faints
-
పెళ్లి సమయంలో పెళ్లికి నిరాకరించిన వధువు.. కుప్పకూలిన వరుడు
-
వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా
సాక్షి,వడోదర: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (64) వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన స్టేజ్పైనే పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రథమ చిక్సిత అనంతరం అహ్మదాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు. (గుజరాత్ సీఎంకు కరోనా) ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికబీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ బీజేపీ నేత భరత్ తెలిపారు. అనంతరం ఆయనను వడోదర నుంచి అహ్మదాబాద్కు హెలికాప్టర్లో తరలించామన్నారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా గుజరాత్లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి. -
వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్
వాషింగ్టన్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఊరట కల్పిస్తోంది. అమెరికాలో ఫైజర్-బయోఎన్టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించింది. అయితే క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టెనస్సీలోని ఫైజర్-బయోఎన్టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ అందుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో వ్యాక్సిన్ భద్రత, సమర్థతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది. (వ్యాక్సిన్.. మీ ఇష్టమే) (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) టేనస్సీలోని సీహెచ్ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్ మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్ గామారింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. (చదవండి : చైనాకు చెక్: ట్రంప్ మరో కీలక ఆర్డర్) -
కోర్టులో సృహతప్పిన ముంబై గ్యాంగ్ రేప్ బాధితురాలు!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలు, ఫోటో జర్నలిస్ట్ కోర్టులోనే సృహ కోల్పోయింది. నిందితులను గుర్తించిన బాధితురాలు.. వాగ్మూలం ఇచ్చే సమయంలో కోర్టులో సొమ్మసిల్లి పడిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఫోటో జర్నలిస్ట్ సృహతప్పి పడిపోయిన వెంటనే వాదనలు ఆపివేసి ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పీటీఐకి తెలిపారు. ఆగస్టు 22 తేదిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌడ్ లో బాధితురాలిపై సామూహిక మానభంగం జరిగినట్టు కేసు నమోదైంది. గురువారం జరిగిన వాదనలకు తన తల్లితో బాధితురాలు కోర్టుకు హాజరయ్యారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి కోర్టులో సంఘటన వివరించినట్టు తెలిపారు. లైంగికంగా దాడికి ముందు చూపించిన అశ్లీల క్లిప్పింగ్ ను కూడా బాధితురాలు గుర్తించినట్టు నికమ్ తెలిపారు. -
ఫిట్స్ వచ్చి పడిపోయిన సీమాంద్ర ఉద్యోగులు