నగరపంచాయతీల్లో ’ఉపాధి’ పనులు కల్పించాలి
నల్లగొండ టౌన్ : దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని నగర పంచాయితీల్లో రద్దు చేయడం వలన కూలీలకు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకటరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, నగరపంచాయతీలలో అమలుచేస్తున్నప్పటì కీ కేవలం దేవరకొండ, హుజూర్నగర్లలో నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారి అయిలయ్య, ఎం.రాములు, బొప్పని పద్మ, కె.నగేష్, కె.ఆనంద్, సీతయ్య, పాండు, వేముల మహేందర్, రొడ్డ అంజయ్య, ఎం.సైదులు, కత్తుల లింగస్వామి, పులుసు సత్యం, పద్మావతి, జిల్లా అంజయ్య, రమణ, బేగం తదితరులు పాల్గొన్నారు.