బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి
కమాన్పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.