ఘనంగా ప్రారంభమైన 'స్కై ఫెస్ట్ 2015'
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం స్కై ఫెస్ట్-2015 వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు అలరించనున్న ఈ గగన పండుగ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ సెక్రటరీ జెయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ వేడుకలో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఆకాశగంగ బృందం చేసే పారా జంపింగ్, హేయిర్ బెలూన్స్ విన్యాసాలు, మ్యూజికల్ ఈవెంట్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.