రాజన్నను దర్శించుకున్న భన్వర్లాల్
వేములవాడ: వేములవాడలో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్లాల్ బుధవారం దర్శించుకున్నారు. ఆయల అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.