breaking news
Mahabubabad District News
-
స్థానిక ఎన్నికలకు సై..
జూలైలో ఎన్నికలు ఉండొచ్చని సంకేతాలుసాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో ఏడాది తర్వాత మళ్లీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు రావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు. అలాగే అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని చెబుతున్నారు. ముందు ఆ ఎన్నికలే.. గత ఏడాదిన్నర నుంచి స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. గత ఏడాది జనవరిలో సర్పంచ్, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం వరుసగా అన్ని ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ముందుగా గ్రామ పంచాయతీలకు కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఆశావహుల హడావుడి.. ఏడాదికాలంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ఆశావహులు ఇటీవల మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రకటనలతో హడావుడి చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలో కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు అన్వేషణ మొదలు పెట్టారు. కొందరికి అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పినట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకతనే బలంగా ముందుకు సాగాలని, అత్యధిక సీట్లు గెలవాలని అధినాయకత్వం చెప్పడంతో అంతా అప్రమత్తమయ్యారు. బీజేపీ కూడా తమ బల నిరూపనకు ఇదే అదునుగా భావించి గెలిచే స్థానాలు గుర్తించి బలమైన అభ్యర్థులను బరిలో దింపే పనిలో ఉన్నారు. వీరితోపాటు మొదటి నుంచి వామపక్ష పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్యూహ రచన చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అయితే ఈ సారి ఏ ఎన్నికై నా.. ఏ పార్టీ నుంచేనా.. పోటీలో నిలిచేవారిలో అధికశాతం యువతే ఉండే అవకాశం ఉంది. ఈమేరకు గాడ్ఫాదర్స్ వద్దకు వెళ్లి టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లపై చర్చ.. ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీల్లో చర్చగా మారింది. బీసీ కులగణన ప్రక్రియపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ వస్తుందా.. ఇలా అయితే రిజర్వేషన్ 50శాతానికి మించే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు బీసీ రిజర్వేషన్ ఉంటుందో.. లేదో.. ఉంటే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ. దీంతోపాటు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన రిజర్వేషన్ రెండు విడతలుగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే నిజమైతే గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం లేకపోలేదు. మేం సిద్ధంగా ఉన్నాం.. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జిల్లాలోని 18 మండలాల్లోని 193 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశాం. 1066 పోలింగ్ స్టేషన్లను గుర్తించాం. బ్యాలెట్ బాక్స్లు, ఆర్ఓ బుక్స్, ఇతర మెటీరియల్ సిద్ధంగా ఉంది. ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చాం. –పురుషోత్తం, జెడ్పీ సీఈఓ అన్ని రాజకీయ పార్టీల్లో సందడి పోటీకి సిద్ధపడుతున్న ఆశావహులు సర్వం సిద్ధం చేశామంటున్న అధికారులు రిజర్వేషన్లపై చర్చపోలింగ్ స్టేషన్లు: 1,066 గ్రామ పంచాయతీలు: 482 వార్డులు : 4,110మండలాలు: 18 జెడ్పీటీసీలు: 18ఎంపీపీలు: 18 ఎంపీటీసీలు: 193 -
విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం
మహబూబాబాద్ అర్బన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం చేపడుతున్నామని మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో సోమవారం వినియోగదారుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విద్యుత్ ప్రజావాణిలో 512 ఫిర్యాదులు రాగా, 442 పరిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేటగిరీ మార్పు, పేరు మార్పు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు తదితర విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాలు, సర్కిల్, డివిజన్, ఈఆర్వో, సబ్ డివిజన్, సెక్షన్ ఆఫీస్ల్లో విద్యుత్ ప్రజావాణి ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిషేధం.. ఉత్తిమాటే!
తొర్రూరు: పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్ల వినియోగం పట్టణాల్లో యథేచ్ఛగా సాగుతోంది. 2022 జూలై 1నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి రాగా తనిఖీలు చేస్తూ చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత అటకెక్కించారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను నిషేధించారు. 120 మైక్రాన్ల లోపు కవర్లను, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగించుకోవడానికి వీలు లేదు. నెల రోజుల పాటు మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారుల దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. మార్పు వచ్చే సమయంలో... జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ను నిషేధించడంతో వ్యాపారులు సైతం పాలిథిన్ కవర్లను వినియోగించడాన్ని నిలిపివేశారు. ఇంటి నుంచే సంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో ప్రజలు పాటించారు. ఆ తర్వాత వ్యాపారులు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. మున్సిపాలిటీల్లో తనిఖీలు వది లేయడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్మయమైంది. ఒకసారి వాడి పడేసే వస్తువులు విపరీతంగా వాడుతున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల వ్యాపారులు పల్చని సంచులు వాడుతున్నారు. ఏ శుభకార్యం జరిగినా కల్యాణ మండపాలు, హోటళ్లు, కర్రీ పాయింట్ల నుంచి ప్యాకింగ్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, మిఠాయి డబ్బాలు, కప్పులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. నేరుగా వ్యాపారులకు సరఫరా.. హోల్సేల్, రిటేల్ ప్లాస్టిక్ దుకాణాల్లో ఒకసారి వాడి పడేసిన వస్తువులను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుంటుండడంతో కొందరు కొత్త తరహాలో వ్యాపారానికి తెర లేపారు. ద్విచక్ర వాహనంపై సంచుల్లో పెట్టుకుని వ్యాపారుల దగ్గరికి వచ్చి పాలిథిన్ సంచులు సరఫరా చేస్తున్నారు. ఈ దందా ఎప్పటి నుంచో ఉండగా గత రెండు నెలలుగా పట్టణాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ సంచులు విక్రయించే వారి సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. తనిఖీలు చేస్తున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో చేసేదేమి లేక వెనక్కి వస్తున్నట్లుగా కార్మికులు చెబుతున్నారు. కమిటీ, తనిఖీలు ఏమైనట్లో? ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను పూర్తిగా నిషేధించడంతో మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్, శానిటరీ సూపర్వైజర్లు, ఎన్జీఓ, పోలీస్ కానిస్టేబుల్ కమిటీలో ఉంటారు. వీరంతా రోజూ పరిశీలించడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఎక్కడ ఉందో కనిపించడం లేదు. శానిటేషన్ సిబ్బంది పలు దుకాణాలు తిరిగి వస్తున్నారు. సిబ్బంది పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణ పనులకే పరిమితమవ్వగా ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విక్రయదారులకు అవగాహన కల్పించాం. తనిఖీలు ముమ్మరం చేసి ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అందరూ సహకరించాలి. –శాంతికుమార్, మున్సిపల్ కమిషనర్, తొర్రూరు యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ చర్యలపై నిర్లక్ష్యం మున్సిపాలిటీల్లో పర్యవేక్షణ కరువు -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
జనగామ రూరల్ : జనగామ మండలం తుకుంబాయి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన సామాను శివ, ప్యారాల సంపత్, ఒగ్గు మహేష్, మాదాసు శివ, కోమటి రాజశేఖర్ మద్యం తాగి పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. పాత నేరస్తుడైన సామాను శివతో స్నేహం చేసి, మిగతావారు కూడా శివ లాగానే దొంగతనం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19వ తేదీరాత్రి దొంగతనం చేద్దామని మద్యం తాగి తిరుగుతుండగా, వెంకిర్యాల తుకుంబాయితండాకు చెందిన వాకిటి రామకృష్ణ రెడ్డి ఇంటికి తాళం వేసిఉండగా దాన్ని పగులగొట్టి, లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. బాధితుడు రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏఎస్పీ పండరిచేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డి పర్యవేక్షణలో సోమవారం ఎస్సై చెన్నకేశవులు తన సిబ్బందితో యశ్వంతపూర్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో నిందితులు బైక్పై వస్తుండగా అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే సిబ్బందితో పట్టుకొని వారిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి బంగారు ఆభరణాలు, టీవీఎస్, బజాజ్ పల్సర్, లక్ష రూపాయల నగదు, మణప్పురం గోల్డ్ లోన్ రశీదు, 4తులాల గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూసిన జనగామ సీఐ పి.దామోదర్ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ అభినందించారు. పోలీసులను అభినందించిన వరంగల్ సీపీ -
ఓపెన్ స్కూల్.. ఓ వరం
విద్యారణ్యపురి : ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల పాఠశాల స్థాయిలోనే కొందరు చదువును మధ్యలో మానేస్తున్నారు. మరికొందరు పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్ చదువును కొనసాగించలేక పోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిలు చేయడంతో చదువుకోనే అవకాశం లేదు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా మళ్లీ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది ఓ రకంగా చదువును మధ్యలో మానేసిన వారికి వరం లాంటిదంటే అతిశయోక్తి కాదు. సార్వత్రిక విద్యను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 117 అధ్యయన కేంద్రాలు (ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు)ఉన్నాయి. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్ స్కూల్ విధానంలో పదోతరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2010–11 నుంచి ఇంటర్లో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు12వరకు అడ్మిషన్లు.. గతంలో ప్రతి ఏటా జూలై–ఆగస్టులో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ ప్రా రంభమయ్యేది. ఈసారి అలా కాకుండా రెగ్యులర్ విధానం వల్లే ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియ ను అధికారులు ప్రారంభించి ఆగస్టు 12వ తేదీవరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా మీసేవా సెంటర్లలోనే ఫీజు చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అక్షరాస్యత శాతం పెంచేందుకు.. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో అడ్మిషన్ల ప్రక్రియకు అర్హులైన అభ్యాసకులు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) ప్రాజెక్టు ద్వారా ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన వారిని కూడా సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. ఉల్లాస్ ప్రాజెక్టు ఆఫీసర్, డీడీలను, సెర్ప్, మెప్మా, సెల్ప్ హెల్ప్ గ్రూప్స్, వీఓ, సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్ల సహాయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్, ఇంటర్మీడియట్ చదివేందుకు అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. టాస్లో అడ్మిషన్లు కల్పించేందుకు సర్వే ప్రక్రియ సైతం మొదలెట్టారు. అలా ఇప్పటి వరకు టెన్త్కు 1,581మందిని, ఇంటర్లో 1,952 మందిని గుర్తించారు. అడ్మిషన్లు పొందిన వారు ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరు కావాల్సింటుంది. పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. అలాగే ప్రతి రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు అడ్మిషన్ల టార్గెట్ 11,616 ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు 11,616 మంది అడ్మిషన్లను నిర్దేశించారు. గతేడాది టెన్త్, ఇంటర్లో 6,849 మంది అడ్మిషన్లు పొందారు. అందులో టెన్త్లో 2,401మంది, ఇంటర్లో 4,448 మంది ఉన్నారు. చదువు మానేసిన వారికి సువర్ణావకాశం ఈసారి ముందస్తుగానే టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 117 అధ్యయన కేంద్రాలుదరఖాస్తులు ఇలా.. ఓపెన్ స్కూల్ టెన్త్లో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కనీస వయస్సు 15ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సుగలవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చును. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తహసీల్దార్ లేదా మున్సిపల్ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్లో ప్రవేశాలకు తప్పనిసరిగా పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 12వతేదీ వరకు అడ్మిషన్లు పొందాలి. పదోతరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్లో అడ్మిషన్లకు ఓసీలకు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యాసకులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుంది. టీజీ ఆన్లైన్లో మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి తమకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్లు తీసుకోవాలి.రెగ్యులర్ విద్యతో సమానం.. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ను పూర్తి చేసిన వారికి రెగ్యులర్ చదువుతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 12వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ఓపెన్ స్కూల్ టెన్త్ పూర్తి చేసిన వారు ఆపై విద్యకు, ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ ఓపెన్ స్కూల్. ఓఆర్జీ వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. ఉల్లాస్ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వారిని కూడా అడ్మిసన్లకు ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టాం. ఆసక్తి గల వారికి ఇది ఒక అవకాశంగా భావించాలి – అనగోని సదానందం, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ -
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు. పాఠశాలలో చేర్పించిన సీనియర్ సివిల్ జడ్జిలు -
వినతులు త్వరగా పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈసందర్బంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు. మొత్తం 106 వినతులు వచ్చినట్లు అదికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, డీపీఓ హరిప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ●గూడూరు మండలం ఏపూర్ గ్రామ శివారు రేకులతండాకు చెందిన మోతీరాం తన రెండున్నర ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని వినతి ఇచ్చారు. ● మానుకోటలోని కేజీబీవీలో హెడ్ కుక్గా కొంత కాలం పని చేశామని, వేతనం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇప్పించాలని ఎస్కె.షహీన్, పి నాగమణి వినతిలో పేర్కొన్నారు. ● గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన కృష్ణ చైతన్య తనకు ఉపాధి కల్పించాలని వినతి అందజేశారు. ● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన శ్రవంతి తనకు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలని వినతిలో పేర్కొంది. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజావాణిలో 106 వినతులు -
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ఎంపీపీఎస్ అభివృద్ధికి సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు కోలిశెట్టి సత్యనారాయణ, ఉమ దంపతులు రూ.20 వేలు విరాళంగా అందజేశారు. అదే విధంగా వారి కుమార్తె భవిష్య పటేల్ను ప్రభుత్వ బడిలో నాలుగో తరగతిలో చేర్పించగా.. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి నరసింహారావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్ష్మి, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ పూర్ణ చందర్, స్పూర్తి ఫౌండేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆవునూరి రవి, రాధిక, సువర్ణ, శ్రీజ, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు చెల్లించాలి
తొర్రూరు: బెస్ట్ అవైలబుల్ పథకం కింద తమ పిల్లలు చదువుతున్న ప్రైవేట్ పాఠశాలలకు బకాయిలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న డివిజన్ కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ హైస్కూ ల్ ఎదుట సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలు భోజనం, వసతి, విద్య అందించడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదివే పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్రెడ్డి వివరణ కోరగా.. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షల మేర ఖర్చు చేస్తుందని, బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థికి కేవల రూ.40 వేలు ఖర్చు చేస్తుందన్నారు. దానికి అంగీకరించి నాణ్యమైన విద్య, భోజ నం, వసతి అందిస్తున్న పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయమై గతంలో పలు పర్యాయాలు ప్రభుత్వ పెద్దలను కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. -
పాకిస్తానీ వలసదారుల భూములకు కోర్టు ఉత్తర్వులు
జనగామ రూరల్: దేశ విభజన అనంతరం పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న అప్పటి భూములకు పట్టాలు పొందిన లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రైతులకు నేడు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధిత రైతులు తమ గోడును కలెక్టర్ ఎదుట వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి.. జలాలుద్దీన్ అన్వర్ పేరుతో సీటీ సివిల్ కోర్టు సదరు భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించద్దని స్టే తీసుకురావడంతో రైతులు ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని, అలాంటి వ్యక్తికి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 1952లో మున్వర్ హైదర్ అనే వ్యక్తి పాకిస్తాన్కు వెళ్లిపోగా అప్పటి నుంచి ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, 1989లోనే కస్టోడియన్ ఆఫ్ ప్రాపర్టీ కింద అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెప్పారు. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పాసుపుస్తకాలు కూడా జారీ చేసిందని, ఇటీవల రైతు భరోసా రావడంలేదని, రిజిస్ట్రేషన్ కావడంలేదని వాపోయారు. జిల్లాలో లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్గఢ్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములకు ఇలాంటి పరిస్థితి ఉంది. లబోదిబోమంటున్న రైతులు 70ఏళ్లకు పైగా సాగులో ఉన్నామని ఆవేదన -
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి ● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్ కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ● నేటినుంచి ప్రారంభం కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్, రాజ్నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ఉమ్మడి జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ విజేత కానిపర్తి
కమలాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్గా కన్నెబోయిన కిరణ్యాదవ్, కెప్టెన్గా దాసరి రమేష్ వ్యవహరించారు. -
ప్రైవేట్ బడులకు పంపకండి
మహబూబాబాద్ రూరల్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపవద్దని పర్వతగిరి జెడ్పీ, ఎంపీపీఎస్ పాఠశాలల హెచ్ఎంలు మందుల శ్రీరాములు, పంజాల లింగమూర్తి కోరారు. బడిబాటలో భాగంగా మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామస్తులు, యువకులు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ పాఠశాల బస్సు ఎక్కిస్తున్న మునీందర్ కుమార్తె 3వ తరగతి విద్యార్థిని రిక్తికను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, గీత, రామాచారి, హరి, రాధిక, గ్రామస్తులు చల్ల వెంకన్న, అశోక్, నవీన, సలీం, సాయి, మహేశ్, నారాయణ సింగ్, అబ్రహం, మధు, సంపత్, నరేశ్, రాజు, రంజిత్, రామన్న, కిరణ్, వేణు, అనిల్ యాకన్న తదితరులు పాల్గొన్నారు. -
తెరుచుకోని ప్రభుత్వ గిరిజన పాఠశాల
గార్ల : ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తాళం తెరుచుకోలేదు. అసలే ఈ పాఠశాల తెరిచిన నాటి నుంచి ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. గార్ల మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ సర్వన్తండా పాఠశాలలో ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతుంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్ను వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్ఎం సీహెచ్ జోగయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సర్వన్తండా జీపీఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాలేదని వివరించారు. విధులకు ఉపాధ్యాయుల గైర్హాజరు -
అవినీతిపై విచారణ చేపట్టాలి
మహబూబాబాద్: గార్ల మండలం మద్దివంచ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, కూలీలకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మద్దివంచ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతిప్రతం అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆ గ్రామంలో ఏపీఓ, ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి బినామీ పేర్లతో కూలీల డబ్బులు కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు నెలల పాటు 200మంది కూలీలు డబ్బులు సుమారు రూ.8 లక్షలు మాయం చేశారని, వెంటనే విచారణ చేసి డబ్బులు వారి ఖాతాల్లోజమ చేయాలన్నారు. ఎంపీడీఓ, సంబంధిత కార్యాలయాల ఎదుట ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశామన్నారు. కూలీలకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రమేశ్, బాబురావు, లోకేష్, నాగేశ్వర్, కూలీలు వినోద, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్లో జరిగిన బంధువుల ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. బంగారు గొలుసు లాక్కెళ్ల్లిన దుండగుడు రాయపర్తి : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని మైలారంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన తుమ్మ సావిత్రమ్మ తెల్లవారుజామున 3గంటలకు ఇంటి తలుపు తెరిచి బాత్రూంకు వెళ్లింది. ఈక్రమంలో వెనకాలే వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలి కుమారుడు తుమ్మ యాకూబ్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, సీసీఎస్ డీసీపీ బోనాల కిషన్, ఏసీపీ సదయ్య, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. -
మాదకద్రవ్యాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్ : మాదకద్రవ్యాలు మన జీవితాలను నాశనం చేస్తాయని, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. యాంటీ నార్కొటిక్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీడ్రగ్స్ పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలని కోరారు. గంజాయిలాంటి మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నంబర్ 87126 71111కి లేదా డయల్ 100 లేదా తమ పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ చంద్రమౌళి, ఐటీ కోర్ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఆర్ఐలు అనిల్, భాస్కర్, నాగేశ్వర్ రావు, సోములు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, రవీంద్రనాధ్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్, దర్శన్ కుమార్, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏఓ నవీన్ కుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇనుగాల శ్రీధర్, కె.వి.జాన్సన్, మన్నె శశి కుమార్, అజ్మీరా శ్రీరామ్ నాయక్, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, సంతోష్, కర్నాల అనిల్ కుమార్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఎల్సీ యాప్ను విధిగా వాడాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
అండర్–19 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల చివరి వారం నుంచి జరగనున్న అండర్–19 లీగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తుది జాబితాను వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జిల్లాల స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి జట్టులో స్థానం కల్పించినట్లు తెలిపారు. అసోసియషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, శంకర్, పవన్ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. జిల్లా జట్టుకు బి. సాత్విక్, వి. ప్రీతేశ్, పి. రంగారావు, ఓ. సుకుమార్, బి. దయానంద్, జె. విశ్వక్సాయి, పి. శ్రీకాంత్, ఎం. మనీశ్ కుమార్, డి. మన్దీప్సింగ్, ఎం. పుజిత్, వి. అశ్విత్, బి. చరణ్, సి. జశ్వంత్, బి. మనోజ్, కె. రిత్విక్, బి. వితేశ్, ఎం. రాంచరణ్, ఎం. రాణాచరణ్, స్టాండ్ బైలుగా ప్రవీణ్, పార్థిషన్, లక్ష్మణ్ ఎంపికై నట్లు తెలిపారు. -
27న అప్రెంటిస్షిప్ జాబ్మేళా
విద్యారణ్యపురి: 2022 –2025 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఈనెల 27న హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో అప్రెంటిస్షిప్ జాబ్మేళా నిర్వహిస్తున్నారని, దీనిని వినియోగించుకోవాలని హనుమకొండ డీఐఈఓ ఎ. గోపాల్ కోరారు. జాబ్మేళా సన్నాహాక సమావేశం శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో హనుమకొండ, ములుగు, నెల్లికుదురు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీధర్, ఎం.పి భగవద్గీత, ఎ. శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నవ్వసి శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. గూడ్స్ షెడ్కు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు శుక్రవారం ఉదయం ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల కోసం చేరిన యూరియా వ్యాగన్ను ఆర్సీఎఫ్ కంపెనీ మేనేజర్ పురుషోత్తం రాథోడ్, ఖమ్మం డిస్ట్రిక్ ఇన్చార్జ్ అభిజిత్ గాంధీతో కలిసి మండల వ్యవసాయ అధికారి రవీందర్రెడ్డి పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు యూరియాను మార్క్ఫెడ్కు 60శాతం, ఫర్టిలైజర్ డీలర్లకు 40 శాతం కేటాయిస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామని, త్వరలోనే మరో వ్యాగన్ వచ్చే అవకాశం ఉందని కంపెనీ మేనేజర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గణేశ్, కంపెనీ సెల్స్ మేనేజర్లు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తిపై తొలిసారి పీడీ యాక్టు
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించిన వ్యక్తిపై రాష్ట్రంలో తొలిసారి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేశారు. మట్టెవాడకు చెందిన ఇరుకుళ్ల వేద ప్రకాశ్పై సీపీ జారీ చేసిన పీడీ యాక్టు ఉత్తర్వులను శుక్రవారం మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి నిందితుడికి పరకాల జైలులో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడు వేదప్రకాశ్ మరో నిందితుడితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. గత నెల 7వ తేదీన రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు నిందితుల నుంచి సుమారు రూ. 49 లక్షల 52 వేల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడు వేదప్రకాశ్ 26వ తేదీన నకిలీ పురుగుల మందులు విక్రయిస్తుండడంతో మట్టెవాడ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. దీంతో నిందితుడిపై సీీపీ సన్ప్రీత్సింగ్ పీడీ యాక్టు నమోదు చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 7799848333 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. కోర్టులో బాంబు కలకలం.. ● బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో జిలెటిన్ స్టిక్స్ లభ్యం ● ఊపిరి పీల్చుకున్న కక్షిదారులు వరంగల్ లీగల్ : హనుమకొండ ఒకటవ అదనపు సెషన్స్ కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి కోర్టులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకుని శుక్రవారం ఉదయమే కోర్టు సమ యం నుంచి కక్షిదారులు, న్యాయవాదులను తనిఖీ చేసిన అనంతరం కోర్టు ప్రాంగణంలోకి అనుమతించారు. కాగా, చాలా సంవత్సరాల (దాదాపు 20 పైగా) క్రితం ఓ క్రిమినల్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న జిలెటిన్ స్టిక్స్ను హనుమకొండ ఒకటవ అదనపు సెషన్స్ కోర్టుకు అందజేశారు. కేసు పరిష్కారమైనా నాడు స్వాధీనం చేసుకున్న ఏడు జిలెటిన్ స్టిక్స్ కోర్టు ప్రాపర్టీ రూంలోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఈ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో సంబంధిత కోర్టు ఏడు జిలెటిన్ స్టిక్స్లో ఒకటి నిర్వీర్యం కావడంతో మిగతా ఆరింటిని పోలీసులకు అప్పగించింది. దీంతో కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ 23న కూడా కోర్టులో అనుమానాస్పద సూట్ కేస్ బాంబు కలకలం రేపింది. గతంలో ఉభ య జిల్లాల న్యాయస్థానాల అధికారిక ఈమెయిల్కు తమిళనాడు చెందిన ఓ తీవ్రవాద సంస్థ పేరుతో కోర్టులో బాంబులు పేలుస్తామని మెస్సేజ్ వచ్చింది. -
స్టార్ హోటల్ లుక్తో మోడల్ రన్నింగ్ రూం.. ●
● నేడు దక్షిణ మధ్య రైల్వే జీఎం చేతుల మీదుగా ప్రారంభంకాజీపేట రూరల్ : రైల్వే శాఖ కాజీపేట జంక్షన్లో మెన్, ఉమెన్ లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం మోడల్ రన్నింగ్ రూంను స్టార్ హోటల్ లుక్తో నిర్మించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సకల సౌకర్యాలతో నిర్మించిన మోడల్ రన్నింగ్ రూం భవన సముదాయాన్ని శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట స్టేషన్ ఎదుట గల పాత రన్నింగ్ రూం స్థానంలో ఈ మోడల్ రన్నింగ్ రూంను నిర్మించారు. సుమారు రూ. 7.50 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్ లుక్తో 57 గదులు, 140 బెడ్ల సౌకర్యంతో నిర్మించిన ఈ భవన సముదాయంలో మెన్, ఉమెన్ ఎల్పీలు, ఎల్పీలు, ట్రైన్ మేనేజర్లు వేర్వేరుగా ఉండేందుకు సకల సదుపాయాలు కల్పించారు. కాజీపేట రైల్వే లోకోపైలెట్ కార్యాలయం కేంద్రంగా కాజీపేట–సికింద్రాబాద్, విజయవాడ, బల్లార్షా రూట్లో విధులు నిర్వహించే ఆన్లైన్ రన్నింగ్స్టాప్ ఈ రన్నింగ్ రూం భవనంలో విశ్రాంతి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
దాతల సహకారం అభినందనీయం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ిపీడియాట్రిక్ విభా గానికి పరికరాలు అందించిన దాతల సహకారం అభినందనీయమని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం ఎంజీఎం పీడియాట్రిక్ విభా గానికి బిలియన్ హాట్స్ బ్రీతింగ్ ఫౌండేషన్, జనప్రియ సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 60 లక్షల విలువైన పీడియాట్రిక్ విభాగానికి అవసరమయ్యే ఎక్స్ రే, ఈసీ జీ మెషిన్, పారా మానిటర్లు, డబుల్ సర్ఫేస్ ఫొటో థెరపీ వంటి 13 వివిధ రకాల పరికరాలను ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సత్యశారద ప్రారంభించి మాట్లాడారు. దాతలు అందించిన పరికరాలతో చిన్నారులకు మెరుగైన సేవలు అందుతాయన్నా రు. అనంతరం దాతలను సన్మానించారు. బిలియన్ హార్ట్స్ బ్రీతింగ్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ సుధా జిజారియా, జనప్రియ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎండీ సతీశ్ కుమార్, ఎంజీఎం పర్యవేక్షకులు కిశోర్, డీఎంహెచ్ ఓ సాంబశివరావు, ఆర్ఎంఓలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేఎంసీలో.. వైద్య, శాసీ్త్రయ రంగాల్లో పరిశోధనలకు మద్దతుగా కాకతీయ మెడికల్ కళాశాలలో మల్టీ డిసిప్లీనరీ రీసెర్చీ యూనిట్ను శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ సుధారాణి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాను ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఈయూనిట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, డీహెచ్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ సునీల్పంత్, ప్రతినిధులు కుమార్ విక్రమ్, నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన ఉద్యోగ సంఘాల ఎన్నికల ఓటింగ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎన్జీఓ ఎంప్లాయీస్, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఎన్నికలకు శుక్రవారం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. కేయూ పరిపాలన భవనంలోని సెనేట్హాల్, సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ, ఖమ్మం పీజీసెంటర్, భద్రాద్రికొత్తగూడెం ఇంజనీరింగ్కాలేజీలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. కేయూ ఎన్జీఓ అసోసియేషన్లో 222 మంది ఓటర్లు ఉండగా 221 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో 79 మంది ఓటర్లు ఉండగా 76 మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకన్నారు. ఎన్నికల అధికారిగా ప్రొఫెసర్ కె.రాజేందర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పంజాల శ్రీధర్ వ్యవహరించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ప్రణయ్కుమార్, బి.నేతాజీ, నర్సింహారావు, సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు ఓట్ల లెక్కింపు .. ఉద్యోగాల సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 21న ఉదయం 11గంటలకు జరగనుంది. లెక్కింపు అనంతరం సంబంధిత అధికారులు ఫలితాలు వెల్లడిస్తారు. -
యోగాతో ఆరోగ్యం..
యోగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకు తె లియకుండా తీసుకునే ఆ హారంలో విషపదార్థాలు ఉంటున్నాయి. దీంతో మధుమేహం, అధిక బ రువు, గుండె జబ్బు వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఫలితంగా 40 ఏళ్లకే వివిధ వ్యాధులతో మంచం పట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజూ 30 నిమిషాలు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. –తమ్మి స్రవంతి, గృహిణి, పాలకుర్తి ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతోప్రజలకు ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతోనే శ్రీ పరివార్ ఆధ్వర్యంలో ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. యోగాసనాల ద్వారా ఆరోగ్యంగా ఉంచాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. –పెండ్లి రాజు బాపూజీ, యోగా గురువు,పాలకుర్తి● -
యోగాలో అష్టాంగ మార్గాలు..
భారతదేశం యోగాకు అంబాసిడర్. క్రీస్తుశకం 4వేల సంవత్సరంలో ఉత్తర భారత దేశానికి చెందిన పతంజలి మహర్షి యోగా శాస్త్రంలో నిబంధనలు జోడించారు. మానవుల ఆరోగ్యం కోసం క్రమ పద్ధతిలో యోగాను గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాలను మహర్షి మహోష్ యోగి వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. పతంజలి మహర్షి యోగాలో అష్టాంగ మార్గాన్ని రూపొందించి, ఇందులో మయం, నియమమం, ఆసనం, ప్రాణామాయం, ప్రత్యాహం, ధ్యానం ధారణం, సమాధి సూత్రాలను ప్రపంచానికి అందించారు. ఇందులో మయం, నియమం, ఆసనం, ప్రాణామాయాలను హట యోగాంగా వర్ణించారు. బాహ్య శరీరాన్ని క్రమబద్ధీకరించడంలో ఇవే మూల ఆసనాలు. ఎక్కువ సమయం లేని వారు కనీసం 20 నిమిషాలు సూర్యనమస్కార ఆసనాలతో పాటు ప్రాణామాయం చేస్తే సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు, పక్షవాతం, చర్మవ్యాధులు, మైగ్రేన్ లాంటి వ్యాధుల నివారణకు యోగా ఉపయోగపడుతుంది. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాకు అంబాసిడర్ ‘భారతదేశం’● ఐరాసలో 177 దేశాల మద్దతు ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పోటీ ప్రపంచంలో జీవనం ఉరుకులు, పరుగుల మయమైపోయింది. సమయానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వృత్తిపర, వ్యక్తిగత ఒత్తిళ్లు.. వెంటాడుతున్న కాలుష్య భూతంతో ధరిచేరే రోగాలు.. వెరసి ఏది చేద్దామన్నా ఇబ్బందే. వీటన్నింటి నుంచి ఉపశమనానికి యోగా చక్కటి ఔషధమని నిపుణులు శాసీ్త్రయంగా నిరూపించారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాకు విశేష ప్రాముఖ్యత కల్పిస్తూ వచ్చారు. ఆయన చొరవతోనే ఐక్యరాజ్యసమి తి.. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నాడే తీర్మానించింది. ఈ నేపథ్యంలో నేడు యోగా డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మినీ స్టేడియంలో యోగా దినోత్సవం పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నేడు ఉదయం 7 గంటలకు యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినం. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొనాలి. ప్రస్తుత జీవనశైలిలో మానసిక ఒత్తిడిని అధిగమించడం, ఆరోగ్యం మెరుగు పరచుకోవడానికి యోగా దివ్యఔషధం. అందుకే ప్రతీ ఒక్కరు రోజు వారీగా యోగాసనాలు వేయాలి. రిజ్వాన్ బాషా, కలెక్టర్, జనగామ●–జనగామ/ పాలకుర్తి టౌన్ -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
● డీఆర్ఓ వైవీ.గణేశ్ హన్మకొండ అర్బన్: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ. గణేశ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, నార్కొటిక్స్ డీఎస్పీ సైదులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, డీఈఓ వాసంతి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, సామాజిక కార్యకర్త ఈవీ.శ్రీనివాసరావు, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, హోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య, హెల్పింగ్ హ్యాండ్స్ డీఅడిక్షన్ కేంద్రం రాము, మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. నేడు బీసీల సత్యాగ్రహ దీక్షహన్మకొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీసీల సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ దీక్షలో బీసీ ప్రజలు, విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం కింద విదేశాలకు పంపే బీసీ విద్యార్థుల సంఖ్యను 300 నుంచి 2000కు పెంచాలని, సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించనున్నట్లు సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముసలయ్య తెలిపారు. శుక్రవారం సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని కంబాలపల్లి, జనార్దనపురం, బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట, సింగారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో మంత్రితో పాటు ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొంటా రని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్రెడ్డి, శ్రీను, రవి, నాగరాజు, లింగ్య, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, మేఘాచారి తదితరులు పాల్గొన్నారు. 1,93,851 మంది రైతులకు ‘భరోసా’ మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో 1,93,851 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లు డీఏఓ విజయనిర్మల అన్నారు. డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడీఏలు శ్రీనివాసరావు, మురళీతో కలిసి కలెక్టరేట్లో శుక్రవారం డీఏఓ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వం 1,93,851మంది రైతుల ఖాతాల్లో రూ. 202.49 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో 22,108 మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు రూ.30.24 కోట్లు పెట్టుబడి సాయం అందించామని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కలుపు మందులు కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచించారు. విద్యుత్శాఖ ఎస్ఈగా శ్రీనివాసాచారి నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈగా ఇ.శ్రీనివాసా చారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యుత్శాఖ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్ఈ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో.. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసాచారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఆయన చార్జ్ తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్ఈని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్కొత్తగూడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో నేరుగా రూపాయి మారకంతో పాటు రక్షణ వ్యవస్థలో అగ్ర దేశాల సరసన నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, స్కాంలే తప్ప మరేమీ మిగలలేదని విమర్శించారు. ఈసభలో బీజేపీ మండల నాయకులు యాదగిరి మురళి, మధు, బోడ నవీన్నాయక్, రవి, ప్రవీన్, సుమన్, అనిల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి తొర్రూరు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు దేవేందర్ అన్నారు. డివిజన్ కేంద్రంలో శుక్రవారం పీడీఎస్యూ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. దేవేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, తాగునీరు కరువయ్యాయని, విద్యార్థుల సరిపడా ఫర్నిచర్ సైతం లేదని వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భూక్య సుమన్, రాజేష్, హేమంత్, గణేష్, సుమన్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రుణాలు
కేసముద్రం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మహిళా సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయిస్తామని డీఆర్డీఓ మధుసూదన్రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీ్త్ర శక్తి భవన్లో అంతర్జాతీయ సహకార సంవత్సరం–25ను పురస్కరించుకుని మండల సమాఖ్య మహిళా సభ్యులతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత కోసం ప్రతిష్టాత్మకంగా అనే పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అదే విధంగా జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా మహిళలు ప్రస్తుతం మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా అనుకూలమైన ఉత్పత్తులను తయారు చేసి గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం మండలంలోని కల్వల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్, భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి మరి యన్న, డీపీఎం నళిని, ఏపీఎం రాజీర్, మండల సమాఖ్య సిబ్బంది అమృత, సోఫియా, ఉమా, వెంకటనారాయణ, శ్రీనివాస్, వెంకటరమణ, పరుశురాం తదితరులు పాల్గొన్నారు. -
స్వల్పకాలిక సన్న రకాల సాగు మేలు
మహబూబాబాద్ రూరల్ : వానాకాలంలో ఇప్పటి వరకు సరిపడా వర్షపాతం నమోదు కాలేదని, రైతులు ఈనెల 25 తర్వాత పత్తి సాగు చేయవద్దని మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కేవీకేలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వానకాలం సాగు చేసే పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాటు చేసిన శిక్షణలో డాక్టర్ మాలతి మాట్లాడారు. రైతులు వరిలో స్వల్పకాలిక సన్న రకాలు వేసుకోవడం ఉత్తమమని సూచించారు. ఆరుతడి పంటలుగా పెసర, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసుకోవాలన్నారు. మిర్చి సాగు వీలైనంత మేరకు విస్తీర్ణం తగ్గించుకోవడం మంచిదని సూచించారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి పచ్చిరొట్ట పంటలు, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించాలని అన్నారు. వరిలో పీ.ఎస్.బీ విరివిగా వాడాలని తెలిపారు. సరైన వర్షాలు పడకపోతే రైతులు నూనె గింజ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. సమావేశంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, శాస్త్రవేత్తలు రాంబాబు, క్రాంతికుమార్, రైతులు పాల్గొన్నారు. ఈనెల 25తర్వాత పత్తి సాగు చేయొద్దు మల్యాల కేవీకే సమన్వయకర్త మాలతి -
ఆస్పత్రుల్లో సేవల వివరాలు ప్రదర్శించాలి
నెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవల వివరాలు, రుసుము, ధరల పట్టికలు, వైద్యుల వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని డీఎంహెచ్ఓ రవిరాఽథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని శ్రీచక్ర, సాయిపల్లవి ఆస్పత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల, సిబ్బంది అర్హత సర్టిఫికెట్లు వివరాలను వెల్లడించాలని, వైద్య ఆరోగ్యశాఖలో సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినవారు భారత ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, వారి డిగ్రీలు కేవలం ఎంబీబీఎస్కు మాత్రమే సమానమని, ఎండీ అని రాసుకోవద్దని హెచ్చరించారు. తనిఖీల్లో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, రాకేష్ పాల్గొన్నారు. వైద్య సహాయం అందజేయాలి.. జిల్లాలో 0నుంచి 18ఏళ్ల పిల్లలకు జెనెటిక్, జన్మతః, పోషకాహార సంబంధిత, ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్య సహాయం అందజేయాలని ఆర్బీఎస్కే అధికారులకు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఆర్బీఎస్కే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, డెమో ప్రసాద్, కేవీ రాజు, రామకృష్ణ, అనిల్కుమార్, ఆర్బీఎస్కే, డీఈఐసీ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
దరఖాస్తుల వెల్లువ
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuమహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఈమేరకు అధికారులు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 3నుంచి 16వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా.. 17నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా పైలెట్ మండలం దంతాలపల్లి మినహా మిగిలిన 17మండలాల్లో 31,900 దరఖాస్తులు వచ్చాయి. 2022 అర్జీలు మాత్రమే ఆన్లైన్ చేశారు. కాగా, చట్టం అమలు కోసం సర్వేయర్ల శిక్షణ కొనసాగుతోంది. ముగిసిన దరఖాస్తుల స్వీకరణ.. భూభారతి చట్టం అమలులో భాగంగా మొదట దంతాలపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు పూర్తి చేశారు. అక్కడ విజయవంతం కావడంతో మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహించారు. కాగా ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించారు. ఆతర్వాత రెవెన్యూ గ్రామాల వారీగా దరఖాస్తులను వేరు చేసి ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ తర్వాత ప్రక్రియ.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ అయిన తర్వాత.. అర్జీల ఆధారంగా ఇరుగుపొరుగు రైతులకు నోటీస్లు ఇచ్చి సర్వేయర్లు సర్వే చేస్తారు. ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్లో సమాచారం ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓలకు కూడా డిజిటల్ సంతకం అవకాశం ఇచ్చారు. అన్ని సవ్యంగా ఉంటే పాస్పుస్తకంతో పాటు మ్యాప్ కూడా ఇవ్వనున్నారు. కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ.. భూ భారతి చట్టం అమలులో భాగంగా సర్వేయర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కొత్తగా సర్వేయర్లకు అవకాశం కల్పించింది. జిల్లాలో 18 మండలాలకు కేవలం పదిమంది రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లకు అవకాశం కల్పించగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 203 దరఖాస్తు వచ్చాయి. శిక్షణ కోసం 183 మంది హాజరయ్యారు. వారికి గత నెల 26నుంచి శిక్షణ ప్రారంభం కాగా.. 50 రోజులు కొనసాగుతుంది. అన్ని అర్హతలు సాధిస్తే లైసెన్స్లు జారీ అవుతాయని అధికారులు తెలిపారు. గత నెల 25న జీపీఓల పరీక్ష.. భూ భారతి అమలు కోసం గ్రామపరిపాలన అధికారుల నియామకం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు అవకాశం కల్పించిన విషయం విదితయే. గత నెల 25న రాత పరీక్ష నిర్వహించగా కేవలం 112మంది ఉత్తీర్ణత సాధించారు. 20మందిఫెయిల్ అయ్యారు. కాగా అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు. న్యూస్రీల్దరఖాస్తుల వివరాలు.. మండలం దరఖాస్తులు ఆన్లైన్ సంఖ్య మానుకోట 6,144 228 కురవి 2,205 278 కేసముద్రం 1,116 370 డోర్నకల్ 1,451 302 గూడూరు 2,051 7 కొత్తగూడ 506 75 గంగారం 560 0 బయ్యారం 1,938 62 గార్ల 3,279 0 సీరోలు 2,062 203 ఇనుగుర్తి 1,714 107 చిన్నగూడూరు 459 0 తొర్రూరు 2,513 328 నెల్లికుదురు 1,456 61 మరిపెడ 2,684 0 నర్సింహులపేట 1,028 0 పెద్దవంగర 734 1 మొత్తం 31,900 2,022 ముగిసిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో 31,900 అర్జీల స్వీకరణ చివరిరోజు తహసీల్దార్ కార్యాలయాల వద్ద రైతుల సందడి కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ దరఖాస్తుల స్వీకరణ పూర్తి ఈనెల 20వ తేదీ వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశాం. త్వరగా రెవెన్యూ గ్రామాలవారీగా ఆన్లైన్ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియ చేపడుతాం. –చంద్ర రాజేశ్వర్, మానుకోట తహసీల్దార్ సర్వేయర్ల శిక్షణ కొనసాగుతోంది మొదటి విడతలో 183 మంది సర్వేయర్లకు శిక్షణ జరుగుతుంది. వారికి ప్రభుత్వ పరంగా లైసెన్స్ వచ్చిన తర్వాత భూ భారతి చట్టంలో వారితో దరఖాస్తుల సర్వే జరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం పదిమంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. – నర్సింహమూర్తి, ఏడీ ఎస్ఎల్ఆర్ -
వెలిశాల.. శోకసంద్రం
టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల వి ముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగి శాయి. రంపచోడవరంలో గురువారం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ఉ ద్యమ గీతాలతో కవులు, కళాకారులు, ఉద్యకారులు ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ అంటూ నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలి శాలకు తీసుకొస్తున్న క్రమంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేష్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పార్థివ దేహం వెలిశాలకు చేరుకోగానే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతాలు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమ యాత్ర ప్రారంభం నుంచి చివరి అంకం వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమని వెలిశాల చెప్పిందని అన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేష్ చితికి సోదరుడు అశోక్ అలియాస్ ఐతు నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు -
ఆదర్శం.. కల్వల బడి
కేసముద్రం: జిల్లాలో విద్యాబోధన, సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు రాక పలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం చూస్తున్నాం. అయితే అందుకు భిన్నంగామండలంలోని కల్వల ప్రాథమిక పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు మెరుగైన విద్యాబోధన ఉండడంతో రికార్డుస్థాయిలో 80అడ్మిషన్లు అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు చుట్టూ పక్కల గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ తిరిగి విద్యా బోధన, సౌకర్యాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో పాఠశాలలో రికార్డుస్థాయిలో అడ్మిషన్లు అయ్యాయి. 142మంది విద్యార్థులు.. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు ఉండగా, కొత్తగా అడ్మిషన్లు పొందిన 80మందితో కలిపి 142 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామం నుంచి 25మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక వాహనంలో కిరాయి చెల్లించి కల్వల పాఠశాలకు పంపిస్తుండడం విశేషం. అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్, వీఆర్ఏ మహేశ్, నవోదయ గెస్ట్ లెక్చరర్ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సౌకర్యాలు ఇవే.. ● దాత సహకారంతో పిల్లలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ● ప్రాజెక్ట్ వర్క్కుగాను అందుబాటులో కలర్ ప్రింటర్ జిరాక్స్ ఏర్పాటు ● ప్రతీ సంవత్సరం పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లడం ● క్రీడా సామగ్రి సౌకర్యంతో పాటు ఆటల్లో మెళకువలు నేర్పించడం ● ప్రతీనెల మూడో శుక్రవారం తల్లిదండ్రులతో సమావేశం ● ప్రైవేట్ స్కూల్కు దీటుగా పాఠశాల భవనానికి రంగులు, ఆంగ్లంలో బోధన ● ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బహుమతులు అందజేత రికార్డు స్థాయిలో ప్రాథమిక పాఠశాలలో 80 అడ్మిషన్లు విద్యాబోధన, సౌకర్యాలకు ఆకర్షితులవుతున్న పిల్లలు చుట్టుపక్కల గ్రామాలు, తండాలనుంచి వస్తున్న విద్యార్థులువిద్యాసామర్థ్యాలు సంపూర్ణంగా సాధించాం.. తరగతుల వారీగా విద్యాసామర్థ్యాలను సంపూర్ణంగా సాధించగలిగాం. ఉపాధ్యాయులు బోధించే తీరు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆకర్షితులైన తల్లిదండ్రులు వారి పిల్లలను మా పాఠశాలకు పంపిస్తున్నారు. సొంతంగా రూ.46వేలతో స్కూల్ బిల్డింగ్కు రంగులు వేయించా. బుధ, శనివారాల్లో ధరించాల్సిన ప్రత్యేక యూనిఫాంలను ఇప్పటికే పిల్లలకు అందజేశాం. ఇంగ్లిష్లో బోధిస్తున్నాం. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పిల్లలు వస్తున్నారు. జిల్లాలోనే రికార్డుస్థాయిలో 80 అడ్మిషన్లు సాధించాం. గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. –కల్లెం వీరారెడ్డి, హెచ్ఎం, కల్వల పీఎస్అర్థమయ్యేలా చదువు చెబుతున్నారు.. నేను కేసముద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి వరకు చదివిన. 3వ తరగతిలో మా కల్వల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చేరా. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో టీచర్లు చదువు చెబుతున్నారు. ప్రతీ సబ్జెక్టు నాకు సులువుగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆటలు ఆడించడం, ఎలాంటి డౌట్స్ ఉన్నా టీచర్లు క్లియర్ చేస్తారు. ప్రతీ సంవత్సరం టూర్కు తీసుకెళ్తారు. –పెద్దారపు రుచిత, 5వ తరగతి విద్యార్థిని, కల్వల -
సీసీఐ కొనుగోళ్ల విధానం కొనసాగించాలి
వరంగల్ చౌరస్తా : ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా కొనుగోలు జరుపుతున్న విధానంతోనే పత్తి రైతులకు మేలు చేకూరుతుందని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో గురువారం ‘బహిరంగ మార్కెట్లో పత్తికి మార్కెట్ ధర, కనీస మద్దతు కంటే తక్కువ ధరలు పలుకుతున్న వ్యత్యాసాలు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనీష్ మల్పానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం 2025–26 కాటన్ సీజన్లో తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి స్కీం అమలులో ఎదురయ్యే సమస్యలపై రవీందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాలు, రెగ్యులేటెడ్ మార్కెట్లలో పత్తి నాణ్యత, బహిరంగ మార్కెట్లోని ధరలను నిర్ధారించడానికి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థలు లేవన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపుతున్న విధానమే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు కంటే తక్కువ ధర పలికితే ఆ వ్యత్యాసపు ధరను నేరుగా రైతులకు చెల్లించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీంను పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ప్రకటించినట్లు రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ డైరెక్టర్ పవన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జాయింట్ సెక్రటరీ లలిత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వరంగల్ చాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి -
అన్నకు తమ్ముడి శఠగోపం
వరంగల్ చౌరస్తా : అన్నకు తమ్ముడు శఠగోపం పెట్టాడు. నమ్మి క్యాష్ కౌంటర్పై కూర్చోబెట్టినందుకు రూ.1.37 కోట్లు స్వాహా చేశాడు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై చాంబర్ ప్రతినిధులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు (అన్న) చల్లా సాంబలింగం విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు గురువారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, తన తమ్ముడు సంపత్ కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2016 నుంచి కేశవ ట్రేడర్స్ పేరుతో మిర్చి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను బయట విషయాలు చూసుకుంటుండగా తన తమ్ముడు సంపత్ క్యాష్ కౌంటర్ పై కూర్చుని ఆర్థిక లావాదేవీలు చూసేవాడన్నారు. ఈ క్రమంలో రూ.1.37 కోట్లు మోసం చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇవ్వనని.. పైగా డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ చక్రపాణి వద్దకు వెళ్లగా అతడు పంచాయితీ నిర్వహించి తనకు రావాల్సిన డబ్బును చెల్లించాలని తన తమ్ముడికి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడు చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం ఏనుమాముల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చాంబర్ ప్రతినిధులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. వ్యాపారంలో రూ.1. 37 కోట్లు ముంచిన తమ్ముడు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు -
పసుపు రైతుల ఆందోళన
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పసుపు క్వింటాల్కు ధర రూ. 12,500 పలుకుతుండగా, వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ. 10వేల చొప్పన వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ధర పెంచే వరకూ అమ్మబోమని తేల్చిచెప్పారు. దీంతో కాంటాలు నిలిచాయి. వ్యాపారులు తమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు చొరవ చూపించినా రైతులు అంగీకరించలేదు. చివరకు మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి జోక్యం చేసుకుని వ్యాపారులతో చర్చలు జరపగా, క్వాలిటీ పసుపునకే ఎక్కువ ధర చెల్లిస్తామని, లేనిపక్షంలో చెల్లించమని పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి రైతులతో మాట్లాడి సరైన ధరలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కాంటాలు ప్రారంభమయ్యాయి. ధర వ్యత్యాసంతో వ్యాపారులపై అన్నదాతల అసహనం సర్దిచెప్పిన మార్కెట్ అధికారులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన కాంటాలు -
ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను గురువారం కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆ కళాశాలలో విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 1,236మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 620 మంది (50.16శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 927మంది విద్యార్థులు హాజరుకాగా 540 మంది ఉత్తీర్ణత( 58.25శాతం) సాధించారు. అలాగే, ఆరో సెమిస్టర్ పరీక్షలకు 742 మంది విద్యార్థులు హాజరుకాగా 582 మంది (78.44శాతం) ఉత్తీర్ణత సాధించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీ క్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, గిరిప్రసాద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
247 క్యూసెక్కుల నీరు పంపింగ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని దేవాదుల ఇన్టెక్ వెల్ వద్ద ఒక మోటారు ద్వారా పంపింగ్ నిలిపి వేశారు. పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో పది మో టార్లు ఉండగా అందులో సెకండ్ ఫేజ్లో ఉన్న రెండు మోటార్లను ఆన్ చేసి 494 క్యూసెక్కుల నీటిని దిగువకు బుధవారం వరకు పంపింగ్ చేశారు. ఈ క్రమంలో గురువారం అందులోని ఒక మోటారును ఆఫ్ చేసి మరో మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవాదుల వద్ద 73.20 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. దీనితో పాటు తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఎగువ నుంచి 5,800 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో బ్యా రేజీ వద్ద రెండు గేట్లను ఎత్తి 6,000క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 73.45మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది -
‘జంపన్న’ సుందరీకరణ ..
