ఈ నెలాఖరుకు మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎక్స్ 5!
చెన్నై: జర్మనీ మోటారు వాహనాల ఉత్పత్తి సంస్థ బీఎండబ్ల్యూ భారత్ లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ నుంచి బీఎండబ్ల్యూ ఎక్స్ 5 అనే కొత్త కారును జూన్ నెలాఖరుకు మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ధర 70 లక్షలకు పైగానే ఉంటుందని బీఎండబ్ల్యూ ఇండియా వెల్లడించింది. భారత మార్కెట్ లో ఉన్న డిమాండ్ మేరకు కార్ల ఉత్పత్తిని చేపడుతామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈనెలాఖరుకు మార్కెట్ లోకి బీఎండబ్ల్యూ ఎక్స్ 5 వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.