Corporation Positions
-
‘కొండపాక’కు జోడు పదవులు
► ఒకే మండలంలో రెండు కార్పొరేషన్ పదవులు ► టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం ► సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు కొండపాక(గజ్వేల్): కొండపాక మండలంలో మర్పడ్గ మదిర నాగిరెడ్డిపల్లికి చెందిన మడుపు భూంరెడ్డిని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా, జప్తినాచారం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకం చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండుకుంది. తెలంగాణ ఉద్యమంలో అన్నింటా ముందుండి పోరాటం చేసిన కొండపాక మండలాన్ని సీఎం కేసీఆర్ ఆలస్యంగానైనా గుర్తించడంపై ధన్యవాదాలు చెప్పారు. పార్టీలో మొదటి నుంచి పని చేసిన నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదన్న నమ్మకాన్ని సీఎం ప్రజల్లో కల్పించారు. మండల పరిధిలోని మర్పడ్గ మదిర నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మడుపు భూంరెడ్డి సీఎం కేసీఆర్తో మొదటి నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో నామినేటెడ్ పదవుల నియామకాలు జరిగినప్పుడల్లా మడుపు భూంరెడ్డికి చోటు దక్కుతుందనే ప్రజల ఆశలు నెరవేడం లేదు. దీంతో భూంరెడ్డి, ప్రజలు కాస్త నిరాశ పడ్డారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భూంరెడ్డి ముందుండి పని చేస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భూంరెడ్డి భూ నిర్వాసితులకు నచ్చజెప్పుతూ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన ఓపిక చివరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరకు తీసుకొచ్చిందంటూ మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మండల పరిదిలోని లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి టీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి లేదు. అయినా అధిష్టానం ఆదేశాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్యాత్మకంగా తీసుకొని నిర్మింపదలచిన మల్లన్న సాగర్ విషయంలో తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేముల గట్టు, పల్లెపహాడ్ తదితర గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణలో కాంగ్రెస్, టీడీపీ భూ నిర్వాసితుల పక్షాన నిలుస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి భూములివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ప్రజలను భూసేకరణకు దూరంగా ఉంచేలా ఇప్పటికీ చూస్తున్నాయి. మల్లన్నసాగర్ నిర్మాణ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం (మంత్రి హరీశ్రావు) సూచనలు, సలహాల మేరకు దుబ్బాక ఎమ్మెల్యే (రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ) సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పని చేస్తూ మెల్లమెల్లగా ఒక్కో గ్రామంలో బంధువులకు, స్నేహితులకు నచ్చజెప్పుతూ ప్రాజెక్టు పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్క వేములగట్టు గ్రామం తప్పా మిగతా గ్రామాల్లో దాదాపు అందరు రైతులు భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదివిని కట్టబెట్టారు. ఏదిఏమైనా కొండపాక మండలంలోని ఇద్దరికి కార్పొరేషన్ సంస్థలో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిదులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
అసంతృప్తులకు నామినేటెడ్ తాయిలం
- ఆదాల, కోటంరెడ్డికి కార్పొరేషన్ పదవులు - జెడ్ఎస్కు నుడా చైర్మన్ - ఆర్నెల్ల కిందట తయారు చేసిన జాబితా ఆధారంగా కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు - నెలాఖరులోపు పదవుల పందేరం ఉండొచ్చంటున్న పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ అనంతరం జిల్లాలో ప్రారంభమైన అసంతృప్తులను కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ హై కమాండ్ పదవు ల పందేరానికి రంగం సిద్ధం చేసింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, నె ల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి కార్పొరేషన్ చైర్మ న్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ జెడ్ శివప్రసాద్కు నుడా చైర్మన్ పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆదాలకు ఆర్టీసీ చైర్మన్ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదాల ప్రభాకర్రెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించారు. ఎన్నికల్లో ఓడినా రాజ్యసభ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఈ విషయం గురించి పట్టించుకోలేదు. స్థానిక సంస్థల కోటా లేదా ఎమ్మెల్యేల కోటాలో తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ఆదాల గట్టిగా అడిగారు. ఇది కుదరక పోవడంతో కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మంత్రి పదవి దక్కడం, తనకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు పట్టించుకోక పోవడంతో ఆదాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే తన అసంతృప్తిని ఎక్కడా బహిరంగ పరచకుండా నేరుగా అధిష్టానానికే సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. సాంకేతిక అంశాలు ఇబ్బందిగా మారక పోతే ఆర్టీసీ చైర్మన్ లభించే అవకాశం ఉందని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. అలా కాని పక్షంలో ఇంకేదైనా కీలక మైన కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కోటంరెడ్డికి కార్పొరేషన్ ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్న నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 2014 ఎన్నికల సమయంలో సిటీ శాసనసభ స్థానం టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. అప్పట్లో సినీనటుడు బాలకృష్ణ కూడా గట్టిగా సిఫారసు చేశారు. చివరి నిమిషంలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తన గురించి పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి పార్టీ పెద్దల వద్ద తన ఆవేదన వెలిబుచ్చుతున్నారు. నెల్లూరులో పార్టీ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనం సోదరుల ఆధిపత్యాన్ని ఎదుర్కుని కార్యక్రమాలు నిర్వహించిన విషయం పార్టీ గుర్తించడం లేదని ఆయన మనసులోనే ఆం దోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాల కోసం ఆర్నెల్ల కిందట జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ తయారు చేసిన జాబితాలో కోటంరెడ్డి కూడా ఉన్నారు. ఇక ఎన్నికల వాతావరణం ప్రారంభమైనందువల్ల కోటంరెడ్డికి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ హై కమాండ్ నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. జెడ్ఎస్కు నుడా 2014లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మేయర్ అభ్యర్థి కరువయ్యారు. ఆ సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రోర్బలంతో డాక్టర్ జెడ్.శివప్రసాద్ రంగంలోకి దిగారు. ఎన్నికల నిర్వహణ వ్యయమంతా ఆయనే భరించారు. కార్పొరేషన్లో టీడీపీ అధికారంలోకి రాలేక పోయింది. జెడ్ఎస్ను పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు తగిన గుర్తింపు కలిగిన పదవి ఇప్పించాలని సోమిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు పట్ట ణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటు తథ్యం కావడంతో జెడ్ఎస్ ఈ పదవి ఆశిస్తున్నారు. ఒకటి, రెండు నెలల్లో నుడాకు పాలక వర్గం నియామకానికి అధి కారిక ప్రక్రియ సాగుతోంది. జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే అనేక పదవులు ఇ చ్చారు.మరో బలమైన సామాజిక వర్గమైన యాద వ కులానికి ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చా రు. ఆ తర్వాత గణనీయమైన సంఖ్యలో ఓటర్లు ఉన్న చేనేత సామాజిక వర్గం తమకు గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకుని పోయింది. ఈ సామాజిక వర్గానికి చెందిన జెడ్ఎస్ను నుడా చైర్మన్గా నియమించడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా నిర్ణయించి నట్లు తెలిసింది. తన రాజకీయ గురువు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కడంతో జెడ్ఎస్కు పదవి రావడానికి అవకాశాలు మరింత బలపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.