కంఠనాథ్ ఆలయంలో తొక్కిసలాట, 9మంది మృతి
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ చిత్రకూట్ ప్రాంతంలోని కంఠానాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలైయాయి. సాత్నా జిల్లాలోని కంఠనాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించాడని అంటారు.
అమావాస్య కావడంతో ఒక్కసారిగా భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాధమిక సమాచారం. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జరిగిన ఘటనపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. సాత్నా జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిల్లో చికిత్సనందిస్తున్నారు.