సిరికొండ/జక్రాన్పల్లి/మోపాల్(నిజామాబాద్రూరల్): విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన డీవీ కృష్ణ సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నాయకులు కోరారు. సిరికొండ, జక్రాన్పల్లి, మోపాల్ మండలాల్లో ఆదివారం డీవీ కృష్ణ సంస్మరణ సభ వాల్పోస్టర్లను ప్రజాపంథా నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 26న డీవీకే 2వ వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రంలో ఆయన స్మారక స్థూపాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. నాయకులు దేవరాం, రామకృష్ణ, దామోదర్, రమే ష్, సాయారెడ్డి, రమేష్, లింబాద్రి, నజీర్, శ్రీనివాస్, అనిల్, టేకేదర్ లక్ష్మీ, నర్సయ్య, చంద్రపు సాయాగౌడ్, దండు గంగమల్లు, డప్పు గంగారాం, రాజు, మహేష్, వీరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment