విజువల్ వండర్గా...
పౌరాణిక నేపథ్యంతో మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై రూపొందుతున్న ‘వైవస్వత’ చిత్రం హైదరాబాద్లో ఆరంభమైంది. వరుణ్-కార్తికేయల జంట దర్శకత్వంలో ఎస్. నాగరాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ వెండితెరకు రాని ఓ కథతో ఈ చిత్రం ఉంటుందని వరుణ్-కార్తికేయ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్పరంగా అద్భుతంగా ఉంటుందని, సాంకేతికంగా భారతీయ సినిమా ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రఘు చతుర్వేదుల, ఆర్ట్: ఎన్. ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కె బంగారి.