Top Stories
ప్రధాన వార్తలు
![Rekha Gupta Named Next Delhi CM, Parvesh Verma To Be Deputy1](/styles/webp/s3/article_images/2025/02/19/WhatsApp%20Image%202025-02-19%20at%2020.12.30%20%281%29.jpeg.webp?itok=ZINx_e3I)
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం ఉత్కంఠతకు తెరపడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. సీఎంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సీఎంగా రేఖా గుప్తా రేపు(గురువారం) మధ్యాహ్నం 12:35 గంటలకు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం ఎంపికపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో 47 మంది ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్ఖడ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లురామ్ లీలా మైదానంలో ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం మేరకు.. రామ్ లీలా మైదానంలో మూడు వేదికలను సిద్ధం చేయనున్నారు. ఒక వేదికపై ఢిల్లీ కొత్త సీఎం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా, రెండో వేదికను మత గురువులు కోసం, మూడో వేదికపై బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన 200 పైగా ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఆప్ అధినేత,మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షుడు దేవేందర్ యాదవ్లను సైతం ఆహ్వానించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
![YS Jagan Fire On Chandrababu Govt After Mirchi Yard Visit2](/styles/webp/s3/article_images/2025/02/19/YS-Jagan-Fire-On-Chandrababu_2.jpg.webp?itok=ZVI0wlWE)
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయంజగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
![Tdp Leaders Attempt To Conspiratorially Implicate Vallabhaneni Vamsi In Case3](/styles/webp/s3/article_images/2025/02/19/CCTv4.jpg.webp?itok=__H41-kI)
వల్లభనేని వంశీ కేసులో అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్మీట్ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.కస్టడీ పిటిషన్పై విచారణకాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో వంశీ పేర్కొన్నారు.వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
![KCR BRS Party Key Meeting At Telangana Bhavan Feb 19th Live Updates4](/styles/webp/s3/article_images/2025/02/19/kcr_speech3.jpg.webp?itok=xrcjk643)
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్పోర్టును అప్పగించి.. సాధారణ పాస్పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు.
![Will Young, Tom Latham Hits Tons, New Zealand Post Big Total 5](/styles/webp/s3/article_images/2025/02/19/WhatsApp%20Image%202025-02-19%20at%2018.39.32.jpeg.webp?itok=h__okdWD)
లాథమ్, యంగ్ సెంచరీలు.. పాక్ ముందు భారీ టార్గెట్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కరాచీ వేదికగా పాకిస్తాన్(Pakistan)తో జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు.73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 114 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన ఈ కివీ ద్వయం.. క్రీజులో సెటిల్ అయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు డెవాన్ కాన్వే(10), డార్లీ మిచెల్(10), విలియమ్సన్(1) విఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.అఫ్రిదిని ఉతికారేశారు..తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులిచ్చి వికెట్ ఏమీ సాధించలేకపోయాడు. గాయం నుంచి తిరిగి వచ్చాక అఫ్రిది తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్లో పేస్ కూడా తగ్గింది. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయడంలో కూడా అఫ్రిది విఫలమవుతున్నాడు. మరోవైపు హ్యారీస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.తుది జట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: PAK vs NZ: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే సూపర్ సెంచరీ
![Bollywood actress Swara Bhasker Contraversey Tweet On Chhaava Movie6](/styles/webp/s3/article_images/2025/02/19/actress-Swara-Bhasker.jpg.webp?itok=mcAnRjiM)
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025
![Telangana Government Key Decision on LRS7](/styles/webp/s3/article_images/2025/02/19/revanth%20reddy%20and%20telangana%20govt.jpg.webp?itok=dLfQ_K9o)
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాయితీ అమలు మార్చి 31 వరకు గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది. ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
![LIC Introduces Smart Pension Plan And Details8](/styles/webp/s3/article_images/2025/02/19/lic.jpg.webp?itok=jxkBxtXf)
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్కు.. మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025
![Ap High Court Key Comments On Establishment Of A Bench In Kurnool9](/styles/webp/s3/article_images/2025/02/19/highcourt2.jpg.webp?itok=VXFvr6yM)
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్ను పెండింగ్లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది.
