land grab case filed
-
ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
హైదరాబాద్, సాక్షి: మణికొండ పోకల్వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్మాల్ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్బుక్లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్బుక్లు జారీ చేశారు. అయితే.. బ్లాక్ లిస్ట్లో ఉన్న ల్యాండ్కు పాస్ బుక్లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్పై కేసు
-
టీడీపీ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు నమోదు
విశాఖ : టీటీపీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్పై భూ కబ్జా కేసు నమోదైంది. తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఎమ్మెల్యేపై రాజేష్బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పెందుర్తికి చెందిన రాజేష్బాబు ఒమెన్లో ఉంటున్నాడు. అతనికి స్వగ్రామంలో ఇల్లు, ఖాళీ స్థలం ఉంది. అయితే ఎమ్మెల్యే, అతని అనుచరులు తన ఇంటి కాంపౌండ్ వాల్ను కూల్చేసి... స్థలాన్ని కబ్జా చేశారని రాజేష్బాబు ఒమెన్ నుంచి ఈ మెయిల్ ద్వారా విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే పీలా గోవింద్పై భూ కబ్జా కేసు పెట్టారు. సమగ్ర దర్యాప్తు చేసి నిజనిజాలు తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. గతంలోనూ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉన్నాయి.