తిరుమలేశుడికి బంగారు పాదాలు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు బంగారు పాదాలు బహూకరించాడు. విజయవాడకు చెందిన సిరినాథ్ అనే భక్తుడు సుమారు రూ.30 లక్షల విలువ చేసే బంగారు పాదాలను గురువారం స్వామివారికి సమర్పించాడు. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆ భక్తుడు ...ఈ మేరకు బంగారు పాదాలను ఈవోకు అందచేశారు.