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతర సమయంలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగును సుందరీకరించనన్నారు. భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ నిధులతో వాగును అభివృద్ధి చేయనున్నారు. మంత్రి సీతక్క చొరవ మేరకు జంపన్న వాగుపై రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. జంపన్న వాగు ఒడ్డున పార్కులు, బెంచీల ఏర్పాటు.. జంపన్న వాగుపై రెండు వైపులా స్నాన ఘట్టాలు నిర్మించారు. జాతర సమయంలో భక్తులు స్నాన ఘట్టాలపై అమర్చిన బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా స్నానాలు ఆచరిస్తారు. అయితే వాగుపై స్నాన ఘట్టాలు తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర నాటికి స్నాన ఘట్టాల వద్ద భక్తులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందకు పార్కులు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఒకటి రెండు కాటేజీలను కూడా నిర్మించనున్నారు. జాతర సమయంలో భక్తులు ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు జంపన్న వాగు ఒడ్డున షెడ్లు కూడా నిర్మించే అవకాశం ఉంది. ఫలితంగా సుందరీకరణతో ఈసారి జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు ఆకర్షణీయంగా కనిపించనుంది. మంత్రి సీతక్క చొరవతో.. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా జంపన్న వాగు భక్తులకు ఆకర్షణీయంగా కనిపించాలనే సంకల్పంతో సుందరీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత మహాజాతరలోనే సమ్మక్క– సారలమ్మ చిహ్నాలుగా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర వరకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈవిషయంపై టూరిజం కార్పొరేషన్ ఏఈ విజయకుమార్ను వివరణ అడగగా జంపన్నవాగులో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తనకు సమాచారం తెలియదన్నారు. నేటి(శుక్రవారం) మధ్యాహ్నం కల్లా వివరాలు తెలుస్తాయన్నారు. వాగు అభివృద్ధి పనులకు నిధులు రూ. 5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆహ్లాదకరంగా మారనున్న స్నానఘట్టాలు -
సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు కృషి
మహబూబాబాద్ అర్బన్: సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు కృషి చేస్తామని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో గురువారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలనకు సమష్టిగా కృషి చేస్తున్నాయన్నారు. జిల్లాలో జూలై 3వతేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాలో 23,2000 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గుగులోతు దేశీరాం నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీస ర్లు సారంగం, లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, మౌనిక, ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ.రాజు, సూ పర్వైజర్ కే.ఎల్.ఎన్.స్వామి, పుష్పలీల, కిరణ్మ యి, శ్రీనివాస్, హెచ్ఎం నరసయ్య, ఉపాధ్యాయులు, ఆశకార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బడిబాటలో.. బడి బాటలో ప్రతీ ఒక్కరిని నడిపించాలన్నదే లక్ష్యమని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓలతో గురువారం జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది బడిబాటను కొత్త ఆవిష్కరణలతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,616 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. సమావేశంలో ఏడీ రాజేశ్వర్, ఏఎంఓ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల పనులను గురువారం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పనులను అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అరకొర వసతుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఒకే వేతన విధానం ఉండాలి కురవి: రాష్ట్ర దేవాదాయశాఖలో పనిచేసే అర్చక, ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు రాక అర్ధాకలి, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారని, ఒకే శాఖలో పనిచేసే అందరికి ఒకే వేతన విధానం ఉండాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జీఓ 577కు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రెండు నెలలుగా వేతనాలు రాక అర్చక, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రెడ్యాల శ్రీనివాస్ శర్మ, పెనుగొండ అనిల్ శర్మ, దూసకంటి విజయ్శర్మ, అభిలాష్ శర్మ, రమేశ్, వేదపండితులు బాలకృష్ణశర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఉద్యోగి జగన్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ తరగతులు జూలై 25 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 150 మంది అభ్యర్థులకు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం.నర్సింహరావు తెలిపారు. నేటి నుంచి జూలై 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29303130, 040–24071178, 7780359322 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. బాలుడి గొంతులో ప్లాస్టిక్ గన్ బుల్లెట్ ● ఏడాదిగా నొప్పి, మింగలేక ఇబ్బందులు ● శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యుడు ఖమ్మంవైద్యవిభాగం: ఆడుకునే క్రమాన ప్లాస్టిక్ గన్ బుల్లెట్ను నోట్లో పెట్టుకోగా అది బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఏడాది కాలంగా నొప్పి, ఏదీ సరిగా తినలేక ఇబ్బంది పడుతుండగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా పాతపోచారం గ్రామానికి చెందిన పి.శ్రవణ్కుమార్ – సౌజన్య దంపతుల మూడేళ్ల కుమారుడు షణ్ముక్ కొంత కాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవటం, తినలేక బాధపడుతున్నాడు. చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేక ఖమ్మం నెహ్రూనగర్లోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రిలో డాక్టర్ ఎం.జీ.వీ.ప్రవీణ్ను సంప్రదించారు. బాలుడికి ఎండోస్కోపీ నిర్వహించినా ఫలితం లేక ిసీటీ స్కాన్ చేయగా గొంతు వెనుక భాగంలో వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన పదునైన వస్తువు ఉన్నట్లు తేలగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయడంతో ప్లాస్టిక్ గన్ బుల్లెట్గా గుర్తించారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే కపాలం నుంచి మెదడులోకి చొచ్చుకెళ్లి మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను పాడు చేసేదని వైద్యుడు తెలిపారు. వృత్తి నైపుణ్యం సాధించాలి వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. యూ నిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నా యక్ అదనపు డీసీపీ రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్ పాల్గొన్నారు. -
దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీజీ డిప్లొమా సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను వీసీ కె.ప్రతాప్రెడ్డి విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యకేంద్రం డైరెక్టర్ బి.సురేశ్లాల్ తెలిపారు. ఈ నెల 20వ తేదీనుంచి జూలై 31వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. కోర్సులు, ఫీజుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ, దూరవిద్యకేంద్రం సైన్స్కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ముంజం, డాక్టర్ వి.జగన్, డాక్టర్ కొట్టే భాస్కర్ పాల్గొన్నారు. అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కురవి: అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీరోలు ఎస్సై నగేశ్ గురువారం తెలిపారు. సీరోలు గ్రామానికి చెందిన వల్లపు లింగన్న తన భూమిని సమానంగా పంచి ఇవ్వలేదనే కారణంతో అతడి రెండో భార్య కుమారులు నరేశ్, మహేశ్, నరేశ్ భార్య సౌందర్య, లింగన్న రెండో భార్య నర్సమ్మ, నున్న వీరన్న (నరేశ్ బావమరిది) కలిసి లింగన్న మొదటి భార్య కుమారుడు కృష్ణను ఈ 18న కత్తితో నరికి చంపారు. ఈ ఘటనలో మృతుడి తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్ తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో ఆరునెలలు జైలు వరంగల్ లీగల్ : అప్పుగా తీసుకున్న రూ.4 లక్షలు చెల్లించని కారణంగా బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో నిందితురాలికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సీహెచ్. శ్రావణస్వాతి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన సుంకరి నరేందర్.. కాజీపేట సిద్దార్థనగర్కు చెందిన యాట భాగ్యలక్ష్మికి 2024, జూన్ 15వ తేదీన రూ.4 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ మేరకు భాగ్యలక్ష్మి.. నరేందర్కు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. రెండు నెలల్లో మొత్తం తిరిగి ఇస్తానని చెప్పింది. అయితే వివిధ కారణాలతో ఇవ్వకుండా సెప్టెంబర్లో హనుమకొండలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సంబంధించిన రూ.4లక్షల చెక్కు ఇచ్చింది. సదరు డబ్బులు డ్రా చేసే నిమిత్తం నరేందర్ 2024, అక్టోబర్ 10వ తేదీన చెక్కును బ్యాంకులో వేయగా అకౌంట్లో సరిపోను డబ్బులు లేవని అధికారులు చెక్కు చెల్లదని తిరిగి ఇచ్చారు. దీనిపై బాధితుడు తన న్యాయవాది బైరి మల్లేశం ద్వారా కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. చెల్లని చెక్కు ఇచ్చిన ఘటనలో నేరం రుజువుకావడంతో నిందితురాలు భాగ్యలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, అప్పుగా తీసుకున్న మొత్తం రూ.4 లక్షలకు వడ్డీ, జరిమానా కింద రూ.3 లక్షలు మొత్తం రూ.7 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. -
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: జిల్లాలోని సీరోలు మండల కేంద్రానికి చెందిన కృష్ణను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ మార్చురీ ఎదుట మృతుడి భార్య సత్యవతి, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు స్పందించి భూ సమస్య పరిష్కరించాలన్నారు. కృష్ణను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ మార్చురీ నుంచి అండర్ బ్రిడ్జి వరకు మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే వెళ్లిపోతామంటూ భీష్మించి కూర్చున్నారు. సంఘటన స్థలికి టౌన్ సీఐ మహేందర్, మరిపెడ సీఐ రాజ్కుమార్, సీరోలు ఎస్సై నగేశ్, టౌన్ ఎస్సై విజయ్కుమార్ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -
కలహాల కాంగ్రెస్...
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్ పోచమ్మమైదాన్లో జరిగిన కార్యక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై నోరు పారేసుకోవడం పార్టీవర్గాల్లో కలకలం రేపింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్తబ్ధత కనిపిస్తున్నా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రచ్చమొదలైంది. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి గాని స్పందించకపోగా, వారి అనుచరులు సైతం మౌనం వహించారు. పార్టీలో తీవ్ర సంచలనంగా మారిన కొండా మురళీధర్రావు వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. మాజీ టీడీపీ నేతలే లక్ష్యంగా... ఓరుగల్లు కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా అంతర్గత కలహాలు సాగుతున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య గతంలోనూ పరస్పర ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్న ప్రచారం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా కొండా సురేఖ దంపతులు చాలాసార్లు తమ అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కొండా మురళీధర్రావు గురువారం పోచమ్మమైదాన్ సభలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. ‘కనుబొమ్మలు లేని నాయకుడు టీడీపీని భ్రష్టు పట్టించి.. చంద్రబాబును ఓడించి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తిష్టవేశాడన్న’ కొండా మురళీధర్రావు... ‘75 ఏళ్ల దరిద్రుడు, ముసలోడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని ప్రాధేయపడితే మా మద్దతుతో పరకాల ఎమ్మెల్యే అయ్యాడు’ అని ఇద్దరిపై ఘాటైన ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. గురువారం ఉదంతంపై అధిష్టానం ఆరా... వరంగల్ కాంగ్రెస్లో దుమారం రేపిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి పరిణామాలపై ఓ వైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు.. పార్టీ సీనియర్ల ద్వారా ‘వరంగల్లో అసలేం జరుగుతోంది’ని ఆరా తీసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. గురువారం రాత్రి కూడా ఉమ్మడి వరంగల్కు చెందిన నలుగురు సీనియర్ నాయకులతో టీపీసీసీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర పార్టీ బాధ్యులు ఒకరు మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఉమ్మడి వరంగల్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను హైదరాబాద్కు పిలిచి మాట్లాడే అవకాశం ఉందని కూడా పార్టీవర్గాల ద్వారా తెలిసింది. కొండా మురళీధర్రావు వ్యాఖ్యలతో బట్టబయలు తారస్థాయికి చేరిన కాంగ్రెస్ గ్రూపువార్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై సీరియస్ వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో మళ్లీ రాజకీయ దుమారం తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా? -
మారనున్న రూపురేఖలు
మహబూబాబాద్: జిల్లాలోని మానుకోట, కేసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు. త్వరలోనే జాబితాను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పంపనున్నారు. పనులు పూర్తయితే రెండు మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. ఈమేరకు రెండు మున్సిపాలిటీల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. మానుకోట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా ఉంది. 25,000పైగా గృహాలు ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఈనెల 13న సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా మానుకోట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, కేసముద్రం మున్సిపాలిటీకి రూ .100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు.. ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. ఐదు గ్రామాలను విలీనం చేశారు. 17,597మంది జనాభా ఉంది. 16 వార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వార్డుల విషయంలో ఇంకా ఫైనల్ కాలేదని అధికారులు తెలిపారు. ఇన్చార్జ్ కమిషనర్, ఇన్చార్జ్ ఏఈ, ఈఈ, టీపీఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా రూ.50 కోట్లు మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు, మిగిలిన రూ.50 కోట్లు ఆర్అండ్బీ, వివిధ శాఖల నిధులు ఉన్నాయని సిబ్బంది పేర్కొన్నారు. ఇందులో రూ.50కోట్ల నిధుల ప్రతిపాదనలు పూర్తి చేశారు. త్వరలోనే ప్రతిపాదనలు కమిషనర్ కార్యాలయానికి.. రెండు మున్సిపాలిటీల ప్రతిపాదనలను త్వరలోనే ఆశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రతిపాదనలను ఫైనాన్స్ విభాగానికి పంపిన తర్వాత ఆనిధుల జీఓ మున్సి పాలిటీలకు వస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మిగిలిన ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రతి పాదనల్లో కొన్ని మార్పులుచేర్పులు జరుగుతాయి. ఔటర్ రింగు రోడ్డు కోసం.. మానుకోట చుట్టూ ఔటర్ రింగు రోడ్డు కోసం ఎమ్మెల్యే మురళీనాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రిని కలువగా.. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అనుమతి ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఎమ్మెల్యే మార్క్ ఉంటుందని ప్రజలు అంటున్నారు. పనులన్నీ పూర్తయితే మానుకోట రూపురేఖలు మారుతాయి.మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం మానుకోట పట్టణం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు కోసం ప్రయత్నాలుప్రతిపాదనలు సిద్ధం.. ప్రత్యేక నిదుల నుంచి రూ.50కోట్ల మంజూరు కాగా..మానుకోట మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి రూ 2.25 కోట్లు కేటాయించారు. జంక్షన్ల అభివృద్ధికి రూ.35 లక్షలు అంతర్గత రోడ్ల కోసం రూ.9.81కోట్లు, వరద కాల్వల కోసం రూ.5 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు కనీస సౌకర్యాల కల్ప నకు రూ.20లక్షలు, పార్క్ల నిర్మాణం కోసం, స్మృతి వనం అభివృద్ధికి రూ.4కోట్లు. కల్వర్టుల నిర్మాణం కోసం రూ.82లక్షలు, షాంపింగ్ క్లాంపెక్స్ల నిర్మాణం కోసం కోటి రూపాయలు (ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీసమీపంలో ఉన్న గ్రీన్ ల్యాండ్లో, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమీపంలో, వివేకానంద సెంటర్లో) కేటాయించారు. ఇండోర్స్టేడియం కోసం రూ.5కోట్లు, మోడల్ వైకుంఠధామాల రోడ్ల కోసం రూ.34 లక్షలు కేటాయించారు. మున్నేరు వాగు వద్ద బతుకమ్మఘాట్ నిర్మాణం కోసం రూ.2.50 కోట్లు, కంబాలచెరువు ట్యాంక్ బండ్ కోసం రూ.4.20 కోట్లు కేటాయింపు. ఇన్నర్ రింగ్రోడ్డు కోసం రూ.10 కోట్లు, మెయిన్రోడ్ల నిర్మాణానికి రూ.2.76 కోట్లు తాగునీటి ఫిల్టర్ బెడ్, తదితర వాటి కోసం కోటి రూపాయలు, ఇతర మెయిన్ రోడ్ల కోసం రూ.76 లక్షలు కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు
● అద్దె భవనాల్లో పలు పాఠశాలలు ● శిథిలావస్థ గదుల్లో భయంగా చదువులు ● మూత్రశాలలు లేక ఆరుబయటే మూత్రవిసర్జనసాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల రాత మారడం లేదు. అభివృద్ధి పనులు, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నప్పటికీ అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. ప్రహరీ లేకపోవడంతో, శిథిలావస్థ బడులు, తాగునీరు, మరుగుదొడ్లు, టాయిలెట్ సమస్యలు పేరుకుపోయాయి. మూత్రశాలలు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేస్తున్న దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పాఠశాలలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ‘సాక్షి’ విజిట్లో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. -
టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి
నెహ్రూసెంటర్: ఆర్టీసీ మహబూబాబాద్ డిపో ఆధ్వర్యంలో ప్రజలు, ప్రయాణికుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీల ద్వారా బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ యాత్ర కరపత్రాలను గురువారం డిపో ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. మహబూబాబాద్ నుంచి 5 ప్రత్యేక ప్రాంతాలకు యాత్ర ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టూర్ ప్యాకేజీ కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీఎస్ఆర్టీసీబస్.ఇన్ అనే వెబ్సైట్, లేదా 99592 26054, 94417 13896, 99482 14022 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది శ్రీనివాస్, పాపిరెడ్డి, కేఆర్ రెడ్డి, శంకర్, ఎండి.నబీ తదితరులు పాల్గొన్నారు. -
అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి
టేకుమట్ల: గాజర్ల రవి.. పెత్తందార్లు, దొరల అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు సానుభూతిపరుడిగా, విద్యార్థి యూనియన్ నాయకుడిగా ఉద్యమంలోకి అడుగు పెట్టి దళ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని అన తి కాలంలోనే నార్త్ తెలంగాణ డివిజన్ కమిటీకి ఎన్నికై కేంద్ర కమిటీ సభ్యుడిగా, స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు తీసుకుని ఉద్యమంలో నూతన ఒరవడికి నాంది పలికాడు. ఎన్నో కీలక ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి 1992లో అడవి బాట పట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు. ఉద్యమాలే ఊపిరిగా.. కుటుంబ సభ్యుల కన్నా ఉద్యమాలే ఊపిరిగా, ప్ర జా శ్రేయస్సే ధ్యేయంగా మూడు దశాబ్దాలుగా అడ వి తల్లి ఒడిలో కాలం గడిపాడు. తల్లిదండ్రులను సైతం కాదని అడవి తల్లి చెంతకు చేరిన గాజర్ల రవి ఉద్యమ ప్రస్థానం బుధవారంతో ముగియడంతో శుక్రవారం పుడమి తల్లి ఒడికి చేరనున్నాడనని నా టి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవి జ్ఞాపకార్థం వెలిశాలతోపాటు, పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చివరి చూపు కోసం ఎదురుచూపు.. ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ మృతి చెందాడనే సమాచారం సోషల్మీడియాలో దావానంలా వ్యాపించడంతో వెలిశాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజులుగా గాజర్ల రవి చివరి చూపు కోసం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి రంపచోడవరంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో సోదరులు గాజర్ల సమ్మయ్య, అశోక్.. రవి పార్థివదేహాన్ని స్వగ్రామం వెలిశాలకు తీసుకురానున్నారు. కాగా, బుధవారం నుంచే వెలిశాలలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు.చర్చల సమయంలో చివరిగా చూశా.. 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మావోయిస్టులను చర్చలకు పిలువగా వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రవ(రవి)న్న చర్చల ప్రతినిధిగా వస్తున్నాడని తెలిసి వెళ్లా. ఎంతో మంది ప్రజలు హాజరైన కార్యక్రమంలో దూరం నుంచి చూశా. ఇప్పుడు విగత జీవిగా చూస్తామని అనుకోలేదు. –అచ్చె లచ్చన్న, మాజీ సర్పంచ్, రామకిష్టాపూర్(వి)నేడు మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలు స్వగ్రామం వెలిశాలలో ఆయన జ్ఞాపకార్థం వెలిసిన ఫ్లెక్సీలు చివరి చూపు కోసం గ్రామస్తుల ఎదురుచూపు -
చందాలు వేసుకుని.. అద్దె చెల్లిస్తూ..
అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి గాజర్ల రవి బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరగగా నాటి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. – 10లోuమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆ భవనంలో పాఠశాల నిర్వహణ చేపట్టొద్దని గతేడాది మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అద్దె భవనంలో పాఠశాల నిర్వహణ చేపడుతున్నారు. పాఠశాలలో 35మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ఒక గదిలో విద్యార్థులు, మరో గదిలో మధ్యాహ్న భోజనం వంటలు, చెట్టు కింద 5వ తరగతి విద్యార్థులకు బోధన చేపడుతున్నారు. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చందాలు వేసుకొని నెలకు రూ.5వేల కిరాయి చెల్లిస్తున్నారు. పాఠశాల పాత భవనం పూర్తిస్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
శిథిలావస్థలో తరగతి గదులు
తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మూడు తరగతి గదులు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే హైస్కూల్లో 100 మంది విద్యార్థులు ఉండగా, నాలుగు తరగతులకు మాత్రమే గదులు ఉన్నాయి. దీంతో మరో తరగతి విద్యార్థులకు స్టాఫ్రూమ్ వరండాలో క్లాస్లు కొనసాగుతున్నాయి. ఉన్న తరగతి గదులు కూలిపోయే దశలో ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. -
జఫర్గఢ్లో ఎలుగుబంట్ల సంచారం
జఫర్గఢ్: జఫర్గఢ్లో రెండు రోజుల నుంచి ఎలు గుబంట్లు సంచరిస్తుండడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. జఫర్గఢ్ చుట్టూ గుట్టలు ఉండడంతో ఎలుగుబంట్లు అందులో నివా సం ఉంటున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బయన్నగుట్టల సమీపంలో దమ్మన్నపేటకు వెళ్లే రహదారిపై ఎలుగుబంటి తన పిల్లలతో వెళ్తుండగా స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యా రు. గురువారం కూడా జఫర్గఢ్ శివారులోని పల్లె పకృతి వనంలో ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఎలుగుబంటిని అక్కడి నుంచి తరిమికొట్టడంతో పంట పొ లా ల మీదుగా మసీదు బండ నుంచి వెళ్లింది. దీంతో స్థానికులు, రైతులు ఊపిరి పిల్చుకున్నారు. కాగా, కొన్నేళ్ల నుంచి గుట్టలపై ఎలుగుబంట్లు నివాసం ఉంటూ గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బంధించి వేరే అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. భయాందోళనలో గ్రామస్తులు -
సొంతింటి కల ఆలస్యం
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే జిల్లాలో లబ్ధి దారుల ఎంపిక, మంజూరులో కాస్త జాప్యం జరుగుతోంది. వచ్చిన దరఖాస్తులు, అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించి లెవన్ వన్ జాబితా తయారీలో ఆలస్యమవుతోంది. ఇందుకు గల కార ణం ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రా యం కుదరడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుకు సాగని ఎంపిక.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 1,89,065 ధరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 28,526 దర ఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ..సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా.. ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజమాని, ఇల్లు ఫొటో తీసి అప్లోడ్ చేశారు. ఇలా చేసిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా.. ఒక్క ఇందిరమ్మ ఇళ్లకోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబి తాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేని ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరుగా విభజించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొదటి జాబితా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం చేస్తున్నారు. కమిటీ సభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కీలక భూమిక పోషించే కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఆలోచనతో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో నిజనమైన అర్హులను ఎంపిక చేయడంలో భాగస్వామ్యులై కమిటీ సభ్యుల ఏకాభిప్రాయంతో తుది జాబితా ఇవ్వాలి. అయితే లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా.. తమ అనుచరులకు ఇల్లు రాకపోయినా.. సంతకం పెట్టేందుకు ముందుకు రావడం లేదని ప్రచారం. దీంతో పలు గ్రామాల్లో తుది జాబితా ప్రకటించలేదు. అదే విధంగా తుది జాబితా తయారు చేసిన గ్రామాల్లో ప్రొసీడింగ్ ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో లేక కూడా జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ఇతర జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండగా మానుకోట లో మాత్రం నెమ్మదిగా జరుగుతున్నా యి. కాగా అధికారులు స్పందించి పనులు వేగంగా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ముందుకు సాగని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కమిటీ సభ్యుల మధ్య కుదరని ఏకాభిప్రాయం ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో జాప్యంజిల్లాలో ఇందిరమ్మఇళ్ల పురోగతి వివరాలు మండలం ఆమోదం పైలెట్ మొదటి ముగ్గు విడత పోసినవిబయ్యారం 545 19 74 93 చిన్నగూడూరు 162 18 56 74 దంతాలపల్లి 350 09 114 123 డోర్నకల్ 424 18 165 183 గంగారం 165 57 40 97 గార్ల 345 04 07 11 గూడూరు 618 07 158 165 ఇనుగుర్తి 260 15 132 147 కేసముద్రం 422 17 249 266 కొత్తగూడ 239 39 118 157 కురవి 593 03 124 127 మహబూబాబాద్ 556 33 152 185 మరిపెడ 575 06 224 230 నర్సింహులపేట 369 41 147 188 నెల్లికుదురు 456 00 70 70 పెద్దవంగర 272 05 40 45 సీరోలు 232 09 91 100 తొర్రూరు 474 00 116 116 మున్సిపాలిటీలు డోర్నకల్ 154 00 68 68 కేసముద్రం 151 00 01 01 మహబూబాబాద్ 288 00 00 00 తొర్రూరు 111 00 00 00 మొత్తం 7,761 300 2,146 2,446వేగంగా ఇళ్ల ముగ్గులు ప్రొసీడింగ్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ముగ్గులు పోసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామాల్లో పలు స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి. కొందరికి బిల్లులు కూడా అందజేశాం. అన్ని మండలాల్లో పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. – కె.రాజయ్య, పీడీ, గృహనిర్మాణశాఖ -
నాడు అన్న.. నేడు తమ్ముడు
ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తమ్ముడు రవి అలియాస్ గణేష్ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమానికి పురుడు పోసిన ఘటన.. వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్ బాక్స్లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్ ఆజాద్గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య అలియాస్ ఆజాద్ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అశోక్ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి 33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి అజ్ఞాతంలోకి.. సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో మరణం వెలిశాలలో ముగిసిన అన్నల శకం మూగబోయిన వెలిశాల.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు. నేడు అంత్యక్రియలు.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందాడని ఏపీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం గాజర్ల కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్న సమ్మయ్య, అశోక్(ఐతు)లు రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్ల వారుజామున తిరిగి వెలిశాలకు వచ్చే అవకాశం ఉండగా, రవి అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి.ఆపరేషన్లలో దిట్ట.. గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు. -
పొలాలకు ఎలా వెళ్లాలి
డైవర్షన్ రోడ్డు నిర్మించాలని బ్రిడ్జి వద్ద నిరసన తెలుపుతున్న ముస్మి గ్రామస్తులు కొత్తగూడ: డైవర్షన్ రోడ్డు నిర్మించకుండా బ్రిడ్జి పనులు చేపడుతున్నారని, తమ పొలాలకు ఎలా వెళ్లాలని మండలంలోని ముస్మి గ్రామస్తులు బుధవారం బ్రిడ్జి వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ముస్మితండా నుంచి దుర్గారం వెళ్లే దారిలో ముస్మి వాగుపై కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాడని, డైవర్షన్ రోడ్డు వేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. బిల్లులు కావడం లేదని పనుల్లో మరింత జాప్యం చేస్తున్నాడని, రైతులు వాగు అవతలి వైపు ఉన్న పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి డైవర్షన్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ రోడ్డు లేక ఇబ్బందులు బ్రిడ్జి వద్ద ముస్మి గ్రామస్తుల నిరసన -
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
పెద్దవంగర: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాజ్మాన్ సింగ్ తండాలో 12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బుదారపు శ్రీనివాస్తో కలసి డీఈఓ పునఃప్రారంభించారు. తండా వాసులతో మాట్లాడారు. అనంతరం అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కాసేపు పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుంచే ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ రకమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. అధికారులు రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్ ఆజాద్, హెచ్ఎం కళాధర్, ఏపీఎం రమణాచారి, మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు భద్రమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యం డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించి ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యమని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్లో సబ్జెక్టుల వారీగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ శాఖలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రత్యేక డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలకు ఓ ప్రవాస భారతీయుడు అందజేసిన డ్యూయల్ బెంచీలను డీఈఓ ప్రారంభించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏఎండీ ఆజాద్ చంద్రశేఖర్, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, హెచ్ఎం బండి నర్సింహారావు, శ్రీలక్ష్మి, వీరన్న, శోభారాణి, త్రివేణి పాల్గొన్నారు. అధిక భారం మోపొద్దు మహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనిభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు, దుస్తులు టై,బెల్టులు, షూలు, పుస్తకాలు పేరుతో అధిక భారం మోపి ఇబ్బందుల గురి చేస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలల ఆవరణలోనే దుస్తులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మకాలకు తెరతీశారని, అధిక ధరలకు అమ్ముతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకుల నుంచి ఆరోపణలు వచ్చాయన్నారు. నిబంధనల మేరకు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం రూపొందించిన పుస్తకాల ద్వారానే బోధించాలని సూచించారు. తెరుచుకున్న బడి.. మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని హజారియాతండా ఎంపీపీఎస్ పాఠశాల 12 సంవత్సరాలుగా మూతపడి ఉంది. డీఈఓ రవీందర్ రెడ్డి ప్రోత్సాహంతో బుధవారం పునఃప్రారంభించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్, ఎంఈఓ ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, పర్వతగిరి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మందుల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్ రెడ్డి -
లక్ష్యాలు పూర్తి చేయడంలో ముందుండాలి
బయ్యారం: ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం ముందుండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. బుధవారం మండంలోని కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక అధికారులు రోజు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. ము న్సిపల్, గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధి కారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉన్న మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇసుక తదితర సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి గార్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. బుధవారం మండలంలోని సీతంపేట, పోచారం పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మార్కింగ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. మండలాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్లు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మంగమ్మ, పంచాయతీ కార్యదర్శులు అభిలాష్, రమేశ్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సన్న బియ్యంతో సంతృప్తికరంగా భోజనం
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఇష్టంగా తిన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని వెలుగు సోమయ్య ఇంట్లో సన్న బియ్యం అన్నంతో ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ, స్థానిక నాయకులు ఆమెతో పాటు భోజనం చేశారు. పప్పు, వంకాయ, సాంబారు వంటకాలను ఎమ్మెల్యే ఇష్టంగా తిన్నారు. భోజనం చేసిన ఇంట్లో కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీతో 80శాతం పేదలు ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయాలిగార్ల: గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాం నాయక్ ఆదేశించారు. బుధవారం గార్ల మండలం సేరిపురం పంచాయతీలోని మర్రిగూడెం గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. బడిబాటలో నమోదైన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, హాజరు శాతం పెంచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే, ఆ పాఠశాల ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాల స్కూళ్లకు డిప్యుటేషన్పై పంపిస్తామని చెప్పారు. పాఠశాల తరగతి గదులు, కిచెన్షెడ్ను పరిశీలించారు. పాఠశాలలో చేతిపంపు పాడైందని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులు డీడీకి విన్నవించారు. చేతిపంపు మరమ్మతులు చేయిస్తానని డీడీ హామీ ఇచ్చారు. ఎస్సీఆర్పీ మాలోత్ బుచ్చానాయక్, ఉపాధ్యాయులు బాలాజీనాయక్, కబ్బాకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మనుమరాలిని మోడల్ స్కూల్లో చేర్పించిన తాతకురవి: రిటైర్డ్ టీచర్ కొండబత్తుల ఈశ్వర్కుమార్ తన మనుమరాలిని నేరడ మోడల్ స్కూల్లో బుధవారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడి బిడ్డ(మనుమరాలు) అభిజ్ఞ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఆయన తన మనుమరాలిని నేరడ మోడల్ స్కూల్లో చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఎస్పీని కలిసిన సీఐమహబూబాబా ద్ రూరల్: మహబూబాబాద్ టౌన్ సీఐగా విధుల్లో చేరిన గట్ల మ హేందర్ రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలమొక్క అందజేశారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగింపు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్కుమార్ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి తన చాంబర్లో రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి రాజ్కుమార్కు ఉత్తర్వులు అందజేశారు. -
22న భద్రకాళికి బంగారు బోనం
హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి అమ్మవారికి ఈనెల 22న బంగారు బోనం సమర్పించనున్నట్లు భద్రకాళి ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈఓ శేషుభారతి, అర్చకుడు భద్రకాళి శేషు ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని, అలాగే లాల్దర్వాజ కమిటీ సభ్యులు, భక్తులు భారీగా హాజరై అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. జంతు బలులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయ చరిత్రలో కొత్తగా బోనాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. ఆచార సంప్రదాయాల ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం బోనాలు నిర్వహించనున్నట్లు అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులను పరిచయం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బోనాలు .. ఉమ్మడి జిల్లాలో ఆషాఢం, శ్రావణమాసాల్లో బీరన్న, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ తదితర గ్రామదేవతలకు మాత్రమే బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. గ్రామదేవతలకు కల్లుశాక, జంతుబలులు ఇచ్చే సంప్రదాయం ఉంది. శైవ, వైష్ణవ, స్మార్త పద్ధతిలో దేవాలయాల్లో జరిగే వాటికి శాస్త్రాధారం ఉంటుంది. ఈ మేరకు వైదిక ఆగమానుసారం జరుగుతున్న దేవాలయంలో బోనాలు సమర్పించడం పట్ల పలువురు భక్తులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అర్చకులను వివరణ కోరగా దేవాదాయశాఖ ఆదేశంతో వైదిక సంప్రదాయం ప్రకారమే జరిగే బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఆలయ చరిత్రలో ఈసారి వేడుకలకు ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన ఈఓ శేషుభారతి -
గోదావరి జలాలు అందించాలి
బయ్యారం: బయ్యారం పెద్దచెరువుతో పాటు కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్ మండలాలకు గోదావరి జలాలు అందించాలని ఎంపీ బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవించారు. బుధవారం హైదరాబాద్లో వారు సీఎంను కలిసి గోదావరి జలాలను సాగు భూములకు అందించాలని కోరారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించి త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నట్లు వారు విలేకరులకు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినా రాయణ, రాందాస్ తదితరులు ఉన్నారు. -
మంట కలిసిన మానవ సంబంధం
అన్నను దారుణంగా హత్య చేసిన తమ్ముళ్లు కురవి: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు. లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపల్లికి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం.. మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది. భూ వివాదమే కారణం మహబూబాబాద్ జిల్లాలో ఘటన -
సైనిక వెల్ఫేర్ ఫండ్కు కేయూ అధ్యాపకుల చేయూత
కేయూ క్యాంపస్: సైనిక వెల్ఫేర్కు ఆర్మెడ్ ఫోర్సెస్ ప్లాగ్డే ఫండ్గా కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అధ్యాపకుల తమ ఒక రోజు బేసిక్ పే రూ. 3లక్షల 7వేల 610( చెక్) బుధవారం తెలంగాణ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్కు అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ (అకుట్) అధ్యక్షుడు బి. వెంకట్రామ్రెడ్డి అందజేశారు. బుధవారం క్యాంపస్లోని అకడమిక్ కమిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో వీసీ కె. ప్రతాప్రెడ్డి,రిజిస్ట్రార్ వి. రామచంద్రం సమక్షంలో చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ దేశ భద్రతలో సైనికులు సేవలు చిరస్మరణీయన్నారు. తెలంగాణ రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ రమేశ్కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేకరించిన సైనిక వెల్ఫేర్ ఫండ్ను సైనికుల సంక్షేమం కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ విషయంలో పారదర్శకత, జవాబుదారితనం ఉంటుందన్నారు.కార్యక్రమంలో అకుట్ జనరల్ సెక్రటరీ ఎల్పి. రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.● వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సమక్షంలో ఒక రోజు బేసిక్ పే అందజేత -
డిస్క్ల మార్పుపై మల్లగుల్లాలు..
హన్మకొండ : అమ్మవారిపేట 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి హనుమకొండ, వరంగల్లోని రెండు సబ్ స్టేషన్లకు వేసిన విద్యుత్ లైన్లో తలెత్తిన సమస్య పరిష్కారానికి టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ సర్కిల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నాణ్యత లేని డిస్క్ల సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. తరచూ డిస్క్లు పగిలి షార్ట్ సర్క్యూట్ అవుతూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో దిద్దుబాటు ఎలా అనే ఆలోచనలో పడ్డారు. అంతరాయాలను నివారించడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని అమ్మవారిపేట 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి హనుమకొండ న్యూశాయంపేట, వరంగల్ ఉర్సు వరకు 33 కేవీ విద్యుత్ లైన్ వేశారు. ఈ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో స్థానిక అధికారులు సీఎండీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులు, ఉద్యోగులు అంతరాయం కలిగిన ప్రతీసారి నరకయాతన పడుతున్నారు. సమస్య గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో గుర్తించడం ఉద్యోగులకు కష్టతరంగా మారింది. టవర్ ఎక్కి పరిశీలిస్తేనే ఈ సమస్య గుర్తిస్తామని, ఇలా ప్రతీ టవర్ ఎక్కి దిగడం ద్వారా అవస్థలు పడుతున్నామని, కాంట్రాక్టర్ చేసిన నాణ్యతలేని పనికి తాము బలవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ 33 కేవీ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయం కలుగడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకు అంతరాయాలు జరుగుతున్నాయని అధికారులను అడిగితెలుసుకున్నారు. డిస్క్లు తరచూ పగిలిపోతున్నాయని, దీంతో షార్ట్ సర్క్యూట్ అయి బ్రేక్డౌన్ అవుతుందని సీఎండీకి వివరించారు. దీంతో ఈ విద్యుత్ లైన్ నిర్మించిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లన్నీ మార్పించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ నుంచి లభించని సంపూర్ణ మద్దతు.. అయితే కాంట్రాక్టర్ నుంచి అధికారులకు సంపూర్ణ మద్దతు లభించడం లేదని విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను విద్యుత్ లైన్ వేసినప్పుడే క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పాటు ఇతర అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తనకు బిల్లులు చెల్లించారని, అప్పుడు నాణ్యత ఉన్నవి, ఇప్పుడు నాణ్యత లేకుండా ఎలా పోతాయని, పైగా తనకుండే 18 నెలల మెయింటెనెన్స్ సమయంకూడా గడిచి పోయింది... తాను ఎందుకు డిస్క్లు మారుస్తానని కాంట్రాక్టర్ ఎదురు ప్రశ్నించారని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, 15 నుంచి 20 ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ లైన్ల డిస్క్లు, ఇన్సులేటర్లు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా, పగలకుండా ఉండగా మూడు, నాలుగేళ్ల క్రితం వేసిన అమ్మవారిపేట–న్యూశాయంపేట, అమ్మవారిపేట– ఉర్సు 33 కేవీ విద్యుత్ లైన్లో ఎందుకు సమస్య ఉత్పన్నమవుతుందనే చర్చ సాగుతోంది. నాణ్యత లేని డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడం వల్లే అవి పగిలిపోయి ఈ పరిస్థితులు కలుగుతున్నాయని ఉద్యోగులు తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్పై రూ.4 లక్షల వరకు భారం.. 33 కేవీ విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్పై అధికారులు ఒత్తిడి పెంచడంతో తాను డిస్క్లు వేయనని, అవసరమైతే లేబర్ సాయం మాత్రం చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే డిస్క్ల ఎవరు తీసుకురావాలి..? ఎక్కడి నుంచి తీసుకురావాలి..? అనే మీమాంసలో అధికారులు పడ్డారు. కాంట్రాక్టర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురుకాగా ఈ సమస్య పరిష్కారం అధికారులకు భారం మారుతోంది. చివరకు ఎన్పీడీసీఎల్ అధికారులు డిస్క్లు వేసే బాధ్యత తీసుకుని కాంట్రాక్టర్ ద్వారా లేబర్ సాయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. డిస్క్, దానిని బిగించడానికి వాడే మెటీరియల్ కలుపుకుని ఒక్కో డిస్క్కు రూ.615 ఖర్చవుతుంది. ఈ లెక్కన 33 కేవీ విద్యుత్ లైన్లో దాదాపు 600కు పైగా డిస్క్లు మార్చాల్సిన అవసరముంది. 600 డిస్క్లు మార్చడానికి వాటి ఖరీదు రూ.3.69 లక్షలు అవుతుంది. ఇతర ఖర్చులు కలుపుకుంటే దాదాపు రూ.4 లక్షల వరకు టీజీ ఎన్పీడీసీఎల్పై భారం పడనుంది. ఈ భారం భరించడంపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్తో చేయించాలా... డిపార్ట్మెంట్ ద్వారా చేయాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.డిపార్ట్మెంట్ ఖర్చుతో చేయాలా? కాంట్రాక్టర్తో చేయించాలా? అమ్మవారిపేట 220 కేవీ సబ్స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సబ్ సబ్ స్టేషన్లకు లైన్.. నాణ్యతలేని డిస్క్లతో తరచూ విద్యుత్ అంతరాయం కాంట్రాక్టర్తో మార్పించాలని సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశం తానేందుకు మార్చుతానంటున్న కాంట్రాక్టర్ అయోమయస్థితిలో అధికారులు -
ఈతకెళ్లి రైల్వే ఉద్యోగి మృతి
● మున్నేరువాగులో ఘటన డోర్నకల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఎర్రంశెట్టి సందీప్(28) డోర్నకల్లో రైల్వే ట్రైన్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి సరదాగా మున్నేరువాగులో ఈతకు వెళ్లాడు. అక్కడ మిత్రులు ఈత కొడుతుండగా ఈతరాని సందీప్ వాగు ఒడ్డున నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులోకి జారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వాగు నుంచి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న ఆర్మీ జవాన్ మృతి శాయంపేట : భార్య వేధింపులతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ ఆర్మీ జవాన్ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. మండలంలోని మైలా రం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్(28) సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ 125లో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య కొంత కాలంగా తనను వేధింపులకు గురిచేయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్.. ఈ నెల 8న హనుమకొండలో గడ్డి మందు తాగాడు. వెంటనే హైదరా బాద్లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో పూణెకు తరలించగా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, తన ఆత్మహత్యాయత్నానికి భార్య, అత్తామామలేనని కారణమని ప్రవీణ్ అంతకుముందు ఓ వీడియోలో వెల్లడించారు. నేటి నుంచి రెండు స్పెషల్ రైళ్లు.. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా గురువారం నుంచి యశ్వంత్పూర్– యోగ్నాగరి రిషికేష్–యశ్వంత్పూర్ మధ్య రెండు స్పెషల్ రైళ్లు నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ఈ నెల 19వ తేదీన యశ్వంత్పూర్–యోగ్ నాగరి రిషికేష్ (06597) ఎక్స్ప్రెస్, ఈ నెల 21వ తేదీన యోగ్నాగరి రిషికేష్–యశ్వంత్పూర్ (06598) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్లనున్నట్లు తెలిపారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్, జనరల్ కోచ్లతో ప్రయాణించే ఈ రెండు రైళ్ల సర్వీస్లకు యొలహంక జంక్షన్, హిందుపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, భోపాల్, బీనాజంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మతుర, హజ్రత్నిజాముద్దీన్, గజియాబాద్, మీరట్ సిటీ, ముజఫర్నగర్, టాప్రి జంక్షన్, రూర్కి, హరిద్వార్లో హాల్టింగ్ కల్పించినట్లు ఆయన తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్.రాంచందర్ అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో ఫెడరేషన్ వరంగల్ రీజియన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డ్యూటీల పేరుతో డ్రైవర్లు, కండక్టర్లపై వేధింపులు మానుకోవాలన్నారు. ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం విధానాలతో ప్రయాణికులు అసౌకర్యానికి గురై సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.ప్రభాకర్ రెడ్డి, అధ్యక్షుడిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా బి.బాబు రావు, ఎల్.యాదగిరి, బి.సుధారాణి, అల్వార్, ఎన్.శ్రీనివాస్, వై.శ్రీనివాస్, కార్యదర్శిగా బి.యు.చారి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.సతీశ్, ఓ.కొమ్మాలు, పి.కె.మూర్తి, డి.సంపత్, ఎం.డి.షాబుద్దీన్, ఎస్.పుష్ప, కోశాధికారిగా బి.శంకర్, ప్రచార కార్యదర్శిగా పి.మహేందర్ ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ప్రభాకర్ రెడ్డి, సీఐటీయూసీ జిల్లా కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్ -
చదువుకొనే వేళ..
ఖిలా వరంగల్: వేసవి సెలవులు ముగిశాయి. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పడుతున్నారు. అయితే తమ పిల్లలు చదువు‘కొన’డానికి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం స్కూల్ ఫీజులు. ఈ అంశ ఒక ఎత్తయితే వారికి కావాల్సిన విద్యాసామగ్రి కొనడం మరో ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో అప్పు చేసైనా తమ పిల్లలకు విద్యాసామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వరంగల్ నగరంలోని బుక్స్టాళ్లు, బ్యాగుల షాపులు, ‘షూ’ మార్టులు కిక్కిరిస్తున్నాయి. అయితే అన్ని వస్తువుల ధరలు గతేడాది కంటే పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసామగ్రి ఉచితంగా సమకూర్చుతున్నా తల్లిదండ్రులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆర్థిక భారమైనా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కార్పొరేట్ హంగులకు సరిపడేలా తమ పిల్లలను తయారు చేసి పంపించాల్సి వస్తోంది. పెరిగిన ‘షూ’ ధర.. ‘షూ’ ధర గత సంవత్సరంతో పోల్చుకుంటే జతకు రూ.50 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.250 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. బ్రాండెడ్ షూ అయితే రూ.700 మధ్య లభిస్తున్నాయి. పౌచ్ల ప్రపంచం.. ప్రస్తుతం ప్రతీ విద్యార్థి వద్ద పౌచ్ ఉండాల్సిందే. పెన్సిళ్లు, పెన్నులు, ఎరెజర్స్, ఇతర తినుబండారాలు ఇందులో భద్రపరుచుకుంటారు. ఎల్కేజీ మొదలు.. డిగ్రీ విద్యార్థుల వరకు పౌచ్ను వినియోగిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో ఈ వస్తువుకు డిమాండ్ ఉంది. రూ.40 నుంచి రూ. 200 వరకు ఉంది. పౌచ్ ధర కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే 10 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. పెన్ను మరింత ప్రియం.. గతంలో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు పెన్సి ల్తోనే రాయాల్సిండేది. ప్రస్తుతం లేదు. ఏకంగా పెన్నుతోనే రాత ప్రారంభిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో రూ. 3 నుంచి రూ.100 వరకు పెన్ను అందుబాటులో ఉంది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ధరలో వ్యత్యాసం తీవ్రంగా కనిపిస్తోంది. పెన్సిళ్లు ధర రూ.4 నుంచి రూ.7, లెడ్ పెన్సిళ్లు రూ.5 నుంచి రూ.50 వరకు ఉంది. స్కూల్ బ్యాగు ధర పైకి.. స్కూల్ బ్యాగు రూ.250 నుంచి రూ.వెయ్యి మధ్య లభిస్తోంది. గతేడాదితో పోలిస్తే ధర పెరిగింది. బ్రాండెడ్ స్కూల్ బ్యాగు ధర మరింత ప్రియం అయ్యింది. రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఉంది. అమాంతం పెరిగిన కుట్టుకూలి.. యూనిఫాం ధర నామమాత్రంగానే ఉంది. అయితే కుట్టు కూలి మాత్రం అమాంతం పెంచారు. జత కుట్టడానికి కూలి రూ.250 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. అధిక శాతం ప్రైవేట్ స్కూళ్లు నేరుగానే విద్యార్థులకు రెడీమేడ్ ఇస్తున్నారు. జామెట్రీ బాక్స్.. విద్యార్థులు ఎక్కువ కొనుగోలు చేసే వస్తువుల్లో జామెట్రీ బాక్స్ ఎక్కువ ఉంటుంది. దీనిని 4వ తరగతి నుంచే వినియోగిస్తున్నారు. ధర రూ.40 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5శాతం ధరలు పెరిగినట్లు వ్యాపారులే చెబుతున్నారు. నోటు బుక్స్ కొనలేకపోతున్నాం.. గతేడాది పోల్చుకుంటే నోటుబుక్స్, పెన్నులు ,పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, పౌచ్, టెస్ట్ బుక్స్, షూ, స్కూల్ బ్యాగులు ధరలు పెరిగాయి. ఇద్దరు పిల్లలకు నోటుబుక్స్, పెన్నులు, ఇతర మెటీరియల్కు రూ.6వేల పైగా ఖర్చు చేశాం. పూర్తి స్థాయిలో నోటుబుక్స్, ఇతర వస్తువులు కొనలేకపోతున్నాం. రంజిత్, కాశిబుగ్గ వరంగల్ కుట్టుకూలి ధరలు పెరిగాయి..యూనిఫాం వినియోగం తగ్గింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తమకు విద్యార్థులకు నేరుగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా యూనిఫాం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా వద్ద కొనుగోలు చేసే వారు కరువయ్యారు. బట్ట ధర తక్కువ ఉంది. కుట్టు కూలి ధరలు మాత్రం పెరిగాయి. ఒక్కో జతకు రూ.250 నుంచి రూ. 400 వరకు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొలేదు. రాధాకృష్ణ, వస్త్ర వ్యాపారి వరంగల్ చుక్కల్లో బ్యాగులు, యూనిఫాం ధరలు నోట్ పుస్తకాలు రేట్లు ౖపైపెకి.. పెరిగిన ధరలతో తల్లిదండ్రులు ఆందోళన -
ఏసీబీ వలలో విద్యుత్శాఖ ఎస్ఈ నరేశ్
మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పరిమితి పెంపునకు కాంట్రాక్టర్లనుంచి లంచం తీసుకుంటూ ఆ శాఖ మహబూబాబాద్ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీకి చిక్కారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన క్లాస్–1 కాంట్రాక్టర్లు అజారుద్దీన్, నజీరుద్దీన్ మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ సబ్ డివిజన్ల పరిధిలోగల సీరోలు, చిన్నగూడూరు సెక్షన్లలో విద్యుత్ పనుల కోసం టెండర్లు దాఖలు చేశారు. పనుల నిర్వహణకు రూ.20 లక్షల పరిమితి మాత్రమే ఉండగా, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రూ.40 లక్షలకు పెంచేందుకు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జే.నరేశ్ను సంప్రదించారు. రెండు నెలలుగా తిరుగుతున్నప్పటికీ పనికాలేదు. ఈ క్రమంలో సదరు అధికారి నరేశ్ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు ఈ నెల 14వ తేదీ (శనివారం) రూ.20వేలు ముట్టజెప్పారు. మిగతా రూ.80వేలు ఇచ్చి ఆ అధికారితో పని చేయించుకోవడం ఇష్టంలేక వారు ఏసీబీ అధికారులను సంప్రదించారు. పక్కా ప్లాన్ ప్రకారం బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ సమీపంలో ఎస్ఈ నరేశ్ అద్దెకు ఉండే ఇంటి వద్ద కాంట్రాక్టర్లు అజారుద్దీన్, నజీరుద్దీన్లు ఆయనకు రూ.80వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నరేశ్ను అదుపులోకి తీసుకుని గురువారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే ప్రజల పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388912 నంబర్ను సంప్రదించాలని వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య కోరారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ పరిమితి పెంచేందుకు రూ.లక్ష డిమాండ్ రూ.80వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
మేడారం హుండీల కానుకల లెక్కింపు
ఎస్ఎస్తాడ్వాయి: మేడార సమ్మక్క, సారలమ్మ హుండీల కానుకలను బుధవారం మేడారంలోని డార్మెటరీ భవనంలో దేవాదాయశాఖ అధికారులు, పూజారుల సమక్షంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీపల్లి సేవ సంస్థ ఆధ్వర్యంలో వలంటీర్లు లెక్కించారు. మేడారం ఈఓ వీరస్వామి పర్యవేక్షణలో హుండీల కానుకలను లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ. 18,36,233, సారలమ్మ ఆదాయం రూ. 16, 59,383, పగిడిద్దరాజు ఆదాయం రూ. 72, 289, గోవిందరాజు ఆదాయం రూ, 81,463.. మొత్తం హుండీల ఆదాయం రూ. 36,49,368 లక్షలు వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరిండెంటెండ్ క్రాంతికుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, వీరన్న, మధు, బాలకృష్ణ, పూజారులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రొసీడింగ్ పత్రాలు అందజేయాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కా ర్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇళ్ల పనులు ప్రారంభించాలన్నారు. వేగవంతంగా ని ర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, హౌసింగ్ డీఈ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
● తల్లి ఇక లేదని తెలియక..!
విద్యుదాఘాతంతో మృతిచెందిన తల్లికోతి వద్ద పిల్లకోతి పడిగాపులు అప్పటి వరకు తల్లికోతి తన కడుపులో పుట్టిన పిల్ల కోతిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. తినడానికి పండ్లు, ఇతర తినుబండారాలు సేకరించి ఇచ్చింది. సరదాగా కాసేపు ఒళ్లో పడుకోబెట్టుకుంది. ఒక చెట్టుపై నుంచి మరోచెట్టు మీదకు దూకుతూ ఆటలాడించింది. ఈక్రమంలో తల్లి కోతి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన బయ్యారం బస్టాండ్ సెంటర్లో మంగళవారం జరిగింది. కాగా, మృతి విషయం తెలియక పక్కనే దీనంగా పిల్లకోతి కూర్చొని తల్లికోతిని తట్టిలేపుతున్న దృశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. కాసేపటి తర్వాత కొందరు ఆ కోతి పిల్లను దగ్గరకు తీసుకొని తమ వెంట తీసుకెళ్లారు. – బయ్యారం -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం!
మహబూబాబాద్ అర్బన్: మానవ మనుగడకు చెట్లే ఆధారం. సకల జీవరాశులు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెట్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈమేరకు పచ్చదనం పెంపులో భాగంగా మొక్కల ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతీ పాఠశాలలో చురుకై న విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేకంగా పర్యావరణ క్లబ్లు ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది నుంచి పేరుమార్పు.. పచ్చదనం పెంపు, మొక్కల రక్షణపై అవగాహన, పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణ లో విద్యార్థులను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో పర్యావరణ క్లబ్ (ఎకో క్లబ్)లను ఏర్పాటు చేయగా..ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మి షన్ లైఫ్’గా పేరు మార్పు చేశారు. అన్ని పాఠశాలల్లో కొత్త క్లబ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో కమిటీ.. ఈ నెల 17 నుంచి జూలై 29వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో క్లబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి క్లబ్లో భాగస్వాములను చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కమిటీలు ప్రతీరోజు ఏడు థీమ్లకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు https://merilife.nic.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కాగా జిల్లాలోని 922 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రచార అంశాలు.. ఎకో క్లబ్లు శక్తి, నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పడం, స్థిరమైన ఆహార వ్యవస్థలు ఉపయోగించడం, వ్యర్థాలు తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోడం, ఈ వ్యర్థాలను తగ్గించడం వంటి అంశాలను ప్రచారం చేయనున్నారు. అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్లబ్ల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుంది. తప్పకుండా అన్ని పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలి. కేటాయించిన అంశాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగించాలి. ప్రతీరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. – చంద్రశేఖర్ ఆజాద్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలు ఉన్నత పాఠశాలలు 102ప్రాథమికోన్నత 120ప్రాథమిక 676కేజీబీవీలు 16మోడల్ స్కూళ్లు 8గతంలో పాఠశాలల్లో పర్యావరణ క్లబ్ల ఏర్పాటు ఈ ఏడాది నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పేరుమార్పు విద్యార్థులతో కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
● డీఈఓ రవీందర్రెడ్డి కేసముద్రం: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నోట్బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ, మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, హెచ్ఎంలు బండారు నరేందర్, కల్లెం వీరారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి గిద్దె రాంనర్సయ్య, వెంకన్న, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, ఎంఈఓ కాలేరు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్: సీజనల్ వ్యాధుల వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ ఆదేశించారు. స్థానిక పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీతో పాటు గ్రామాల్లోని హెల్త్ సబ్సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఖాళీ పోస్టుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ని డోర్నకల్, తొర్రూరు, బయ్యారం, మరిపెడ, గూడూరు ఆస్పత్రుల్లో పది పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఫీవర్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ పీహెచ్సీలో ఇక నుంచి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని, రాత్రి వేళల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి సాధ్విజ, సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన డీపీఓగార్ల: మండలంలోని సత్యనారాయణపురం, సీతంపేట పంచాయతీల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) హరిప్రసాద్ మంగళవారం ముగ్గులు పోసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తే దశలవారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తహసీల్దార్ వద్దకు వెళ్లి ఇల్లు మంజూరు పత్రం చూపిస్తే ఉచిత ఇసుక కూపన్లు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక పొందవచ్చని సూచించారు. ఎంపీడీఓ మంగమ్మ, పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, అభిలాష్, లబ్ధిదారులు పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు విడుదలమహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలోని 2,22,306 మంది రైతుల ఖాతాల్లో రూ.273.37 కోట్లు జమ చేయాల్సి ఉంది. సోమవారం రాత్రి నుంచి దశలవారీగా జమ అవుతుండగా.. మంగళవారం సాయంత్రం వరకు రూ.1,27,502 మంది రైతుల ఖాతాల్లోకి రూ.76.73 కోట్ల నిధులు జమ అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. కొత్త దరఖాస్తులు అందజేయాలి... కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు (సీసీఎల్ఏ నుంచి ఈనెల 5వ తేదీ వర కు పంపిన డేటా ఆధారంగా) తమ దరఖాస్తులను క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు. ఈనెల 20వ తేదీలోగా పాసుపుస్తకం జిరాక్స్ లేదా డిజిటల్స్ సంతకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్, దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. బాలిక అదృశ్యంపై విచారణమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్లో బాలిక అదృశ్యంపై మంగళవారం వైరా ఏటీడీఓ జహీరుద్దీన్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 17న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్లో బాలిక అదృశ్యమైందని, భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పాఠశాల హెచ్ఎం, హాస్టల్ వార్డెన్పై విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి పీఓకు నివేదికలు అందిస్తామన్నారు. కాగా, జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన పలు సంఘటనపై విచారణ చేస్తున్నారని తప్ప చర్యలు తీసుకోవడం లేదు. కాగా, తప్పు చేస్తున్నది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారులు, సిబ్బంది కావడంతోనే సస్పెండ్ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుని, అందరికీ సామాజిక న్యాయం చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ట్రెంచ్ పనులను అడ్డుకున్న పోడు రైతులు
కేసముద్రం: ఫారెస్టు అధికారులు చేపట్టిన ట్రెంచ్ పనులను పోడు రైతులు అడ్డుకున్న సంఘటన ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి శివారు పాత తండా జీపీ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. ఇనుగుర్తి సెక్షన్ పరిధిలోని 1149 కంపార్ట్మెంట్ నంబర్ భూమిలో అటవీశాఖ అధి కారులు జేసీబీ సాయంతో ట్రెంచ్ పనులు చేపడుతుండగా.. అక్కడికి పోడు రైతులు చేరుకొని, తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, తమ వద్ద పత్రాలుఉన్నాయని పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కాగా కేసముద్రం ఎస్సై మురళీధర్రాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేయగా తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు లాక్కోవడం సరికాదని వాపోయారు. చివరకు భూమి పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
శిథిలావస్థలో పశువైద్యశాల
కొత్తగూడ: మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. 40ఏళ్ల క్రితం నిర్మించి భవనం గోడలు, స్లాబ్ దెబ్బతిని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యం కోసం పశువులను తీసుకొచ్చే రైతులు సైతం వైద్యశాల వద్ద కూర్చోవడానికి భయపడుతున్నారు. నిత్యం పశువులకు వైద్యం.. పశు వైద్యశాల పరిధిలో కొత్తగూడ, గుంజేడు, వేలుబెల్లి, గోపాలపురం, కార్లాయి, బత్తులపల్లి, తాటివారివేంపల్లి, పెగడపల్లి, నీలంపల్లి, ఎదుళ్లపల్లి, జంగవానిగూడెం, రామన్నగూడెం, ముస్మి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిత్యం రైతులు వైద్యశాలలో పశువులకు చికిత్స చేయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పశువైద్యశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే గడ్డి విత్తనాలు, మందులు వర్షాల సమయంలో తడిసి పనికి రాకుండాపోతున్నాయి. దీంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. భయం భయంగా సిబ్బంది విధులు ఇబ్బందిపడుతున్న పశు పోషకులు -
పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు
మహబూబాబాద్ రూరల్: పోడు రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయవద్దని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని అటవీ, పోడు భూ ముల సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలుచోట్ల పోడు భూ ములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటినుంచి ఏ ఒక్క రైతును ఇబ్బందిపెట్టినా సహించేదిలేదన్నారు. కొన్నిచోట్ల పోడు భూముల్లో బావులకు విద్యుత్ సరఫరాలేక పంటపొలాలు ఎండిపోతున్నాయన్నారు. అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం వల్లే విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లు ఇవ్వడం లేదన్నారు. వీలైనంత త్వరగా అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలని, రైతులకు కరెంట్ కష్టాలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. కేసముద్రం, మహబూబాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ప్రజలు దహన సంస్కారాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటవీశాఖ అనుమతులతో స్థలాలను గుర్తించి శ్మశానవాటికలు నిర్మించాలని సూచించారు. గూడూరు మండలం భీమునిపాదం ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, దానికి సంబంధించిన రూపకల్పన గురించి అటవీశాఖ అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి విశాల్ బత్తుల, ఎఫ్ఆర్ఓ జ్యోత్స్న దేవి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అటవీశాఖ అధికారులతో సమీక్ష -
సీట్ల భర్తీపై అసంతృప్తి
సాక్షి, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది సీట్ల కేటాయింపునకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) కొర్రీలు పెడుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు, ల్యాబ్స్ ఇతర సౌకర్యాలు లేవనే కారణంతో రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, నాలుగు సంవత్సరాల క్రితం మంజూరైన మెడికల్ కళాశాల భవనాల నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎన్ఎంసీ హెచ్చరిక నేపథ్యంలో గడువులోగా పనులు పూర్తి చేసి, వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపుతున్నారు. లోపాలు ఇవే.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తెలిపిన నిబంధనల ప్రకారం ప్రతీ మెడికల్ కళాశాలలో బోధించేదుకు అనాటమీ, ఫిజియోథెరఫి, మైక్రోబయాలజితో పాటు మొత్తం 20 విభాగాలకు 19మంది ప్రొఫెసర్లు, 40 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 55 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అన్ని విభాగాలకు కలిపి 14 మంది తక్కువగా ఉన్నారు. వీరితోపాటు 32 మంది ట్యూటర్లు, 58 ఎస్ఆర్లు ఉండాలి. వీరు కూడా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రతీ అంశాన్ని వివరించేందుకు తొమ్మిది మేరకు డెడ్బాడీలు అందుబాటులో ఉండాలి. అయితే నివేదిక ఇచ్చేనాటికి డెడ్బాడీలు లేవు. తర్వాత పలువురు ప్రముఖులు తమ కుటుంబీకుల మృతదేహాలను దానం చేయడం, పలు గుర్తుతెలియని మృతదేహాలను కూడా పోలీసులు కళాశాలకు అందజేశారు. అదేవిధంగా అనుబంధ ఆస్పత్రిలో ప్రతీరోజు 1200లకు తక్కువ కాకుండా ఔట్ షేషెంట్లు ఉండాలి. పేదలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో టార్గెట్కు మించి ఔట్ పేషెంట్లు వస్తుంటారు. 600లకు పైగా పడకలు అందుబాటులో ఉండాలి. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో కేవలం 330 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తొమ్మిది మేజర్, ఆరు మైనర్ మొత్తం 15ఆపరేషన్ థియేటర్లు ఉండాలి. కానీ ఎనిమిది మాత్రమే ఉన్నాయి.నిర్మాణంలో ఉన్న జిల్లా జనరల్ ఆస్పత్రి భవనంనాలుగేళ్లుగా పూర్తికాని మెడికల్ కాలేజీ పనులు వసతులు లేమి, ఇతర సౌకర్యాలపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్రు ఈ విద్యాసంవత్సరం అనుమతికి కొర్రీలు గడువులోగా వసతులు కల్పిస్తేనే సీట్లు కేటాయించే అవకాశంవారి పాపమే.. ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు, స్థలంతో పాటు రూ.250కోట్ల మేరకు నిధులు కేటాయించారు. వీటితో మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాలు, అవసరమైన ల్యాబ్స్, థియేటర్లు, 20 విభాగాల డాక్టర్ల చాంబర్లు, బెడ్స్, క్రిటికల్ కేర్ భవనాలు, డైనింగ్ హాల్, బాలురు, బాలికలతోపాటు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లకు క్వార్టర్స్ నిర్మించాలి. పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ నర్సింగ్ కళాశాలకోసం నిర్మించిన భవనంలోనే తరగతులు జరుగుతున్నాయి. దీంతో డాక్టర్లు, స్టాఫ్నర్సులు సరిపడా ఉన్నా.. కేవలం 330 పడకల పాత ఆస్పత్రిలోనే ఉన్నారు. హాస్టల్స్, క్వార్టర్స్ లేక విద్యార్థులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ఎంసీ హెచ్చరికతో.. సరైన వసతులు కల్పించకపోతే కౌన్సెలింగ్లో కళాశాలకు సీట్లు కేటాయించమని ఎన్ఎంసీ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. హాస్టల్స్, డైనింగ్ హాల్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 330 పడకలకు తోడుగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం వరకు 600కు పైగా పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు.. 50 పడకల క్రిటికల్ కేర్, 250 పడకల జనరల్ విభాగాల కోసం పనులు చేస్తున్నారు. తుది పరిశీలనకు ఎన్ఎంసీ బృందం వచ్చేలోపు పనులు పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. అడ్మిషన్ల నాటికి సిద్ధం చేస్తాం కళాశాలలో బోధన సంతృప్తికరంగా సాగుతోంది. ఇందుకు నిదర్శనం గత రెండు సంవత్సరాల ఫలితాలు. కళాశాల భవనాలు, హాస్టల్స్, ఇతర భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జూలైలో నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు. ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల నియామకాలు పూర్తి అవుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ ఏడాది కొత్త విద్యార్థులు వచ్చేనాటికి ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా సర్వం సిద్ధం చేస్తాం. – లకావత్ వెంకట్, ప్రిన్సిపాల్, మానుకోట ప్రభుత్వ వైద్య కళాశాల -
కంచ కట్టయ్య జీవితం ఆదర్శం
నర్సంపేట: మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం నింపిన కంచ కట్టయ్య (సైన్స్ మనిషి..బిరుదు) జీవితం ఆదర్శమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య సోదరుడు, సైన్స్ శాస్త్రవేత్త కంచ కట్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కంచ కట్టయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలు వీడి కంచ కట్టయ్య జీవితాన్ని ఆదర్శం తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వీరన్నయాదవ్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు సుభాశ్, కంపాటి వీరయ్య, ఓయూ జేఏసీ నాయకులు కొంగళపాండుకురుమ, కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నడి రమేశ్, వెంకట్నాయక్, మేకల శివ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో నియోజకవర్గ అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక, రైతు భరోసా వంటి పథకాల అమలుపై మంత్రి ప్రభాకర్ చర్చించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు
భూపాలపల్లి : రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా, ఆదాయం లేకుండా ఇబ్బంది పడకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం చెన్నాపూర్లో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, కుందూరుపల్లి వద్ద సెంట్రల్ లైటింగ్ పనులను డిప్యూటీ సీఎం మంగళవారం ప్రారంభించారు. అనంతరం మంజూర్నగర్లో మంజూర్నగర్, గణపురం మండలం ధర్మారావుపేట, చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాసభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన వారు ప్రతీ రూపాయి దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏటా ఇందిరమ్మ ప్రభుత్వం రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ఐదేళ్ల కాలంలో రూ. 3.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు మొదటి దశలో 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ. 11,500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరిక మేరకు జిల్లాలోని కొత్త మండలాల్లో ఎన్పీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్లు, జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ స్టోర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, దుబ్బపల్లి, పరశురాంపల్లి గ్రామాల్లో భూసేకరణ చేపట్టాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్కు సూచించారు. అనంతరం భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓపెన్కాస్ట్ –2ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి సింగరేణి ప్రాజెక్టుల ఏర్పాటు, బొగ్గు ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే లైన్ తీసుకొస్తా.. సింగరేణి, కేటీపీపీ పరిశ్రమలు ఉన్న భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అ న్నారు. కేంద్రంతో మాట్లాడి ఇక్కడ జవహర్ నవో దయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పది రోజుల్లో టాస్క్ సెంటర్.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పది రోజుల్లో భూపాలపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాకు చుక్క నీరు రాలేదని, అయినా అప్పటి భూపాలపల్లి ప్రజాప్రతినిధి, మంథని బీఆర్ఎస్ నాయకుడు నోరు మూసుకుని ఉన్నారన్నారు. భూపాలపల్లి జిల్లాలో 47,200 ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. 800 మెగావాట్ల ప్లాంటు మంజూరు చేయాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూపాలపల్లిలో 500, 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించారని, ఇక్కడ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నాయని, 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సింగరేణి, కేటీపీపీలో స్థానికులు, భూ నిర్వాసితులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఎన్పీడీసీఎల్ సీఈ రాజు చౌహాన్, ఎస్ఈ మల్చూర్నాయక్, తదితరులు పాల్గొన్నారు. సంక్షేమంలో వెనుకంజ వేసేది లేదు రైతుల కోసం ఏటా రూ. 70 వేల కోట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పది రోజుల్లో భూపాలపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
బీపీఈడీలో రైతుబిడ్డకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్
ఏటూరునాగారం: బీపీఈడీలో రైతుబిడ్డ సత్తా చాటింది. టీజీ పీఈసీఈటీ–2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరుకు చెందిన రైతు రామయ్య, కుమారి దంపతుల కూతురు జ్యోతిర్మయి ఈ నెల 13వ తేదీన టీజీ పీఈసీఈటీ–2025 (తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాసింది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు రామయ్య, కుమారి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, జ్యోతిర్మయి రొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 5వ తరగతిలో రాయపర్తి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సీటు సాధించింది. ఐదు నుంచి ఇంటర్ వరకు అక్కడే చదువుకుంది. అయితే క్రీడలపై మక్కువతో 9వ తరగతిలో రంగారెడ్డి జిల్లా కమ్మదను సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ హబీద్ హుస్సేన్ వద్ద శిక్షణ తీసుకుంది. అనంతరం పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల బీపీఈడీ (వ్యాయామ) ప్రవేశ పరీక్ష రాసింది. ఇందులో స్టేట్ ర్యాంక్ను సాధించింది. కాగా, బీపీఈడీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందని జ్యోతిర్మయి తెలిపింది. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన జ్యోతిర్మయి తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
● ఇస్రా తండాలో ఘటన నెల్లికుదురు: మద్యం మత్తులో భర్త క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండా శివారు ఇస్రా తండాలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం. తండాకు చెందిన బానోత్ భద్రు, రంగమ్మ (55) దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న భద్రు క్షణికావేశంలో రంగమ్మను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం క్షణికావేశంలో తానే హత్య చేశానని తండావాసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై మృతురాలి కూతురు వాంకుడోతు శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఓకే
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (సర్కారు) తీసుకున్న సానుకూల నిర్ణయంపై కేయూ పాలకమండలి సమావేశం చర్చించి ఆమోదించింది. దీంతో ఎట్టకేలకు ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఊరట లభించింది. ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఈఏడాది ఫిబ్రవరి 24న అప్పటి సీఎస్ను ఆదేశించిన విషయం విధితమే. దీంతో ప్రభుత్వం ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకుని ఈఏడాది మే 8న ఆ జీఓను కాకతీయ యూనవర్సిటీ రిజిస్ట్రార్కు పంపింది. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఆ జీఓపై చర్చించి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదించారు. కాగా, 15 సంవత్సరాలుగా ఉద్యోగంలో కొనసాగుతున్నా వీరి నియామకంపై వివాదాల నేపథ్యంలో వీరికి క్యాస్ పదోన్నతులు కల్పించలేదు. అయితే వీరికి పదోన్నతులు చర్చకు రాగా ఇప్పుడే కల్పించొద్దని నిర్ణయించారని తెలిసింది. దీంతో వీరు పదోన్నతుల కోసం కొంతకాలం వేచిచూడకతప్పదు. యంగ్ఇండియా స్కూల్ కేయూ భూమిలోనే.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 200కోట్లతో నిర్మాణం చేయాల్సింటుంది. అయితే ఈ నియోజకవర్గంలో ఒకే చోట ప్రభుత్వం భూమి 15 నుంచి 20 ఎకరాల వరకు లభించే పరిస్థితి లేదని సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూలో 15 ఎకరాల భూమి కేటాయించే అంశంపై కూడా యూనివర్సిటీ అధికారులు ఏజెండాలో పెట్టగా చర్చించి పాలకమండలి ఓకే చెప్పినట్లు సమాచారం. స్నాతకోత్సవ నిర్వహణ వ్యయానికి ఓకే.. జూలై 7న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహించబోతున్నారు.అయితే విద్యార్థులకు ఇచ్చే గోల్డ్ మెడల్స్పై తొలుత ఫైనాన్స్ కమిటీలో, ఆ తర్వాత పాలకమండలిలో కూడా చర్చ జరిగింది. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం గోల్డ్ధర పెరిగినా మెడల్స్ ప్రదానం చేయాల్సిందే. అందుకయ్యే వ్యయానికి తొలుత ఫైనాన్స్ కమిటీలో, ఆ తర్వాత పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించింది. స్నాతకోత్సవానికి గవర్నర్ కూడా రానున్నారు. దీంతో స్నాతకోత్సవ నిర్వహణ వ్యయానికి సంబంధించి అంశం ఓకే అయ్యింది. రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకంపై చర్చ.. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్న పోస్టులను మినహాయించి మిగితా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల వెకెన్సీల్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమాకం చేపట్టాలనే అంశం కూడా పాలకమండలి సమావేశంలో చర్చించారని సమాచారం. అందుకు పాలకమండలి ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ ఇద్దరి సస్పెన్షన్ ఎత్తివేతకు నో.. కేయూ భూమిలో ఓ సర్వే నంబర్లో ఇల్లు కలిగి ఉన్నారని, ఇంకా పలు ఆరోపణలతో కొన్నినెలల క్రితం సస్పెన్షన్కు గురైన ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ ఎత్తివేత అంశం చర్చకు వచ్చింది. అయితే అతను ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ ఎత్తివేతకు పాలకమండలి సమావేశం నో చెప్పింది. మరో అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంవత్సరంన్నర క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.అతడిని అప్పట్లోనే యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ చేశారు. అతడి సస్పెన్షన్ ఎత్తివేతపై పాలకమండలిలో చర్చకురాగా సస్పెన్షన్ ఎత్తివేతకు నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరికి ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ పాలకమండలి సమావేశంలో కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, ఫైనాన్స్జాయింట్ సెక్రటరీ సుజాత, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి. సురేశ్లాల్, డాక్టర్ కె. అనితారెడ్డి, పుల్లూరు సుధాకర్, సుకుమారి, ఎం. నవీన్, డాక్టర్ రమ, డాక్టర్ ఎన్ సుదర్శన్, డాక్టర్ చిర్రరాజు, బాలుచౌహాన్ పాల్గొన్నారు. కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం ఇప్పుడే పదోన్నతులకు మాత్రం నో.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 15 ఎకరాలు కేటాయింపు ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ ఎత్తివేతకు ససేమిరా -
తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు
ఖిలా వరంగల్: తీర్థ యాత్రలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 23 నుంచి జూలై 01వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జూయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్యాకేజీ –1 (గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర–ఎస్సీజెడ్ బీజీ 44) యాత్రలో కాశీ (వారణాసి), అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ రాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించొచ్చు. ఈయాత్ర జూన్ 23వ తేదీన ప్రారంభమై జూలై 01వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.16,200, థర్డ్ ఏసీ ధర రూ. 26,500, 2 ఏసీ ధర రూ. 35,000 ఉంటుంది. యాత్ర రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూ బాబాద్, డోర్నకల్, ఖమ్మం మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, ప లాస, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది. ప్రయాణికులకు రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భో జనం, రాత్రి భోజనం), వాటర్ బాటిళ్లు, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శించొచ్చు. అదనపు ఖర్చులు ఏమి ఉండవు. ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయి.అలాగే, రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు ప్రయాణం పూర్తిగా ఉచితం. టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు వివరాలకు 9701360701 నంబర్లో సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొన్న బొలెరో ● మహిళ మృతి, ఇద్దరికి గాయాలు ● పాలకుర్తిలో ఘటన పాలకుర్తి టౌన్: బైక్(టీవీ ఎక్సెల్)ను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై పవన్కుమార్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన పండుగ చైతన్య(36) తనకున్న భూమిలో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం మామ సోమయ్య, కూతురు ప్రవళికతో కలిసి బైక్పై పాలకుర్తి మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి బొలెరో ఢీకొనడంతో చైతన్య అక్కడికక్కడే మృతి చెందింది. సోమయ్య, ప్రవళికకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చైతన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ తరలించినట్లు ఎస్సై పవన్కుమార్ పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, 2005లో చైతన్య భర్త కుమార్ ట్రాక్టర్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. -
నిర్లక్ష్యపు డ్రైవింగ్కు బాలకార్మికుడు బలి..
