Historic day
-
చల్లని రాజా ఓ చందమామా
చందమామ రావే... జాబిల్లి రావే.. అని ఎంత పిలిచినా దగ్గరకు రాని చందమామ దగ్గరకు మనిషే వెళ్లాడు. జూలై 20, 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు మోపిన రోజు.అతడే చెప్పినట్టు అది ‘మానవ జాతి ముందంజ’.అయినా సరే... నేటికీ చందమామ ఒక నిగూఢ దీపం. రహస్యాల మయం.మానవజాతికి ఈ రేరాజు ఆత్మీయుడు,అందమైన స్నేహితుడు, ప్రియతముడు, మేనమామ. అతని చుట్టూ ఎన్నో కథలూ గాథలూ కల్పనలు. నేడు ‘ఇంటర్నేషనల్ మూన్ డే’. కాబట్టి శశికాంతుని సంగతులు కొన్ని...కుందేలు ఇలా వచ్చిందట!చంద్రుడిపై కుందేలు అనేది అందమైన అబద్ధమైనా అది మనకు అమితంగా ఇష్టమైన అబద్ధం! అసలు మన కుందేలు అక్కడెక్కడో ఉన్న చంద్రుడిపైకి ఎలా చేరింది? ప్రపంచ వ్యాప్తంగా పాచుర్యంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం.... బుద్ధుడు ఊరూరూ తిరిగి, బోధనలు చేసి అలిసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. ఇది గమనించిన జంతువులు తమకు తోచిన పరిధిలో బుద్ధుడు తినడానికి రకరకాల పదార్థాలు తీసుకువచ్చాయి. పాపం! ఒక కుందేలు దగ్గర మాత్రం ఏమీ ఉండదు. ‘నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అంటూ మంటల్లో దూకి చనిపోతుంది కుందేలు. కుందేలు ఆత్మత్యాగానికి చలించిన బుద్ధుడు దానికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడిపై ఉండి కనువిందు చేసేలా వరమిస్తాడు.మూడుసార్లు పుట్టాడు...ఎవరైనా సరే ఒక్కసారే పుడతారు. పురాణాల ప్రకారం చంద్రుడు మాత్రం మూడుసార్లు పుట్టాడు. అందుకే చంద్రుడిని త్రిజన్మి అని కూడా అంటారు. చంద్రుణ్ణి మొదటిసారి బ్రహ్మ సృష్టించాడు. రెండోసారి అత్రి మహర్షి కన్నుల నుంచి ఉద్భవించాడు. రాక్షసులు, దేవతల క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పునర్జన్మ పొందాడు.డస్ట్బిన్ కాదు...మనిషంటేనే నిరంతరం చెత్తను పారబోస్తుండే జీవి. అతడా చెత్త వేయడానికి భూగ్రహం సరి΄ోక చంద్రుని మీదా బోలెడంత ΄ారబోస్తున్నాడు. పనికి రాకుండా పోయిన రోవర్లూ, విఫలమైన రాకెట్లూ, పంపిన ఉపగ్రహాలూ, ఆస్ట్రొనాట్ల బూట్లూ, బ్లాంకెట్లూ ఇలాంటివెన్నో అక్కడ. అంతరిక్ష ప్రయాణికులు బ్యాగుల్లో ΄ోసి అక్కడ ΄ారబోసిన యూరిన్ బ్యాగులే 100కు పైగా ఉన్నాయక్కడ. ఇలా ఇప్పటివరకూ చంద్రుడి మీద మనిషి పారబోసిన చెత్త బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 2,27,000 కిలోలు.చంద్రపాలుమనకు భూకంపాలలాగే చంద్రుడి మీదా చంద్రకం΄ాలు వస్తుంటాయి. ఇంగ్లిషులో మూన్క్వేక్స్. ఇవి మళ్లీ నాలుగు రకాలు. చాలా లోతుగా వచ్చేవి డీప్ క్వేక్స్, ఉల్కలేవైనా చంద్రుణ్ణి ఢీకొడితే వచ్చేవి మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రతతో వచ్చేవి థర్మల్ క్వేక్స్... ఇవి మూడూ ఒకరకం. కానీ ‘షాలో మూన్ క్వేక్స్’ మాత్రం చాలా భయంకరం. భూకంపం సెకన్లపాటు కొనసాగితేనే మహా ఉత్పాతం కదా... కానీ చంద్రకంపం దాదాపు పదినిమిషాలు మొదలుకొని అరగంట ΄ాటూ అదేపనిగా వస్తుంది.లూనార్ స్మెల్...చంద్రునికో వాసన కూడా ఉంటుంది. దాన్నే ‘లూనార్ స్మెల్’ అంటారు. అక్కడ వాతావరణం ఉండదు. అప్పుడు స్మెల్ ఎలా అనే అనుమానం రావచ్చు. అ΄ోలో–11కు చెందిన ఆస్ట్రొనాట్స్అందరి స్పేస్ సూట్లకు అంటుకుపోయి ఒకేలాంటి వాసన కొట్టడంతో ఈ విషయం తెలిసొచ్చింది. ఘాటైన మెటాలిక్ స్మెల్లాగా. క్రాకర్స్ కాలిపోయాక బాగా మండిన గన్΄ûడర్లా ఉండే వాసన ఇదంటూ ఖచ్చితంగా తెలిపినవాడు హరిసన్ జాక్ స్మిత్ అనే అపోలో–17 కు చెందిన సైంటిస్ట్ ఆస్ట్రొనాట్.ఆఖరి మజిలీ...΄ాపం... అప్పుడప్పుడూ అతడు శశికాంతుడా శ్మశానమా అనే డౌటు కూడా వస్తుంటుంది. చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలని చాలా మంది భూలోక వాసుల కోరిక. అందుకే 450 బీసీ కాలం నుంచే కొందరు తమ చితాభస్మాన్ని చంద్రుడి మీద పడేలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేయమని వీలునామా రాసేవారు. యూజీన్ షూమాకర్ అనే ఆస్ట్రొనాట్కు చంద్రుని మీదకు వెళ్లాలని కోరిక. అయితే అతడు ఓ శారీరక లోపం కారణంగా చంద్రుణ్ణి చేరలేక΄ోయాడు. కానీ ఏనాటికైనా చంద్రుణ్ణి చేరాలన్న అతడి కోరిక నెరవేరకుండానే కారు యాక్సిడెంట్కు గురై 1997 లో మరణించాడు. అతడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న నాసా... అతడి భార్య, పరిశోధనల్లో సహచరి అయిన కరోలిన్ దగ్గర్నుంచి అనుమతి తీసుకుని లూనార్ ్రపాస్పెక్టర్ అనే ఉపగ్రహోపకరణంతో చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలోని ఓ క్రేటర్లోకి సమాధయ్యేలా చితాభస్మాన్ని జల్లి 1998లో అతడి కోరిక తీర్చారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ లాంటివాళ్లు తమ స్పేస్ ఎక్స్తో 2019లో 152 మంది చితాభస్మాల్ని అంతరిక్ష వైతరణిలో నిమజ్జనం చేశారు.మూన్ డస్ట్ ఫీవర్ప్రస్తుతానికి ఎవరు పడితే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి చంద్రుడేమీ పిక్నిక్ స్పాట్ కాదు. మామూలు వ్యక్తులు చంద్రుడి మీదకి వెళ్లడం సాధ్యం కాదు. అక్కడ ఉండే దుమ్మూధూళికి మూన్ డస్ట్ అని పేరు. అది పీల్చడం ఎంతో ప్రమాదకరం. స్పేస్ సూట్ తొడుక్కుని వెళ్లినా బట్టల్లోకి చేరిపోతుంది. అది ‘లూనార్ హే ఫీవర్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీన్నే మూన్ డస్ట్ ఫీవర్ అని కూడా అంటారు.ధారాసింగ్ ముందే అడుగు పెట్టాడు‘ఇదెలా సాధ్యం!’ అనుకోవద్దు. సినిమాల్లో ఏదైనా సాధ్యమే కదా! విషయంలోకి వస్తే....1967లో హిందీలో ‘చాంద్ పర్ చడాయి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లో ప్రఖ్యాత రెజ్లర్ ధారాసింగ్ వ్యోమగామి ఆనంద్ ΄ాత్రలో నటించాడు. తన అసిస్టెంట్ ‘భాగు’తో కలిసి చంద్రుడిపై అడుగు పెట్టిన ఆనంద్ అక్కడ మాన్స్టర్లతో వీరోచితంగా ΄ోరాడుతాడు. ఈ ఫైటింగ్ విషయం ఎలా ఉన్నా ‘చంద్రయాన్’ లాంటి సందర్భాలలో ఈ సినిమాలోని స్టిల్స్ను సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేస్తుంటాడు అతడి కుమారుడు విందు ధారాసింగ్. -
సెన్సెక్స్ @ 50000
భారత స్టాక్ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేష్, సత్యం కుంభకోణాలను చూసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్–19 సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ.., వాటిని తానే తిరగరాస్తూ ముందుకు సాగింది. పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా కోలుకుని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుబెట్టుకుంది. 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఇప్పటివరకు 16 శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్)ని అందించింది. కోవిడ్ ముందు... తర్వాత..! కోవిడ్ వైరస్తో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు డిమాండ్ సన్నగిల్లడంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో çసరిగ్గా 10 నెలల సెన్సెక్స్ కిత్రం(మార్చి 24న) సెన్సెక్స్ 25,638 స్థాయికి దిగివచ్చింది. ఈ కరోనా కాలంలో సెన్సెక్స్ ప్రపంచ ఈక్విటీ సూచీల్లోకెల్లా అత్యధికంగా 80 శాతం నష్టపోయింది. ఒకవైపు సంక్షోభం దిశగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజురోజుకూ దిగివస్తున్న ఈక్విటీ సూచీలు.. వెరసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే నిరాశావాదంతో బుల్ మార్కెట్ పుట్టి, ఆశావాదంతో పరుగులు పెడుతుందనే వ్యాఖ్యలను నిజం చేస్తూ భారత మార్కెట్ దూసుకెళ్లడం సెన్సెక్స్కు కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ అంచనాలు, కోవిడ్–19 వ్యాక్సిన్కు ఆమోదం, డాలర్ బలహీనతతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు సెన్సెక్స్ సంచలన ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ మార్చి కనిష్టం నుంచి అంటే 208 రోజుల్లో 24,500 పాయింట్లు లాభపడింది. సూచీ 50 వేల స్థాయిని చేరుకొనే క్రమంలో గతేడాది మార్చి 13న 2,889 పాయింట్లను ఆర్జించి తన జీవిత చరిత్రలో అతిపెద్ద లాభాన్ని పొందింది. ఇదే 2020 మార్చి 23న 3,934 పాయింట్లను కోల్పోయి అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది. మార్కెట్ విశేషాలు... ► ఫ్యూచర్ గ్రూప్తో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 2 శాతం లాభపడింది. ► క్యూ3 ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో హిందుస్థాన్ జింక్ 4 శాతం నష్టపోయింది. ► హావెల్స్ ఇండియా షేరు 11 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.196.50 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. కొత్త గరిష్టాల నుంచి వెనక్కి... ♦ రెండురోజుల రికార్డుల ర్యాలీకి విరామం ♦ ముగింపులో 50 వేల దిగువకు సెన్సెక్స్ సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 49,624 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590 వద్ద స్థిరపడింది. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడే సెన్సెక్స్ 392 పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అధిగమించి 50,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ సైతం 108 పాయింట్లు పెరిగి 14,753 వద్ద ఆల్టైం హైని అందుకుంది. డాలర్ మారకంలో రూపాయి మూడోరోజూ బలపడటం కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్కు కలిసొచ్చాయి. దేశీయ పరిణామాలు కలిసిరావడంతో గురువారం సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక స్థాయి 50000 స్థాయిపైన 50,097 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 14,731 వద్ద మొదలైంది. మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ప్రెస్పై నిపుణులు ఏమన్నారంటే... గడిచిన రెండు దశాబ్దాల్లో సెన్సెక్స్ 5000 పాయింట్ల నుంచి 50,000 పాయింట్ల వరకు చేసిన ప్రయాణం చిరస్మరణీయం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలే స్టాక్ సూచీలకు సోపానాలుగా మారుతాయి. మున్మందు.., పైపైకే... అనే సూత్రాన్ని విశ్వస్తున్నాను. – రాధాకృష్ణ ధమాని, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అతిపెద్ద బుల్ మార్కెట్ ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో మార్కెట్ పెరిగేందుకు అనేక కారణాలు మున్ముందు రానున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. – రాకేశ్ ఝున్ఝున్వాలా, స్టాక్ మార్కెట్ బిగ్బుల్ 50 వేల పాయింట్ల మైలురాయిని అందుకోవడం అనేది సెన్సెక్స్కు కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇది గమ్యంæ కాదు. మరో పదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము. – విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీసీ చీఫ్ ఏప్రిల్ 1, 1979 సెన్సెక్స్ – 100 పాయింట్లు జూలై 25, 1990 సెన్సెక్స్ – 1000 పాయింట్లు ఫిబ్రవరి 7, 2006 సెన్సెక్స్ – 10,000 పాయింట్లు డిసెంబర్ 11, 2007 సెన్సెక్స్ – 20,000 పాయింట్లు మార్చి 4, 2015 సెన్సెక్స్ – 30,000 పాయింట్లు మే 23, 2019 సెన్సెక్స్ 40,000 జనవరి 21, 2021 సెన్సెక్స్ 50,000 -
శూన్యం నుంచి శిఖరానికి..
