ముంబై ఆశలు సజీవం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబాంగ్ ముంబై తమ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 6-3తో నెగ్గింది. ఈ ఓటమితో విజార్డ్స్ సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. ముంబై తరఫున గుర్జంత్ సింగ్ (14వ నిమిషంలో), ఫ్లోరియన్ ఫచ్స్ (42), యూసుఫ్ అఫాన్ (59) ఫీల్డ్ గోల్స్తో అదరగొట్టారు. యూపీ విజార్డ్స్ నుంచి వీఆర్ రఘునాథ్ (19) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచగా.. చింగ్లెన్సన సింగ్ (30) ఫీల్డ్ గోల్ చేశాడు. 10 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో ప్రస్తుతం ముంబై జట్టు కళింగ లాన్సర్తో సమానంగా 25 పాయింట్లతో ఉంది.