మరిపెడ చెక్పోస్ట్ వద్ద రూ. 2 లక్షలు పట్టివేత
వరంగల్: వరంగల్ జిల్లా మరిపెడ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కారును పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించి... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మర చేశారు. ఆ క్రమంలో గత వారం రోజుల వ్యవధిలో పలుప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.