అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం: రమణ
సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే తమ పార్టీ అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. మహాకూటమిలో భాగం గా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై గురువారం వెలగపూడి సచివాలయంలో రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, అరవింద్కుమార్ గౌడ్, సారంగపాణి, దీపక్రెడ్డితోపాటు పలువురు టీటీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలసి చర్చించారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీటీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.