రాహుల్ గాంధీకి సమన్లు
ముంబై: మహారాష్ట్రలోని భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు గైర్హాజరు కావడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా కోర్టు హాజరు కాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మే 8 న కోర్టు కు హాజరుకావాలని ఆదేశించింది.గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ముంబై హైకోర్టులో రాహుల్ గాంధీపై డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే.