స్టాలిన్ సహా 60 మంది ఎమ్మెల్యేలపై కేసు నమోదు
తమిళనాడు: డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తమిళనాడు అసెంబ్లీ నుంచి వారం పాటు డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నెల 17న అసెంబ్లీ స్పీకర్ తమపై విధించిన సస్పెన్షన్ను నిరసిస్తూ సచివాలయంలోనూ అసెంబ్లీ ప్రాంగణం వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు, స్టాలిన్ ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్ సహా 60 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.