breaking news
vijayawada
-
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సాక్షిపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు
-
ఇంద్రకీలాద్రి కొండపై హీరోయిన్ లయ పూజలు (ఫొటోలు)
-
విజయవాడలో భారీ వర్షం (ఫొటోలు)
-
అందమైన రైల్వే స్టేషన్లు, ఎపుడైనా చూశారా?
-
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే
లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి డాక్టర్ బాబ్జీ శ్యామ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్సీ వైద్యులు -
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
PHC వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలం
-
రేపు చలో విజయవాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్క్యా‹Ùమెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుఈనెల 7న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలికింది. -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
ఎర్ర సముద్రంలా మారిన ఇంద్రకీలాద్రి..పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
రిలే దీక్షలకు దిగిన పీహెచ్సీ వైద్యులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ⇒ అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్సర్వీస్ పీజీ సీట్లు కొనసాగించాలి. టైమ్»ౌండ్ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్ అలవెన్స్ మంజూరుచేయాలి. ⇒ సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి. రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు.. రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికిసాక్షి, అమరావతి: పీహెచ్సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెంటేనే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. -
కోడలిని హత్య చేసిన అత్తకు దుర్గగుడి ట్రస్ట్ లో కీలక పదవి..?
-
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ స్నానం చేస్తుండగా నగ్న వీడియో రికార్డ్ చేసి..
-
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
మహిషాసుర మర్దినిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శ్రీ దుర్గాదేవి అలంకారం. .పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడలో గుండెపోటుతో ఎస్ఐ మృతి
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఎస్ఐ–2గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుతో విజయవాడలో సోమవారం ఉదయం మృతి చెందారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాల బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ విజయవాడ హనుమాన్పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరేలోపు బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం
-
శ్రీమహాచండీ దేవి అలంకరణలో దుర్గమ్మ
-
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో నృత్యరూపకాలుగా ప్రదర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే కేరళ తరంగ్లో పాల్గొని విజేతగా నిలిచారు. గిన్నిస్బుక్ రికార్డ్లోనూ చోటు సం పాదించారు. నృత్యం ద్వారా తమ శక్తిని ఎలా ప్రదర్శిస్తారో ఈ సందర్భంగా వివరించారు.‘‘దసరా నవరాత్రులలో అంతటా అమ్మవారే కనిపిస్తుంటారు. ఇక విజయవాడలోనే కొలువైన అమ్మవారికి చేరువలో ఉంటూ నృత్యం ద్వారా సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వివిధ ఆలయాలకు ముందుగానే అప్లికేషన్స్ ఇచ్చాం. వారు ఇచ్చిన టైమ్ ప్రకారం నృత్యం ప్రదర్శనలు ఇస్తున్నాం. అలసట తెలియదునవరాత్రుల మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆరు ప్రదర్శనలు ఇచ్చాం. అమ్మవారి మీద ఎన్నో గీతాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గీతాన్ని ఒక్కో ఆలయంలో మాకు ఇచ్చిన సమయం వరకు ప్రదర్శన ఇస్తున్నాం. పూర్తయ్యాక పెద్ద వయసున్నవారు కూడా ఏమాత్రం సంకోచించకుండా మమ్మల్ని కలిసి ‘ఆ అమ్మవారే నృత్యం చేస్తున్నారా అనే భావన కలిగింది’ అని చెప్పినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఒక తొంభై ఏళ్ల బామ్మగారు ప్రదర్శన పూర్తయ్యాక వచ్చి తన చిన్నప్పుడు నేర్చుకున్న ఆలాపన ఇప్పుడు గుర్తుకు వచ్చిందని భావయుక్తంగా పాడి వినిపించారు. ‘ఆ అమ్మవారు ఈ రూపంలో నాకు కనిపించారు’ అని పొంగిపోయారు. ఇలాంటి ఎన్నో అనుభూతులను ప్రతిసారీ మేం పొందుతుంటాం. మా దగ్గర నృత్యం నేర్చుకునే విద్యార్థులు కూడా ‘అమ్మవారి నృత్యంలో అలసట ఎందుకు రాదు’ అని అడుగుతుంటారు. నృత్యం ఒక యాక్టివిటీ కాదు దైవికంగా ఎంత దగ్గరవుతుంటామో ఈ నృత్యం మాకు స్పష్టం చేస్తుంటుంది. విజయవాడ అంటేనే అమ్మవారు. దసరానవరాత్రుల్లో ఆలయాల్లో మేం నృత్యం చేయడం అంటే అమ్మకు దగ్గరగా ఉన్నట్టే. ఒక భక్తి పూర్వక ప్రార్థన. మా నృత్యాన్ని అమ్మ చూస్తుంది అనే భావనతోనే చేస్తాం. ‘ఎంతసేపు నృత్యం చేసినా అలసటగా ఎందుకు అనిపించడం లేదు?’ అని మా విద్యార్థులు అడుగుతుంటారు. ఆధ్యాత్మికంగా అమ్మవారికి దగ్గరగా ఉంటే మరేమీ తెలియదు. అమ్మవారి ప్రతి రూపం మనకు ప్రేరణ ఇచ్చే పాఠమే. మన జీవన విధానానికి ఎంతగానో తోడ్పడేదే. ఆ శక్తిని మేం నృత్యం ద్వారా ప్రదర్శించడమే కాదు మేమూ పొందుతుంటాం. సేవ చేస్తున్న కొద్దీ శక్తి పెరిగేదే. శ్రీశైలం, తిరుపతి, శిరిడీ, మహానంది, భద్రాచలం, హరిద్వార్, కేదార్నాద్, బదిరీనాద్... ఇలా మనదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. వందల, వేల మంది ముందు ప్రదర్శనలు ఇస్తుంటాం కాబట్టి ధైర్యం పెరుగుతుంది. మధురమైన మాటతీరు, ఏకాగ్రత.. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలు పెరుగుతాయి. రోజూ సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందం కలుగుతుంది. వీటన్నింటి వల్ల జీవనశైలి కూడా బాగుంటుంది.బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ, నృత్యంలో డిప్లొమా చేశాను. మా అమ్మ మాధవికి కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచి నాకు నృత్యం నేర్పించారు. ఐదేళ్ల వయసు నుంచి ప్రదర్శనలు ఇస్తున్నాను. అకాడమీ పెట్టి, నృత్యసేవను కొనసాగిస్తూ ఉండాలని మా నాన్న కల. నాన్న వెంకట రత్నకుమార్ కరోనాలో మాకు దూరమయ్యారు. నాన్న కలను నెరవేర్చడానికి ‘పంచమవేద’ అకాడమీ ద్వారా కృషి చేస్తున్నాను. జాతీయ స్థాయి నృత్య పోటీ అయిన కేరళ తరంగ్లో పాల్గొన్ని విజేతగా నిలిచాను. ఇప్పటి వరకు 1500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. గ్రూప్గా చేసిన శతనృత్య యాగంలో పాల్గొనే అవకాశం రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కింది. ఎంతో సాధన చేస్తూ శక్తిని పెంచుకోవడానికే ఈ నృత్య సేవ చేస్తున్నాను’ అని వివరించారు ఈ నృత్యకారిణి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
కాత్యాయనీ దేవిగా దుర్గమ్మ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: మహిళా భక్తులపై పోలీసుల జులుం
విజయవాడ: శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్లో సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ భక్తులు తరలి రావడంతో వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు.దుర్గ గుడిపై వైభవంగా జరుగుతున్న నవరాత్రులలో భాగంగా గురువారం అమ్మవారు కాత్యాయనీ అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. విశేషంగా తరలివస్తున్న మహిళా భక్తులను పోలీసులను కట్టడి చేయలేకపోతున్నారు. విచక్షణ మరిచి పోలీసులు ప్రవర్తిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా భక్తులను పట్టుకుని, పోలీసులు ముందుకు నెట్టివేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఒక సమయంలో పోలీసులతో సేవా కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. తమ వారిని దర్శనాలకు పంపించాలంటూ పోలీసులతో సేవా కమిటీ సభ్యులు గొడవపెట్టుకున్నారు. ఇదిలావుండగా దుర్గగుడి ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద డ్యూటీ ముగించుకుని బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ ను ముందుకు వెళ్ళమని ఏసీపీ తోసేసిన ఉదంతం చోబుచేసుకుంది. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి కానిస్టేబుల్ కిందపడిపోయాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఏసీపీ ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీ వాళ్లకేనా దర్శనాలు.. దుర్గ గుడి కమిటీ సభ్యులపై YSRCP రజని సీరియస్
-
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేత
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశ) నిర్ణయించింది. రూ. 670 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.రూ.670 కోట్లు చెల్లిస్తేనే మేం చర్చలకు వెళతామని లేకపోతే చర్చలకు వెళ్లేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ‘‘మిగిలిన 2 వేల కోట్ల బకాయిల పై కార్యాచరణ ఇవ్వాలని.. అక్టోబర్ 10 లోగా మా సమస్యలన్నీ తీర్చాలి. మా సమస్యలు తీర్చకపోతే అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలన్నింటినీ పూర్తిగా ఆపేస్తాం. ప్యాకేజీలలో కచ్చితంగా మార్పులు చేయాలి...ప్యాకేజీలకు ఒక కచ్చితమైన సిస్టమ్ను పెట్టాలి. ఇన్స్యూరెన్స్ స్కీమ్కు వెళ్లే ముందు కచ్చితంగా మా బకాయిలు తీర్చాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్లాలి. బీమా ఆధారిత యూనివర్శల్ హెల్త్ ప్రోగ్రామ్కు రూపకల్పన చేయడంలో మమ్మల్ని భాగస్వామ్యుల్ని చేయాలి’’ అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. -
ఇంద్రకీలాద్రిపై అపచారం.. చెప్పులతో అమ్మవారి దర్శనానికి
-
Vijayawada: కుప్పకూలిన భవనం
-
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిలో హోంమంత్రి అనితను నిలదీసిన భక్తులు
-
మారని పోలీసుల తీరు.. మళ్ళీ అదే సీన్ రిపీట్
-
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు (ఫొటోలు)
-
ఏపీకి అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు చెట్ల కింద నిలబడరాదని.. ఈదురు గాలుల వీచేప్పుడు హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణంలో అంధకారం నెలకొంది. విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రహదారులు జలమయంగా మారాయి. గుడివాడలో కూడా వర్షం కురిసింది. -
విజయవాడ : ముగిసిన దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)
-
గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం
-
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో విజయవాడ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైళ్లే ప్రధానంగా ఉన్నాయి. దసరా నేపథ్యంలో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో విజయవాడ-దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది.రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేశారు.కాకినాడ పోర్టు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17267ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే రైలు నంబర్17268 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 12718 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. వీటితో పాటు.. సీఎస్ఎంటీ ముంబై నుంచి భువనేశ్వర్ కు ప్రయాణించే రైలు నంబర్ 11019ను నవంబర్ 21న 180 నిమిషాల పాటు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. ధన్ బాద్ నుంచి అలప్పుజకు వెళ్లే రైలు నంబర్ 13351ను నవంబర్ 24న 180 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. అలాగే హతియా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలు నంబర్ 22837ను కూడా 160 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. -
విజయవాడలో ‘మిరాయ్’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)
-
‘విజయవాడ ఉత్సవ్’ స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది. -
నడిరోడ్డుపై దుశ్శాసన పర్వం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు. అసలేం జరిగిందంటే.. గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్తో పాటు, తండ్రి కుమార్బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య.. హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షమాపణలు చెప్పాలని ఆందోళన.. మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటన
సాక్షి, విజయవాడ: న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్సీపీ నిజ నిర్థారణ కమిటీ ఆదివారం ఉదయం పర్యటించింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, సత్తెనపల్లి ఇంచార్జ్ డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్ ఉన్నారుబాధితుల ఇళ్లకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమను సరిగా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నేతల వద్ద డయేరియా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంప్ల వద్ద సరైన వైద్యం అందడం లేదని.. ఆర్ఎంపీలు వద్ద వైద్యం చేయించుకున్నామని తెలిపారు. తమకు వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యులపై కేసులు పెడతామని బెదిరించారంటూ బాధితులు తెలిపారు. రంగు మారిన నీటిని తాగుతున్నామంటూ బాధితులు.. వైఎస్సార్సీపీ నేతలకు వాటర్ బాటిల్స్ చూపించారు.మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజుల్లో డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా?. గత ప్రభుత్వంలో మేం అందరికీ సురక్షిత మైన నీరును అందించాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది. విజయవాడ వంటి నగరంలోనే పరిస్థితి ఇంత దారుణమా?. ఇంత వ్యవస్థ పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తోంది?. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ డయేరియా వస్తే బాధితులు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఐదు రోజుల నుంచి ప్రజలు డయేరియాతో బాధపడుతున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాలతో మేం న్యూ ఆర్.ఆర్ పేటలో పర్యటించాం. ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పేందుకే మేం వచ్చాం. ఐదు రోజులైనా ప్రభుత్వం కారణాలను బయటపెట్టడం లేదు.ఈ ప్రభుత్వంపైన నమ్మకం లేకే బాధితులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది? ఎందుకు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు. మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు కాబట్టి ఈ ఉదయం ఓమహిళ చనిపోయింది. కొద్ది రోజుల్లో దసరా మహోత్సవాలు వస్తున్నాయి. 20 వేల మంది ఉన్న ప్రాంతంలోనే డయేరియాను అదుపు చేయలేకపోయారు.దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇంకేం సౌకర్యాలు కల్పిస్తారు. ఆరోగ్యశాఖ మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు. బుడమేరు వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయని మంత్రి చెప్పడం సిగ్గుచేటు. మరణాలను కప్పిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి. అధికారులు గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదు. వినాయకుడి భోజనాలు తినడం వల్ల డయేరియా వచ్చిందంటున్నారు. ఖాళీ వాటర్ టిన్లు ఇస్తే మంచినీళ్లు ఎవరిస్తారు?.మెడికల్ క్యాంప్లో బాధితులను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రేపు సాయంత్రం వరకూ డెడ్ లైన్ పెడుతున్నాం. రేపు సాయంత్రానికల్లా డయేరియా కారణాలను వెల్లడించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతాం. బాధ్యత లేకుండా వ్యవహరించిన మంత్రులను బర్తరఫ్ చేయాలి -
నవంబరులో సంగీత విభావరి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరి (మ్యూజికల్ లైవ్ కన్సర్ట్) నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నవంబరు 8న మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ‘ట్రెండ్సెట్టర్స్.లైవ్’ సుధాకర్ ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఇళయరాజా, మంత్రి టీజీ భరత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ట్రెండ్ సెట్టర్స్.లైవ్’ సుధాకర్ మాట్లాడుతూ– ‘‘సినీ సంగీతానికి జీవనాడిగా ఉన్న ఇళయరాజాగారితో ఈ సంగీత విభావరి నిర్వహించనుండటం సంతోషంగా ఉంది. 40 మంది సభ్యులతో ఆయన ఈ లైవ్ కన్సర్ట్కు హాజరవుతున్నారు’’ అని చె΄్పారు. -
YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
-
Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది
-
విజయవాడలో డయేరియాకు మరొకరు బలి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలో విజృంభిస్తున్న డయేరియాకు మరొకరు బలయ్యారు. గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న నరసింహ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గద్వాల నరసింహ(38) భార్యతో విభేదాలు రావడంతో ఒక్కడే ఉంటున్నాడు. నరసింహ ఇంటి కింద భాగంలో ఉంటుండగా, అతని తమ్ముడి కుటుంబం ఇంటి పైభాగంలో ఉంటోంది. గత 4 రోజుల నుంచి ఆ ఇంటిల్లిపాది డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. నరసింహ తమ్ముడి కుమార్తెకు కూడా వాంతులు, విరేచనాలు కావడంతో వారి కుటుంబ సభ్యులంతా 2 రోజుల నుంచి పాపతో పాటు హాస్పిటల్లోనే ఉంటున్నారు. శుక్రవారం నరసింహ వాంతులు, విరేచనాలతో నీరసించిపోయాడు. సాయంత్రానికి అతని పరిస్థితి విషమించడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
ఏసీబీ కోర్టు వద్ద చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆవేదన
సాక్షి,విజయవాడ: ఏసీబీ కోర్టు వద్ద వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేనెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదు. తాగుడు వల్లే మా నాన్న,తమ్ముడు చనిపోయారు. అందుకే నేను లిక్కర్ను ద్వేషిస్తా. లిక్కర్ను ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్టు చేశారు. కొన్ని పత్రికల్లో ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారు. 13ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాని తెలిపారు. -
బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి?: సీదిరి అప్పలరాజు
సాక్షి, విజయవాడ: న్యూఆర్ఆర్ పేటలో డయేరియా అదుపులోకి రాలేదు. మెడికల్ క్యాంప్లకు బాధితులు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామంటున్న బాధితులు చెబుతుండగా.. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అంటోంది. డయేరియాతో ఇద్దరు చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుండగా.. డయేరియా మరణాలను చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్ క్యాంప్లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు. మెడికల్ క్యాంప్ను విజిట్ చేసి బాధితులను పరామర్శించాం. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు.‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైఎస్ జగన్ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్ జగన్ నాలుగు యూపీహెచ్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు...క్యాంటమ్ కంప్యూటర్ అంటాడు. క్యాంటమ్ కంప్యూటర్ తో డయేరియా తగ్గించు. మాట్లాడితే ఏఐ టెక్నాలజీ అంటాడు. రండి ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా?. యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?. నేపాల్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేశామని నిన్న ఓ మంత్రి షో చేశాడు. ఆర్టీజీఎస్లో కూర్చున్నామని ఊదరగొట్టాడు. ఇక్కడ డయేరియా బాధితుల మాటేమిటి?. చంద్రబాబుకు ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల సేఫ్టీపై లేదు. మున్సిపల్ మంత్రికి అమరావతిలో భూములు అమ్మడం పైనే దృష్టి. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు...వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడంపైన ఉన్న శ్రద్ధ ప్రజల పై లేదు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి?. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన కావాలి. గతేడాది గుర్ల గ్రామంలో డయేరియాతో 13 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారు?. ఇదేనా ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ. స్థానిక ఎమ్మెల్యేకు కలెక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ స్థానిక సమస్య పట్ల లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మరణాలను దాచేస్తోంది. తక్షణమే న్యూ ఆర్.ఆర్.పేటను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాలి. ఇంటింటికీ ఒక వాటర్ టిన్ సప్లై చేయాలి’’ అని అప్పలరాజు డిమాండ్ చేశారు. -
డయేరియా బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్లో డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు మండిపడ్డారు. గంటగంటకూ బాధితులు పెరుగుతున్నారని.. వారికి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేకపోతోందన్నారు.‘‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. మంచినీటి వల్లే సమస్య వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వల్ల అంటున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా నీటి వల్ల కాదని ఎలా నిర్ధారిస్తారు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘మెడికల్ క్యాంప్కు వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. మున్సిపల్ మంత్రి వచ్చి చూసి వెళ్లిపోయారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోవటం వల్లే ఈ పరిస్థితి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 48 గంటల నుంచి ఈ ప్రాంతం భయంకరమైన వాతావరణంలో ఉంటే అధికారులు మీటింగ్లకు పరిమితమయ్యారు...అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? పేషెంట్లను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
‘నీరు’వెల్లా విషం.. ‘డై’యేరియా..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రీకొడుకుల పేర్లు వంగేటినాగబాబు, జయదీప్. వాంతులు విరేచనాలతో నీరసించి ఓ ప్రైవేటు హాస్పటల్లో ఇలా సొమ్మసిల్లిపడిపోయారు. రెండు రోజుల నుంచి వీరు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగబాబుకు కోడలు వరుస అయ్యే శ్రావణి కూడా వాంతులు, విరేచనాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో డయేరియా పడగ విప్పింది. ఇద్దరు మహిళలను బలిగొంది. వందలాది మందిని ఆస్పత్రిపాలుచేసింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అయినా అధికారయంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. చవితి పందిరిలో పెట్టిన భోజనం వల్ల ఫుడ్పాయిజనై ఇద్దరు మరణించారని, వాంతులు, విరేచనాలు ప్రబలాయని అధికారులు బుకాయిస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అసలు గణపతి పందిరి వద్ద భోజనాలే పెట్టలేదని చెబుతున్నారు. కలుషిత నీటివల్లే వాంతులు, విరేచనాలు ప్రబలుతున్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ లక్షణాలతో విజయవాడ జీజీహెచ్లో 25 మంది చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా మురుగునీరే సరఫరా స్థానిక 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో వారం రోజులుగా మంచినీటి కొళాయిల్లో నుంచి దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. విషయాన్ని కొందరు సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు తొలుత సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటున్నా అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అధికారుల ఉదాసీనం ఇంతలా డయేరియా ప్రబలుతున్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలను అన్వేషించకుండా ఫుడ్ పాయిజన్ అని బుకాయిస్తున్నారు. కలుసిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం లేదు. కేర్ అండ్ షేర్ స్కూల్లో తూతూమంత్రంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కలుషిత నీటి సరఫరా విమర్శలపై పైప్లైన్లను పరిశీలిస్తున్నామని బాధ్యత లేకుండా సమాధానమిస్తున్నారు. కాగా, విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేట డయేరియా కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం ఆరా తీశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ఆదేశించారు.న్యూ ఆర్ఆర్పేటలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఇంటిల్లిపాదీ నరకయాతనఈ చిత్రంలో మంచంపై ఉన్న వ్యక్తి పేరు గుండు సుధాకర్, కింద పడుకున్న బాలుడి పేరు సూరాబత్తుల చిన్ని చైతన్య. వీరిద్దరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. చిన్ని చైతన్య సోదరి కుసుమాంజలి, అతని తండ్రి కృష్ణ కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కుసుమాంజలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పటల్లో మంగళవారం చేరి్పంచారు. ఇంటిల్లిపాదీ నరకయాతన అనుభవిస్తున్నారు. తల్లీ, పిల్లలిద్దరూ ఆస్పత్రిలోనే.. ఈ చిత్రంలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళ పేరు లంకవలస మహాలక్ష్మి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు షర్మిల, హారిక ఉన్నారు. వీరు ముగ్గురూ మూడు రోజుల నుంచి వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. అందరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాలక్ష్మి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని, బుధవారం ఇంటికి వచ్చేసింది. అలా వచ్చిచన కాసేపటికే మళ్లీ వాంతులు, విరేచనాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు ఆమెను భుజాలపై మోసుకుంటూ సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.ఇద్దరు మహిళలు బలి కలుషిత తాగునీరు డయేరియా బారిన పడిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. న్యూరాజరాజేశ్వరీపేట ప్రభుత్వ జీప్లస్త్రీ అపార్ట్మెంట్లలోని 25వ బ్లాకుకు చెందిన శ్రీరామ నాగమణి(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం రాత్రి మరణించారు. నీటి సరఫరా విభాగ అధికారుల నిర్లక్ష్యానికి నాగమణి బలైందని, ఆస్పత్రిలోనూ వైద్యులు సరిగా చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. న్యూఆర్ఆర్పేటలోని సింగ్నగర్ పోలీస్స్టేషన్ వెనుక భాగంలో నివసిస్తున్న కువ్వల లక్ష్మీకాంతమ్మ(85) ఆమె అల్లుడు గంటేడి అప్పారావు(55) ఇద్దరూ వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. లక్ష్మీకాంతమ్మ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందింది. ఆమె అల్లుడు అప్పారావూ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభణ
-
విజయవాడలో కలుషిత నీరు కలకలం
సాక్షి,విజయవాడ: న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. వాంతులు, విరేచనాలతో న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో శ్రీరామ నాగమణి అనే మహిళ మృతి చెందారు. కలుషిత నీరు తాగి సుమారు 16మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రెండురోజుల నుంచి న్యూ రాజరాజేశ్వరి పేట వాసులు అనారోగ్యంపై సమాచారం అందుకున్న వైద్యులు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రజల అనారోగ్యానికి ఇప్పటి వరకూ సరైన కారణం తెలియలేదని డీఎం&హెచ్ఓ సుహాసిని తెలిపారు. అయితే, కలుషిత నీరు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని న్యూరాజరాజేశ్వరీ పేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడం విఫలమైందని మండిపడుతున్నారు. -
‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, నీకింత–నాకింత అని పంచుకు తినడాన్ని అలవరుచుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. ‘చిన్న’ పథకంతో ఏకంగా రూ.400 కోట్ల విలువైన భూమిని గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్ వేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నంబర్లు 454/2బీ, 3బీలో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కల్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు.ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవదాయ శాఖ ఆలయ నిర్వహణతోపాటు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం రూ.10 కోట్లకు పైగానే ఉంది. దీంతో రూ.400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు.. విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జీ మేళా, అగ్రిటెక్ షోకేస్, టూరిజం ప్రమోషన్ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది. కారు చౌకగా కొట్టేసే ఎత్తుగడ ⇒ మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్ కోసం ఈ భూమి కేటాయించాలని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి రూ.500 చొప్పున, 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ⇒ నిజానికి ఆ భూములకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాదిపాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి రూ.95,500తో ఏడు ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు రూ.1,00,500తో 6.50 ఎకరాలు, అనుమోలు రామారావుకు రూ.66,700తో 4.50 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు రూ.97,000తో 4.50 ఎకరాలు ఇచ్చారు. కె.ధర్మారావుకు 2023–24 నుంచి 2025–26 వరకు ఐదెకరాల భూమిని రూ.52,500కు, కె.అయ్యప్పకు 2.50 ఎకరాలను రూ.23,500తో కౌలుకు ఇచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ⇒ అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్ లీజుకు తీసుకొని, ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలం పాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలో తొక్కారు. ఉత్తర్వులు రాక ముందే భూమి స్వాధీనం⇒ దేవదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక ముందే ఈ భూములను పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే రూ.కోట్ల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ⇒ మరో వైపు ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్ సచివాలయంలో శరవేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాల సమాచారం. ⇒ ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ నుంచి తప్పించి, విజయవాడ దుర్గామల్లే«శ్వర స్వామి పరిధిలోకి తెచ్చారు. అయితే గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గత ప్రభుత్వంలో ఆలయానికి పూర్వ వైభవం ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలిపోయే దశలో ఉన్న గొడుగుపేట ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. అప్పటి మంత్రి పేర్ని నాని ప్రతిపాదన మేరకు 2020 మార్చిలో ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోంచి తప్పించి దేవదాయ శాఖ పరిధిలోకి తెచ్చి ఈవోను కూడా నియమించారు. ⇒ 2020 అక్టోబర్లో పేర్ని నాని సీజీఎఫ్ నిధులు రూ.1.80 కోట్లు, భక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.20 లక్షలు వెరసి రూ.2 కోట్లు వెచ్చించి, ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా పునఃప్రారం¿ోత్సవం జరిపించారు. 2023 జూలైలో ఈ ఆలయ భూములకు వేలం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భూములకు వేలం పాట నిర్వహించి, రైతులకు లీజుకు ఇస్తున్నారు. 2024 మే వరకు ధూప దీప నైవేద్యాలు, ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేశారు.గోల్ఫ్ కోర్టుకు వెంకన్న స్వామి స్థలమే కనిపించిందా?⇒ప్రపంచ స్థాయి అమరావతిలో స్థలమే దొరకలేదా?⇒ ఆలయ భూముల్నీ పప్పు బెల్లాల్లా పంచుకుంటారా?⇒ ఆ భూమిపై మోజు ఉంటే విక్రయించి ఆలయానికి డబ్బు జమ చేయాలి ⇒ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజంమచిలీపట్నం టౌన్: ప్రపంచ స్థాయి రాజధానిగా చెబుతున్న వేలాది ఎకరాల భూమి ఉన్న అమరావతిలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుకు స్థలమే కనిపించ లేదా.. అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్టు సంస్థకు కేటాయించనుండటం దారుణం అన్నారు.విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆలయ భక్త బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఆలయం జీర్ణావస్థకు చేరిందని, కూలేందుకు సిద్ధంగా ఉంటే సరుగుబాదుల సపోర్టుతో ఆలయాన్ని భక్తులు కాపాడుతూ వచ్చారన్నారు. ఆ సమయంలోనే ఈ భూమిపై కూటమి పాలకులు కన్ను వేసి.. ఆలయాన్ని విజయవాడ దుర్గ గుడి ఆధీనంలోకి తీసుకెళ్లారన్నారు.దీంతో ఈ ఆలయ ధూప, దీప నైవేద్యాలకు కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ఆలయాన్ని దుర్గ గుడి నుంచి మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణకు దాదాపు రూ.1.80 కోట్లు సీజీఎఫ్ నిధులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. భక్తుల వద్ద నుంచి రూ.20 లక్షలు సేకరించి.. మొత్తం రూ.2 కోట్ల నిధులతో ఆలయ పునరుద్ధరణ గావించామని చెప్పారు. ఈ భూమిని రైతులకు బహిరంగ వేలంలో కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదాయాన్ని ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తున్నారని వివరించారు. మళ్లీ కూటమి నేతల కన్నుకూటమి అధికారంలోకి వచ్చాక ఈ 40 ఎకరాల భూమిపై మళ్లీ కన్నేసి కౌలు దారులను, అధికారులను బెదిరించి పంట వేయకుండా అడ్డగిస్తూ గోల్ఫ్ కోర్టు నిర్మాణం పేరుతో ఆ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టి తోలుతూ, దేవుడి ఆస్తి అనే భయం లేకుండా మెరక పనులు చేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం అండగా ఉండటం పాపం కాదా..? ఇదే కలెక్టర్ ఈ భూమిని గోల్ఫ్ కోర్సుకు, ఎగ్జిబిషన్కు కేటాయించాలని జూలైలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాశారు.దేవదాయ భూమిని లీజుకు తీసుకోవాలంటే బహిరంగ వేలం ద్వారానే తీసుకోవాలని, వేరే ఏ పద్ధతుల్లోనూ తీసుకోకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. దేవుడి భూమిని కూటమి పాలకులు పప్పు బెల్లాల్లా పంచుకోవాలని చూస్తుండడం ఎంతవరకు సబబు?’ అని నాని నిలదీశారు. స్వామి వారి భూమిపై మీకు మోజు ఉంటే బహిరంగ వేలం వేసి విక్రయించగా వచ్చే మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ భూమి ఆక్రమణపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన ఈ దోపిడీని నిలిపివేస్తే సరి అని, లేదంటే కోర్టును ఆశ్రయించాలని సమావేశానికి హాజరైన భక్తులు, పలు రాజకీయ పక్షాల నాయకులు తీర్మానించారు. ఈ సమావేశంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
బెడిసికొట్టిన బాబు కుట్ర..! మద్యం అక్రమ కేసులో ముగ్గురు విడుదల
-
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
మద్యం అక్రమ కేసులో ‘ముగ్గురికి బెయిల్’.. విడుదలపై అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, విజయవాడ: రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేస్తున్నారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. నిన్న సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ జైలు సూపరిటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్బంగా అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ..‘నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలను విడుదల చేయలేదు. నిన్న రాత్రి 8:30 వరకూ జైలు వద్ద ఎదురు చూశాం. ఈరోజు ఉదయం 6:30 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఉదయం ఆరు గంటలకే జైలు వద్దకు న్యాయవాదులు చేరుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడని మేము ప్రశ్నిస్తే.. జైలు అధికారులు వింత సమాధానం చెబుతున్నారు. అదే పనిగా మేము ప్రశ్నించడంతో మచిలీపట్నం నుంచి సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటున్న జైలు అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ కిందకు వస్తుంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం’ అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది.పాస్పోర్టులను ఇప్పటికే జప్తు చేయకుంటే, విడుదలైన మూడు రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోని లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్నివేళల్లో కోర్టు విచారణలకు హాజరై తీరాలని స్పష్టం చేసింది. తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్ను యాక్టివ్లో ఉంచాలని పేర్కొంది. సాక్షులను గాని, సహ నిందితులను కలవడానికి వీల్లేదని ఆదేశించింది. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని, షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. -
చంద్రగ్రహణం.. రేపు దుర్గగుడి మూసివేత
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా రేపు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) విజయవాడ దుర్గమ్మవారి గుడిని మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం గం. 3.30ని.లకు దుర్గగుడితో పాటు ఉపాలయాలు కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. గ్రహణ మోక్షకాల అనంతరం అంటే 8వ తేదీ లెల్లవారు జామున 3 గంటలకు కవాట ఉద్ఘటన( తిరిగి తలుపులు తీయడం) ఉంటుంది. స్నపనాభిషేకాల అనంతరం ఉదయం గం. 8.30ని.ల నుంచి తిరిగి భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. -
బాబు సర్కార్కు ఆటో కార్మికుల హెచ్చరిక.. కార్యాచరణ ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు. -
అర్ధరాత్రి ఆటోనగర్ సాక్షి ప్రధాన కార్యాలయానికి పోలీసులు
-
సంబరాల బాబూ.. బుడమేరు ప్రక్షాళన ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సంబరాలు దేనికి చంద్రబాబూ..? చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..? వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.విజయవాడను గాలికొదిలేశారు:పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. -
విజయవాడలో భారీ వర్షం
-
ఏడాది దాటినా తీరని బుడమేరు కష్టాలు..
