fake vigilance
-
నకిలీ విజిలెన్స్ ముఠా ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: రోడ్ల నిర్మాణంలో వినియోగించే బ్లాక్ ఆయిల్ వ్యాపారం చేస్తున్న ట్యాంకర్ యజమానులను లక్ష్యంగా చేసుకొని విజిలెన్స్ అధికారుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను భువనగిరి ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.8 లక్షల నగదు, కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మేట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్రెడ్డితో కలిసి అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు బుధవారం వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, గుంతకల్కు చెందిన షేక్ జహీర్ అహ్మద్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవాడు. ఏడాది క్రితం కంపెనీ చిత్తూరుకు తరలించడంతో ట్యాంకర్లు అవసరం లేదని కంపెనీ చెప్పింది. దీంతో గుంతకల్లుకు చెందిన ఫజుల్ రెహమన్ను తన ట్యాంకర్ డ్రైవర్గా నియమించుకొని లైసెన్స్డ్ డీలర్ల నుంచి బ్లాక్ ఆయిల్ను కొనుగోలు చేసి అవసరమైన వారికి విక్రయించేవాడు. బ్లాక్ ఆయిల్ కొనుగోలుకు పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లే ఫజుల్ రహమాన్ ఈ విషయాన్ని తన స్నేహితులైన భూషణ్ హరీశ్ అలియాస్ నిఖిల్కు చెప్పాడు. దీంతో అతను తన స్నేహితులు నునవత్ తులసీ, భరత్, శ్రీను, వినోద్కుమార్లతో కలిసి విజిలెన్స్ అధికారులుగా అవతారమెత్తారు. ఇదే సమయంలో బ్లాక్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ఫజుల్ రెహమాన్ ఆయిల్ నింపుకొని తిరిగి వెళుతూ తమ వద్ద రూ.3 లక్షలు ఉన్నట్లు నిఖిల్కు సమాచారం అందించాడు. దీంతో అతను తన ముఠాతో కలిసి సభ్యులతో ఔషాపూర్ వద్ద ట్యాంకర్ను అడ్డుకున్నారు. పథకం ప్రకారం ఫజుల్ రెహమాన్ ట్యాంకర్ యజమాని జహీర్కు ఫోన్ చేసి విజిలెన్స్ అధికారులు ట్యాంకర్ను పట్టుకున్నారని విడిచిపెట్టేందుకు రూ.మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత నగదు తీసుకొని నిఖిల్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. దీనిపై ఘట్కేసర్ పీఎస్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఫజుల్ రెహమాన్పై అనుమానం వచ్చిన యజమాని అతడి వివరాలపై ఆరా తీయగా గుంతకల్లో 2018లో కేసు నమోదైనట్లు తెలియడంతో అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఫోన్ చేసి.. దోచుకున్నారు... దీనిని మనస్సులో పెట్టుకున్న ఫజుల్ రెహమాన్ పథకం ప్రకారం బ్లాక్ ఆయిల్ అమ్ముతానంటూ తన స్నేహితుడు నిఖిల్తో జహీర్కు ఫోన్ చేయించాడు. అయితే బక్రీద్ పండుగ ఉన్నందున తాను రాలేనని చెప్పడంతో డ్రైవర్ను పంపిస్తే బ్లాక్ ఆయిల్ లోడింగ్ చేసి పంపుతామని నమ్మించాడు. దీంతో అతను డ్రైవర్, క్లీనర్లకు రూ. 6 లక్షలు ఇచ్చి యామ్నాంపేటకు పంపాడు. అదే రోజు రాత్రి కారులో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు ట్యాంకర్ను ఆపి తాము విజిలెన్స్ అధికారులమని లారీ డాక్యుమెంట్లు తనిఖీ చేయాలంటూ కారులో డ్రైవర్ను ఎక్కించుకొని రూ.6 లక్షలు తీసుకున్నారు. సమీపంలోని పంక్చర్ దుకాణం వద్ద మరో ఇద్దరితో కలిసి అక్కడికి వచ్చిన నిఖిల్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ డ్రైవర్ను కారులోనుంచి కిందకు తోసి పరారయ్యారు. లారీ యజమాని జహీర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన భువనగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.రాజు నేతృత్వంలోని బృందం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏపీ28 సీజీ8152 కారు నంబర్ కారులో అదే ముఠా ఔషాపూర్ వద్ద మాటు వేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8.8 లక్షల నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను ఘట్కేసర్ పోలీసులకు అప్పగించారు. గ్యాంగ్ను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అదనపు సీపీ రివార్డులతో సత్కరించారు. -
నకిలీ విజిలెన్స్ అధికారుల మోసాలపై దర్యాప్తు
ఉయ్యూరు: నకిలీ విజిలెన్స్ అధికారి పేరుతో కొనసాగిస్తున్న దందాకు ఉయ్యూరు పోలీసులు చెక్ పెట్టారు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగిస్తున్న మోసాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గుట్కా విక్రయ దుకాణాలనే టార్గెట్గా చేసుకుని లక్షలు కొల్లగొట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆ కేటుగాళ్ల మాయపంథాలో ఎందరో చిరువ్యాపారులు చిక్కుకున్నవారే. అచ్చం విజిలెన్స్ అధికారిలానే.. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు నకిలీ విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తి సుమారు రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మోసాలకు పాల్పడుతున్నారు. బాలాజీతో కలిసి చిరు వ్యాపారులని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దందా సాగిస్తున్నారు. నిజమైన విజిలెన్స్ అధికారిలా కనపడేలా ఐడీ కార్డు పెట్టుకుని దొంగ రశీదు బుక్కుతో కారు దిగి హడావుడి చేసి వ్యాపారులను భయబ్రాంతులకు గురిచేస్తూ యథేచ్ఛగా దోచేస్తున్నట్లు తెలిసింది. ‘‘శ్రీనివాసరావు ముందుగానే ఎక్కడ గుట్కాలు అమ్ముతారో తెలుసుకుంటాడు. ఆ షాపు తిన్నగా కారు ఆపి నేరుగా షాపులోకి వెళ్లి అదేంటి.. ఇదేంటి అంటూ హడావుడి చేస్తాడు. ఏం గుట్కాలు అమ్ముతున్నావంటూ గుట్కా ప్యాకెట్లు పట్టుకుని కేసు రాస్తున్నా, కోర్టుకు వెళ్లి రూ.25 వేలు ఫైను కట్టుకోండి అంటూ భయబ్రాంతులకు గురిచేస్తాడు. ఆ వ్యాపారి సరిచేయమంటూ ప్రాథేయపడతాడు. చివరకు అలాఇలా రూ.5 వేలు నుంచి రూ.10 వేలు మధ్యలో బేరం కుదుర్చుకుని ఆ నకిలీ రశీదు ఇచ్చి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు తాను నిజాయితీ అధికారినంటూ, ఫార్మాల్టీస్ ఏమీ వద్దని చెబుతూ ఓ రెండు సిగరెట్ పెట్టెలు ఇవ్వండని తీసుకుని మరీ వెళ్లిపోయి మరో కొత్త ఊరిని వెతుక్కుంటాడు.’’ ఇదే పంథాలో శ్రీనివాసరావు తన మోసాలు కొనసాగిస్తున్నాడు. గుట్కాలు అమ్మడం నేరం కావడంతో వ్యాపారులు ఎవ్వరూ ఇంతవరకు పోలీసులను ఆశ్రయించకపోవడంతో దర్జాగా దోచుకుంటూ తిరుగుతున్నాడు. ఉయ్యూరులో వెలుగులోకి.. పట్టణంలోని ఓ దుకాణంలో తన పంథాలోనే శ్రీనివాసరావు దాడి చేసి హడావుడి చేశాడు. ఈ క్రమంలోనే గల్లా పెట్టెలోని రూ.60 వేలు మాయం చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో ఆ వ్యాపారి టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ సత్యానందం నేతృత్వంలో ఎస్ఐ రామారావు సిబ్బందితో శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టి ఎట్టకేలకు మాటువేసి మరీ పట్టుకోవడంతో అసలు డొంకంతా కదులుతోంది. రూట్లు మారుస్తూ.. కారు మార్చి.. శ్రీనివాసరావు తన మోసాలకు రెండు కార్లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. షాపులపై దాడులకు వెళ్లేటప్పుడు అద్దెకు స్విఫ్ట్ కారును వినియోగించి, డబ్బు దోచుకున్న అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు తన సొంత ఇండికా కారును వాడి దొరక్కుండా తిరుగుతాడు. ఈ క్రమంలోనే ప్రధాన రోడ్లగుండా కాకుండా ప్రత్యామ్నాయం డొంక రోడ్లగుండా వెళ్లి చిక్కకుండా పోతున్న కేటుగాడిని అదే వ్యూహాన్ని అనుసరించి పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం శ్రీనివాసరావుతో పాటు రెండు కార్లు పోలీసుల అదుపులో ఉన్నాయి. మరో వ్యక్తితోపాటు ఇంకా ఎక్కడెక్కడ నేరాలు చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ విజిలెన్స్ అధికారుల అరెస్టు విజయవాడ: విజిలెన్స్ అధికారుల ముసుగులో అక్రమ వసూళ్లకు, దోపిడీలకు పాల్పడే ఇద్దరు నిందితులను ఉయ్యూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేటలో లా అడ్ అర్డర్ డీసీపీ క్రాంతి రాణా టాటా తన చాంబర్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వజ్జల వెంకట శ్రీనివాస్ కుమార్ డిగ్రీ వరకు చదివి, చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి తేలికగా డబ్బు సంపాదించేందుకు మరో ఇద్దరితో కలిసి నకిలీ విజిలెన్స్ అధికారులుగా డబ్బు వసూళ్లు చేస్తున్నారు. రెండేళ్లుగా శ్రీనివాసకుమార్ నగరంలో నివసించే మహేష్, లోకం బాలాజీతో కలిసి విజిలెన్స్ అధి కారులుగా, పొల్యూషన్ బోర్ఢు అధికారులుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. యజమానులను బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వెంకట శ్రీని వాసకుమార్, బాలాజీలను విద్యాధరపు రం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు, నకిలీ రసీదులు, స్టాంపులు స్వాధీ నం చేసుకున్నారు. ఓ కారు, బైక్కూడా స్వా ధీనం చేసుకున్నారు. మరో నిం దితుడు మహేష్ పరారీలో ఉన్నాడు.డీసీపీ గజరావు భూ పాల్, ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు. -
నకిలీ విజిలెన్స్ అధికారుల పట్టివేత
తలుపుల: అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారుల పేరుతో దందాలకు దిగిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తలుపుల మండలంలోని ఓదులపల్లి గ్రామంలోని రేషన్ దుకాణానికి సోమవారం భాస్కర్, వలీ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము విజిలెన్స్ అధికారులమని చెప్పి సోదాలు చేశారు. రేషన్ డీలర్ దగ్గర కొంత మొత్తం నగదు పుచ్చుకుని వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత రేషన్ డీలర్ రెవెన్యూ అధికారులను విచారించగా తమకు సమాచారం లేదన్నారు. మంగళవారం భాస్కర్, వలీ కుర్లి గ్రామం రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి విజిలెన్స్ అధికారుల పేరుతో సోదాలకు దిగారు. డీలర్ వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు విషయం తెలుపగా, రంగంలోకి దిగిన పోలీసులు భాస్కర్, వలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.