DIG akun sabarwal
-
హత్నూర పీఎస్ భేష్
ప్రశంసించిన డీఐజీ.. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఉన్నతాధికారి హత్నూర: స్థానిక పోలీస్టేషన్ పని తీరుతోపాటు రికార్డు నిర్వహణ భేష్గా ఉందని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. శనివారం పోలీస్టేషన్ను ఎస్పీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి డీఐజీ పరిశీలించారు. స్టేషన్కు ఆయన స్థానిక ఎస్సై బాల్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్ను క్షుణ్ణంగా పరిశీలించి ఏడుగురు కానిస్టేబుళ్లను వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరేడ్ భేష్గా చేశారంటూ ప్రశంసిస్తూ రివార్డులను ప్రకటించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్ను పరిశీలించి పోలీస్టేషన్ ప్రశాంత నిలయంగా ఉందన్నారు. అనంతరం మొక్కలునాటిన డీఐజీ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. పోలీస్టేషన్ రికార్డులను పరిశీలించడంతోపాటు నిర్వహణ తీరు బాగుందన్నారు. రికార్డులు ప్రతి ఒక్కటి సక్రమంగా ఉన్నాయని అభినందించారు. స్టేషన్లో రికార్డులు, సీడీ ఫైల్స్ చక్కగా నిర్వహించినందుకు ఏఎస్ఐ సుదర్శన్, హెడ్కానిస్టేబుల్ జగదీశ్వర్లకు, కానిస్టేబుల్ సికిందర్, శ్రీరాములు, భూపాల్లకు రివార్డు ప్రకటించి అభినందించారు. కానిస్టేబుల్ బాల్రాజ్, హోంగార్డు మల్లేశంగౌడ్ల పనితీరుపై రివార్డు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎస్సై బాల్రెడ్డి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. బొల్లారం పోలీస్టేషన్ను రెండు నెలల క్రితం పరిశీలించిన సమయంలో ఎస్సైగా పని చేసిన ప్రశాంత్ను సైతం ఆయన అభినందించారు. డీఐజీతోపాటు ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి , కరీంనగర్ ఓస్డీ రోహినిప్రియదర్శిని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతిరాజు, ఎస్సై బాల్రెడ్డి, శిక్షణ ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఐజీ
గౌరారం ఎస్ఐ సస్పెన్షన్ జగదేవ్పూర్ ఎస్ఐకి సూచనలు గజ్వేల్ రూరల్: నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ గురువారం గజ్వేల్ సర్కిల్ పరిధిలోని పోలీస్స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ములుగు, గౌరారం, జగదేవ్పూర్ పోలీస్స్టేషన్లను సందర్శించిన అనంతరం గజ్వేల్ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. అ క్కడ పోలీస్ సిబ్బంది డీఐజీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ అకున్ సబర్వాల్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ములుగు పోలీస్స్టేన్ పనితీరు పరవాలేదని, గౌరారం పోలీస్స్టేన్లో పనులు సరిగ్గా జరగనందున ఎస్ఐని సస్పెండ్ చేశామని, సాయంత్రంలోగా ఆర్డర్ పంపించనున్నట్లు తెలిపారు. అలాగే జగదేవ్పూర్ పోలీస్స్టేషన్కు సంబంధించి కొన్ని సూచనలు చేశామన్నారు. మళ్ళీ శనివారం వచ్చి పలు సూచనలు చేస్తానన్నారు. కాగా గజ్వేల్ పోలీస్స్టేషన్లో విధుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన పోలీసు సిబ్బంది రాములు, స్వామిలకు రూ. 500 చొప్పున రివార్డును అందించనున్నట్లు తెలిపారు. అనంతరం గజ్వేల్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఉసిరి మొక్కను నాటారు. ఈ డీఐజీ అకున్ సబర్వాల్తో పాటు గజ్వేల్ సీఐ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు. జగదేవ్పూర్ ఠాణాను తనిఖీ చేసిన డీఐజీ జగదేవ్పూర్: డీఐజీ అకున్ సబర్వాల్ గురువారం ఉదయం జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. పీఎస్ రికార్డులను పరిశీలించారు. అరగంట పాటు ఎస్ఐ వీరన్నతో కలిసి పోలీస్ భవనాలను పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పరుచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా వేప మొక్కను నాటారు. కార్యక్రమంలో గజ్వేల్ సీఐ సతీష్, కానిస్టేబుల్ బాలమల్లయ్య, శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు.