Eedhupally venkateswar rao
-
విప్లవం తర్వాత
రష్యా నాయకుడు నికిటా కృశ్చేవ్ ఒకసారి సైబీరియా ప్రాంత పర్యటనకు వెళ్లినప్పుడు, తొంబయి ఏళ్ల ముసలాయన దగ్గరకెళ్లి, ‘‘తాతయ్యా! మనదేశంలో జరిగిన సామ్యవాద విప్లవం తరువాత నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు కదా!’’ అని అడిగాడట. అందుకా ముసలాయన, ‘‘బాబూ! నాకా విప్లవం గురించి వివరంగా తెలియదుగానీ గతంలో అంటే అక్టోబర్ విప్లవానికి ముందు నాకు రెండు జతల బూట్లూ, రెండు పైన తొడుక్కునే కోట్లూ, రెండు ఉన్ని సూట్లూ ఉండేవి. ఇప్పుడు వాటిలో ఒక్కొక్కటే మిగిలాయి. అవైనా బాగా చిరిగిపోయాయి’’ అని చెప్పాడు వణుకుతున్న స్వరంతో. ముసలాయన్ని ఎలాగైనా ఒప్పించాలని– ‘‘తాతయ్యా! నీకీ విషయం తెలుసా? చైనా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియా మొదలైన దేశాల్లో ఉన్న ప్రజలకి నీకున్న సౌకర్యాలు కూడా లేక ఎంతో పేదరికంలో మగ్గిపోతున్నారు’’ అని వివరించాడు కృశ్చేవ్. ‘‘బహుశా ఆ దేశాల్లో మనకంటే ముందే అక్టోబర్ విప్లవం వచ్చుంటుంది’’ అన్నాడా వృద్ధుడు తాపీగా. -ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
పరోపదేశ పాండిత్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రబోధాలన్నీ పరులకోసమే కాని తాను మాత్రం పాటించాలన్న స్పృహ ఆయనకు ఏనాడు లేదనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నారావారిదంతా పరోపదేశ పాండిత్యమే. పొదుపు గురించి, ప్రజాధన సంరక్షణ, నీతి, నిరాడంబరత్వం గురించి పదేపదే పసలేని ప్రసంగాలు చేస్తాడు గానీ వాటిలో ఏ ఒక్కదాన్నీ పాటించే అవసరం ఆయనకు లేనట్లుగానే కనిపిస్తోంది. నిజంగా తాను చెప్పే విషయంపట్ల వారికి చిత్త శుద్ధి ఉంటే తన అభిరుచుల కోసం, వాస్తు పై తన నమ్మకాల కోసం సచివాలయంలో మార్పులు, చేర్పుల కోసం, ఆ పేరుతో హంగులు, ఆర్భా టాల కోసం ఇప్పటివరకూ ప్రజాధనం రూ.81 కోట్లు ఖర్చు పెట్టడు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అధునాతన సెల్ఫోన్లు బహుమతిగా ఇవ్వవలసిన అవసరం ఏమిటి? వాటిని ఉపయోగించే ప్రాథమిక పరిజ్ఞానం మన ప్రజా ప్రతినిధుల్లో ఎంతమందికి ఉంది? ఇది వృథావ్యయం కాదా? ఇతరులకు ఉపదేశాలు, తనకు మాత్రం స్వప్రయో జనాల నుంచి బాబు బయటపడితే మంచిది. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు