'రక్షణ రంగంలో ఎఫ్డీఐలు... ప్రమాదకరం'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. బడ్జెట్లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించిందనేందుకు ఈ బడ్జెట్ మంచి ఉదాహరణ అని తెలిపారు. ప్రతి బడ్జెట్లో దేశంలో ప్రతి ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆయన గుర్తు చేశారు. అలాంటి శాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవేశపెట్టడం అత్యంత ప్రమాదకరమని రఘువీరా రెడ్డి హెచ్చరించారు.