-
Devineni Avinash: విజయవాడకు వెన్నుపోటు పొడిచి ఈ రోజుతో సంవత్సరం..
-
విజయవాడలో పడవలో కూర్చొని CPM నేతల వినూత్న నిరసన
-
రేపు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) విజయవాడలో పర్యటించనున్నారు. వినాయకచవితి సందర్భంగా నగరంలోని రాణీగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
విజయవాడ ACB కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి దృశ్యాలు
-
భక్తులకు అలెర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్
సాక్షి,విజయవాడ: భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు డ్రెస్కోడ్ అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్ను అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన చేశారు.అభ్యంతరకర దుస్తులలో వచ్చే భక్తులకు దేవాలయంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి డ్రెస్కోడ్ తప్పనిసరి విధించింది. ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకుంది.విధి నిర్వహణలో సిబ్బంది సెల్ఫోన్ల వాడకంపై నిషేదం. ఈ కొత్త నిబంధనలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
పేదల ఇళ్ల స్థలాలపై జనసేన నేతల కన్ను YSRCP నేతలు ఫైర్
-
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
‘నేటికీ విజయవాడ ప్రజలు కోలుకోలేదు’
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం. రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు. దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)
-
సినీ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: హైదరాబాద్లో సినీ నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్పై ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు.గాజుల మహేష్ వద్ద దాసరి కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకోగా.. డబ్బులు అడిగేందుకు ఆయన ఆఫీస్కు వస్తే.. 15 మంది తమపై దాడి చేశారంటూ గాజుల మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజుల మహేష్ ఫిర్యాదు మేరకు దాసరి కిరణ్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
చంద్రబాబు, పవన్ల రోడ్ షో.. అంబులెన్స్కు తప్పని కష్టాలు!
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు విజయవాడలో శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) చేపట్టిన రోడ్ షోలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీరు బస్సులో విజయవాడ బస్టాండ్కు వెళ్తూ చేపట్టిన రోడ్ షో కారణంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడేపల్లిలో సర్వీస రోడ్, హైవే మద భారీగా ట్రాఫిక జామ్ అయయింది. అదే సమయంలో అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అంబులెన్స్ వచ్చినప్పటికీ చంద్రబాబు కాన్వాయ్ దారి ఇవ్వలేదు. అంబులెన్స్కైనా దారి కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. వాహనాల మధ్యలో నిలిచిపోయింది అంబులెన్స్. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి (ఫొటోలు)
-
Vijayawada: చెట్టు మీద పడి మరొకరు మృతి
-
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వైఎస్సార్ జిల్లా పులివెందుల రూరల్ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికలు నిర్వహించడంలో యంత్రాంగం ఘోర వైఫల్యం చెందిందని మండి పడింది. దౌర్జన్యాలు, దాడులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? అని నిలదీసింది. పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్కుమార్ యాదవ్, సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్కుమార్, సుధాకర్బాబు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తదితరులను పోలీసులు బయటే ఆపేయడంతో తోపులాట జరిగింది. దీంతో వారంతా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదని నిప్పులు చెరుగుతూ వాగ్వాదానికి దిగారు.‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి విడనాడాలి..’ అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వారిని వినతిపత్రం అందజేసేందుకు పోలీసులు అనుమతించారు. పోలింగ్ బూత్లు మార్చడానికి వీల్లేదని, బైండోవర్ కేసులు పెట్టి కనిపించకుండా దాచిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని, సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ చేయాలని వారు ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దయనీయం.. ఘోరం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరుగుతున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా, దయనీయంగా, ఘోరంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కళ్లు, చెవులు మూసుకొని కమిషన్ ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రోత్సహించడం కోసం, ఓటింగ్ శాతం పెంచడానికి వ్యవస్థను ఓటర్ల వద్దకు తీసుకెళ్లాల్సింది పోయి.. పులివెందులలో అందుకు విరుద్ధంగా ఓటర్లకు దూరంగా పోలింగ్ కేంద్రాలను తీసుకెళుతుండటం దారుణం. – పేర్ని నాని, మాజీ మంత్రి దేవుని దయవల్ల బతికి బయట పడ్డానుబీసీ సామాజిక వర్గానికి చెందిన నాపై అతి ఘోరంగా బండరాళ్లు, సుత్తులతో దాడి చేశారు. పెట్రోలు పోసి నన్ను చంపేందుకు ప్రయతి్నంచారు. దేవుని దయతో బతికి బట్ట కట్టాను. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తామే గెలవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చారు. – రమేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఈ అధికారం శాశ్వతమా? పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే ఇక్కడ మమ్మల్ని పోలీసుల చేత నెట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ఎందుకంత కండకావరం? ఈ అధికారం శాశ్వతమా? – టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు పులివెందులలో రాజ్యాంగం అమలులో లేదు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల కమిషనర్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. – దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
పులివెందులలో ఈసీ నిద్ర నటిస్తోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ను కలిసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఎన్నికల కార్యాలయం ఎదుట బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలను అరికట్టాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తర్వాత.. వారికి లోపలికి అనుమతి ఇవ్వడంతో పులివెందులలో పరిస్థితులపై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇక, ఎన్నికల కమిషనర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు , కైలే అనిల్ కుమార్ , ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్, పూనూరు గౌతమ్ రెడ్డి, నారాయణ మూర్తి ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రశాంతంగా ఉన్న పులివెందులను రక్త చరిత్ర పులివెందులగా మార్చారు. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రచారానికి వెళ్లిన మాపై దాడి చేశారు. మమ్మల్ని హతమార్చేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో నేను ప్రాణాలతో బయటపడ్డా. తాజాగా పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. దోచుకున్న డబ్బును పులివెందులలో పంచుతున్నారు. మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కమిషనర్ను కలిసి పరిస్థితులను వివరించాం. ఎమ్మెల్సీనైన నాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు. టీడీపీ తరపున పోలీసులే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లుమూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు. నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది. ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తున్నారు. ఎన్నికల కమిషనర్ సీట్లో కూర్చునే ముందు చేసిన ప్రమాణాలను గుర్తుచేసుకోవాలని కోరాం. కేవలం జెడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపారని, రమేష యాదవను హత్య చేయాలని చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈసీ మొద్దు నిద్ర వీడాలని ఆయన హెచ్చరించారు. -
అమ్మ చల్లగా చూడమ్మా...ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)
-
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
బాబూ.. నేను ఎమ్మెల్యేను!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్కు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్రోడ్డు మీదగా ఓం టర్నింగ్కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డి బెయిల్పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డి బెయిల్పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
రూ.4,150 కోట్ల అంచనాతో విజయవాడ ‘మెట్రో’ తొలి దశ పనులు
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.4,150 కోట్ల అంచనా వ్యయంతో సోమవారం ఏపీఎమ్మార్సీఎల్(ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 30 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఫ్రీబిడ్ సమావేశాన్ని ఈ నెల 18న ఎపీఎమ్మార్సీఎల్ కార్యాలయంలో నిర్వహించనుంది.విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను 38.40 కి.మీ. పొడవున వయాడక్ట్(ఇందులో 4.33 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్ లేన్ ఫ్లైఓవర్, మోట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వేస్టేషన్తో పాటు 32 స్టేషన్లను నిర్మించేలా పనులు చేపట్టింది. ఈ పనులను రెండు కారిడార్లుగా చేపట్టింది. మొదటి కారిడార్ను 25.9 కి.మీ పొడవున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు, రెండో కారిడార్ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిమీల పొడవున మెట్రో రైల్ వయాడక్ట్, స్టేషన్లు నిర్మించనుంది.మెట్రో తొలిదశ కన్సల్టెన్సీలకు రూ.401.28 కోట్లువిశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనుల పర్యవేక్షణకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.401.28 కోట్లు చెల్లించనుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ కన్సల్టెన్సీ బాధ్యతలను సిస్ట్రా సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.212.40 కోట్లు చెల్లించనుంది. అలాగే, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశకు కన్సల్టెన్సీ బాధ్యతలను టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.188.88 కోట్లు చెల్లించనుంది.ఇక విశాఖపట్నంలో తొలిదశ కింద మూడు కారిడార్లలో 46.23 కి.మీ.ల పొడవున వయాడక్ట్ (ఇందులో 20.16 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), 42 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 24న రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వనించింది. ఫీజుకింద రూ.212.40 కోట్లను చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ సిస్ట్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది.మరోవైపు.. విజయవాడలో తొలిదశ కింద 38.40 కిమీ పొడవున వయాడక్ట్ (ఇందులో 4.33 కిమీ డబుల్ డెకర్ ఫోర్లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్తోపాటు మరో 32 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, పనులు పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ కోసం ఏప్రిల్ 30న ఏపీఎమ్మార్సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.188.88 కోట్లు చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్ఏ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు టెండర్లను ఏపీఎమ్మార్సీఎల్ ఆమోదించి, కన్సల్టెన్సీలుగా ఆ సంస్థలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ బాధ్యతలను ఆ సంస్థలకు అప్పగిస్తూ వాటితో ఒప్పందం చేసుకుంది. -
Malladi Vishnu: పవన్ మిత్రుడికి 1200 ఎకరాలు కట్టబెట్టారు
-
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఐక్య ఉద్యమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని, విజయవాడ ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 6న విజయవాడలో పౌర వేదిక తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు.చంద్రబాబుకు భూదాహం..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడలో అత్యంత చారిత్రక నేపథ్యంతోపాటు రూ.400 కోట్ల విలువైన 4.15 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని, విశాఖపట్నంలో 13.7 ఎకరాలను బహుళజాతి సంస్థకు అçప్పగించే ప్రభుత్వ చర్యలు సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం పట్టుకుందని, అమరావతిలో మరోమారు భూ సమీకరణకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.ఐక్య ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలివైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ పాలకులు ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో యథేచ్ఛగా భూసంతర్పణ చేయడం ఆక్షేపణీయమన్నారు.సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ (సీపీఎం), నరహరశెట్టి నరసింహరావు (కాంగ్రెస్), దోనేపూడి శంకర్ (సీపీఐ), పి. ప్రసాద్ (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరనాథ్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్)లతోపాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ ప్రసాద్, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ అంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. ఆర్టీసీ స్థలాన్ని అన్యాక్రాంతం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, జీఓ నెంబర్ 137ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
తిమ్మిని బమ్మి చేయబోయి..
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించేందుకు పన్నిన తాజా కుతంత్రం విఫలమైంది. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించేందుకు తెగించిన ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల బరితెగింపు బయటపడింది. ఈ అక్రమ కేసులో రూ.11 కోట్ల నగదు జప్తు పేరిట సాగించిన హైడ్రామాను కప్పిపుచ్చే సిట్ ఎత్తుగడ చిత్తయింది.హైదరాబాద్ శివారులో పట్టుకున్నట్టు చెప్పిన నగదును గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేయాలని సిట్ తాజా కుయుక్తి పన్నింది. తద్వారా... ఈ కేసులో సాక్షులను బెదిరించి, ఆ నగదును తామే తెప్పించి జప్తు చేసినట్టు ఆడిన హైడ్రామాను కప్పిపుచ్చాలని యత్నించింది. కాగా, సిట్ తాజా కుట్రపై ఉప్పందడంతో అక్రమ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు శనివారం వెంటనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని, వాటిపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.దీన్ని విచారించిన కోర్టు... రూ.11 కోట్లను ప్రత్యేకంగా భద్రపరచాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్ల వివరాలను నమోదు చేస్తూ పంచనామా నిర్వహించాలని విస్పష్టంగా పేర్కొంది. న్యాయస్థానం ఉత్తర్వుల కాపీని పిటిషనర్ తరపు న్యాయవాది దుష్యంత్రెడ్డి ఎస్బీఐ అధికారులకు అందజేశారు. నగదును ప్రత్యేకంగా భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. దీంతో రూ.11 కోట్ల జప్తు పేరిట సాగించిన కుట్రను తొక్కిపెట్టాలన్న సిట్ పన్నాగం బెడిసికొట్టింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ సాగించిన కుట్ర... కోర్టు సత్వర స్పందనతో బట్టబయలైన వైనం ఇదిగో ఇలా ఉంది.లేని ఆధారాలు సృష్టించేందుకు జప్తు డ్రామామద్యం అక్రమ కేసులో ఏదో విధంగా భారీగా నగదు జప్తు చేసినట్టు చూపించాలని సిట్పై టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. తద్వారా నిందితుల బెయిల్ను అడ్డుకోవడమే ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారుల పన్నాగం. అందుకే సిట్ రూ.11 కోట్లు పట్టివేత కనికట్టు చేసింది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్ర బిందువుగా కపట నాటకానికి తెరతీసింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి బెంబేలెత్తించింది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి భార్య దివ్యారెడ్డి హైదరాబాద్లోని ఎరేట్ హాస్పిటల్లో మైనర్ వాటాతో డైరెక్టర్గా ఉన్నారు.హైదరాబాద్కు చెందిన తీగల విజయేందర్రెడ్డి కూడా ఈ హాస్పిటల్లో భాగస్వామి. ఆయనకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ రూ.వందల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, వర్ధమాన్ కాలేజీతో గానీ విజయేందర్రెడ్డి ఇతర వ్యాపారాలతోగానీ రాజ్ కేసిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ, లేని ఆధారాలు సృష్టించేందుకు విజయేందర్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సిట్ వేధించింది. రాజ్ కేసిరెడ్డికి చెందిన నగదును జప్తు చేసినట్టు చూపించే తమ కుట్రకు సహకరించాలని పోలీసు మార్కు బెదిరింపులకు పాల్పడింది. దాంతో విజయేందర్రెడ్డి సిట్ అధికారుల ఒత్తిడికి తలొగ్గినట్టు తెలుస్తోంది.తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్ను సిట్ అమలు చేసింది. అందులో భాగంగా వర్ధమాన్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను ఎవరికీ తెలియకుండా విజయేందర్రెడ్డికి చెందిన హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీకి సరిగ్గా ఎదురుగానే ఉండే సులోచన ఫామ్హౌస్లోకి తరలించారు. ఈ పనికూడా ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బందితోనే చేయించినట్టు తెలుస్తోంది. సిట్ పోలీసులే ఆ అట్టపెట్టెలు తీసుకెళ్తే ఎవరైనా ఫోన్లతో వీడియోలు తీస్తారేమోనని సందేహించి జాగ్రత్తపడ్డారు. నగదును ఫామ్హౌస్కు చేర్చిన తర్వాత... సిట్ అధికారులు ఆ ఫామ్హౌస్పై దాడి చేసినట్టు... రూ.11 కోట్లను గుర్తించి జప్తు చేసినట్టు డ్రామా రక్తి కట్టించారు. ఆ నగదంతా రాజ్ కేసిరెడ్డిదేనని... 2024 జూన్ నుంచి అక్కడ ఉంచారని కట్టు కథ వినిపించారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రాజ్ కేసిరెడ్డిరూ.11 కోట్ల జప్తు పేరుతో సిట్ కుతంత్రాన్ని రాజ్ కేసిరెడ్డి తిప్పికొట్టారు. ఆ నగదుతో తనకు గానీ తన కుటుంబానికిగానీ ఏ సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. విజయేందర్రెడ్డే సమాధానం చెప్పాలన్నారు. ఈమేరకు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎరేట్ హాస్పిటల్లో తన భార్య కేవలం మైనర్ వాటాతో డైరెక్టర్గా ఉన్నారని, విజయేందర్రెడ్డి కుటుంబానికి చెందిన ఇతర వ్యాపార సంస్థలతో తమకు సంబంధం లేదన్నారు. సిట్ జప్తు చేసింది ఆ వ్యాపార సంస్థలకు చెందిన నగదే కావచ్చని చెప్పారు.దీనికితోడు సిట్ జప్తు చేసినట్టు చెబుతున్న నోట్ల కట్టలపై ఉన్న ఆర్బీఐ బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లను నమోదు చేయాలని రాజ్ కేసిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ నగదును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆర్బీఐని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆ రూ.11 కోట్ల నగదు కట్టలను వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. కుట్ర కప్పిపుచ్చే కుతంత్రంన్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ మరో కుట్రకు తెరతీసింది. హైదరాబాద్లోని ఫామ్హౌస్లో జప్తు చేశామని చెప్పిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా విజయవాడ పోలీసుల బ్యాంకు ఖాతాలు నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని ఎత్తుగడ వేసింది. అలా చేస్తే బ్యాంకులో ఉండే ఇతర నగదుతో పాటు ఈ రూ.11 కోట్లను కలిపేస్తారు.ఆ నగదు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి సిట్కు ఓ డిపాజిట్ పత్రం ఇస్తారు. అంటే నగదు రూపంలో ఉన్న రూ.11 కోట్లు డిపాజిట్ పత్రం రూపంలోకి మారిపోతాయి. బ్యాంకు ఆ నగదును వివిధ అవసరాలకు వాడుకుంటుంది కూడా. అలా ఆ నోట్లు మిగతా నోట్లతో కలిసి మార్కెట్లోకి చెలామణిలోకి వెళ్లిపోతాయి. సిట్ అధికారులు హైదరాబాద్లో జప్తు చేసిన నోట్ల కట్టలు ఏవీ అంటే ఎవరూ చెప్పలేరు. ఇదీ సిట్ పన్నాగం...! ఇందుకోసం సిట్ అధికారులు శుక్రవారం రాత్రే రంగంలోకి దిగారు.శుక్రవారం రాత్రి నుంచే హైడ్రామా...శుక్రవారం రాత్రే విజయవాడ ఎస్బీఐ పటమటలోని సీసీఎస్ బ్రాంచి, మాచవరం బ్రాంచి అధికారులను సంప్రదించారు. అంత భారీ నగదును డిపాజిట్గా స్వీకరించాలంటే ముందుగా రెండుసార్లు నోట్ల కట్టలను డినామినేషన్ చేసి పరిశీలించాల్సి ఉంటుంది. అందుకు చాలా సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ ప్రక్రియ నిర్వహించడం గమనార్హం. మొదటి దశ కింద డినామినేషన్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో దశ డినామినేషన్ శనివారం మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని భావించారు. న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్..సిట్ కుట్రను పసిగట్టిన రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు సత్వరం స్పందించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. జప్తు చేశామని చెబుతున్న రూ.11 నోట్ల కట్టలను సిట్ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సారి జప్తు చేసినట్టు న్యాయస్థానానికి నివేదించిన నగదు, ఇతర ఆస్తులపై పూర్తి అధికారం కోర్టుకే ఉంటుంది.