![YouTube Village turning content into cash and change one video at a time in Chhattisgarh viral10](/styles/webp/s3/article_images/2025/02/19/youtubechannel.jpg.webp?itok=m5ubKVJH)
కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ
ఛత్తీస్గఢ్లోని ఒక చిన్న గ్రామం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రాయ్పూర్కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం యూ ట్యూబ్ (YouTube) వీడియోలతో ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది. తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్ కింగ్లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.అందుకే ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది. ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి. వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్ స్కిట్లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ తలొక పాత్ర పోషిస్తారు.సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు. ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్, స్టడీ, కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభంలో చాలా టెక్నికల్ సమస్యలు,కాపీ రైట్ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు. మొదట్లో మొబైల్ ఫోన్లలో షూట్ చేసేవారు కాస్తా ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు. హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా, చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సే: కేటీఆర్
బయోఏషియా 2025: ఒకే వేదికపై 80 సంస్థలు
జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం: వైఎస్సార్సీపీ
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. అలా ఎలా వెళ్లాడబ్బా!
లాథమ్, యంగ్ సెంచరీలు.. పాక్ ముందు భారీ టార్గెట్?
సార్.. మరో మిత్రదేశం పాకిస్తాన్ నుంచి మీకు ఫోన్ సార్!
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
ఇక్కడయితే మన ఆస్తులన్నీ జరిమానాలకే సరిపోయేవి!
కేసులు పెట్టడం.. లోపలేయడం.. కొట్టడం..: హైకోర్టు ఆగ్రహం
ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
నీ ఇంటికొచ్చి కొడతా నా కొ...కా...!
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సే: కేటీఆర్
బయోఏషియా 2025: ఒకే వేదికపై 80 సంస్థలు
జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం: వైఎస్సార్సీపీ
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. అలా ఎలా వెళ్లాడబ్బా!
లాథమ్, యంగ్ సెంచరీలు.. పాక్ ముందు భారీ టార్గెట్?
సార్.. మరో మిత్రదేశం పాకిస్తాన్ నుంచి మీకు ఫోన్ సార్!
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
ఇక్కడయితే మన ఆస్తులన్నీ జరిమానాలకే సరిపోయేవి!
కేసులు పెట్టడం.. లోపలేయడం.. కొట్టడం..: హైకోర్టు ఆగ్రహం
ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
నీ ఇంటికొచ్చి కొడతా నా కొ...కా...!
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
సినిమా
![Tollywood Hero AKhil Akkineni With His Engagement Girl Zainab Ravdjee](/styles/webp/s3/article_images/2025/02/19/Hero-AKhil-Akkineni.jpg.webp?itok=dYntdWjn)
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025
![Pooja Hegde To Do Special Song In Rajinikanth Coolie Movie](/styles/webp/s3/article_images/2025/02/19/Pooja-Hegde3.jpg.webp?itok=TsvwQ0s4)
రజనీకాంత్తో ‘జిగేల్ రాణి’ స్టెప్పులు.. పూజాకి ‘సూపర్’ ఛాన్స్
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ఓ స్పెషల్ సాంగ్కి స్టెప్పులేయబోతుందట.‘కావాలయ్యా’తరహాలో ..రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.పూజాకి కొత్తేమి కాదుస్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
![Ishita Dutta Ready To Welcome Second Baby After Two Years of First Child](/styles/webp/s3/article_images/2025/02/19/Ishita-Dutta.jpg.webp?itok=WHfbN8fG)
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta)
![Shabana Azmi Reveals She Wanted To Remove Jyotika From Netflix Dabba Cartel Web Series](/styles/webp/s3/article_images/2025/02/19/Jyothika1.jpg.webp?itok=BoEF_Ly4)
జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
ఈ వెబ్ సిరీస్లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్రాజ్ రావు, జిస్సు సేన్గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.జ్యోతికను తీసేయాలనుకున్నా..ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జ్యోతిక, షబానా అజ్మీనా తప్పే..తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?
క్రీడలు
![Naseem Shah removes Kane Williamson for 1 with a peach in PAK vs NZ 5](/styles/webp/s3/article_images/2025/02/19/williamson1.jpg.webp?itok=Nnubp7uV)
పాక్ బౌలర్ సూపర్ బాల్.. పాపం కేన్ మామ! ఐదేళ్ల తర్వాత?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్నతొలి మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్( Kane Williamson) తీవ్ర నిరాశపరిచాడు. పాక్ పేసర్ నసీమ్ షా అద్బుతమైన బంతితో విలియమ్సన్ను బోల్తా కొట్టించాడు. అతడి దెబ్బకు కేన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నసీమ్ షా.. తొలి బంతిని కేన్ మామకు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివరీగా ఆఫ్సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ బ్యాక్ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే అతడి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. దీంతో కేన్ మామ హెడ్ను షేక్ చేస్తూ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా విలియమ్సన్ సింగిల్ డిజిట్ స్కోర్కు అవుట్ కావడం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.రవీంద్ర దూరం..కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ విల్ యంగ్(88 నాటౌట్) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.29 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్లో గాయపడిన కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్ను వీడి బయటకు వెళ్లిపోయాడు.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ WHAT A BALL FROM NASEEM SHAH ⚡⚡ pic.twitter.com/ghHOFkiSlU— Johns. (@CricCrazyJohns) February 19, 2025
![Unless You Are Rich: Pullela Gopichand Advice To Parents Goes Viral6](/styles/webp/s3/article_images/2025/02/19/Pullela-Gopichand1.jpg.webp?itok=0pOTnJxU)
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్
![Fakhar Zaman walk off the field in the first over vs New Zealand in Champions Trophy opener7](/styles/webp/s3/article_images/2025/02/19/zaman.jpg.webp?itok=5Q48JJN9)
తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్కు భారీ షాక్..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)కి బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.గాయం కారణంగా ట్రైసిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అదే సిరీస్లో గాయపడిన కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు.ఇక తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్లో మూడో బంతికి విల్ యంగ్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జమాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కూడి కాలికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. అతడి స్దానంలో కమ్రాన్ గులాం సబ్స్ట్యూట్గా మైదానంలోకి వచ్చాడు. ఇప్పటివరకు జమాన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదుకాగా అతడి గాయంపై పీసీబీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. "ఫఖర్ జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని" పీసీబీ ట్విటర్లో రాసుకొచ్చింది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయితే పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్
![Goosebumps: Sam Curran after his Brother Maiden ODI century For Zimbabwe8](/styles/webp/s3/article_images/2025/02/19/bensam.jpg.webp?itok=M62Y0d7y)
శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్
ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లొర్కన్ టక్కర్ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ ఎన్గరవ, ట్రెవర్ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ప్రారంభించిన బెన్ కరన్ తొలి వికెట్కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (59 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ ఎక్స్ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్ ఏ బాయ్!.. అద్బుత ఇన్నింగ్స్’’ అని ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కరన్కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్ కరన్ పెద్దవాడు కాగా.. బెన్ కరన్ రెండోవాడు. ఇక సామ్ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్, సామ్ మాత్రం ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్కే దక్కింది. 28 ఏళ్ల బెన్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. 26 ఏళ్ల సామ్ కరన్ బౌలింగ్ ఆల్రౌండర్. లెఫ్టార్మ్పేస్ మీడియం బౌలర్ అయిన అతడు లెఫ్టాండర్ బ్యాటర్. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్ కరన్ కూడా బౌలింగ్ ఆల్రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగనుంది.చదవండి: సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
బిజినెస్
![Australian Woman Loses Rs 4.3 Crore To Online Scam](/styles/webp/s3/article_images/2025/02/19/online-scam.jpg.webp?itok=HZ86I-5R)
ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్లైన్లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.ఫేస్బుక్లో రెండో స్కామ్నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్బుక్లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్స్టర్డామ్కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
![Bajaj Allianz introduced retirement plan Guaranteed Pension Goal2](/styles/webp/s3/article_images/2025/02/19/bajaj01.jpg.webp?itok=gwqqLKtC)
రిటైర్మెంట్ ప్లాన్ కోసం కొత్త ప్లాన్
బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ 2 అనే కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ప్లాన్ను పదవీవిరమణ సమయంలో నిర్దిష్టమైన రాబడులు వచ్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లో ఈ తరహా రిటైర్మెంట్ ప్లాన్లు చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఇటువంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసేముందు పాలసీదారులు అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బజాన్ కొత్త పథకంలోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.దీర్ఘకాల వాయిదా: ఈ ప్రత్యేక ఫీచర్ 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక భవిష్యత్తును ముందుగానే నిర్ణయించుకునేందుకు తోడ్పడుతుంది. వాయిదా వ్యవధిని 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఇది పొదుపు పెరగడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.మల్టిపుల్ యాన్యుటీ పేఅవుట్ ఆప్షన్లు: ఈ ప్లాన్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ (ఆర్ఓపీ) ఎంపికలతో సహా వివిధ యాన్యుటీ చెల్లింపు సదుపాయాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత రిటైర్మెంట్ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉంటాయి.కస్టమైజబుల్ ఆర్ఓపీ: పాలసీదారులు కొనుగోలు ధర 50% నుంచి 100% రాబడిని ఎంచుకోవచ్చు. ఇది యాన్యుటీ చెల్లింపులను పెంచుతుంది.గ్యారంటీడ్ లైఫ్ టైమ్ ఇన్ కమ్: రిటైర్మెంట్ సమయంలో స్థిరమైన ఆదాయాన్ని ఇది నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్ఈసీఈ సందర్భంగా బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈఓ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పదవీ విరమణ తర్వాత చాలాఏళ్లు జీవిస్తున్నారని చెప్పారు. కానీ సరైన ప్రణాళికలేక రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్ను తీసుకోవాలని పేర్కొన్నారు.
![US SEC seeking assistance from Indian govt to serve a complaint to Adani](/styles/webp/s3/article_images/2025/02/19/adani001.jpg.webp?itok=m_IxFNzq)
అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్ఈసీ
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఫిర్యాదు చేసేందుకు భారత ప్రభుత్వం సాయం కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ఈసీ) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న అదానీలకు తమ ఫిర్యాదును అందించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ఎస్ఈసీ న్యూయార్క్ జిల్లా కోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ పేర్కొంది. అయితే అందుకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్ తన ఎక్స్లో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా స్పందిస్తూ అదానీతో ఉన్న ‘పర్సనల్ మామ్లా(వ్యక్తిగత సంబంధం)’కు మోదీ కట్టుబడి ఉంటారో.. లేదో.. తెలియాలని కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ గతంలో రెండు సంస్థలను కూడా నియమించింది.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి ‘నిరాధారమైనవి’ అని కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని చెప్పింది. ఎస్ఈసీ అభ్యర్థనపై భారత ప్రభుత్వం ఇంకా ఏ విధంగానూ స్పందించలేదు. ప్రభుత్వం అదానీలకు ఫిర్యాదును అందించడానికి అంగీకరిస్తుందో.. లేదో చూడాలి.
![Elon Musk announced the launch of Grok 3 latest iteration of his AI chatbot](/styles/webp/s3/article_images/2025/02/19/grok01.jpg.webp?itok=os8BzEfB)
‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్
ఎక్స్ఏఐ కొత్త వర్షన్ ‘గ్రోక్ 3(Grok 3)’ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్(Elon Musk) ప్రకటించారు. ఎక్స్లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్లో ఈ కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ను మస్క్ ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ గ్రోక్ 3 అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలను హైలైట్ చేశారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర!గ్రోక్ 3తోపాటు డీప్ సెర్చ్ అని పిలువబడే కొత్త స్మార్ట్ సెర్చ్ ఇంజిన్ను కూడా ఈ సందర్భంగా ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారులకు మెరుగైన పరిశోధనలు అన్వేషించడానికి, డేటాను విశ్లేషించడానికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రోక్ 3 మోడల్ ఎక్స్ ప్లాట్ఫామ్ ప్రీమియం ప్లస్ చందాదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సూపర్ గ్రోక్ అని పిలువబడే కొత్త సబ్ స్క్రిప్షన్ ద్వారా ఇతరులకు దీని సేవలు అందిస్తున్నట్లు చెప్పింది.
ఫ్యామిలీ
![Legal Advice: What Is POCSO Act? How To Protect Childrens12](/styles/webp/s3/article_images/2025/02/19/posco.jpg.webp?itok=Oam_z-Mr)
చిన్నారుల రక్షణ బాధ్యత అందరిదీ!
నేను ఇటీవల ప్రచార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో పోక్సో చట్టం అనే పదాన్ని తరచు వింటున్నాను. దీని గురించి వివరించగలరా?– సంకా పవన్ కుమార్, తెనాలిచిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతోంది. అంతకుముందు చిన్నారులపై లైంగిక దాడులు లేవని కాదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉన్న కఠినమైన పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కూడా ఈ మధ్యకాలంలో చాలా కేసులను బయటకు తీసుకు వచ్చింది. 2024 ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2019 నుంచి 31–మే 2024 వరకు దేశవ్యాప్తంగా 2,99,759 పోక్సో కేసులు నమోదు కాగా తెలంగాణలో 2,731 – ఆంధ్రప్రదేశ్లో 11,774 కేసులు నమోదయ్యాయి. గత ఐదు సంవత్సరాలలో దాదాపుగా 20 శాతం చిన్నారులపై లైంగిక దాడుల కేసులు పెరిగినట్లుగా చెబుతున్న అంకెలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వెలుగులోకి వస్తున్న కేసుల కన్నా నమోదు కాని కేసుల సంఖ్య రెండింతల పైమాటే!చట్ట ప్రకారం మైనర్ బాలిక/బాలుర పై ఏ విధమైన లైంగిక హింస లేదా దాడి జరుగుతున్న విషయం తెలిసినవారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక దాడి జరిగిందన్న ఖచ్చితమైన సమాచారం మాత్రమే కాదు. లైంగిక దాడి జరిగి ఉండవచ్చు లేదా దాడి జరిగి ఉండే ఆస్కారం ఉంది అన్న సందేహం ఉన్న వారు కూడా ఫిర్యాదు చేయాలి. అలా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా సరే సెక్షన్ 19 పోక్సో చట్టం కింద ఆరు నెలల నుండి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అంశంపై ప్రభుత్వాలు, అలాగే మీడియా కూడా తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రులకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజానిది కూడా!లైంగిక హింస, లైంగిక దాడి, మైనర్ల ఫోటోలు – వీడియోలు అశ్లీల చిత్రాలకి వాడడం, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు/వీడియోలు కలిగి ఉండడం వంటివి కూడా పోక్సో చట్టం కింద నేరాలే. ఆటిజం వంటి మానసిక ఎదుగుదల లేమి, మతిస్థిమితం లేని పిల్లలపై, అలాగే చిన్నపిల్లలపై అధికారం కలిగిన వ్యక్తులు (తల్లిదండ్రులు, టీచర్లు, కొన్ని ప్రత్యేక వృత్తులలో ఉండే అధికారులు మొదలైన వారు) లైంగిక దాడులకు పాల్పడినట్లయితే అవి ‘అతి తీవ్రమైన’ నేరాలుగా పరిగణించబడతాయి. అందుకుగాను యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, బాలలకు ఎటువంటి లైంగిక ఇబ్బంది కలుగుతుందేమోనన్న సందేహం ఉన్నా తక్షణం పోలీసులకి తెలియజేయడం అందరి బాధ్యత. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్ చేయవచ్చు)(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్)
![No plowing no weeding no chemicals organic farming by Raju13](/styles/webp/s3/article_images/2025/02/19/RajuTitus.jpg.webp?itok=mlaIuSXS)
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్!
![The Gannets: Kerala Launches Indias First All-Female Scuba Diving Team14](/styles/webp/s3/article_images/2025/02/19/scuba.jpg.webp?itok=Oxa25-c0)
ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్
కేరళ మన దేశంలో మొదటి మహిళా స్కూబా టీమ్ను సిద్ధం చేసింది. అగ్నిమాపక దళం నుంచి ఎంపిక చేసిన వారితో ఈ టీమ్ను తయారు చేసి ఇక పై వరద ప్రమాదాల్లో వీరి సేవను వినియోగించనుంది.‘గన్నెట్స్’(The Gannets)... ఇదీ కేరళ(Kerala) అగ్నిమాపక శాఖ(Fire Department) తన ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ టీమ్కు(All Women Scuba Diving Team) పెట్టిన పేరు. ఉత్తర అట్లాంటిక్ తీరంలో సముద్రపు లోతుకు దూసుకెళ్లి చేపలను నోట కరుచుకుని ఎగిరే పక్షులే ‘గన్నెట్స్’. ఇకపై కేరళలో ఏవైనా జల ప్రమాదాలు సంభవిస్తే ఈ గన్నెట్స్ దూసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. వీరి మొత్తం సంఖ్య 17. ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ముగించుకొని ఈ టీమ్ మంగళవారం బాధ్యతల్లోకి వచ్చింది. భారతదేశంలో అందరు మహిళల స్కూబా రక్షణ దళం ఇదే.100 మంది నుంచి...కేరళలో వానకాలంలో ఊహించని వరదలు సర్వసాధారణంగా మారాయి. మనుషుల్లో నీళ్లల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే సామర్థ్యం ఉన్న స్కూబా డైవర్స్ ఉండాలని ప్రభుత్వం భావించింది. అయితే వారు ఎందుకు స్త్రీలు కాకూడదు అని ప్రశ్నించుకుంది. అగ్నిమాపక శాఖ నుంచి 100 మంది మహిళలను ఎంపిక చేస్తే వారిలో 17 మంది అన్ని విధాలుగా అర్హులుగా నిలిచి ట్రైనింగ్కు ఎంపికయ్యారు.