Army running race
-
ఆర్మీ రిక్రూట్ మెంట్ లో మరో అపశ్రుతి
విశాఖపట్టణం: విశాఖలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం ర్యాలీ లో పాల్గొన్న తోబుల్ రెడ్డి అనే అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతనిని స్థానిక కేజీహెచ్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న తోబుల్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతనిని కేజీహెచ్ నుంచి ఓ ప్రయివేటు హాస్పిటల్ కు తరలించారు. కాగా బుధవారం జరిగిన రిక్రూట్ మెంటు ర్యాలీలో పొల్గొన్న నీలబాబు అనే అభ్యర్థి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్మీ పరుగుపందెంలో పొల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన నీలబాబు రేసు పూర్తయిన తర్వాత సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. -
పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
-
పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
విశాఖపట్నం: సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేద్దామనుకున్నాడు. పరుగు కూడా విపరీతంగా ప్రాక్టీసు చేశాడు. ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వచ్చి, పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ పోటీ ముగిసిన వెంటనే అక్కడే సొమ్మసిల్లి పడిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం విశాఖపట్నంలో జరిగింది. వివరాలు... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత మొదటి స్థానంలో నిలిచిన నీలబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆ అభ్యర్థిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం సమయంలో నీలబాబు ప్రాణాలు కోల్పోయాడు.