అటువంటిది కోర్టు అనుమతి లేకుండానే ఆ నగదును డిపాజిట్ చేయడం ద్వారా సిట్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని నివేదించారు. తద్వారా ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ రూ.11 కోట్లను డిపాజిట్ చేయకుండా సిట్ను ఆదేశించాలని కోరారు. అప్పటికే చేస్తే వాటిని ఎస్బీఐలోని ఇతర నోట్లతో కలపకుండా ప్రత్యేకంగా భద్రపరచాలని సిట్తో పాటు ఎస్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం శనివారం విచారించింది. ఈ సందర్భంగా సిట్ విచారణ అధికారి ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించేందుకు యత్నించడం గమనార్హం. రూ.11 కోట్లు ఎక్కడ ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారిని ప్రశ్నించగా.. అప్పటికే ఎస్బీఐలో డిపాజిట్ చేసేశామని ఆయన చెప్పారు. దీనిపై రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాది దుష్యంత్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ నగదును ఇంకా డిపాజిట్ చేయలేదన్నారు. చేసి ఉంటే బ్యాంకు కౌంటర్ ఫాయిల్ చూపించాలన్నారు. ఈ ప్రశ్నకు సిట్ అధికారి సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ నగదు డిపాజిట్కు సంబంధించిన పూర్తి వివరాలతో సోమవారం అఫిడవిట్ సమర్పిస్తామని చెప్పారు. అందుకు దుష్యంత్రెడ్డి సమ్మతించ లేదు. తమకు సిట్పై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలో సిట్ పావుగా మారిందన్నారు. రూ.11 కోట్లకు సంబంధించిన బ్యాంకు కౌంటర్ ఫాయిల్ ఫొటోను వాట్సాప్ ద్వారా తెప్పించుకుని అయినా చూపించమని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పరిణామంతో తనకు సమయం కావాలన్న సిట్ అధికారి దాదాపు గంట వరకు పత్తా లేకుండాపోవడం గమనార్హం. రూ.11కోట్లను ప్రత్యేకంగా భద్రపరచండిరాజ్ కేసిరెడ్డి పిటిషన్ను విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టమైన తీర్పునిచ్చింది. రూ.11 కోట్లను విడిగా భద్రపరచాలని సిట్ అధికారులు, ఎస్బీఐ అధికారులను ఆదేశించింది. ఇప్పటికే డిపాజిట్ స్వీకరించి ఉంటే బ్యాంకులోని ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా భద్ర పరచాలని స్పష్టం చేసింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని సిట్ను ఆదేశించింది. మొత్తం ప్రక్రియను వీడియో తీయించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి హక్కులను పరిరక్షించేందుకు, ఆయన లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని తేల్చి చెప్పింది. దాంతో సిట్ కుట్ర బెడిసికొట్టింది.ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు బెంబేలుఈ పరిణామాలతో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు సిట్ అధికారులు బెంబేలెత్తారు. రూ.11 కోట్ల నోట్ల కట్టలను ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ నగదు కట్టలను రాజ్ కేసిరెడ్డి 2024 జూన్ నుంచే ఫామ్హౌస్లో ఉంచినట్టు సిట్ పేర్కొంది. కానీ, ఆర్బీఐ అధికారులు ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నోట్లు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024 జూన్ తరువాత ముద్రించినవి అని నిర్ధారణ అయితే సిట్ చెప్పిన జప్తు వ్యవహారం అంతా కట్టుకథేనని స్పష్టమవుతుంది.అంతేకాదు, ఆ నోట్ల కట్టలను ఏ ఏ తేదీల్లో బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారన్నది కూడా ఆర్బీఐ అధికారులు పరిశీలించి వెల్లడిస్తారు. ఆ నోట్ల కట్టలు అన్నీగానీ వాటిలో కొన్ని గానీ 2024, జూన్ తరువాత బ్యాంకుల నుంచి విత్డ్రా చేసినట్టు వెల్లడైతే సిట్ బండారం బట్టబయలవుతుంది. చివరకు కోర్టును తప్పుదారి పట్టించిన సిట్ అధికారులపై న్యాయస్థానం తీవ్రమైన చర్యలకు ఆదేశించవచ్చు. ఆపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన ఈ అక్రమ కేసు కుట్ర బెడిసికొడుతుంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు, సిట్ అధికారులు హడలిపోయారు.విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అడ్డగోలు వాదనజప్తు చేసిన ఆస్తుల విషయంలో చేయాల్సింది ఇలా...పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు తాము జప్తు చేసే స్థిర, చర ఆస్తులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను న్యాయ వ్యవస్థ విస్పష్టంగా పేర్కొంది. అవి ఏమిటంటే...⇒ జప్తు చేసిన నగదు, స్థిర, చర ఆస్తులను మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేయాలి. ⇒అనంతరం పంచనామా చేయాలి. అంటే ఆ స్థిర, చర ఆస్తుల పరిమాణం, స్వరూప స్వభావాలను స్పష్టంగా పేర్కొనాలి. నగదు కాబట్టి.. ఆ నోట్లపై ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు, మొత్తం విలువ, వాటిని ఎందులో భద్రపరిచింది? మొదలైన వివరాలతో పంచ నామా చేయాలి. ⇒ జప్తు చేసిన నోట్ల కట్టలను ప్యాకింగ్ చేసి న్యాయస్థానంలో ప్రదర్శించాలి. ప్యాకింగ్ తెరచి మరీ న్యాయస్థానానికి చూపించాలి. ⇒ అనంతరం న్యాయస్థానం అనుమతితో ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో భద్ర పరచాలి. కోర్టు కోరితే ఎప్పుడైనా సరే వాటిని మరోసారి తీసుకొచ్చేందుకు వీలుగా ట్రెజరీలోనే ఉంచాలి. ⇒ కోర్టు అనుమతి ఇచ్చిన తరువాతే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలి.కానీ, సిట్ ఏం చేసిందంటే..⇒హైదరాబాద్ శివారు ఫామ్హౌస్లో రూ.11కోట్లు జప్తు చేసినట్టు ప్రకటించింది. ⇒జప్తు చేసిన నోట్ల కట్టలను న్యాయస్థానానికి చూపించనే లేదు. జప్తు చేసినట్టు కేవలం ఓ నోట్ సమర్పించి చేతులు దులుపుకొంది.⇒ ఆ రూ.11 కోట్లను ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరచలేదు.⇒ కోర్టు అనుమతి లేకుండానే ఆ రూ.11కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించింది. తద్వారా బ్యాంకులోని ఇతర నోట్ల కట్టలతో వాటిని కలిపేయాలన్నది సిట్ కుట్ర. తద్వారా జప్తు పేరిట తమ కుట్ర బయటపడకుండా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.నోట్ల కట్టలన్నిటికీ బ్యాంక్ పిన్, సీల్స్⇒ వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది⇒ మరి రూ.11 కోట్లని ఎలా నిర్ధారించారు?⇒ లెక్కపెట్టే యంత్రాలను ఎక్కడా చూపలేదు..⇒ అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారు⇒ కానీ, ఇక్కడే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామాసిట్ కపట నాటకంలో మరో అంకం ఇది.. అది జప్తు చూపించిన డబ్బు అంతా కట్టలకు బ్యాంక్ పిన్, సీల్స్తో ఉంది. దీన్నిబట్టి కనీసం వాటిని విప్పలేదని స్పష్టం అవుతోంది. అలాగైతే.. ఆ మొత్తం రూ.11కోట్లని ఎలా నిర్ధారించారు? అనేది సమాధానం చెప్పాలి. పైగా నగదు లెక్కింపు యంత్రాలను కూడా ఎక్కడా చూపలేదు. అంటే, ఎక్కడో లెక్కపెట్టి ఇక్కడికి తెచ్చి చూపారని స్పష్టం అవుతోంది. కానీ, ఫామ్హౌస్లోనే కనిపెట్టి జప్తు చేసినట్లు పెద్ద డ్రామా నడిపించింది.నోట్ల నంబర్లు రికార్డు చేస్తే సిట్ బండారం బట్టబయలునోట్ల నంబర్లు రికార్డు చేస్తే ఏ బ్యాంకు ద్వారా ఎప్పుడు డ్రా చేశారు? ఎవరి బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు? ఏ టైమ్లో డ్రా చేశారు? అనేది స్పష్టంగా తేలిపోతుంది. అందుకే అది తెలియకుండా ఉండేందుకు బహుశా ప్రపంచంలో ఏ విచారణ సంస్థ కూడా చేయని విధంగా సిట్ బరితెగించింది. భారీ స్కెచ్ వేసింది. స్వయంగా డబ్బు తానే పెట్టి.. జప్తు పేరిట కపట నాటకం ఆడింది. ఇదంతా బయటపడకుండా ఉండేందుకు బ్యాంకులోని మిగతా డబ్బులో కలిపేసే కుతంత్రానికి తెరతీసింది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
ముగిసిన మిథున్ రెడ్డి రిమాండ్.. విజయవాడకు తరలింపు
-
విశాఖలో లులుకు ఖరీదైన ప్రభుత్వ భూముల కేటాయింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి,అమరావతి: విశాఖలో లులు గ్రూప్కు ఖరీదైన భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషనర్ పిటీషన్ దాఖలు చేశారు. లులు సంస్థకు బిడ్డింగ్ లేకుండా ప్రభుత్వ భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. గతంలో బిడ్ల ద్వారా భూమిని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.విజయవాడలో కూడా లులు గ్రూప్కు ప్రభుత్వ భూములు కేటాయింపు జరిగింది. భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం జీరో జారీ చేసింది. విశాఖలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించారు. అయితే, భూ కేటాయింపుల్లో కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది అన్నారు. లులుకు భూములు కేటాయించడాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
దొంగ.. దొంగది.! అర్ధరాత్రి ఇంట్లోకి దూరి
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు. వన్టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు.పలు కేసుల్లో నిందితులు..నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు. బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్స్టేషన్లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. అత్త సొమ్ము అల్లుడి దానమా?: శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
జైల్లో మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమైన తల్లి స్వర్ణలత
-
ఇటు ప్రకృతి విధ్వంసం.. అటు పాలకుల నిర్లక్ష్యం
-
చంద్రబాబు లులూ భజన..!