కఠినమైన ట్రైనింగ్కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అకాడెమీలో ఈ మహిళా సభ్యుల శిక్షణ 21 రోజుల పాటు జరిగింది. స్కూబా డైవింగ్తోపాటు నదులు, చెరువులు, సముద్రాల్లో నీటి స్వభావాన్ని బట్టి ఎలా రక్షణ చర్యలు చేపట్టాలో నేర్పారు. అండర్వాటర్ కెమెరాలు వాడటం కూడా ఇందులో భాగం.]వీరికి 30 మీటర్ల లోతుకు వెళ్లి రక్షించడం నేర్పారు. ‘ట్రైనింగ్ మాకు మొదట్లో కష్టమైంది. కాని అన్ని దశలను దాటగలిగాం. ఇప్పుడు మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల సేవకు సిద్ధం’ అని ఈ టీమ్లోని మహిళలు అన్నారు. ఈ కొత్తశక్తికి స్వాగతం. (చదవండి: చాట్ జీపీటీ బామ్మ..! ఆమె అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్)
![88 Year Old Indian Grandmother Interacts With ChatGPT 15](/styles/webp/s3/article_images/2025/02/19/bamma.jpg.webp?itok=zzN5t0lM)
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్బాట్ అయిన ‘చాట్జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..)
ఫొటోలు
National View all
![title](/styles/webp/s3/article_images/2025/02/19/photo1.jpg.webp?itok=Bcbzw0vX)
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా?
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ
![title](/styles/webp/s3/article_images/2025/02/19/MHADA.jpg.webp?itok=SZGa4iPg)
ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్
దాదర్: ముంబైవ్యాప్తంగా ఖాళీస్థలాల్లో హోర్డింగులు నిర్మించి
![title](/styles/webp/s3/article_images/2025/02/19/Siddaramaiah.jpg.webp?itok=T0UXjwV6)
సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట
బెంగళూరు : ముడా కేసులో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు భారీ ఊరట ద
![title](/styles/webp/s3/article_images/2025/02/19/Mamata-Banerjee.jpg.webp?itok=rVX6Jb_Y)
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున
![title](/styles/webp/s3/article_images/2025/02/19/new%20delhi%20railway%20station%20stampade.jpg.webp?itok=YlVJxJD5)
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్ల
International View all
![title](/styles/webp/s3/article_images/2025/02/19/wallmart.jpg.webp?itok=1d47xuI0)
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్మార్ట్
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు.
![title](/styles/webp/s3/article_images/2025/02/19/zelenskyy.jpg.webp?itok=liWPmreT)
ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం !
వాషింగ్టన్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్య
![title](/styles/webp/s3/article_images/2025/02/19/sunita.jpg.webp?itok=s-knHPP-)
‘రాజకీయ కారణాలతోనే బైడెన్ వారిని వదిలేశారు’
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల
![title](/styles/webp/s3/article_images/2025/02/19/immigrants.jpg.webp?itok=WlMOzC2E)
వలసదారులకు సంకెళ్లు.. వైట్హౌజ్ వివాదాస్పద వీడియో
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస
![title](/styles/webp/s3/article_images/2025/02/19/Pakistan-Army.jpg.webp?itok=VazqWzRU)
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
NRI View all
![title](/styles/webp/s3/article_images/2025/02/17/Mana-American-Telugu-Association.jpg.webp?itok=eLPbfGMr)
MATA అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం 'మన అమెర
![title](/styles/webp/s3/article_images/2025/02/15/Telugu-expats.jpg.webp?itok=IRSa2FZC)
ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు
ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్కామ్ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్ (Israel)
![title](/styles/webp/s3/article_images/2025/02/15/TTA1.jpg.webp?itok=vu0K2RpY)
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్లో జరగనున్నాయి.
