అనుమానం పెనుభూతం!
విశాఖపట్నం: అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం జి.మాడుగుల మండలం కుమ్మరిపూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఓ మహిళను గ్రామస్తులు కిడ్నాపర్ అని అనుమానించారు.
అంతే ముందూ వెనుక చూడకుండా పలువురు గ్రామస్తులు ఏకమై ఆ మహిళను చంపి పాతిపెట్టారు. ఈ హత్య ఘటనలో 15 మంది గ్రామస్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.