-
విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
-
విజయవాడలో ధియేటర్ అద్దాలు పగలగొట్టిన పవన్ సైకో ఫ్యాన్స్
-
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపైనే ప్రశ్నిస్తున్నాం: మేయర్ భాగ్యలక్ష్మి
-
అత్యంత దారుణంగా విజయవాడ రోడ్లు
-
యూజ్ లెస్ ఫెలోస్ అంటూ అధికారులపై మంత్రి నారాయణ చిందులు
-
చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది. -
Vijayawada: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజువల్స్
-
Central Jail: జైల్లో నేలపైనే మిథున్ రెడ్డి
-
విచారణకు రావాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం
సాక్షి,విజయవాడ: ఎంపీ మిథున్రెడ్డికి జైలులో వసతులు కల్పించాలనే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరించారనే ఫిర్యాదుపై రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు(మంగళవారం, జూలై 22) కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి, విష్ణు వర్ధన్లు ఫిర్యాదు చేశారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలన్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించారని న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. అనంతరం, రాజమండ్రి జైలు అధికారులు రేపు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలు అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. -
విజయవాడలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తుల సారె.. (ఫొటోలు)
-
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి మిథున్ రెడ్డి
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరుపర్చనుంది. లేని మద్యం కేసును సృష్టించి.. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ వేధిస్తోంది. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. మిథున్రెడ్డి అరెస్ట్పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మిథున్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయి. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మిథున్రెడ్డి కడిన ముత్యంలా బయటకొస్తారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. లేని మద్యం కేసును సృష్టించి అరెస్ట్లు చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే మిథున్రెడ్డిని అరెస్ట్ చేశారు. న్యాయ పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. కాగా, విచారణకు ముందు.. మిథున్రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన మాజీ ఎంపీ వంగా గీతమీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు కాబట్టే వాటిని మేము ప్రశ్నిస్తామని భయపడి YSRCP నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని అందరికీ తెలుసు.చంద్రబాబూ.. నిజాయితీగా పాలన చేస్తున్నవారు ఎవరూ ఇలా అక్రమ అరెస్టులు చేయించరు.మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.లేని మద్యం కేసును సృష్టించి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది: ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రిఎంపీ మిథున్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యంచంద్రబాబు గారూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.మిథున్ రెడ్డిపై అక్రమ అరెస్టును ఖండిస్తున్నా: గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీప్రజల అండదండలు మాకు ఉన్నాయి.మీ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.మిధున్ రెడ్డి అరెస్ట్ పై X లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ఇంకెక్కడా కుంభకోణం???? కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్నఈ కుట్రలో మిథున్ అన్నను కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది చంద్రబాబు గారి ప్రతీకార డ్రామామిథున్ రెడ్డి అరెస్ట్ కుట్రపూరితం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: గురుమూర్తి, ఎంపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజల సమస్యలు గాలికి వదలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపులకు ప్రాధాన్యం ఇస్తుంది.ఎన్నికలలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఈ కుట్రలన్నింటికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. -
మిథున్రెడ్డి అరెస్ట్పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం
మిథున్రెడ్డి అరెస్టును ఖండించిన కాసు మహేష్రెడ్డికూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయితప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదుమిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారువైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం: ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికక్ష సాధింపు లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారుఏపీ లో కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారుమిథున్ రెడ్డి ఖచ్చితంగా న్యాయ పోరాటంలో విజయం సాధిస్తారువైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అరెస్ట్ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్రేపు కోర్టులో హాజరుపర్చనున్న సిట్లేని మద్యం కేసును సృష్టించి.. కుట్రలకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంమిథున్రెడ్డి అరెస్ట్పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహంవిజయవాడసిట్ కార్యాలయంలో 6 గంటలకు పైన కొనసాగుతున్న ఎంపీ మిథున్రెడ్డి విచారణఏ సమయం వరకు విచారణ సాగిస్తారో చెప్పని అధికారులురాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథ్న్ రెడ్డిని ఉంచనున్నట్లు సమాచారంసిట్ కార్యాలయం బయట ఉదయం నుండి భారీ భద్రతలిక్కర్ కేసుకు సంబంధించి చార్జీ షీట్ను జడ్జి ఇంటికి తీసుకెళ్ళిన సిట్ అధికారులుజడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్ షీట్ను వెనక్కి తీసుకొచ్చిన సిట్ అధికారులు300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు సమాచారంపూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో ఉంచాలని చూస్తున్నారంటున్న వైఎస్సార్సీపీవిజయవాడమద్యం పాలసీ కేసులో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విచారణవిజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్రెడ్డిఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్రెడ్డిసిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తిరుపతి..మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందివైఎస్సార్సీపీలో ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసుకుని ఇలా సిట్ వేధింపులకు గురిచేస్తున్నారు.50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదునీతిగా నిజాయితీగా పాలన చేశాంవైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతికి అవకాశం లేదుఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారుజగనన్న పాలనలో బెల్ట్ షాపులు లేవు.ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించాం అంబటి రాంబాబు కామెంట్స్..ఇది పూర్తిగా తప్పుడు కేసు.ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారు.మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా మద్యం అక్రమ కేసు.ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. తాడేపల్లి..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..ఏపీలో కక్షసాధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందిజగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారుకూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుసాక్ష్యాలు ఏం ఉన్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్ చూపించలేక పోయిందిరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగిందిదాన్నుంచి తప్పించుకునేందుకే కొత్తగా మా పార్టీ నేతలపై కేసులు పెట్టారుఎంపీ మిథున్ రెడ్డి స్వచ్చందంగా విచారణకు హాజరయ్యారువిచారణ సందర్భంగా ఒక యుద్ద వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసిందిరోడ్డు పొడవునా పోలీసులను పెట్టి హడావుడి చేస్తోందిఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదుచిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఎంపీ గురుమూర్తి కామెంట్స్..మిథున్రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు.రాజకీయ కక్షతోనే మిథున్రెడ్డిపై కేసు.కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్చంద్రబాబు, నారా లోకేష్ కక్ష్య సాధింపుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.వైఎస్సార్సీపీలో కీలక నేత, జగన్ సన్నిహితుడు అయిన ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్రలు జరుగుతోంది.ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర.మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు.ఓ అభూత కల్పనతో దారుణాలకు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతున్నారుఇప్పటి వరకు అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవుఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, కొట్టడం చేస్తున్నారు.రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు మిథున్ రెడ్డి కామెంట్స్..రాజకీయ కక్షతో కేసు పెట్టారు.ఇది పూర్తిగా తప్పుడు కేసు.మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కేసులకు భయపడే ప్రసక్తే లేదు.రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు.సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు. విజయవాడ..ఎనికేపాడు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుగన్నవరం విమానాశ్రయం నుండి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు బయల్దేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు.సిట్ కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలుఎవరిని అనుమతించని పోలీసులుసిట్ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణును ఆపేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి.మద్యం కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఏపీలో మద్యం కేసులో విచారణ విషయమై.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి.. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.నేడు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.విమానాశ్రయం ఎంట్రన్స్లో భారీగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల వివరాలు అడిగి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో ఆంక్షలు విధించారు. -
Rowdy Gang: గజగజ లాడుతున్న బెజవాడ
-
Hyderabad: దంచికొట్టిన వర్షం
-
మరో నారాయణ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,విజయవాడ: నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. భవానీపురం నారాయణ కాలేజీలో జీవన్ సాయి చదువుతున్నాడు. అయితే,ఈ క్రమంలో మార్కులు తక్కువ వచ్చాయని జీవన్ సాయిని కాలేజీ లెక్చరర్ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన జీవన్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.తన కుమారుడి మరణానికి నారాయణ కాలేజీ యాజమాన్యమే కారణమని విద్యార్ధి తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాబిడ్డను అందరి ముందు కొట్టారు. నా కొడుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ సాయి ఆత్మహత్యపై భవానిపురం నారాయణ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. లెక్చరర్ కొట్టడంతో మనోవేదనకు గురై ఆత్మ చేసుకున్న విద్యార్థి ఏమీ పట్టనట్లు కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాలేజీపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. -
విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్
-
బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్
-
ఉప్పల హారిక పై దాడి.. విజయవాడలో మహిళలు భారీ నిరసన
-
టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుంది: వరుదు కల్యాణి
సాక్షి, విజయవాడ: జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజున్న బాబు,పవన్ ఎక్కడ?’’ అంటూ నిలదీశారు.టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా?. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. కచ్చితంగా చంద్రబాబు సర్కార్కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ‘‘జడ్పీ చైర్పర్సన్పై జరిగిన దాడి సిగ్గుచేటు. బీసీ మహిళపై దాడితో సభ్య సమాజం తలదించుకుంటుంది. బీసీలు అంటే బ్యాక్ బోన్స్ అని చెప్పిన చంద్రబాబు.. ఆ బోన్స్ విరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం.. సంక్షేమంలో రికార్డు లేదు కానీ.. దాడుల్లో రికార్డ్ సాధించింది. గంటసేపు మహిళపై నానా బూతులు మాట్లాడారు...దాడి చేయడమే కాకుండా ఉప్పాల రాముపై కేసు నమోదు చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మహిళా సంఘం చైర్మన్ మౌనంగా ఉంది?. చట్టం అందరికీ ఒకటే అనే సంగతి మరిచారా?. తక్షణం హోం మంత్రి, డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. దాడి చేయడమే కాకుండా ఉప్పాల హారికని మహానటి అనడం దారుణం’’ అని కల్పలతారెడ్డి మండిపడ్డారు. -
కొనసాగుతున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె
-
Vijayawada: పనిమనిషే ప్రాణం తీసింది
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
జయహో శాకంబరీ మాత!
అమ్మవారంటే సాక్షాత్తూ అమ్మే. ఈ సృష్టిలోని జీవరాసులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలిని తీర్చడానికి శాకంబరి దేవి అవతారంలో ఉద్భవించింది. ఈ దేవిని పూజించటం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆకలి బాధ ఉండదనీ భక్తులు విశ్వసిస్తారు. వరంగల్లోని భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ దేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాధ తెలుసుకుందాం...∙ఆషాఢ ఉత్సవాలువేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తి హీనులై΄ోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది.ఋషులు, దేవతలు సర్వ శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో ‘శతాక్షి’గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకంలో వున్న దుస్థితి ని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్దచెట్టు లాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం.పార్వతీదేవి దుర్గగా, తన నుంచి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది. అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో ఆషాఢ మాసం లో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి.వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో మొదటిసారిగా ఆషాడ శుద్ధ సౌర్ణమి నాడు శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు... అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు... వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను.. నా శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను.. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని’ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది.కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శోకాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడవుతాడు.చదవండి: తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం చేస్తున్నా: ఉపాసన కొణిదెల ఆషాఢమాసంలో ఆలయానికి వెళ్లే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు, కూరగాయలను ఉంచి, వీలయితే వాటితో అమ్మవారిని అలంకరించి, ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది. అందుకు కూడా వీలు లేనివారు కనీసం శాకంబరీ ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలచుకుని పేదలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం ఫలదాయకం.వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో గత నెల జూన్ 26న సహస్ర కలశాభిషేకంతో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు. నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!– అడ్లూరి సునందాశివప్రసాద్ సాక్షి, హన్మకొండ కల్చరల్ -
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
పల్నాడు: భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ ఆత్మహత్య
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లికీ చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. విజయవాడ పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్ డ్రిల్ (ఫొటోలు)
-
‘ప్రభుత్వానికి ఇగో ఏంటి?.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?’
