'పోర్టు రాకుండా అధికార పార్టీ కుట్రలు'
నెల్లూరు: దుగ్గరాజుపట్నం పోర్టు రాకుండా అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని ఎంపీ వరప్రసాదరావు విమర్శించారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.
కృష్ణపట్నం యాజమాన్యం తాయిలాలకు తలొగ్గి గూడురు ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణ పోర్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినా లాభదాయకం కాదని నివేదిక ఇవ్వడం సరికాదని ఎంపీ వరప్రసాద రావు వాపోయారు.