-
ఘనంగా మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి రథోత్సవం (ఫోటోలు)
-
పానకాల స్వామికి రూ.38 కోట్ల ఆదాయం
విద్యానగర్ (గుంటూరు), న్యూస్లైన్ :మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూముల వేలంలో రూ.38 కోట్ల ఆదాయం లభించింది.మొత్తం 48 ప్లాట్లకు సీల్డు టెండరుతోపాటు బహిరంగ వేలం నిర్వహించారు. వీటిలో 26 ప్లాట్లకు టెండర్లు ఖరారు అయ్యాయి. వివరాలు ఇలావున్నాయి. వీజీటీఎం ఉడా, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో శుక్రవారం విక్రయాలు జరిగాయి. గుంటూరు విద్యానగర్ 3వలైను లోని దేవాలయ భూముల వేలం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ బొంతు మహేశ్వరరెడ్డి, ఈవోలు నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత దరఖాస్తులను ప్లాట్లు వారీగా విభజించి వేలం నిర్వహించారు. మొత్తం 48 ప్లాట్లకు వేలం నిర్వహించగా తొమ్మిది ప్లాట్లకు సింగిల్ టెండర్లు రావడంతో వాటి వేలం నిలిపివేశారు. ఒకటికి మించి ఎక్కువ టెండర్లు వచ్చిన 26 ప్లాట్లకు వేలం నిర్వహిచారు. గరిష్టంగా చదరపు గజానికి రూ. 35 వేలు, కనిష్టంగా రూ. 24 వేలకు వేలం జరిగింది. ప్లాట్లనుకొనుగోలు చేసిన సభ్యులకు మూడు రోజుల్లోగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ పంపనున్నట్టు ఉడా చైర్మన్ తెలిపారు. ఆర్డర్స్ వచ్చిన తరువాత మూడు రోజులకు 10 శాతం నగదు, 15 రోజులకు 15 శాతం, 30 రోజులకు 25 శాతం, 45 రోజులకు 25 శాతం చెల్లించాలని ఇదేవిధంగా 60 వ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. 26 ప్లాట్లకు రూ. 37,63,86,527 ఆదాయం వచ్చిందని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వేలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు గజం రూ.23 వేలు నిర్ణయించగా కొనుగోలుదారులు అధిక మొత్తం చెల్లించి ఆదాయాన్ని సమకూర్చి స్వామి వారి కృ పకు పాత్రులయ్యారని తెలిపారు. ప్రారంభం నుంచి 57 ప్లాట్లకు వేలం నిర్వహించారని అందులో 5 ప్లాట్లు గతంలోనే అమ్మకాలు జరిగాయన్నారు . నాలుగు ప్లాట్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయన్నారు. మిగిలిన 48 ప్లాట్లను వేలానికి పెట్టగా 26 ప్లాట్లకు వేలం జరిగిందన్నారు. మిగిలిన 22 ప్లాట్లకు మొదటి విడత చేపట్టిన ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయిన తరువాత వేలం నిర్వహణకు ప్రయత్నిస్తామన్నారు. ఉడాకు నష్టం.. వీజీటీఎం ఉడా, దేవాదాయశాఖ అధికా రులు నిర్వహించిన ఆలయ భూముల వేలంలో ప్లాట్లు దక్కించుకున్నావారే లాభపడినట్టయింది. చదరపు గజం గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.24 వేలకు పాడుకున్నారు. అంటే సగటు ధర రూ 30 వేలు పలికింది. అయితే ఈ ప్రాంతంలో గజం ధర రూ. 45 వేల నుంచి రూ. 60వేల వరకు ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఏపీలో అల్లర్లు చేసింది వీరే..
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
కర్నూల్ లో వజ్రాల వేట
యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు!.. కానీ..
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
తప్పక చదవండి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Advertisement