మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Published Thu, Feb 20 2025 8:16 AM | Last Updated on Thu, Feb 20 2025 8:11 AM

మృత్య

మృత్యువులోనూ వీడని స్నేహం

జిన్నారం (పటాన్‌చెరు): చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ నాగలక్ష్మి కథనం ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన వల్లపు రాంబాబు కుమారుడు నరేశ్‌(26), వల్లపోలు రాజు కుమారుడు శంకర్‌ (22) ఇద్దరూ స్నేహితులు కాగా కూలీ పని చేస్తుంటారు. మంగళవారం సాయంత్రం జిన్నారం మండలం వావిలాలలో కల్లు తాగేందుకు స్క్యూటీ పై వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఈత కొట్టేందుకు వావిలాల పీర్ష చెరువులోకి దిగారు. చెరువు ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. అక్కడే గేదెలు మేపే ఓ వ్యక్తి గమనించి చెరువులో దిగి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వెంటనే పోలీసులకు విషయం చెప్పాడు. బుధవారం జగంపేట వావిలాల గ్రామాలకు చెందిన ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేశారు.

కల్లు తాగేందుకు వచ్చి

ఈతకు వెళ్లిన యువకులు

ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి

జిన్నారం మండలంలోని

వావిలాల పీర్ష చెరువు వద్ద ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
మృత్యువులోనూ వీడని స్నేహం1
1/1

మృత్యువులోనూ వీడని స్నేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement