ద్విభాషా చిత్రంలో..
మౌనమేలనోయి, ఒరేయ్, నీ జతగా నేనుండాలి తదితర తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోగా నటించిన సచిన్ జోషి నటిస్తున్న తాజా చిత్రం ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’. ఇప్పటివరకు సోలో హీరోగా చేసిన ఆయన ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర అంగీకరించడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి అయుష్ రైనా దర్శకుడు. సచిన్ మాట్లాడుతూ -‘‘తొలిసారి బయటి బేనర్లో నటిస్తున్నాను. రచయిత ప్రవల్ రామన్ ‘హంటింగ్ ఆఫ్ బోంబే మిల్స్’ కథ మొత్తం చెప్పి కీలక పాత్రకు అడగ్గానే ఆశ్చర్యపోయాను. కానీ, కథ, పాత్ర నచ్చడంతో అంగీకరించాను. ఇందులో ధనిక పారిశ్రామికవేత్త పాత్ర నాది’’ అన్నారు.