2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, 2016లో మధ్యంతర ఎన్నికలు తప్పవని తిరుపతి ఎంపీ చింతా మోహన్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదన్నారు. ముందున్న రెండు పార్టీలకు ఒక్కోదానికి 70, కాంగ్రెస్కు 25 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ చెప్పారు. తెలంగాణలో 119 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారాన్ని చేపడుతుందన్నారు.