![title](/styles/webp/s3/article_images/2025/02/14/NRI1.jpg.webp?itok=Ucp99Q7Z)
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్: మాట (మన అమెరికన్ తెలుగు అసోసియేషన్) బోర్డు మీటిం
![title](/styles/webp/s3/article_images/2025/02/14/Partner-Met-Indian-PM-Modi.jpg.webp?itok=IGc1aOY5)
ప్రధాని మోదీతో మస్క్-శివోన్ పిల్లల అల్లరి
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో
క్రైమ్
![Farmer ends life in Medak](/styles/webp/s3/article_images/2025/02/19/211212.jpg.webp?itok=BnHd1AAI)
ఇల్లరికం అల్లుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పాపన్నపేట(మెదక్): భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని..అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓ భార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తీరా మృతుడి మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మ దంపతులకు కూతురు లావణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. ఎకరంన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండక, నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్కు చెందిన రమేశ్కు ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తున్నాడు. ఇటీవల బోరు వేసి ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చారు. శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య జారిపడగా, తుంటి ఎముక విరిగింది. ఆశయ్యకు శస్త్ర చికిత్సకు రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేశ్తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. సోమవారం సాయంత్రం ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
![pregnant woman dies in karimnagar hospital](/styles/webp/s3/article_images/2025/02/19/556.jpg.webp?itok=IQweI6mu)
అమ్మా.. లే అమ్మ
మల్యాల: ‘మా అమ్మకు ఏమైంది.. అమ్మ.. లే అమ్మా..’ ఆ చిన్నారుల కంటతడి అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. తల్లి తన ఒడిలో ఆడిస్తూ.. అల్లరి చేస్తే అడిగింది ఇస్తూ.. ఏడిస్తే బుజ్జగించే అమ్మ లేదని, ఇక తిరిగి రాదని ఆ పిల్లలకు తెలియదు. అమ్మే లోకంగా.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే పిల్లల అమాయక చూపులు.. అమ్మ లేదని తెలియని ఆ పిల్లలకు ఎప్పుడొస్తుందని అడిగితే ఏం చెప్పాలో తెలియని ఆ తండ్రిని చూసి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ ఓ నిండు గర్భిణి మృతిచెందగా.. ఆమె మృతదేహం వద్ద కనిపించిన ఈ హృదయ విదారకమైన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. నూకపల్లికి చెందిన చెవులమద్ది మహేశ్తో పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన స్రవంతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు నిహాంత్ (7), కూతురు నిక్షిత (3) ఉన్నారు. మహేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. స్రవంతి బీడీలు చేస్తూ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. స్రవంతి మూడోసారి గర్భం దాల్చినప్పటినుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి పరీక్షల కోసం వెళ్లగా.. కడుపులో బిడ్డ కదలడం లేదని, కరీంనగర్కు రెఫర్ చేశారు. అక్కడ కూడా కడుపులో బిడ్డ కదలడం లేదని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి పురుడుపోసినా.. అప్పటికే శిశువు మృతిచెందింది. కాసేపటికి పరిస్థితి విషమించి స్రవంతి కూడా చనిపోయింది.నూకపల్లిలో విషాదంస్రవంతి పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి.. కడుపులో బిడ్డ, తల్లి కూడా మృతిచెందడంతో నూకపల్లిలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా ఆమె కుమారుడు, కూతురు బిక్కుబిక్కుమంటూ చూడడం స్థానికులను కంటతడి పెట్టింది. మా అమ్మకు ఏమైంది అని అక్కడున్నవారిని అమాయకంగా అడగడంతో ఏం చెప్పాలో.. వారిని ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. నూకపల్లిలో స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాదిమంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.
![Young Man Ends Life In Hyderabad](/styles/webp/s3/article_images/2025/02/19/1312.jpg.webp?itok=RGEFVJXw)
Moinabad: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు పాడె ఎక్కాడు..
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
![Software employee Ends Life On Online betting](/styles/webp/s3/article_images/2025/02/19/112.jpg.webp?itok=lvdjSTMk)
ఆన్లైన్ బెట్టింగ్లో రూ.కోటి రూపాయలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ యువకుడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపా లిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవుల సంజయ్ (28)సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. ఆరు నెలల కిందట అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపో యింది. అప్పులు సుమారు రూ. కోటి వరకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక, జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దేవుని పల్లి ఎస్సై రాజు తెలిపారు.