స్కూలు వ్యాను ఢీకొని ఒకరి మృతి
నెల్లూరు: బస్సు కోసం నిలబడి ఉన్న వృద్ధురాలిని స్కూలు వ్యాను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం జువ్వలగుంటపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మమ్మ(60) బస్సు కోసం గ్రామ మలుపులో వేచి ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు వ్యాను ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.