విజయవాడ: విదేశీ వైద్య విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఇగో ఏంటో అర్థం కావడం లేదని,. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే తమకు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు తెలిపారు. పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ధర్మాచౌక్లో ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) సైతం నిరసన చేపట్టిన వైద్య విద్యార్థుల ఆందోళనకు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు తమ మద్దతు తెలిపారు. విద్యార్థుల శిబిరానికి చేరుకుని వైఎస్సార్సీపీ నేతల మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా సీదిరి అప్పలరాజా మాట్లాడుతూ.. ‘న్యాయమైన డిమాండ్ ను అడిగితే విద్యార్ధులను రోడ్డుకు ఈడుస్తారా?, విద్యార్ధినుల జుట్టుపట్టి కొట్టేస్తారా?, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ...తాలిబాన్ లో ఉన్నామా?, వైద్య విద్యార్ధులను జుట్టుపట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేస్తారా?, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది?, 13 నెలలుగా కాలయాపన చేసి చివరికి విద్యార్ధులను ఎండలో కూర్చోబెట్టారు. వైద్య విద్యార్ధుల ఏడుపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి. వైద్య రంగం సంపూర్ణంగా పనిచేయాలని జగన్ కృషి చేశారు. 50 వేల మందిని రిక్రూట్ చేశారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే...ఈ ప్రభుత్వం వాటిని కట్టకుండా ఆపేసింది. ఏడాదిలో లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చారు చంద్రబాబు. ఆరువేల కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటున్నారు. లక్ష కోట్లతో బిల్డింగ్లు ,బొలేరోలు కొనుక్కోవడానికి డబ్బులున్నాయంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెడుతున్నారు. బ్లాకే మెయిల్ చేస్తారా అని సాక్షాత్తూ మంత్రే విద్యార్ధులను బెదిరిస్తున్నారు విద్యార్ధుల పట్ల మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఇది ప్రభుత్వం చేతగానితనంవైద్య విద్యార్తులు రోడ్డెక్కాల్సిన రావడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనిరవాసరెడ్డి. ‘ చంద్రబాబు,లోకేష్ పరిపాలనను గాలికొదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పై దృష్టిపెట్టారు. ఎవరి పై కేసులు పెట్టాలి...ఎవరిని లోపల పెట్టాలనేదే వాళ్ల ఆలోచన. విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. ఏపీలో మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నారు. ఏపీలోనే ఎందుకు ఈ సమస్య వచ్చిందిమీకు ఇవ్వడం చేతకాకపోతే ఎన్ఓసి ఇవ్వండి వేరే రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటారు. 68 మంది విద్యార్ధుల పై కేసులు పెట్టారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి తమ పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. చంద్రబాబు,లోకేష్ ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడనాడండి. డాక్టర్లను రోడ్డు మీదకు వదిలేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి వైద్య విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలి’ అని గోపిరెడ్డి శ్రీవినాసరెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి -
యోగా టీచర్లపై పోలీసుల జులుం
-
చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్ల నిరసన
-
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్లో ల్యాండింగ్కి వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వరుసగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం.. విమాన ప్రయాణం అంటేనే భయపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తీసుకొచ్చారు. -
విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఆషాఢ సారె (ఫొటోలు)
-
ఇదే కనుక జరిగితే నీటి సరఫరా, విద్యుత్ బంద్..
-
విజయవాడలో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్ను ఎస్ఐ పలుసార్లు పోలీస్స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన ఎస్ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్ఐలు చాణక్య, రాజేష్ వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్ చేశారు. -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ విజయవాడ జీజీహెచ్ పరిస్థితి (ఫొటోలు)
-
చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.ఈ సందర్భంగా.. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్ను సిట్ అధికారులు కొడితే మణిపాల్లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్గా చూపించారు’ అని తెలిపారు. -
ఏపీలో యోగా డే వేడుకల్లో అపశృతి.. మహిళకు అస్వస్థత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న కేంద్రం వద్ద లైవ్ సైడ్ స్క్రీన్ పక్కకు పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే యోగా చేసే వారిపై స్కీన్ పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు.. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో యోగా సందర్భంగా అరకొరగా వసతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యోగా చేసేందుకు స్టేడియంకు వచ్చిన వారికి కావాల్సిన మొత్తంలో మ్యాట్స్ ఇవ్వకపోవడంతో వాటి కోసం అందరూ ఎగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారికి చెదరగొట్టారు.ఇదిలా ఉండగా.. విశాఖలో యోగా డే సందర్భంగా ప్రమాదం తప్పింది. యోగా డే వేడుకల కోసం ప్రజలను తరలిస్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హనుమంతువాక విశాలాక్షి నగర్ వద్ద బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారంతా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. -
విజయవాడలో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో సదస్సు
-
విజయవాడ: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వాంతులు, విరోచనాలు, డీ హైడ్రేషన్తో వంశీ బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఆయన గత నెలలో కూడా తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్థారించారు.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. -
వివాహితను నవవధువుగా చెప్పి మోసం
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వివాహమై పిల్లవాడు ఉన్న యువతిని పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి లక్షలు దండుకొని మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక కొప్పుల్ జిల్లాకు చెందిన జి.దుర్గాప్రసాద్ (34) వివాహం కాకపోవడంతో స్థానికంగా ఉన్న మ్యారేజీ బ్యూరోకి చెందిన శ్రీదేవి అనే మహిళ ద్వారా రాజమండ్రి, విజయవాడలోని మధ్యవర్తులను ఆశ్రయించాడు. వారు విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని పరిచయం చేశారు. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావు కృష్ణలంకకు చెందిన పల్లవి అలియాస్ ఆమని అనే యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడ కృష్ణలంకలోని ఒక హోటల్లో పెళ్లి చూపులు తతంగం జరిపించారు. అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే రూ.2.70 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం మరో రూ.18 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు పార్వతి అనే మహిళకు రూ.50 వేలు ఇచ్చారు. ఈ నెల ఐదున దుర్గగుడిలో వివాహం జరిగింది. కర్నాటక వెళ్లి ఏడో తేదీన వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ జరుపుకొన్నారు. పల్లవి వెంట కర్నాటక వెళ్లిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద రూ.50 వేలు తీసుకుని అదృశ్యమయ్యాడు. మూడు రోజుల తరువాత పల్లవి తనకు అంతకు ముందే వివాహమైందని, ఒక బాబు కూడా ఉన్నట్లుగా చెప్పింది. దాంతో దుర్గాప్రసాద్ తాను మోసపోయినట్లు గుర్తించి తన కుటుంబ సభ్యులకు వివరించాడు. పల్లవిని తీసుకొని ఈ నెల 14వ తేదీన విజయవాడ బస్టాండ్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేయటమే కాకుండా తన నుంచి రూ.2.88 లక్షల నగదును సైతం కాజేశారని వాపోయాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు దుర్గాప్రసాద్ను వన్టౌన్ పోలీసుస్టేషన్కు పంపించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
Malladi Vishnu: జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం
-
జూన్ 26 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ: ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు, 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవ రాత్రులు, జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. ఆషాఢ మాసోత్సవాలు.. అమ్మవారికి సారె ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా భక్తులు దుర్గమ్మకు సారె సమర్పిస్తారు. నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూలవిరాట్ దర్శనానంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. గుప్త నవరాత్రులుఆషాఢంలో దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకు వారాహి నవరాత్రులు (గుప్త నవరాత్రులు) నిర్వహిస్తారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఆలయ వైదిక కమిటీ, అర్చకులు ఈవోతో చర్చించారు. శాకంబరీదేవి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై జూలై 8 నుంచి 10వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి మూలవిరాట్తో పాటు ఉపాలయాల్లో దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని కాయగూరలు, ఆకుకూరలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసే కదంబం ప్రసాదం శాకంబరీదేవి ఉత్సవాల ప్రత్యేకత. చదవండి: Today recipes : బ్రెడ్తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?వైదిక కమిటీ, అర్చకులతో ఈవో సమీక్ష దుర్గగుడిలో ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం ఆలయ వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, ఆలయ ఏఈవో, ఫెస్టివల్ విభాగంతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థ్ధానంపై ఉందని ఆలయ అధికారులతో పేర్కొన్నారు. దర్శన వేళలు, రద్దీ సమయాల్లో వ్యవహరించాల్సిన విధానాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వీఐపీ ప్రత్యేక బ్రేక్ దర్శన వేళలు వంటి అంశాలను చర్చించారు. సమీక్షలో ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు శ్యావాశ్వ మహర్షి, సీహెచ్ ఆంజనేయ ఘనాపాటి, ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధానఅర్చకులు కోట ప్రసాద్, ఏఈవో ఎన్. రమేష్బాబు, బి. వెంకటరెడ్డి, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్ -
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
విజయవాడ: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు మగిసిన తర్వాత హైదారాబాద్ బయల్దేరారు ఏపీలోని ప్రజలు. అయితే ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సుల ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడింది. వేసవి సెలవులు ముగిశాయని తెలిసినా ప్రభుత్వం మాత్రం సాధారణ బస్సు సర్వీసులకే పరిమితమైంది. ఎటువంటి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట చేయకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. గతరాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ప్రత్యేకంగా గత ఏడాది కూడా ఇలానే వచ్చినా ఈ తరహాలో బస్సులు లేకుండా ఇబ్బందులు పడలేదని ప్రయాణీకులు అంటున్నారు. -
Sakshi: విజయవాడ సాక్షి కార్యాలయంపై పచ్చమూకల దాడి
విజయవాడ,సాక్షి: విజయవాడలో పచ్చమూకలు రెచ్చిపోయారు. విజయవాడ సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. సాక్షి యూనిట్ కార్యాలయం బోర్డులను టీడీపీ నేతలు పగలకొట్టారు. సాక్షి బోర్డులు పీకేసీ తగులబెట్టారు. అనంతరం, సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు, రాళ్లు విసిరేశారు. సాక్షి కార్యాలయంపై దాడి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ సమక్షంలోనే జరిగింది. అయితే, సాక్షి కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.