బయ్యారం: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ బాలకార్మికుడిని బలి తీసుకుంది. బాలుడిని పనిలో పెట్టుకోవడమే నేరం కాగా అలసిపోయి నిద్రిస్తున్న ఆ చిన్నారిపై నుంచి బోరువాహనం వెళ్లడంతో నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లాడు. ఈ హృదయవిధారకర ఘటన మంగళవారం మండలంలోని మిర్యాలపెంట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన ధారావత్ భాస్కర్ బోరువాహనంపై పని చేసేందుకు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా నీలవరం గ్రామానికి చెందిన కబాతి హిడ్మా(14) పదిరోజుల క్రితం మేనమామ సుక్కతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో బయ్యారం మండలంలోని మిర్యాలపెంట సమీపంలో బోరువేస్తుండగా హిడ్మా ఆ వాహనం కింద నిద్రపోయాడు. ఇది గమనించకుండా వాహన డ్రైవర్ భూక్య భాస్కర్ వెనకకు తిప్పడంతో హిడ్మా తలపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి మేనమామ సుక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. నిద్రిస్తున్న బాలుడిపై నుంచి వెళ్లిన బోరువాహనం అక్కడికక్కడే మృతి.. మిర్యాలపెంట సమీపంలో ఘటన -
దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలి
కాజీపేట రూరల్/మామునూరు/విద్యారణ్యపురి : దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమొడోర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్ ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ సైలానికి వరంగల్ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ నింబాకర్ వీరచక్ర స్వాగతం పలికారు. రెండు రాష్ట్రాల బాధ్యతలు చేపట్టిన నర్సింగ్ సైలాని గ్రూప్హెడ్క్వార్టర్లో ఎన్సీసీ క్యాడెట్స్తో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఎన్సీసీ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ రక్షణ కోసం యువత సైన్యంలో పాల్గొనేలా సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్రూప్ శిక్షణ విధానాలను పరి శీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పద్ధతులు, క్యాంప్ నిర్వహణ, పరిపాలన విధానాలు చూసి అభినందించారు. ఎకై ్సజ్కాలనీలోని ఆర్మీ మెస్కు వెళ్లి అక్కడ జవాన్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం 10వ తెలంగాణ బెటాలియన్, 1వ తెలంగాణ బెటాలియన్, 4వ ఎయిర్ ఫోర్స్ బెటాలియ న్, మామునూరు పీటీసీ క్యాంప్ను సందర్శించారు. కాగా, నర్సింగ్ సైలాని బుధవారం ఖమ్మం బెటా లియన్ను సందర్శిస్తారని గ్రూప్ కమాండర్ సచిన్ నింబాకర్ తెలిపారు. ఎన్సీసీ అధికారులు రాహుల్సింగ్, ఎస్ఎం. రియాజ్, కల్నల్ పిప్పి కిశోర్, కల్న ల్ ఎస్.ఎస్.రామదురై, విజయ్కుమార్, ‘టి’ వింగ్ కమాండర్ ఆశీష్ భాస్కర్, ‘డి’ వింగ్ కమాండర్ వి.కె.ఆర్య, కల్నల్ రవీంద్రకుమార్, లెఫ్టినెంట్ రవి సునారి, కల్నల్ సంజయ్కుమార్, కల్నల్ నవీన్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీలో రాణిస్తే భవిష్యత్.. క్రమశిక్షణ, సామాజిక సేవభావంతో ఎన్సీసీలో రాణిస్తే క్యాడెట్కు భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమొడోర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని పోలీసు శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఎన్సీసీ 8వ తెలంగాణ బెటాలియన్ వరంగల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్సీసీ శిక్షణ శిబిరం మంగళవారం పదోరోజుకు చేరుకుంది. క్యాడెట్లకు బ్యాలెన్స్ జంప్, వాల్జంప్, రన్నింగ్, డ్రిల్, మాప్రీడింగ్,ఫైరింగ్, ఆయుధ శిక్షణ ఇచ్చారు. నర్సింగ్ సైలాని ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. సమావేశంలో 8వ బెటాలియన్ కమొడర్ కల్నల్ రవీంద్రకుమార్, 615మంది క్యాడెట్లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ సైలాని వరంగల్ ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్ సందర్శన -
పత్తి రైతు అభివృద్ధికి తోడ్పాటు అందించాలి
న్యూశాయంపేట: తెలంగాణలో పత్తి రైతు అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాటన్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్కుమార్ గుప్తా, సీసీఐ మార్కెటింగ్ డైరెక్టర్ విజయసేనా, సీసీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీపాణిగ్రహి తదితరులను ముంబాయిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 40లక్షల బేళ్ల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మూడురోజుల్లో డబ్బులు చెల్లించిన నేపథ్యంలో చైర్మన్, తదితరులను సన్మానించినట్లు తెలిపారు. భవిష్యత్లో కూడా ఇదే విధంగా సహకరించాలని ఆయన కోరారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కేయూ క్యాంపస్: టీజీఈసెట్ అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం రెహమాన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంనిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూనియర్ కళాశాల, పాఠశాలల హద్దులు గుర్తించాలన్నారు. ఈ ఏడాది పదో వతరగతి ఫలితాల్లో మానుకోట జిల్లాను మొదటిస్థానంలో నిలిపారని, అదే ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మినరల్ వాటర్ మధ్యాహ్న భోజన సమయంలో అందుబాటులో ఉంచాలన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖలీల్పాషా, శ్యామ్, సురేష్, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, కళాశాల, పాఠశాలల ప్రిన్సిపాళ్లు పొక్కుల సదానందం, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఇందిరమ్మ ఇళ్లు, విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సీజనల్వ్యాధులు, శానిటేషన్పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేన్, గ్రౌండింగ్, ప్రొసీడింగ్ కాపీల మంజూరు 90శాతం పూర్తియిందన్నారు. దశల వారీగా ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. ఈనెల 30వరకు జిల్లాలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు,. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఆర్డీఓ మధుసూదన్, డీఈఓ రవీందర్రెడ్డి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నర్సింహాస్వామి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఏఓ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సంరద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం కాని యెల కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రజావాణిలో 97వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు మధుసూదన్రాజ్, హరిప్రసాద్, మరియన్న, నరసింహాస్వామి, సురేష్, శ్రీనివాస్, రజిత, సత్యనారాయణ, రవీందర్రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● మానుకోట పట్టణానికి చెందిన ఏలేంద్ర, గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామానికి చెందిన జ్యోతి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయా లని ప్రజావాణిలో దరఖాస్తులు అందించారు. ● నెల్లికుదురు మండలం నర్సింహులడూడెం గ్రామానికి చెందిన రైతులు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు గుండ్లపది చెరువు తూము తెగి తమ పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయని, తూము నిర్మాణం చేపట్టాలని ప్రజావాణిలో వినతి అందజేశారు. ● అమనగల్ గ్రామ శివారు గుండాలగడ్డతండాలో తాగునీటి కోసం చేతిపంపు, డ్రెయినేజీ ఏర్పాటు చేశామని, అయితే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పలువురు గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
వానాకాలం అరిగోస
చిన్నగూడూరు: ఏటా వానాకాలంలో మండల కేంద్రానికి పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. మండలంలోని పగిడిపల్లి, గుండంరాజుపల్లి గ్రామాల నుంచి చిన్నగూడూరు మధ్య జిన్నెలవాగు ప్రవహిస్తోంది. వర్షం కురిసి వాగులో వరద పారితే ఆ రెండు గ్రామాల ప్రజల రాకపోకలు నిలి చిపోయి ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా పాలకులకు విన్నవిస్తూనే ఉన్నామని ఎవరూ స్పందించ డం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మె ల్యే రాంచంద్రునాయక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాగుపై వంతెన నిర్మించేలా కృషి చేయాలని కోరుతున్నారు. దూర, వ్యయ భారం.. వర్షం వస్తే జిన్నెలవాగు దాటనీయని పరిస్థితి. ఆయా గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం ఉంది. అయితే వాగు ప్రవహించినప్పుడు మహబూబాబాద్ మండలంలోని కొత్తూరు, జంగిలిగొండ గ్రామాల మీదుగా మండల కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు తెలుపుతున్నారు. దూరం పెరగడంతో వాహనాలను కిరాయి తీసుకొని ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో వ్యయభారం అవుందని ఇరు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వంతెన నిర్మిస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని వారు వేడుకుంటున్నారు. జిన్నెలవాగు ప్రవహిస్తే మండల కేంద్రానికి రాకపోకలు బంద్ ఏటా రెండు గ్రామాల ప్రజలకు తిప్పలు బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు -
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuడిప్యుటేషన్ వైద్యులతో గార్ల సీహెచ్సీలో అరకొర వైద్యం ● విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో రోగుల ఇబ్బందులు ● రాత్రి సమయంలో ఉండని డాక్టర్లు ● పట్టించుకోని ఉన్నతాధికారులు ● నిరుపయోగంగా అత్యాధునిక పరికరాలుగార్ల: గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను సకల సౌకర్యాలతో నిర్మించారు. అయితే డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. గత సర్కారు హయాంలో రూ.5కోట్లు వెచ్చించి 30 పడకల ఆస్పత్రిని నిర్మించారు. నాటి నుంచి వైద్యులు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. వారానికి రెండు రోజులు మాత్ర మే విధులు హాజరవుతున్నారు. అదికూడా ఒకపూట మాత్రమే వచ్చి వెళ్తున్నారు. రాత్రి సమయంలో అత్యవసర వైద్యచికిత్స కోసం ఎవరైనా వస్తే విధుల్లో ఒక్క డాక్టర్ ఉండడం లేదు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. గతేడాది.. గత ఏడాది స్పెషలిస్ట్ వైద్యులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడంతో డాక్టర్లు అంతా వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. ఆన్లైన్లో గార్ల ఆస్పత్రి పేరు లేకపోవడంతో ఇక్కడికి ఎవరూ రాలేదు. పలుమార్లు దిన పత్రికల్లో వరుస కథనాలు రావడం, అఖిలపక్ష నాయకుల ఆందోళనలు చేపట్టడంతో కలెక్టర్, డీసీహెచ్ఎస్ స్పందించి తొర్రూరు, గూడూ రు ఆస్పత్రుల నుంచి డిప్యుటేషన్పై నలుగురు డాక్లర్లును ఇక్కడికి రప్పించారు. డిప్యుటేషన్పై విధుల్లో చేరిన డాక్టర్లలో ఒకరు లాంగ్లీవ్ పెట్టగా, మరో ముగ్గురు షిఫ్ట్ పద్ధతిలో వారానికి రెండు రోజులు మాత్రమే వచ్చి, ఒక పూట విధులు నిర్వహించి వెళ్తున్నారు. అత్యాధునిక పరికరాలు.. నిరుపయోగం ఆస్పత్రిలో ఎక్స్రే గది, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్, వెంటిలేటర్ బాక్స్లు, ఫొటోథెరఫీ బాక్స్, స్టెరిలైజేషన్ మిషన్, ఆక్సీకాన్సన్ట్రేటర్లు, తదితర వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు. అవి నిరుపయోగంగా మారాయి. కాగా వైద్యులను నియమించడంలో పాలకులు, అధికారులు వైఫల్య ం చెందారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారులు స్పందించి గార్ల సీహెచ్సీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి రెగ్యులర్ వైద్యులను నియమించి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. నిరుపయోగంగా వైద్య పరికరాలున్యూస్రీల్ -
ప్రాణం తీసిన భూ వివాదం
● రెండు గుంటల భూమే కారణం... ● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య ● చిట్యాలలో ఘటన చిట్యాల: భూ వివాదం ప్రాణం తీసింది. రెండుగుంటల భూమి కోసం కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవతో మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్కూరి మధునమ్మ(65)కు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా కొంత భూమి వచ్చింది. ఇందులో రెండు గుంటల భూమిని తన అన్న కుమారుడి(మేనల్లుడు)కి ఇవ్వాలని తన కుమారులు రమేశ్, శ్రీనివాస్ను కోరింది. ఈ విషయంపై వారు అంగీకరించకపోవడంతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగింది. అయినా కుమారులు వినడం లేదు. దీనిపై మనస్తాపం చెందిన మధునమ్మ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి హుటహుటిన పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి మృతి చెందింది. కాగా, మధునమ్మ మృతికి కారణమైన కుమారులపై కేసు నమోదు చేయాలని ఆస్పత్రి ఆవరణలో కాలనీ వాసులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మధునమ్మ మృతిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుమార్తె రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రవణ్కుమార్ సోమవారం తెలిపారు. -
మేకను కొనేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని బయ్యారం మండలం జగత్ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బస్సును ఢీకొన్న ఆటో.. మహిళ దుర్మరణం భజన తండా సమీపంలో ఘటన -
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు అని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అందులో వెరిఫికేషన్ పూర్తయిన 1,659 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సోమవారం వరంగల్ ఓసిటీ లోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మిగతా లబ్ధిదారులకు త్వరలో అందచేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూంలకు బదులు ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మాయ మాటలు చెప్పి పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిరుపేద రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్కు నిధులు అధికంగా విడుదల చేసి, తెలంగాణపై వివక్ష చూపించారని విమర్శించారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, నోడల్ అధికారి రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో క్యాంపు ఆఫీస్ కిక్కిరిసింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిట్స్తో కింద పడిపోగా సల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తొలి విడతలో 1,659 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగులు బాఽధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈ (టెక్నికల్), సేఫ్టీ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు గుర్తించి మార్చాలన్నారు. తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచాలని, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ లైన్లను గుర్తించి మార్చాలన్నా రు. ఈ మేరకు కార్యాచరణ రూ పొందించుకోవాలన్నారు. అధి కారులు తమ సర్కిళ్ల పరిధిలో నిరంతరం అప్రమతంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాల నివా రణపై విస్తృత ప్రచారం కల్పించి వినియోగదారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. రైతులు స్వయంగా విద్యుత్ సంబంధ పనులు చేయొద్దని, అవసరమైతే 1912కు ఫోన్ చేయాలన్నారు. వీడియో కాన్ఫ రెన్స్లో చీఫ్ ఇంజనీర్లు, రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఆదర్శం.. కల్వల ప్రాథమిక పాఠశాల
● మూడు రోజుల్లో 65 అడ్మిషన్లు కేసముద్రం: విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్న క్రమంలో మండలంలోని కల్వల ప్రాథమిక పాఠశాల కేవలం మూడు రోజుల్లోనే 65 అడ్మిషన్లు సాధించి ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కల్వల ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులుండగా ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో సోమవారం నాటికి 65 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఫలితంగా ఆ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 127కి చేరింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్, వీఆర్ఏ మహేశ్, నవోదయ గెస్ట్ లెక్చరర్ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ యాదగిరి, హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతామని, అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. -
మొక్కుబడిగా భూ భారతి సదస్సులు
తొర్రూరు: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో స్థానికంగా రూపొందించిన షెడ్యూల్ ఆధారంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయాలు ఇష్టానుసారంగా షెడ్యూల్ రూపొందించాయి. సమస్యలు అధికంగా ఉండే మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో రెవెన్యూ సదస్సును కేవలం ఒక్క రోజులోనే ముగిస్తున్నారు. సదస్సుల నిర్వహణపై సమాచారం లేని అనేకమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒక రెవెన్యూ గ్రామం పరిధిలో మూడు, నాలుగు గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామం ఉన్నచోటే ఇతర గ్రామాల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రజలు రెవెన్యూ గ్రామానికి వచ్చి దరఖాస్తులు అందజేస్తున్నారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం.. భూ భారతి సదస్సుల కారణంగా దాదాపు 8 ఏళ్ల తర్వాత గ్రామాలకు బృందాలు వస్తున్నాయి. అధికారులు తమ చెంతకే వస్తుంటే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ, సదస్సుల సమాచారం మాత్రం వారికి చేరడంలేదు. గ్రామాల్లో చాటింపు, వాట్సాప్ ద్వారా సమాచారం పంపించామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గ్రామాల్లో వ్యవసాయాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు సదస్సుల గురించి చెప్పడంలో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ నెల రోజుల నుంచి సన్నద్ధం చేసినప్పటికీ వీరు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మిగిలింది నాలుగు రోజులే.. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3న ప్రారంభమైన సదస్సులు 20వ తేదీతో ముగియనున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం అని చెప్పినప్పటికీ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. సదస్సులు పూర్తయిన తర్వాత దరఖాస్తుల విభజన చేయనున్నారు. ఇవే బృందాలు మళ్లీ ఆయా గ్రామాల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో మరోమారు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2 మండలాలు 18 రెవెన్యూ గ్రామాలు 288 ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 6,546 ఒక్క రోజులోనే ముగిస్తున్న అధికారులు సమాచారం లేక దరఖాస్తులు ఇవ్వలేకపోతున్న రైతులు -
సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు కష్టమైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఏ వర్గాలైతే అండగా నిలబడ్డాయో వారందరినీ కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్టీలో కొత్త, పాత కలయికలతో ఇబ్బందులు వస్తున్నాయని, ఆ అంశాల గురించి పార్టీ పరంగా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపా రు. మంత్రివర్గ విస్తరణలో సముచిత న్యాయం కోసం ఎస్సీలోని మాదిగ, మాల వర్గాల వారికి ఏ విధంగా అవకాశం కల్పించారో, అదేవిధంగా ఎస్టీలోని ఆదివాసీలకు అవకాశం కల్పించిన విధంగా లంబాడీలకు అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్నయాదవ్, నాయకులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పద్మజ, గుగులోత్ వెంకట్ నాయక్, తోట వెంకన్న, గొల్లపల్లి ప్రభాకర్, చెన్నసీతారాములు, లకావత్ పద్మాబాయి, గుగులోత్ దేవి, భూక్య లక్ష్మి, సంపంగి రామచంద్రు, ముంజాల రాజేందర్ గౌడ్, బానోత్ ప్రసాద్, కొత్త యుగంధర్, మేకల శివ, గాడిపల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ -
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి, నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆర్థో విభాగం అసో సియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేశవ్, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్ డి.నాగలక్ష్మి, హైదరాబాద్ ఆర్హెచ్ఎఫ్ డబ్ల్యూటీసీ కార్యాలయ పర్యవేక్షకుడు ఎండి. ఫయాజ్, మహబూబాబాద్ ప్రభుత్వ న ర్సింగ్ కళాశాల పరిపాలన అధికారి బి.శ్రీనివాస్ను డిప్యుటేషన్పై కాళోజీ నారాయ ణరావు హెల్త్ యూనివర్సిటీకి కేటాయించారు. ఏడాది కాలం పాటు హెల్త్ యూనివర్సిటీలో విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నమిలిగొండలో విషాదఛాయలు
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి నమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు. గ్రామానికి చెందిన ప్రేమజంట భువనగిరిలో ఆత్మహత్యరోదిస్తున్న శృతి తల్లి, కుటుంబ సభ్యులు -
ఓసీ–3లో నిలిచిన పనులు
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి శివారు ఓసీ–3 ప్రాజెక్టులో బొగ్గు తవ్వకం పనులు సోమవారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచి పూర్తిగా నిలిచాయి. ఓసీ–3 గనిలో తవ్వకం పనులు చేపట్టిన ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కంపెనీకి సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో పనులు కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. సుమారు రూ.4 కోట్ల వరకు సింగరేణి సంస్థ ఎస్వీఎస్ కంపెనీకి చెల్లించాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు చెల్లించక పోవడంతో బొగ్గు, మట్టి తవ్వకం పనులు నిలిపి వేశారు. డబ్బులు చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని కంపెనీ యంత్రాలు, లారీలను ఎక్కడిక్కడే నిలిపి వేసింది. రోజుకు 3వేల టన్నుల బొగ్గు, 4వేల టన్నుల మట్టి తవ్వకం పనులు నిలిచి పోవడంతో సింగరేణి సంస్థ భారీగా నష్టపోతుంది. సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించలేదని పనులు నిలిపిన కంపెనీ -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను సోమవారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించారు. జిల్లాలో నూతనంగా 36 రైతు వేదికల్లో రైతు నేస్తాలను ప్రారంభించారు. వీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామ శివారు చంద్రుతండాకు చెందిన మహిళా రైతు అజ్మీరా ద్వాలీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆమె సాగు చేస్తున్న పంటల వివరాలు, రైతు రుణమాఫీ జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్వాలీ మాట్లాడుతూ.. తనకు రూ.1,65,509 రైతు రుణమాఫీ అయిందని, రైతు భరోసా కింద రూ.12 వేలు తన ఖాతాలో జమ అయ్యాయని తెలిపింది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని, ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వానికి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. రైతు వేదిక నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల, జిల్లా హార్టికల్చర్ అధికారి జి.మరియన్న, ఏఓ ఎన్.తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఆయిల్ఫామ్ అడ్వైజరీ మెంబర్ వల్లూరి కృష్ణారెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, రైతులు సత్తిరెడ్డి, రవి, బుచ్చిరెడ్డి, ఏఈఓలు పూజిత, సాయి ప్రకాశ్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రైతు ద్వాలీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతు నేస్తం వీసీల ప్రారంభం -
నిందితులను కఠినంగా శిక్షించాలి
● మృతుడి కుటుంబీకుల డిమాండ్ ● కుమారస్వామి మృతదేహంతో ఆర్టీఏ జంక్షన్ వద్ద ఆందోళన ఖిలా వరంగల్: తన భూమిని కబ్జా చేశారంటూ వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలెపాక కుమారస్వామి(55) మనస్తాపంతో ఈనెల 9వ తేదీన శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్లో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందగా.. సోమవారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్ వద్ద కుమారస్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. కబ్జాకు పాల్పడిన బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల మల్లేశంను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన మామునూరు, మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. భార్యపై బెంగతో యువకుడి ఆత్మహత్య ● ఎల్కతుర్తిలో ఘటన ● మృతుడు రాజస్థాన్ వాసి ఎల్కతుర్తి: ఏడు నెల గర్భవతి అయిన తన భార్యను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననే (సపర్యలు) బెంగతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని జై బాలాజీ స్టోన్స్లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. రాజస్థాన్లోని గోగవస్ సికర్ జిల్లాకు చెందిన రాజేంద్రకుమార్ జాకర్ (21) రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వచ్చి జై బాలాజీ స్టోన్స్లో హెల్పర్గా పనిచేస్తున్నాడు. తన భార్య 7నెలల గర్భవతి. ఈ సమయంలో తన దగ్గరుండి చూసుకోలేకపోతున్నానని కొన్ని రోజు లుగా స్నేహితులతో చెప్పుకుని మదనపడేవాడు. ఈ విషయంపై మనస్తాపం చెందిన రాజేంద్రకుమార్ జాకర్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధులవుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. అప్పుల బాధతో వ్యాపారి.. ఎస్ఎస్తాడ్వాయి : అప్పుల బాధతో ఓ గాజుల వ్యాపారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్రెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్కు చెందిన పిల్లి సత్యం(50), జ్యోతి దంపతులు 12 సంవత్సరాల నుంచి మేడారంలో గాజుల దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సత్యం వ్యాపారం కోసం రూ. 10 లక్షల అప్పు చేశాడు. వ్యాపారం సరిగా నడవకపోవడంతోపాటు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. ఈక్రమంలో సోమవారం దుకాణం వెనుక రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
కేయూలో ఎన్నికల సందడి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎన్జీఓ, క్లాస్ ఫోర్త్ అసోసియేషన్ల ఎన్నికల సందడి నెలకొంది. ఉద్యోగుల ప్రచారంతో క్యాంపస్ సందడిగా మారుతోంది. బరిలో ఉన్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివిధ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తమకు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. కేయూ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బి. నవీన్కుమార్, జి. నిరంజన్ పోటీపడుతుండగా వైస్ ప్రెసిడెంట్గా ఎండి. యూనస్, పి. భాస్కర్, జనరల్ సెక్రటరీ పదవికి వల్లాల తిరుపతి, సయ్యద్ అక్రం అహ్మద్, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (జనరల్)కు ఎ. సతీశ్బాబు, బి. రాజు పోటీపడుతున్నారు. జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (ఉమెన్) బి. కృష్ణవేణి, గౌసియాబేగం, సిహెచ్. దేవమ్మ, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (రిక్రియేషన్ )జి. మధుకర్, టి. ప్రభాకర్, పి. సుశీల్, ట్రెజరరీగా సిహెచ్. ప్రవీణ్కుమార్, టి. దామోదర్ పోటీపడుతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్జీఓ కేటగిరీలోని ఉద్యోగులను కలిసి ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేగాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. 222 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్.. కాకతీయ యూనివర్సిటీ క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ ఎ న్నికల్లో వివిధ పదవులకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో నిలి చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్ష పదవికి పి. గుమ్మయ్య, ఎండి. నిజాముద్దీన్ పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (జనరల్ ) ఎండి. వలిపాషా, టి. రాజేశ్వర్, జాయింట్సెక్రట రీ ఆర్గనైజేషన్ (రిక్రియేషన్) ఎన్. ఐలయ్య, పి. వే ణు, ట్రెజరరీ పదవికి టి. తరుమల్శ్రీనివాస్సింగ్, పి. రామనాథం పోటీ పడుతున్నారు. 79 మంది ఉ ద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఈ రెండు అసోసియేషన్లకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఈనెల 20న 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు.ఈనెల 21న 11గంటలకు ఓట్ల లెక్కింపు ప్ర క్రియ ప్రారంభించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తా రు. ఈ అసోసియేషన్ల ఎన్నికల ప్రక్రియకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ వ్యవహరిస్తున్నారు.ముగ్గురు ఏకగ్రీవం క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి ఒక్కరే నామినేషన్ వే సిన మొగిలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అంకూస్, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (ఉమెన్) మల్లికాంబ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్జీఓ, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఎన్నికలు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ బరిలో నిలిచిన వారు పోటాపోటీ ప్రచారం క్లాస్ ఫోర్త్లో ముగ్గురు ఏకగ్రీవం -
ఆయుర్వేదం మన సంపద
జనగామ: మన ఆయుర్వేద వైద్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతోపాటు భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరి షత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులుగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్టేట్ లెవల్ ఆయుర్వేద కౌశలం–2025 సదస్సు ఆదివా రం ముగిసింది. వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం దేశ సంపద అన్నారు. నిత్య జీవితంలో ఆయుర్వేదాన్ని అనుసరిస్తూ, కాపాడుకోవాల్సిన బాధ్యత మ నపై ఉందన్నారు. గౌరవ అతిథి కల్నల్ మాచర్ల భిక్షపతి మాట్లాడుతూ వైజ్ఞానిక విశిష్టత, ప్రాచీన జ్ఞానం ఆధారంగా రోగ నివారణ సామర్థ్యాన్ని విశదీకరించారు. డాక్టర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఆరో గ్య పరిరక్షణలో ఆయుర్వేద వైద్యం ముఖ్యమో ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. డాక్టర్ ప్రీతి ద యాల్.. పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోనల్ అసమతుల్యత గురించి వివరించారు. డాక్టర్ శరద్ కుమార్.. ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రస్తుత కాలా నికి అనుగుణంగా ఎలా ఉపయోగించాలో అనే అంశంపై అవగాహన కల్పించారు. డెలిగేట్స్ ఐశ్వర్య, ఆదిలక్ష్మి ఆయుర్వేద కౌశలంలో నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్ను చూసిన తర్వాత తాము ఎంతో ప్రేరణ పొందామన్నారు. అనంతరం డీసీపీ చేతుల మీదుగా వైద్య విద్యార్థులు, అతిథులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎల్.కె.విరాజిత, సురేశ్ జకోత్యా, పూలే అనిల్, ఆర్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముగిసిన స్టేట్ లెవల్ ఆయుర్వేద కౌశలం–2025 సదస్సు -
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చతుస్థానార్చన, పూర్ణాహుతి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారి, అమ్మవార్ల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మహిళల కోలాటం, మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, బండారు వెంకన్న, రావుల మురళి, తరాల వీరేష్, ఆలయ కమిటీ సభ్యులు వోలం మురళి, క్రిష్ణమూర్తి, రాజు, బచ్చు పరమేశ్వర్, బాణాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్ని సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని, అధికంగా ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా నడిపిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను రద్దు చేయాలన్నారు. విచ్చలవిడిగా బుక్స్, టై, బెల్ట్, స్కూల్ యూనిఫాం పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన పీడీఎస్యూ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి మధు, జిల్లా కోశాధికారి మునగాల మహేశ్, జిల్లా నాయకులు యువరాజ్, గణేశ్, జయంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీకి అవార్డు వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. శ్రీరాం అష్టావధానం విజయవంతం విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో తె అక్షర ముష్టికా కథనం అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని చెన్నూరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరమణపట్వర్దన్, శతాశధాని మురళి అభినందించారు. ఈ అవధానానికి సహృదయ సాహితి అధ్యక్షుడు గిరిజా మనోహర్బాబు, దహగం సంబమూర్తి, సభ్య అధ్యక్షుడిగా విశ్రాంత డీఈఓ నున్నపురాజు రమేశ్వర్రాజు వ్యవరించారు. అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్దంకి బాబు పాల్గొన్నారు. -
చినుకు జాడేది!
సాక్షి, మహబూబాబాద్: తొలకరి వర్షాలతో రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకున్నారు. అయితే తొలకరి తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా పదును లేకుండా విత్తనాలు వేయవద్దని, మంచి వర్షం కురిసిన తర్వాతనే నాటుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దుక్కులు దున్ని.. జిల్లాలో వర్షం పడితే విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధం ఉన్నారు. గత ఏడాది జిల్లాలో అన్ని పంటలు కలిపి 4,29,790ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయకగా ఇందులో 83,357 ఎకరాల్లో పత్తి, 2,19,143 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు వేశారు. అయితే గత ఏడాది జూన్ మొదటి వారంలోనే పలుచోట్ల పత్తి విత్తనాలు నాటారు. ఈ ఏడాది వరి 2,21,282 ఎకరాలు, పత్తి 84,854 ఎకరాలు, మొక్కజొన్న 58,361ఎకరాలు, మిర్చి 52,249 ఎకరాలు మొత్తం 4,22,641 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశా రు. మే నెలలో కురిసిన వర్షాలకు భూమి పదును వచ్చింది. దీంతో దుక్కులు దున్నుకున్నారు. పలుచోట్ల పచ్చిరొట్ట జీలుగు, పెసర, జనుము విత్తనాలు చల్లారు. పత్తి, మొక్కజొన్న పంటలు వేసేందుకు విత్తనాలు కొనుగోలు చేసి ఉంచారు. అదను దాటిపోతుందని ఆందోళన ప్రతీ పంట కార్తెల ప్రకారం వేస్తేనే మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. రోహిణి, మృగశిర కార్తెల్లో వరి నార్లు పోయడం, జూన్ మొదటి వారంలో పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేయడం ఆనవాయి తీ. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆశించి స్థాయిలో వానలు పడలేదు. అదే విధంగా ప్రధాన నీటి వనరులైన 154 చె రువులు తెగిపోయి కట్టలు పోయకుండా ఉన్నాయి. చెక్డ్యామ్లు తెగి నీళ్లు లేకుండా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో వర్షాలు లేకుండా బావులు, బోర్లు, చెరువులపై వ్యవసాయం చేసే పరిస్థితి సన్నగిల్లింది. వర్షం పడితేనే విత్తనాలు వేస్తారు. జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో) జిల్లాలో రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలు తొలకరి వర్షాలతో దుక్కులు సిద్ధం చేసిన రైతులు మళ్లీ వర్షం కురిస్తేనే విత్తనాలు వేసేది.. నాటిన విత్తనాలు మొలకెత్తక రైతన్నల ఆందోళన పదును లేకుండా విత్తనం వేయొద్దంటున్న అధికారులు జిల్లాలో 13వతేదీ వర్షపాతం నెల్లికుదురు 8.8 నర్సింహులపేట 3.4 దంతాలపల్లి 5.8 తొర్రూరు 4.2 పెద్దవంగర 2.6 మొత్తం 24.8 జిల్లా సరాసరి వర్షపాతం 1.6(మి.మీ) జిల్లాలో 14వతేదీ వర్షపాతం మండలం వర్షపాతం కొత్తగూడ 8.2 గంగారం 8.2 నర్సింహులపేట 4.6 దంతాలపల్లి 2.6 మొత్తం 23.6 జిల్లా సరాసరి వర్షపాతం 1.5(మి.మీ)30 క్వింటాళ్ల పెసర 45వేల ప్యాకెట్ల పత్తి 260 క్వింటాళ్ల వరి 40 కిలోల మిర్చి గింజలు 120 క్వింటాళ్ల మొక్కజొన్న -
మరిన్ని ‘రైతు నేస్తాలు’
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల్లో రైతు నేస్తాల పేరిట వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ, ఉద్యాన, ఆయా శాఖల అనుబంధ పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యవసాయశాఖకు 16 వీసీ యూనిట్లను మంజూరు చేయగా వాటి ద్వారా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సేవలు అందిస్తున్నారు. కాగా మరో 36 వీసీ యూనిట్లను మంజూరు చేయగా నేడు ప్రారంభించనున్నారు. సలహాలు, సూచనలు.. హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సాగు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సాధించాల్సిన దిగుబడులపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సీజన్ల వారీగా రైతులు ఏయే పంటలు ఏ విధంగా సాగు చేయాలనే అంశాలు, వినియోగించాల్సిన పురుగు మందులు, ఎరువులు, సేంద్రియ సాగుపై శిక్షణ ఇస్తూ రైతులు పంటల సాగులో అవలంబించాల్సిన అధునాతన సాంకేతిక పద్ధతులపై వివరిస్తున్నారు. నేడు 36 రైతు నేస్తాలు ప్రారంభం.. జిల్లాలో 82 రైతు వేదికలు ఉండగా ప్రస్తుతం 16 రైతు వేదికల్లో వీసీ యూనిట్లు ఉండగా.. మరో 36 రైతు వేదికల్లో రైతు నేస్తాల యూనిట్లను సోమవారం ప్రారంభిస్తారని డీఏఓ ఎం.విజయలక్ష్మి తెలిపారు. సీరోలు మండల పరిధిలో కాంపల్లి, తాళ్లసంకీస, మన్నెగూడెం, బయ్యారం మండల పరిధిలో బయ్యారం, రామచంద్రాపురం, ఇనుగుర్తి మండలం పరిధిలో ఇనుగుర్తి, చిన్నముప్పారం, పెద్దవంగర మండలం పరిధిలో అవుతాపురం, చిట్యాల, గార్ల మండల పరిధిలో ముల్కనూరు, పోచారం, నెల్లికుదురు మండలం పరిధిలో ఆలేరు, మునిగలవీడు, గంగారం మండల పరిధిలో కోమట్లగూడెం, మర్రిగూడెం, నర్సింహులపేట మండలం పరిధిలో పెద్దనాగారం, కౌసల్యదేవిపల్లి, మరిపెడ మండల పరిధిలో ధర్మారం, చిల్లంచర్ల, కొత్తగూడ మండల పరిధిలో పొగుల్లపల్లి, బత్తులపల్లి, దంతాలపల్లి మండల పరిధిలో పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, కేసముద్రం మండల పరిధిలో పెనుగొండ, ఉప్పరపల్లి, మహబూబాబాద్ మండలం పరిధిలో మల్యాల, జంగిలిగొండ, గూడూరు మండలం పరిధిలో గూడూరు, మర్రిగూడెం, తొర్రూరు మండలం పరిధిలో వెలికట్టె, తొర్రూరు, చిన్నగూడూరు మండలం పరిధిలో జయ్యారం, కురవి మండల పరిధిలో కురవి, బలపాల, డోర్నకల్ మండల పరిధిలో గొల్లచర్ల, డోర్నకల్ రైతు వేదికల్లో నూతనంగా వీసీ యూనిట్లు ఏర్పాటు చేశారు. రైతులతో ముచ్చటించనున్న సీఎం.. మూడో దశలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రారంభించి రైతులతో ముచ్చటిస్తారు. సోమవారం సాయంత్రం 3గంటలకు జిల్లాలోని 52 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు గల రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు అధిక సంఖ్యలో పాల్గొనాలని డీఏఓ విజయనిర్మల కోరారు. జిల్లాలో నేడు 36 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ప్రారంభం -
కలెక్టర్ ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు
కాజీపేట: వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతోపాటు ఈ ప్రాంత పరిచయాలు మరచిపోలేనివని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో ఆదివారం రాత్రి అన్ని శాఖల అధికారులు సంగారెడ్డి కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు.. కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి. గణేశ్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, డాక్టర్ నారాయణ, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, తహసీల్దార్ బావుసింగ్ పాల్గొన్నారు. ముగిసిన చెస్ పోటీలు ● బాలురలో అభివన్రెడ్డి, బాలికల్లో శ్రీలాస్యకు ప్రథమ స్థానం వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–13 బాలబాలికల చెస్ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుంచి 65 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. బాలుర విభాగంలో అభినవ్రెడ్డి ప్రథమ స్థానం, సాయిజోషిత్ బొల్లం ద్వితీయస్థా నం, అల్లాడి శ్రీవాట్సన్ తృతీయ స్థానం, శ్రీసాయి ప్రీతం కనకాల నాల్గవ స్థానం సాధించారు. అలాగే, బాలికల విభాగంలో శ్రీలాస్య బోనాల, కంభంపాటి అస్మిత, పెండ్రు సాన్విక, కై రంకొండ సహస్క వరుస నాలుగు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మంది క్రీడాకారులు జూలైలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు శ్రీనివాస్, ప్రేమ్సాగర్ పాల్గొన్నారు. ఆటో, బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు గూడూరు: ఆటో ద్విచక్రవాహనం, ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలంలోని మానుకోట వైపు దామరవంచ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఏపూరుకు చెందిన బానోత్ తరుణ్, జాటోత్ హేమంత్, ధారావత్ యశ్వంత్ కలిసి ద్విచక్రవాహనంపై మానుకోట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దామరవంచ క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 108లో గూడూరులో ప్రథమ చికిత్స అనంతరం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం కాజీపేట రూరల్: కాజీపేట జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలోని హసన్పర్తి రైల్వే యార్డు సమీపంలో రై లు ఢీకొని మతిస్థిమితం లేని వృద్ధుడు ఆదివారం దుర్మరణం చెందాడు. కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేష్కుమార్ కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామం వినాయక వీధికి చెందిన కలవచర్ల రాజేంద్రం (76) ఆరు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఆదివారం రైలు పట్టాల వైపు వెళ్లడంతో ఉప్పల్రైల్వే స్టేషన్ వైపు వెళ్లే రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు సీఐ వివరించారు. -
ఎలుకలు ఎంత పని చేసే..
చిల్పూరు: ఎలుకలు ఎంత పని చేశాయి.. పల్లెంలో ఉన్న దీపం, పండ్లను ఇంటి చూరులోకి తీసుకెళ్లాయి. దీంతో దీపం అంటుకుని ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం మండలంలోని కృష్ణాజీగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన సాదం చంద్రమ్మ పెంకుటింట్లో నివాసం ఉంటోంది. రోజు మాదిరి గానే ఉదయం దేవుడికి దీపం పెట్టి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో దీపం పళ్లెంలో పండ్లు ఉండడంతో ఎలుకలు వాటిని తీసుకుని ఇంటి చూరులోకి వెళ్లాయి. పంట్లతో పాటు వెలిగించిన దీపం కూడా ఉండడంతో పెంకులు అమర్చిన వెదురు కర్రలకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ. 26 వేల నగదు, బియ్యం, ఇతర వస్తువులు కాలి బూడిద కావడంతో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు లబోదిబోమంది. నిరుపేద చంద్రమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పల్లెంలో ఉన్న దీపం, పండ్లను ఇంటి చూరులోకి తీసుకెళ్లిన మూషికాలు దీపం అంటుకుని దగ్ధమైన ఇల్లు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం -
రెండు బైక్లు ఢీ..
● ఒకరి మృతి.. తొర్రూరులో ఘటన తొర్రూరు: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. తొర్రూరుకు చెందిన సర్వి రమేశ్ (42) తొర్రూరు ఎంఈఓ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన వ్యక్తి గత పనుల నిమిత్తం తొర్రూరు బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో అన్నారం రోడ్డుపై జఫర్గఢ్ మండలానికి చెందిన జువారి బన్ని తన బైక్తో ఎదురుగా ఢీకొన్నాడు. దీంతో రమేశ్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి వెంటనే వరంగల్ తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతో ంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. 2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 జేఎస్.భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780 -
జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీ ఎన్నిక
కాజీపేట రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లు దర్గా కాజీపేటకు చెందిన చర్లపల్లి జైలు రిటైర్డ్ సూపరింటెండెంట్ జి.సమ్మయ్య తెలిపారు. హనుమకొండలో జైళ్లశాఖ విశ్రాంత ఉద్యోగులు సమావేశమై కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా జి.సమ్మయ్య, ప్రెసిడెంట్గా సిహెచ్.రాధాకృష్ణ, సెక్రటరీగా ఎన్.సమ్మయ్య, ట్రెజరర్గా కె.నర్సయ్య, కార్యదర్శులుగా ఎం.రవీందర్, ఎ.యాదగిరి, టి.ప్రకాశ్, సిహెచ్.గణపతి, మహిళా కార్యదర్శిగా జె.ప్రభావతి, లీగల్ అడ్వైజర్గా కె.నర్సింహాస్వామిని ఎన్నుకున్నారు. బస్టాండ్ షాపుల యజమానులకు కౌన్సెలింగ్ వరంగల్ క్రైం: హనుమకొండ బస్టాండ్, పరిసర ప్రాంతాల షాపుల, లాడ్జిల యజమానులకు హనుమకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి 10.30 గంటల తర్వాత షాపులు నిర్వహించొద్దన్నారు. లాడ్డిలలో ఉండే వ్యక్తుల వివరాలు, ఆధార్, ఫోన్ నంబర్ తీసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తండ్రీకొడుకుల విగ్రహాలు ఆవిష్కరణ
డోర్నకల్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకొడుకుల విగ్రహాలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆవిష్కరించారు. మండలంలోని దుబ్బతండాకు చెందిన అజ్మీరా బాల్యాతో పాటు కుమారుడు సాయికుమార్ ఈ నెల 5న ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. వారి జ్ఞాపకార్థం బాల్యా సతీమణి భారతితో పాటు కుటుంబ సభ్యులు దుబ్బతండాలో ఏర్పాటు చేసిన తండ్రీకొడుకుల విగ్రహాలను రెడ్యానాయక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డోర్నకల్ పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ ఎంపీపీ ధరంసోత్ బాలునాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్, నాయకులు రాయల వెంకటేశ్వర్రావు, నంజాల మధు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాహితను ఇంటినుంచి వెళ్లగొట్టిన కుటుంబీకులు..
బచ్చన్నపేట: వారు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఇదే అదునుగా భావించిన కుటుంబీకులు ఆ వివాహితను కులం, వరకట్నం పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని తమ్మడపల్లిలో జరిగింది. బాధితురాలు శ్రావణి అలియాస్ నైనిక కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేజాడి మంజుల, మల్లేశం దంపతుల కుమారుడు కరుణాకర్, అదే గ్రామానికి చెందిన పోగుల విజయలక్ష్మి, నర్సింహులు దంపతుల కూతురు శ్రావణి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలను ఎదురించి ఎనిమిది నెలల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. అనంతరం మండలంలోని కొడవటూరులోని సిద్ధేశ్వరాలయ వద్ద మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో కూడా మాట్లాడుకున్నారు. ఇంతలోనే మరోసారి కులం, వరకట్నం పేరుతో విడిపోదామని ఒత్తిడి తేవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణిని కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు భర్త కావాలంటూ రోదించింది. కాగా, భర్త కరుణాకర్, కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు తమ్మడపల్లి గ్రామంలో ఘటన -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణ కట్టలో పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారుగా 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టిసారించి భక్తుల కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పూజారులు కోరుతున్నారు. -
అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దు..
వాజేడు: పర్యాటకులు అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులకు రక్షణ చర్యలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. అయితే వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ జలపాతాలు దూరంగా ఉండడంతో ఇక్కడికి పర్యాటకుల సందర్శనను నిషేధించారు. అయినా కొందరు పర్యాటకులు దొంగచాటున వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అవగాహన కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు (ఫ్లెక్సీలు) ఏర్పాటు చేశారు. దీంతోపాటు అటుగా వెళ్లే రహదారులకు అడ్డుగా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నారు. వాజేడు మండల పరిధి కృష్ణాపురం సమీపంలోని అడవిలో భామన సిరి, దూలాపురం సమీప గుట్టల్లో మాసన్లొద్ది, కొంగాల సమీప గుట్టల్లో దూసపాటి లొద్ది, అరుణాచలపురం సమీప గుట్టల్లో గుండం, మొరుమూరు గుట్టల్లో మరో జలపాతం ఉన్నాయి. వీటి వద్దకు పర్యాటకులు వెళ్లొద్దని వాజేడు రేంజర్ చంద్రమౌళి, దూలాపురం రేంజర్ బాలకృష్ణ తెలిపారు. ఆయా జలపాతాలకు వెళ్లడంపై ఇప్పటికే నిషేధించినట్లు ప్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఎవరు అతిక్రమించొద్దని వారు కోరారు. పర్యాటకులకు అటవీశాఖ అధికారుల విజ్ఞప్తి ఆయా జలపాతాలపై నిషేధం విధించినట్లు ఫ్లెక్సీల ఏర్పాటు -
నీట్గా మెరిశారు..
నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ –25) ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు మెరిశారు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీనిపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ర్యాంకర్లు, తల్లిదండ్రులను సన్మించారు. మానుకోట విద్యార్థుల ప్రతిభ.. మహబూబాబాద్ అర్బన్: నీట్ ఫలితాల్లో మానుకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, మాధురి దంపతుల కుమారుడు ప్రణీతమ్ సుహాస్ 720 మార్కులకు 408 మార్కులు సాధించాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్రెడ్డి, సుజాత దంపతుల కుమారై వర్షితారెడ్డి 720 మార్కులకు 431 మార్కులు సాధించింది. అలాగే, పిట్టల శ్రీమతి, మహేందర్ దంపతుల కుమారై అభిన్య 720 మార్కులకు 500 మార్కులు సాధించింది.–సాక్షి నెట్వర్క్ షణ్ముఖకు 48వ ర్యాంకు.. కేయూ క్యాంపస్: జాతీయ స్థాయిలో మెడిసిన్లో ప్రవేశాలకు గాను నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల్లో హనుమకొండకు చెందిన యాండ్రపాటి షణ్ముఖ 720 మార్కులుకు 656 మార్కులు సాధించి ఆల్ఇండియా 48వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీకి చెందిన యాండ్రపాటి శ్యాంసుందర్, రజనీదంపతుల కుమారుడు షణ్ముఖ పదో తరగతి హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే షణ్ముఖ డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి శని వారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో సత్తాచాటాడు. దీనిపై తల్లిదండ్రులు శ్యాంసుందర్, రజనీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, షణ్ముఖ ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ఏపీ ఎప్సెట్ అగ్రికల్చరల్, ఫార్మసీలోనూ రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కూడా సాధించాడు. ఢిల్లీ ఎయిమ్స్లో చేరుతా.. నీట్లో ఆల్ఇండియాలో 48వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్లో చేరుతా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు. షణ్ముఖ, నీట్ 48వ ర్యాంకర్● -
రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుకమారి రాజేశ్ రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాఽధించాడు. హ రియాణాలోని నిట్ కురుక్షేత్ర, చైన్నెలోని కాంచీపురం ట్రిపుల్ ఐటీ అండ్ మా న్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో (ఐఐఐటీడీఎం)లో కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాడు. పద్మాశాలి సా మాజిక వర్గానికి చెందిన చిలుకమారి సమ్మయ్య, స్వరూప దంపతుల కుమారుడు రాజేశ్ పాలకుర్తిలోని విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో పదో తరగతి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాతృశ్రీ ఇంజనీరింగ్ క ళాశాలలో సీఎస్ఐ బీటెక్ పూర్తి చేశాడు. నిట్ సిక్కింలో ఎంటెక్, నిట్ వరంగల్లో సీఎస్ఈలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని వీఐటీ అమరావతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూనే నిట్ కురుక్షేత్ర, ఐఐఐటీడీఎం కాంచీపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు. దీంతో రాజేశ్ను పలువురు అభినందించారు. పంచకర్మ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి జనగామ: ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచించారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సు జరుగుతోంది. శనివారం వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన ఆయుర్వేద వైద్య శాస్త్రంపై నిర్వహించిన సదస్సులో ప్రముఖ అధ్యాపకులు, వైద్య నిపుణులు ప్రయోగాత్మకజ్ఞానంతో పాటు తమ అనుభవాలు పంచుకున్నారు. డాక్టర్ సరస్వతి హిమబాల మాట్లాడుతూ సంప్రదాయ గ్రంథాల నుంచి ఆధునిక వైద్య చికిత్సల వరకు ఆయుర్వేదంలో పొందుపరిచి ఉందన్నారు. డాక్టర్ పంతులు రఘుపతి మాట్లాడుతూ పంచకర్మను సాధారణ వైద్య ప్రయోగాల్లో సమర్థవంతంగా ఎ లా అప్లయ్ చేయాలనే అంశంపై వివరణాత్మకంగా బోధించామన్నారు. డాక్టర్ సురేంద్రశర్మ మాట్లాడుతూ ఔషధ తయారీ ప్రక్రియ గురించి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా అవగాహన కల్పించా మన్నారు. డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం గొప్పదనాన్ని తెలుసుకుని రోగులకు చికిత్స చేసే సమయంలో దానిని అమలు పర్చాలన్నారు. డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ కంటి వ్యా ధులు, దుష్ఫలితాలకు సంబంధించి అనేక మందికి ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్సలు చేసి విజయం సాధించామన్నారు. ఆయుర్వేద వైద్యంలో అద్భుత ఫలితాలు సాధించి, రుజువు చేయడమే కాకుండా, యువ వైద్యులకు శాసీ్త్రయం, అనుభవాత్మకంగా పరిపూర్ణత సాధించేందుకే ఇలాంటి రాష్ట్ర స్థాయి సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
● రూ.1.30 లక్షల నగదు అపహరణ ● గంగారంలో ఘటన కాటారం : తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు సంతోషం గౌరక్క ఒంటరిగా నివసిస్తోంది. నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు తలుపు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులో ఉన్న రూ.1.30 లక్షల నగదును అపహరించుకెళ్లారు. శనివారం ఇంటికి చేరుకున్న గౌరక్క తలుపు తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుంది. వెంటనే చుట్టు పక్కల వారికి తెలుపగా పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై అభినవ్ తెలిపారు. -
33 కేవీ విద్యుత్ లైన్లో డిస్క్ల సమస్య
హన్మకొండ: 33 కేవీ విద్యుత్ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో సమస్య గుర్తించేందుకు విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి ఆరెపల్లి 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి వరంగల్ ఉర్సు, హనుమకొండలోని న్యూ శాయంపేట వరకు మూడు సంవత్సరాల క్రితం 33 కేవీ లైన్ వేశారు. ఈ విద్యుత్ లైన్ ఏర్పాటైనప్పటి నుంచి తమకు అవస్థలు తప్పడం లేదని విద్యుత్ ఉద్యోగులు వాపోతున్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడంతో అవి తరచూ పగిలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను గుర్తించడానికి పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. పగిలిన డిస్క్, ఇన్సులేటర్ గుర్తించడానికి ప్రతీ స్తంభాన్ని ఎక్కి దిగాల్సి వస్తోందని వాపోయారు. స్తంభం ఎక్కితేనే పగిలింది కనిపిస్తుందని, కింది నుంచి చూస్తే ఫాల్ట్ దొరకడం లేదని తెలిపారు. విద్యుత్ లైన్ వేసిన క్రమంలో నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఈ విద్యుత్ లైన్లో తరచూ సరఫరాలో అంతరాయం కలుగడం, డిస్క్లు, ఇన్సులేటర్లు ఫెయిల్ కావడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్లో జరిగిన సమీక్షలో విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లు, ఇన్సులేటర్లన్ని మార్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారని సమాచారం. కానీ, వాటిని మార్చకపోవడంతో సమస్య పునరావృతమవుతూనే ఉంది. వారానికి ఒకసారి డిస్క్, ఇన్సులేటర్ ఫెయిల్, షాట్ సర్క్యూట్తో బ్రేక్ డౌన్ అవుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. రెండేళ్లలో 18 డిస్క్లు మార్చినట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు బిగించకపోతే విద్యుత్ అంతరాయాలు తప్పవని, ఫాల్ట్ కనుక్కోవడానికి ప్రతీ స్తంభం ఎక్కి దిగాల్సిందేనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికై నా టీజీ ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీఎండీ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్తో నాణ్యమైన డిస్క్లు, ఇన్సులేటర్లు ఏర్పాటు చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు. టైర్ పగిలి డీసీఎం బోల్తా.. ● యువకుడి మృతి.. ముగ్గురికి గాయాలు ● మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన మడికొండ: టైర్ పగిలి డీసీఎం బోల్తాపడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ ఔటర్ రింగ్ రో డ్డుపై జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. డీసీఎంలో ఎస్బీఐ బ్యాంకు లాకర్లను తీసుకుని హైదరాబాద్ నుంచి భూపాలపల్లికి నలుగురు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మడికొండ శివారు టెక్స్టైల్ పార్కు సమీపంలో డీసీఎం వెనుక టైర్ పగిలింది. దీంతో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో లాకర్ మీదపడి హైదరాబాద్కు చెందిన ఎండీ జావీద్ఖాన్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ క్యాబిన్లో ఉన్న ముగ్గురు ఎండి. హబీబ్ఖాన్, ఎండి. మోయిజ్ఖాన్, ఎండి. సలీమ్ఖాన్కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించి, మృతదేహాన్ని పంచనామ నిమిత్తం ఇదే ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృతుడి బంధువు మోయిన్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. నాసిరకం డిస్క్లు, ఇన్సులేటర్లతో అవస్థలు మార్పించాలని సీఎండీ ఆదేశం రెండున్నర నెలలు గడుస్తున్నా మార్చని అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
90 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు ఓ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక, గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని జి ల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ ఎకై ్సజ్ ప రిధి అనంతారం గ్రామ శివారుతోపాటు అనంతా రం నుంచి కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో శుక్రవారం సాయంత్రం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ డీసీ ఎం అటువైపురాగా ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చే యగా అందులో గుడుంబా తయారీ కోసం మహబూబాబాద్ జిల్లాకు తరలిస్తున్న 90 క్వింటాళ్ల నల్ల బెల్లం, 10 క్వింటాళ్ల పటిక, 60 లీటర్ల గుండుంబా కనిపించింది. దీంతో వాహనాన్ని సీజ్చేసి నల్ల బెల్లం, పటిక స్వాధీనం చేసుకుని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రేకుల తండాకు చెందిన గుగులోత్ అశోక్, మొగిలిచర్లకు చెందిన నీలం వీరన్న, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన సంగు నరేశ్పై కేసు నమోదు చేశామని, కోదాడకు చెందిన కోనేరు మురళీమోహన్ పరారీ లో ఉన్నారని తెలిపారు. కాగా, పట్టుకున్న వాహ నం, బెల్లం, పటిక విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి, ఎస్సై అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబు ళ్లు శేఖర్, సాలెం రాజ్, శ్రీనివాస్, రవి, వెంకటనరసయ్య, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు. డీసీఎం సీజ్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎకై ్సజ్ అధికారి కిరణ్ -
‘షైన్’ విద్యార్థుల విజయదుందుభి
హన్మకొండ : నీట్–2025 ఫలితాల్లో ‘షైన్’ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారు. తమ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ‘షైన్’ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి, నీట్, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్లో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాయన్నారు. నీట్లో జాతీయ స్థాయిలో జి. కీర్తన –498 మార్కులు , కె. సహస్ర– 497, డి. ఇందూ– 437, ఇ. వెంకట శివాణి–427 మార్కులు సాధించారని వివరించా రు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 300 పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలి తాలు సాధించిన విధ్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్, అధ్యాపకులు అభినందించారు. -
ఆస్తి కోసమే హత్య!
హసన్పర్తి: ఆస్తి కోసమే పిన తల్లి (చిన్నమ్మ)ని కుమారుడు గొడ్డలితో నరికి హత్యచేశాడని హనుమకొండ ఏసీపీ నర్సింహారావు అన్నారు. ఈ మేరకు కేయూ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు వెల్లడించారు. హసన్పర్తి మండలం పెగడపల్లికి చెందిన చల్లా శ్రీనివాస్రెడ్డి మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. 30ఏళ్ల క్రితం మొదటి భార్య వనమ్మ మృతి చెందగా, వివిధ కారణాలతో ఇద్దరు కుమారులు కూడా తనువు చాలించారు. చిన్న కుమారుడు చల్లా భూపాల్రెడ్డి ఆలనా పాలనా తండ్రి శ్రీనివాస్రెడ్డి చూసుకున్నాడు. కొంతకాలం తర్వాత సరోజన అనే మహిళను శ్రీనివాస్రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఆస్తి తగదా.. శ్రీనివాస్రెడ్డి తనకున్న భూమిలో నుంచి 3.20 ఎకరాల భూమిని రెండో భార్య కూతుళ్లు పేర రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో తనకు తెలియకుండా చెల్లెళ్ల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కొడుకుకు భూమి కౌలుకు ఇవ్వొద్దు.. కాగా, పదిరోజుల క్రితం శ్రీనివాస్రెడ్డి కాలుకు దెబ్బ తగలడంతో వ్యవసాయ పనులకు దూరమయ్యాడు. దీంతో తన పేరిట ఉన్న 2.20 ఎకరాల భూమిని కొడుకు చల్లా భూపాల్రెడ్డికి కౌలుకు ఇవ్వాలని నిర్ణయించాడు. దీంతో భార్య సరోజన నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఆ భూమిని అల్లుళ్లకు కౌలుకు ఇవ్వాలని సరోజన వాదిస్తూ వచ్చింది. పథకంప్రకారం హత్య.. తనకు తెలియకుండానే 3.20 ఎకరాల భూమిని కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్చేసుకోవడమే కాకుండా తండ్రి భూమిని కూడా అల్లుళ్లకు ఇవ్వాలని పినతల్లి గొడవ చేయడంతో ఆమెనుఎలాగైనా హత్యచేయాలని భూపాల్రెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి పిన తల్లి సరోజన బయట నుంచి ఇంట్లోకి వస్తుండగా గేట్ వద్ద గొడ్డలితో నరికి హత్యచేశాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వివరించారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. పథకం ప్రకారమే మర్డర్ పినతల్లిని చంపిన కొడుకు.. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నాం హనుమకొండ ఏపీసీ నర్సింహారావు -
ప్రమాణంచేసి పౌరుల ప్రాణాలు తీస్తారా!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘ప్రశ్నించేవారంటే నరేంద్రమోదీకి భయం.. ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టులను లేకుండా చేయడానికి హత్యాకాండ కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టి ఆపరేషన్ కగార్ పేరిట దేశ పౌరుల ప్రాణాలు తీస్తున్నారు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండ కాకతీయ హోటల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని, ఇంకా 11 మంది కీలక మావోయిస్టు నేతలు ఉన్నారని ప్రకటించడం అప్రజాస్వామికం, ఆటవికమని పేర్కొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికమన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిది.. ఏటా రూ.25వేల కోట్లకు పైగా మెయింటనెన్స్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు పనికిరాదు.. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు. అర్హులకు పథకాలు అందాలి రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులకు అందించాలని సాంబశివరావు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో జర్నలిస్టులు, కార్మికులు, అసంఘటిత కార్మికులను కచ్చితంగా భాగస్వాములను చేయాలని సూచించారు. జర్నలిస్టులకు సర్కారు ఆసరా కావాలని, ఉచిత విద్య, ఆరోగ్యకార్డులు అందజేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీసోడ్ను తాము రాజకీయంగా చూడడం లేదు. కానీ.. అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని సాంబశివరావు పై విధంగా స్పందించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికం ఎన్కౌంటర్లపై ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
‘శివాని’ విద్యార్థుల విజయకేతనం
హసన్పర్తి: నీట్–2025 ఫలితాల్లో నగరంలోని శివాని కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెందిన మాధురీముఖేశ్(495/720), ఆడెపు మనోజ్(451/720), ఇ.కార్తీక్(443/720), ఆరికెళ్ల నిస్సి(438/720) మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాళ్లు జి.సురేందర్రెడ్డి,వి.చంద్రమోహన్,డైరెక్టర్లు రాజు, ఎన్.రమేశ్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్. సంతోశ్రెడ్డి అభినందించారు. -
నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి : నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్టెస్ట్ (నీట్–యూజీ –25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి శనివారం తెలిపారు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి పి. సాయిదివ్యాన్ ఆల్ ఇండియాలో 14వ ర్యాంకు, బి. ప్రియాంక 100వ ర్యాంకు, ఎం. వినయ్ 226వ ర్యాంకు, బి. గణేశ్ 671వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. రాష్ట్రంలోని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థలకు చెందిన 210 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించేలా ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామన్నారు. ఈఏడాది జేఈఈ మెయిన్స్ –25 జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తూ పిల్ల ల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. -
నిబంధనలు పాటించాలి
● శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మహబూబాబాద్: మాంసం విక్రయదారులు కనీస నిబంధనలు పాటించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్సెక్టర్ కరుణాకర్ హెచ్చరించారు. మాంసం విక్రయదారులు గొర్రెలు, మేకులు కోసే విషయంలో, షాపుల నిర్వహణ తదితర అంశాలపై ఈ నెల 14(శనివారం)న ‘వ్యాపారుల ఇష్టారాజ్యం’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంపై కమిషనర్ రాజేశ్వర్ స్పందించారు. మాంసం విక్రయదారులకు నోటీసులు ఇచ్చి విక్రయాలపై అవగాహన కల్పించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. ఈనేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాంసం విక్రయదారులతో మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఆర్యోగంగా ఉన్న జీవాల ను కోయాలన్నారు. పశు వధశాల లేనందున కనీస నిబంధనలు పాటించాలన్నారు. ధరలు తగ్గించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే మాంసం విక్రయదారులతో సమావేశం ఉంటుందని ఆ సమావేశానికి వ్యాపారులు హాజరు కావాలని తెలిపారు.ఉద్యమకారులకు న్యాయం చేయాలిమహబూబాబాద్ అర్బన్: తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మానుకోట జిల్లా ఉద్యమకారులు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ కోరారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారికి కలెక్టరేట్లో శనివారం ఉద్యమకారులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసుల పాలయ్యామని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేయాలని, హెల్త్కార్డులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారులు పిల్లి సుధాకర్, ఎండీ వాహేద్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి● పింగిళి రమేష్రెడ్డి మహబూబాబాద్ అర్బన్: గిరిజన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను, బ్యాడ్మింట్ క్రీడను ప్రోత్సహించాలని బ్యాడ్మింటన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పింగిళి రమేష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరకాలనీ గిరిజన భవనంలో శనివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిళి రమేష్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకు పుట్టినిల్లు మానుకోట జిల్లా అని.. ఈ ప్రాంతంలో బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించి జిల్లాను రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు. రానున్న రోజుల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.జితేందర్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి నాగకిషన్, జిల్లా కార్యదర్శి కొమ్ము రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ సర్వయ్య, సహాయకార్యదర్శి సాంబమూర్తి, కోశాధికారి శంకర్, సభ్యులు శ్యామ్, కిషొర్, ప్రవీణ్, సతీష్, కోటిరెడ్డి, క్రీడకారులు పాల్గొన్నారు. -
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
● మాజీ ఎంపీ సీతారాంనాయక్మహబూబాబాద్ అర్బన్/దంతాలపల్లి: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో, దంతాలపల్లి మండలకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం వేర్వేరుగా సీతారాంనాయక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ హక్కుచట్టం ప్రకార మే ఆదివాసీ గిరిజనులు వారి హక్కులు అడుగుతున్నారని అన్నారు. దేశంలో 720 గిరిజన తెగలు ఉన్నాయని తెలిపా రు. గ్రామసభలు నిర్వహించి అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కుపత్రాలు అందించాలని కో రారు. దేశంలోని 81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రధాని మోదీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేష న్ అందచేస్తున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనలో దే శం సాంకేతికంగా దూసుకెళ్తుందన్నారు. నాయకులు ఎడ్ల అశోక్రెడ్డి, శ్యాంసుందర్శర్మ, మహేష్, పూర్ణచందర్రెడ్డి, మురళి, ప్రవీణ్, ఉమేష్, రమేష్, రాణిరెడ్డి పాల్గొన్నారు. -
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించా డు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీమేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సుమలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
శాంతియుత వాతావరణంలో జీవించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై బరువు తగ్గించేందుకు, వివిధ కేసుల్లో ఇరువర్గాల వారితో మాట్లాడి పరిష్కరిస్తారని తెలిపారు. కేసుల కొట్టివేత కోసం నిరంతరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడొద్దనే ఆలోచనతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు కోర్టుల్లో 13,500 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ఇలాగైతే కేసుల సంఖ్య పెరిగిపోతుందని అన్నారు. నేర ప్రవృత్తిని తగ్గించాలని, లోక్ అదాలత్ ఒక పరిష్కార వేదికగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, డీఎస్పీ తిరుపతిరావు, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. 8,495 కేసుల పరిష్కారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 8,495 కేసులను పరిష్కరించగా ఇందులో వివిధ రకాల 2,437 కోర్టు కేసులు, 5,465 పోలీస్ చలాన కేసులు ఉన్నాయి. వాటితోపాటుగా 15 మోటార్ వాహన ప్రమాద కేసుల్లో రూ.59.85 లక్షల నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించే విధంగా ఆదేశించారు. 497 క్రిమినల్ కేసుల్లో నేరాన్ని అంగీకరించిన వారికి రూ.32.88 లక్షల 400 రూపాయల జరిమానా విధించారు. 17 సైబర్ నేరాల కేసులు పరిష్కారమవ్వగా రూ.2.62 లక్షలను బాధితులకు తిరిగి ఇచ్చే విధంగా ఆదేశించారు. 53 టెలిఫోన్, సైబర్, బ్యాంకు సంబంధిత కేసులు పరిష్కారం అవ్వగా వాటిలో కక్షిదారులు రూ.13 వేల 170 రూపాయలు చెల్లించి రాజీ చేసుకున్నారు. 7 సివిల్ కేసులు, 4 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యాయి. 588 కేసుల పరిష్కారం తొర్రూరు: స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 588 కేసులు పరిష్కారమయ్యాయి. జడ్జి ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో కేసుల విచారణ చేపట్టి సివిల్, క్రిమినల్, పెటీ, ఎకై ్సజ్, సైబర్ క్రైమ్ తదితర కేసులు పరిష్కరించారు. అన్ని కేసుల్లో జరిమానా కింద రూ.20.5 లక్షలు విధించారు. కార్యక్రమంలో ఏపీపీ రేవతిదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముకుందరావు, సీఐ గణేష్, బార్ ప్రతినిధులు అశోక్, భాస్కర్, వెంకన్న, ఐలోని, మహేష్, కుమార్లు పాల్గొన్నారు. జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. వృత్తిరీత్యా నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన చేసిన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో అవగాహన కల్పించేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
మానుకోట నియోజకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుమతి ఇచ్చారని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని.. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ప్రజలు ఇళ్లులేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రికి విన్నవించామని తెలిపారు. దీంతో అదనంగా 1,500 ఇందిరమ్మ ఇళ్లు కావాలని కోరగా సానుకూలంగా స్పందించిన 1,000 ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చారన్నారు. మానుకోట అభివృద్ధిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
భూమి అమ్మి చదివించారు..
నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలు కు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్. -
నిబంధనలు పాటించాలి
డోర్నకల్: విత్తన విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఏఓ విజయనిర్మల సూచించారు. డోర్నకల్, గొల్లచర్ల, చిలుకోడు గ్రామాల్లోని ఫెస్టిసైడ్స్ దుకాణాలతో పాటు సొసైటీ కార్యాలయాల్లో శుక్రవారం డీఏఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులతో పాటు విత్తనాల నిల్వ లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. దుకాణదారుల పీఓఎస్ మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. దుకాణదారులు స్టాక్ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీమోహన్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. ● డీఏఓ విజయనిర్మల -
బస్సు సౌకర్యం కల్పించాలి
నెహ్రూసెంటర్: ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అదనపు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికులు ఫోన్ ద్వారా వినతులను సమర్పించారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి 14 వినతులు వచ్చినట్లు డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్–సింగారం–మునిగలవీడు, మహబూబాబాద్–మట్టెవాడ–గూడూరు, మహబూబాబాద్–మరిపెడ–రాంపూర్–హైదరాబాద్, మరిపెడ–చిన్నగూడూరు సర్వీసులను నడిపించాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. మరిపెడ బస్టాండ్ ప్రాంగణంలో సమయపాలన సూచిక ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు డీఎం తెలిపారు. సదరు రూట్లను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని డీఎం వెల్లడించారు. -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
● కార్యకర్తలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపు కొత్తగూడ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరా జ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూ చించారు. మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన కొత్తగూడ, గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐఏఎస్ అధికారుల బదిలీల వల్ల కొంత జాప్యం జరుగుతుందని, వారం పది రోజుల్లో ఎన్నికలపై స్పష్టత వస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. రైతు భరోసా కొంత ఆలస్యమవుతున్న విషయం నిజమేనని, అది కూడా త్వరలో ప్రభుత్వం వేస్తుందన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలతో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు మంత్రి సీతక్క.. సామూహిక విద్యాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ప్రైవేట్లో అధిక ఫీజులను నియంత్రించాలి విద్యారణ్యపురి: ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. పేదపిల్లలకు ప్రైవేట్లో ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలోనే ఉందన్నారు. ప్రతి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వంగ రవియాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుగొండ హైమవతి, సిలువేరు రవీందర్, అశోక్, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం
కాటారం(మహాముత్తారం): కాటారం, మహాముత్తారం మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డి మందు దందాను పోలీసులు, వ్యవసాయశాఖ అధికా రులు ఛేదించారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో ఎస్సై మహేందర్కుమార్, ఏఓ అనూష సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డి మందు నిల్వలను పట్టుకున్నా రు. కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్ శుక్రవారం మహాముత్తారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరా లను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఘనికపూడికి చెందిన అచ్చ హన్మంతరావు, కాటారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ సమ్మిరెడ్డి, మల్హర్ మండలం పాతరుద్రారానికి చెందిన జాడి సమ్మయ్య, మహాముత్తారం మండలం నల్లగొండ మీనాజిపేటకు చెందిన చీర్ల సతీశ్, కాటారానికి చెందిన బొమ్మన వెంకట స్వామి, కొత్తపల్లికి చెందిన కందుల కోటేశ్వరరావు.. నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానితుల ఇళ్లలో శుక్రవారం దాడులు నిర్వహించగా.. భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందు గుర్తించినట్లు తెలిపారు. సుమారు రూ.5,06,250 విలువ చేసే 202.5కేజీల నకిలీ పత్తి విత్తనాలు, సుమారు రూ.1,20,000 విలువ చేసే 300లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనపర్చుకున్నట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. ఏఓ అనూష ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో అధికారుల తనిఖీలు ఆరుగురిపై కేసు నమోదు -
విలువైన ప్రాణాలను కాపాడొచ్చు..
ప్రతీ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. గ్రామాల్లోని యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి ఎంతో మందిచే రక్తదానాన్ని చేయించాను. రక్తదానంపై అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగేలా కృషి చేశాను. భవిష్యత్లో కూడా యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూ నేను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. – దాసరి సుధాకర్, ఎస్సై టేకుమట్ల -
బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడి మృతి
● మృతుడిది ఖమ్మం జిల్లా మద్దులపల్లి వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాల బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడు మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ రాజేంద్ర ప్రసాద్(55) పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం బడిబాట కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా రాజేంద్ర ప్రసాద్కు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో (కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు) పాఠశాలలోనే ఉండాలని తోటి సిబ్బంది చెప్పి వెళ్లారు. ఈనేపథ్యంలో హాస్టల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్ కోసం భోజనం తీసుకుని క్వార్టర్స్కు రాగా.. బాత్రూంకు వెళ్లి వచ్చాక భోజనం చేస్తానని చెప్పాడు. ఎంతకూ బాత్రూంనుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది.. తలుపు తెరిచి చూడగా కింద పడిపోయి ఉన్నారు. దీంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడినుంచి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజేంద్ర ప్రసాద్కు భార్య ప్రమీలరాణి, కుమారుడు రామ్కుమార్, కుమార్తె స్రవంతి ఉన్నారు. ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య ఏటూరునాగారం వైద్యశాలకు వచ్చి వివరాలు సేకరించారు. -
మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు
వరంగల్ క్రైం: మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన వరంగల్లోని మట్టెవాడ రాజీవ్కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్ని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈస్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రూ.18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగా రు, 34 గ్రాముల వెండి అభరణాలతోపాటు రూ.10 వేలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించి ప్రణయ్ని శుక్రవారం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్లో విచారించినట్లు తెలిపారు. ఈక్రమంలో ప్రణయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జల్సాలు, బైక్ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అప్పు చేసినట్లు తెలిపారు. ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని ప్లాన్వేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన తన మేనత్త స్వరూప వద్దకు వెళ్లిన ప్రణయ్ ఆమెతో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. స్వరూప గాఢ నిద్రలో ఉన్న సమయంలో డంబెల్తో మేనత్త తలపై కొట్టినట్లు తెలిపారు. స్వరూప మరణించినట్లుగా నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతోపాటు ఇంట్లోని వెండి ఆభరణాలు, డబ్బును దోచుకొని వెళ్లినట్లు తెలిపారు. 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్కుమార్ -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరినట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్లో బట్టి విక్రమార్కను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పిన వెంటనే ట్రాన్స్ కో సీఎండీకి ఫోన్ చేసి త్వరలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్పు చేయడంతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, 01.02.1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సంస్థలో మిగిలివున్న 6,500 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఖాళీలను భర్తి చేయాలని, ట్రాన్స్కో సీబీడీ గ్యాంగ్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు విద్యార్హతతో పనిలేకుండా గ్రేడ్–1 జీతం ఇవ్వాలని కోరామన్నారు. కారుణ్య నియామకాల వయస్సును 25 నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సమావేశంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, బీఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రాణం పోస్తున్నారు..
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ●● రక్తదానంలో యువత ముందంజ●● అవగాహన కల్పించడంలో ఎన్జీఓల కృషి ● అత్యవసర సమయంలో కాపాడుతున్న రక్తదాతలుప్రమాదం జరిగినప్పుడు.. అనారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తం అందక అనేకమంది మృత్యుఒడికి చేరిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం ఎన్జీఓలు, యువజన సంఘాలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా రక్తదానంపై వారిలోని అపోహలను దూరం చేస్తున్నారు. తద్వారా అనేకమంది యువత రక్తదానం చేసి చావుబతుకుల్లో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భం ప్రత్యేక కథనం. టేకుమట్ల: రక్తదానం చేయడం వల్ల నీరసించి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహ ప్రజల్లో ఉంటుంది. కానీ, అలాంటిది జరగదు. కేవలం 21 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రక్తం శరీరంలో సమకూరుతుంది. అలాగే 6 నుంచి 12 వారాల్లో పురుషులకు, 6 నుంచి 16 వారాల్లో మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయిలు సమంగా చేరుకుంటాయి. ఈవిషయంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రెడ్క్రాస్ వంటి సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా చొరవ చూపుతున్నాయి. దీంతో యువత రక్తదానం వైపు అడుగు వేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. ఎవరు రక్తదానం చేయాలి.. ఎవరు రక్తదానం చేయాలనే విషయంపై ఎంతో మంది ఆలోచనలో పడి రక్తదానం చేయడంలో కాస్త వెనుకడుగేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హెపటైటిస్ బీ, హెచ్ఐవీ, రక్తహీనత, బలహీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. రక్తదానం చేసేందుకు అనర్హులుగా వైద్యులు చెబుతారు. ఎంతో మందికి పునర్జన్మ అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది పునర్జన్మ పొందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు. -
భూమికి పరిహారం చెల్లించాలని..
కురవి: తన భూమికి పూర్తి పరిహారం చెల్లించకుండా గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నారని మహబూ బాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో రైతు నూకల రవి పురుగుల మందు డబ్బా పట్టుకుని హైవే రోడ్డు కోసం పక్కన నిర్మించిన విద్యుత్ స్తంభం(టవర్) ఎక్కాడు. పూర్తి పరిహారం చెల్లించే వరకు దిగేది లేదని, పురుగుల మందు తాగి టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. తన 1.34 ఎకరాల భూమి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ చేశారని, 1.12 ఎకరాలకు నష్టపరిహారం కింద రూ.14లక్షలు చెల్లించారని, ఇంకా 22 గుంటల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ రవి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్తంభం ఎక్కిన రైతుతో మాట్లాడారు. ఎంతచెప్పినా వినకుండా కిందికి దూకుతానని అనడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో టవర్ కింద రైతు తల్లి ఉప్పలమ్మ, భార్య రజిత, కొడుకు వంశీకృష్ణలు ఆందోళనకు దిగారు. చివరికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు సామ పాపయ్య సంఘటన స్థలానికి వచ్చి పరిహారం అందే వరకు నీ తరఫున పోరాటం చేస్తామని చెప్పడంతో టవర్ దిగాడు. మళ్లీ లారీల్లో మట్టి తీసుకొచ్చి పనులు చేస్తుండడంతో రవి ఆ వాహనం ఎదుట బైఠాయించాడు. భూమిలో పనులు చేయొద్దని కాంట్రాక్టర్కు చెప్పడంతోపాటు పూర్తిస్థాయి అందేలా సాయం చేస్తానని రవికి ఆర్ఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కాగా, ఈ విషయమై ఆర్ఐ రవికుమార్ వివరణ కోరగా నూకల రవికి సంబంధించిన బంధువు(పెద్దభార్య కొడుకు) తన కు వాటా కావాలని, పరిహారం చెల్లించాలని మహబూబాబాద్ కోర్టును ఆశ్రయించాడని, అందుకే పరిహారం అందడంలో ఆలస్యం అవుతుందని వివరించాడు. పురుగుల మందు డబ్బాతో విద్యుత్స్తంభం ఎక్కి రైతు హల్చల్ -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి–తిరుపతి మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. జూలై 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి–తిరుపతి (07251) ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో జూలై 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–చర్లపల్లి (07252) ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు చేరుకుటుంది. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు అప్ అండ్ డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
రాజీమార్గమే మేలు..
మహబూబాబాద్ రూరల్ : ప్రజలు పగలు, ప్రతీకారాలను పక్కనపెట్టి రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుంది. ఈమేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సెక్రటరీ, నర్సంపేట సీనియర్ సివిల్ జడ్జి వరూధిని ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. అదే విధంగా తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలోనూ లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం.. సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వేదికగా కక్షిదారులు రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కోరుతుంది. సుప్రీంకోర్టు 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీకి చట్టబద్ధమైన హోదాను కల్పించింది. అప్పటినుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయమూర్తులు చర్యలు తీసుకుంటున్నారు. జడ్జిలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్, సివిల్ పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ వివిధ కేసుల్లోని కక్షిదారులను సమన్వయం చేస్తూ కేసులను పరిష్కరిస్తున్నారు. పరిష్కరించేందుకు సిద్ధం.. రాజీ పడదగిన సివిల్, మోటార్ వాహన ప్రమాదాలు, క్రిమినల్, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యు త్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కో ర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటున్నారు. కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలి.. లోక్ ఆదాలత్ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు, కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అందుకనే లోక్ అదాలత్లో కేసులను రాజీచేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి. మహమ్మద్ అబ్దుల్ రఫీ, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాజీ కుదుర్చుకోండి.. ప్రశాంతంగా జీవించండి నేడు జాతీయ లోక్ అదాలత్ -
ఏటీఎం అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
జనగామ: ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, డబ్బులు డ్రా చేసుకుంటున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జనగామ పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఇనుమెల్ల గ్రామానికి చెందిన ముల్లముడి వెంకటకోటేశ్వరావు ఓ కంపెనీలో ఆఫీస్బాయ్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ నష్టపోయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి.. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏటీఎంల నుంచి సులువుగా డబ్బులు ఎలా డ్రా చేయొచ్చని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న వెంకటకోటేశ్వరావు ప్రజలు ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేసుకునే క్రమంలో వారిని మాటల్లో పెట్టి కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు డ్రా చేసుకుని నల్లగొండ, సంగారెడ్డి, పరకాల జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు. ఈక్రమంలో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్ శివారు సూర్యబండ తండాకు చెందిన భూక్యా భాస్కర్ ఏటీఎం వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఏమార్చి డబ్బులు కాజేసినట్లు ఫిర్యాదు చేయడంతో.. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ, సీఐ దామోదర్రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై భరత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏటీఎంల వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో బస్టాండ్ రోడ్డు వైన్స్ సమీపంలోని ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెంకట కోటేశ్వరరావును ఎస్సై భరత్ అదుపులోకి తీసుకుని విచారించగా, ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కర్ణాకర్, సాగర్, మహేందర్, సల్మాన్లను సీపీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ -
చిన్నతనంలోనే పెళ్లి!
సాక్షి, మహబూబాబాద్: యుక్తవయస్సు రాకముందు వివాహాలు జరిగితే మగవారికి బాధ్యత తెలియదు.. ఆడవారి ఆరోగ్యం సహకరించదు. చదువుకునే వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నో బాధలు, మరెన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత మంది ఉద్యోగులతో నిఘా పెట్టిన జిల్లాలో బాల్య వివాహాలు ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి నెట్వర్క్ ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో బాల్య వివాహాలను అడ్డుకోలేక పోతున్నారు. వివాహ తంతు ముగిసిన తర్వాత సమాచారం తెలుస్తుండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. 291 వివాహాలు అడ్డుకున్న అధికారులు జిల్లా వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 291బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన లేకపోవడం, ఆకర్షణకు లోనై పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో తొందరగా పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందనే ఆలోచనతో తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తున్నారు. అడ్డుకున్నవి తక్కువే.. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతుంటే.. పదుల సంఖ్యలో మా త్రమే అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నా యి. బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను అడ్డుకోవడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దత్తత, వీధి బాలల సంరక్షణ, అనాథ పిల్లల సంరక్షణ మొదలైన వాటికోసం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు, చైల్డ్లైన్, బాలల పరిరక్షణ, మహిళా సాధికారత వంటి విభాగాలతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. బాలల సంక్షేమం కోసం ప్రతీ జిల్లాలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలో చైర్పర్సన్, మరో ఇద్దరు కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో సమన్వయం లేకపోవడంతో బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు క్షేత్ర స్థాయికి చేరడం లేదని విమర్శలు ఉన్నాయి. అదే విధంగా బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు, ప్రమాదాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, ప్రతీ నెల సీడీపీఓలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించినా పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శ ఉంది. దీనికి తోడు ఫిర్యాదులుకు స్పందించకపోవడం, రాజకీయ ఒత్తిడికి తలొగ్గడం, పలువురు ఉద్యోగులు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి జరిగేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి కట్టడి చేస్తాం జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండడం బాధాకరం. దీనిని అదుపు చేయడం కోసం జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే అదరి సహకారం కావాలి. –రాజ్యలక్ష్మి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్నాలుగు సంవత్సరాలుగా జిల్లాలోని అడ్డుకున్న బాల్య వివాహాల వివరాలు.. 2021లో 109 2022 68 2023 37 2024 53 2025 24(ఇప్పటి వరకు) మొత్తం 291జిల్లాలో ఆగని బాల్య వివాహాలు అవగాహన లేకపోవడంతో అనర్థాలు ప్రేక్షక పాత్రలో అధికారులు వివాహం తర్వాత సమాచారంతో ఏమీ చేయలేని పరిస్థితిఅదుపు చేయకపోతే అంతే సంగతులు.. జిల్లాలో జరుగుతున్న బాల్య వివాహాలను అదుపు చేయకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు, మానసికవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏజెన్సీ గూడేలు, గిరిజన తండాల్లో చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎక్కువగా ఉన్నారు. రక్తహీనత, గైనిక్ సమస్యలతో సతమతమవుతున్నవారు అధికంగా ఉన్నారు. చిన్నతనంలో వివాహాలు, కుటుంబ పోషణ భారం, భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 836 మంది సీ్త్రలు ఉన్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.