తిరుమలలో అన్యమత ప్రార్థన
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం వేరే మతానికి చెందిన ఓ యువకుడు ప్రార్థన చేయడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాకు చెందిన అమీర్ అమ్జా.. శ్రీవారిని దర్శనా నికి తొలిసారిగా తిరుమలకు వచ్చాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఓ మూలన కూర్చొని ప్రార్థన చేస్తున్న అమ్జా ను గమనించిన పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు అన్యమత ప్రార్థనలపై తిరుమలలో నిషే« ధం ఉందనే విషయం తనకు తెలియ దంటున్నాడు. అమ్జా వ్యక్తిగత సమాచారా న్ని రాష్ట్ర, కేంద్ర హోం శాఖలకు పంపించా రు. ఈ ఘటనపై టీటీడీ ఈవో డి. సాంబశి వరావు విచారణకు ఆదేశించారు.