న్యూఢిల్లీ: సున్నా నుంచి శిఖరానికి(శూన్య టు శిఖర్) బీజేపీ చేరుకుందంటూ త్రిపుర గెలుపును ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనే సమాధానమని ఆయన పేర్కొన్నారు. మూడు ఈశాన్య రాష్ట్రాల ఫలితాల అనంతరం బీజేపీ నూతన ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని స్థాయికి క్షీణించిందని ఆయన ఎద్దేవాచేశారు. పలు రాష్ట్రాల్లో విజయాల దిశగా పార్టీని నడిపిస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముందుకెళ్తున్నారని, బీజేపీ విజయాలకు ఆయనే సూత్రధారని ప్రధాని పేర్కొన్నారు. త్రిపురలోని 25 ఏళ్ల లెఫ్ట్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోసిందని, పార్టీ కార్యకర్తల శ్రమ వల్లే దేశ వ్యాప్తంగా బీజేపీ మర్రిచెట్టులా విస్తరించిందని, వారికే ఈ విజయం అంకితమని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించేందుకు గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రులు ఎన్నో రాత్రులు అక్కడ గడిపారని గుర్తుచేవారు. వాస్తు శాస్త్రంలో ఈశాన్యం ఎంతో ముఖ్యమైన స్థలమని,.. ప్రస్తుతం అక్కడ ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. ఆ రాష్ట్రాలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నాయని చెప్పారు. త్రిపురలో ధనబలంతో గెలిచారన్న లెఫ్ట్ విమర్శలపై స్పందిస్తూ.. ఓటమిని ప్రతిపక్షాలు క్రీడాస్ఫూర్తితో తీసుకోవడం లేదని విమర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(కాంగ్రెస్) గురించి మాట్లాడుతూ ఆయన స్వతంత్ర సైనికుడని పేర్కొన్నారు. ప్రసంగం ప్రారంభానికి ముందు వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల మృతికి ప్రధాని మౌనం పాటించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటకల్లో రాజకీయ హింసకు బీజేపీ కార్యకర్తలు బలయ్యారని, ఇప్పుడు ఒడిశాలో కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మోదీ విధానాలకు ఆమోద ముద్ర ఎన్నికల ఫలితాలపై అమిత్ షా త్రిపురలో బీజేపీ గెలుపు, నాగాలాండ్, మేఘాలయలో మెరుగైన ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ప్రజామోదంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ గెలుపు చరిత్రాత్మకం. నాతో పాటు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు ఆనందకరమైన రోజు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృషి చేశారు. ఆయన పనితీరు, అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆమోద ముద్ర వేశారు’ అని చెప్పారు. -
తెలంగాణ భవన్లో ఘనంగా దీక్షా దివాస్
-
27 సెప్టెంబర్, 1988 ఎర్రజెండా ఎగిరింది!
కడుపులో చల్ల కదలకుండా మయన్మార్ సింహాసనంపై నింపాదిగా కూర్చున్న ‘నియంతృత్వం’ వెన్నులో చలి పుట్టిన చారిత్రక రోజు ఇది. దీనికి కారణం...‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ పార్టీ పుట్టుక. ప్రజాస్వామ్య నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది ఎన్ల్డి. నోబెల్ బహుమతిగ్రహీత ఆంగ్సాన్ సూకి ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. సూకీ పార్టీనీ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మిలటరీ నియంత పాలకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ప్రజా తీర్పు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ 1990 పార్లమెంటరీ ఎన్నికలలో 392 స్థానాలను గెలుచుకుంది ఎన్ఎల్డి. అయితే ప్రజా తీర్పును నియంత పాలకులు ఆమోదించలేదు. ఆ తరువాత ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ బర్మా రాజకీయచరిత్రలో ‘ఎన్ఎల్డి’ ఆవిర్భావం కీలక మార్పులకు దారి తీసింది.