బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి | Take Actions On The Blackmailer | Sakshi

బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి

Jul 19 2018 9:27 AM | Updated on Nov 9 2018 4:31 PM

Take Actions On The Blackmailer - Sakshi

 వినతిపత్రం ఇస్తున్న విద్యార్థి నాయకులు   

మెదక్‌ మున్సిపాలిటీ : బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చెప్పుకుంటూ అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న రఘుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు రమేశ్‌ మాట్లాడుతూ గతంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రఘు ప్రైవేట్‌ విద్యా సంస్థలు, వార్డెన్లను బ్లాక్‌ మెయిల్‌చేస్తూ డబ్బులు వసూలు చేశాడన్నారు.

ఈ విషయాన్ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లగా గతంలోనే రఘును అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జరిగిందన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడి చెప్పుకుంటూ మళ్లీ బ్లాక్‌ మెయిల్స్‌ పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో రఘుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మెమోరాండాం సమర్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, పృథ్వి, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు శరత్‌ కుమార్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు వినోద్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నీలంబాబుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement