మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ డేవిడ్ దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేవిధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకుని పని చేయాలన్నారు. పరిష్కారం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 173 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ నర్మద, జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్
ప్రజావాణిలో 173 వినతులు
Comments
Please login to add a commentAdd a comment