రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట జరిగిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ దుర్ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యత అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న ప్రచార యావ కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని దుయ్యట్టారు. బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... * చంద్రబాబు పూజలు చేస్తున్న సమయంలోనే లక్షల మంది బయట వేచి చూస్తున్నారు. * సీఎం ఘాట్ కు వచ్చేటప్పటికే జనం కిక్కిరిసి ఉన్నారు * ప్రభుత్వమే కావాలనే భక్తులందరినీ ఒకే ఘాటుకు తరలించింది * భక్తులు తమంతట తామే అక్కడికి వచ్చారని తప్పుదారి పట్టిస్తున్నారు * సీఎం పూజ చేస్తున్న సమయానికి జనం పోటెత్తారని చెప్పడానికే ఇదంతా చేశారు * లఘుచిత్రం కోసం ఫోటోలు తీసుకునేందుకే ఇలా చేశారు * ఫోటోలు బాగా రావాలన్న ఆలోచనతో భక్తుల భద్రతను గాలికి వదిలేశారు * భారీ జనసందోహం కనబడే దాకా సీఎం పూజ కార్యక్రమం నిర్వహించారు * మూడు గంటల పాటు జనాన్ని పుష్కర ఘాట్ బయట ఆపేశారు * ప్రచార యావతో జరిగిన తప్పిదం ఇది * ప్రభుత్వ నిర్లక్ష్యంగానే ప్రాణనష్టం జరిగింది * చంద్రబాబు పిచ్చిని ప్రజలు గమనిస్తున్నారు * బాబుకు మీడియా పిచ్చి, ప్రచార పిచ్చి ఉంది * తన వల్ల తప్పు జరిగినందుకు సీఎం క్షమాపణ చెప్పారా? * తన వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పుకుంటే ఏమౌతుంది? * చంద్రబాబు కంటతడి పెట్టారని మీడియా సలహాదారు చెబుతారు * చంద్రబాబు ప్రతిదీ మేనేజ్ చేయాలనుకుంటారు * న్యాయవిచారణకు ఆదేశించే నైతిక చంద్రబాబుకు ఎక్కడుంది * చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారా, లేదా? * తొక్కిసలాట ఘటనపై సమగ్ర నివేదిక ప్రభుత్వం వద్ద లేకపోవడం దారుణం * తొక్కిసలాట ఘటన బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కాలనుకున్నారు * తొక్కిసలాట దృశ్యాలు బయటకు రాకుండా చేశారు.
Published Wed, Jul 15 2015 1:54 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement