సెమీస్లో అద్వానీ
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ పంకజ్ అద్వానీ 5-0 (68-20, 80-0, 73-10, 72-0, 64-32) ఫ్రేమ్ల తేడాతో కరమ్ ఫాతిమా (సిరియా)పై గెలుపొందాడు.
అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో అద్వానీ 4-3 (25-57, 116-16, 57-41, 79-64, 50-67, 42-85, 66-43) ఫ్రేమ్లో తేడాతో భారత్కే చెందిన ఇష్ప్రీత్ సింగ్ చడ్డాను ఓడించాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో క్రిట్సానట్ లెర్ట్సటాయతోర్న్ (థాయ్లాండ్)తో అద్వానీ తలపడతాడు.