Advertisement
Sangareddy District Latest News
-
ఆషాఢం.. ప్రత్యేకతల సమాహారం!
ఉపందుకునే వ్యవసాయ పనులు.. ఎటూ చూసిన పచ్చని పంటలు. ఆడబిడ్డల అరచేతులపై అందమైన ముగ్గులు.. దేవుడిలాంటి భర్త దొరకాలని కోరుకునే ఆడపిల్లల ఆకాంక్షలు.. కొత్త జంటు దూరంగా.. పంటలు బాగా పండాలని.. పిల్ల జెల్లా బాగుండాలని.. ఊరువాడా చల్లంగుండాలని గ్రామ దేవతలకు భోనాల సందడి.. ఇలా ఎన్నెన్నో విశేషాలతో కూడుకున్నదే ఆషాఢమాసం.. ఈ మాసంలో పల్లెలు, పట్టణాలు బోనాలతో మార్మోగుతాయి. నెల రోజుల పాటు గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. శనివారం నుంచి ప్రారంభమైన ఆషాఢమాసం గురించి ప్రత్యేక కథనం..బోనం.. అమ్మవారికి నైవేద్యం..బోనం అంటే అమ్మవారి నైవేద్యం, మహిళలు వండిన అన్నంతోపాటు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఆకట్టుకుంటాయి. పూర్వ కాలంలో పండుగ రోజు దుష్టశక్తులను పారదోలడానికి బోనంతో పాటు దున్నపోతును బలిచ్చే వారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కొడిపుంజులను బలి ఇవ్వడం అనవాయితీగా మారింది.వన భోజనాల సందడి..గ్రామీణ ప్రాంతాల్లో వన భోజనాలు సందడి నెలకొంటుంది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుతారు. పాడి పంటలు పండి అందరూ బాగుండాలని గ్రామ దేవతల వద్ద వనభోజనాలకు వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం అక్కడే భోజనాలు వండి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వంటలు చేసి భుజిస్తారు.అరచేతిలో అందమైన ముగ్గులు..కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢమాసం ప్రారంభం కాగానే తప్పనిసరిగ పుట్టింటికి వెళ్తారు. చేతులకు గోరింటాకు పెట్టి అది ఎంత బాగా పండితే వారి జీవితం అంత బాగుంటుందని, సుఖ కాంతులో వర్ధిలుతారని నమ్మకం. గతంలో గ్రామాల్లో ప్రకృతి పరంగా గోరింటాకు పెట్టుకునేవారు. కాలక్రమేణా గోరింటాకు కనుమరుగై దాని స్థానంలో మోహిందీ వాడటం ప్రారంభమైంది.అత్తా కోడళ్లకు ఎడబాటు..ఆషాఢ మాసంలో అత్తత్తాకోడళ్లు ఒకరి ముఖం మరొకరు చూసుకోవద్దని తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ కారణంగా కొత్త కోడళ్లు అత్తవారింటికి దూరమవుతారు. ఆషాఢ మాసం ప్రారంభానికి ముందే కోడళ్లు తమ పుట్టింటికి చేరుకుంటారు. ఇలా దూరంగా ఉండటం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని పెద్దలు చెబుతుంటారు.ఎవుసం పనులకు ఊపు..ఆషాఢమాసం ప్రారంభానికల్లా రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులన్నీ పూర్తి చేస్తారు. తొలకరి జల్లులు కురవగానే వ్యవసాయ పనులను వేగవంతం చేస్తారు. ఈ మాసం ముగిసే వరకు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతారు. ఎక్కువగా వరి సాగు పనులు జరుగుతాయి. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
వెల్దుర్తి(తూప్రాన్): ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తూప్రాన్ సీఐ కృష్ణ, ఎస్ఐ నవతగౌడ్ సూచించారు. వచ్చేనెల 13న ఎన్నికల సందర్భంగా మండల కేంద్రం వెల్దుర్తిలో బుధవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్, బస్టాండ్ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును స ద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లు ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. -
నాటి చరిత్రకు నేటి సాక్ష్యాలు..
● భూగర్భంలో ఆదిమానవుని అవశేషాలు లభ్యం ● సిద్దిపేట జిల్లా నర్మేట, పాలమాకుల, మగ్దూంపూర్, పుల్లూర్లో బహిర్గతం ● నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంనంగునూరు(సిద్దిపేట): కాల గర్భంలో కలిసిపోయిన చరిత్ర, కళ్ల ముందున్న కట్టడాలు, భూగర్భంలో నిక్షిప్తమైన చారిత్రాత్మక ఆధారాలు, వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్డేను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రను భావితరాలకు అందించేందుకు పురావస్తుశాఖ తోపాటు తెలంగాణ కొత్త చరిత్ర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా పుల్లూర్, నంగునూరు మండలం నర్మేట, పాలమాకుల, మగ్ధుంపూర్లో 2017 ఏప్రిల్ పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. అక్కడ ఆదిమానవుని అవశేషాలు, రాతి యుగపు పాత్రలు, మృణ్మన పాత్రలు, మెన్మీర్లు, ఆహార అలవాట్లను గుర్తించి హైదరాబాద్లోని పురావస్తుశాఖ కార్యాలయంలో భద్ర పరిచారు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైన అవశేషాలపై ప్రత్యేక కథనం.. ఎంత పెద్ద బండరాయో.. నర్మేటలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న సమాధి బహిర్గతమైంది. బండరాయి (క్యాప్ స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 65 సెంటీమీటర్ల మందంతో 43 టన్నుల బరువు ఉండగా క్రేన్ సహాయంతో 2 గంటలపాటు కష్టపడి బండను పక్కకు తొలగించారు. మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్వస్తిక్ ఆకారంలో చుట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. కఫ్మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్మాక్స్లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండలపై చెక్కేవారు. ఎముక ఆభరణాలు మేన్హీర్ వద్ద జరిపిన తవ్వకాల్లో ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. చెక్కు చెదరని దంతాలు, ఎముక మేన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో తెగ పెద్దగా భావిస్తున్న మహిళ 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దంతా లు ఇప్పటికి చెక్కు చెదరకపోవడం విశేషం. శంఖాలు (కౌంచ్) చూడగానే రెండు సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు పూజ చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా ఊదేందుకు దీన్ని వాడేవారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. భావితరాల వారికి అందించాలి పురాతన కాలం నాటి చరిత్ర, సాంస్కృతిని భావి తరాలవారికి అందించాలి. గ్రామాల్లో తిరిగి ఎన్నో అధ్యయనాలు జరిపి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వం చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలి. – కొలిపాక శ్రీనివాస్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, నంగునూరు -
తప్పులుంటే తిప్పలే
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అఫిడవిట్ తప్పసరి● అన్ని కాలమ్స్ పూరించాల్సిందే ● నేర సమాచారం ఇవ్వాలి ● ఆస్తులు, అప్పులు పక్కాగా సమర్పించాలి ● ఫారమ్ 26 అసంపూర్తిగా ఉంటే తిరస్కరణనారాయణఖేడ్: లోక్సభ ఎన్నికల పోరు ప్రారంభమయ్యింది. ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమ ర్పించే అఫిడవిట్ కీలకంగా మారుతోంది. అభ్యర్థులు తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి ప్రమాణ పత్రం రూపంలో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్ష పడినా వాటినీ పొందుపరచాలి. వీటన్నింటినీ కలిపి దాఖలుచేసే పత్రమే అఫిడవిట్. అందులో తప్పుడు సమాచారమిస్తే మాత్రం అదే ప్రత్యర్థులకు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లటమే కాకుండా అనర్హత వేటుకు దారితీయొచ్చు. ఆస్తులు, అప్పులను ప్రస్తావించాల్సిందే! స్థిర, చరాస్తుల వివరాలతోపాటు చేతిలో, బ్యాంకు అకౌంట్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వంటి వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి. అవి వారసత్వంగా వచ్చాయా, కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలనూ ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు తెలియజేయాలి. సమాచారం లేకపోతే నోటీసు అఫిడవిట్లోని ఏఒక్క కాలమ్ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేకపోతే కాలమ్ నిల్ లేదా వర్తించదు అని రాయాలని తెలిపింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ ను గమనించి ఏదైనా సమాచా రం లేకపోతే ఆర్వో నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్ను అభ్యర్థి అందించాలి. అయినప్పటికీ పూర్తిస్థాయి వివరాలతో అఫిడ విట్ లేకపోతే స్కృటినీ సమయంలో నామినేషన్ తిరస్కరణకు గురవు తుంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఆర్ఓలు నోటీసు బోర్డు, వెబ్సైట్లో పొందుపరుస్తారు.కేసులు పొందుపర్చాలి క్రిమినల్ కేసులు నమోదై ఉంటే వాటి వివరాలను అఫిడవిట్లో పొందుపర్చాలి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించి నా, అప్పీల్కు వెళ్లినా వాటి సమాచారాన్ని ప్రస్తావించాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ కు నోటరీ తప్పనిసరి. నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ముందు అభ్యర్థి ప్రమాణం చేస్తారు. వేరే ఎవరైనా నామినేషన్ సమర్పిస్తే సదరు అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాలి. కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.ఓటర్లు తెలుసుకోవాలి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందులో భాగంగానే అభ్యర్థులు తమ నామినేషన్తోపాటు అఫిడవి ట్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫామ్ 26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి. ఇందులో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కేసుల సమాచారంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలి. -
చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య
వట్పల్లి(అందోల్): చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగిపేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ తెలిపిన ప్రకారం.. పుల్కల్ మండలం సింగూరు గ్రామానికి చెందిన ఆత్మకూరు బీరయ్య (31) ఈనెల 15వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా అతడి నుంచి సమాధానం రాలేదు. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం మధ్యాహ్నం అందోలు మండలం అన్నసాగర్ చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు బీరయ్యగా గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. వివాహిత..జిన్నారం(పటాన్చెరు): వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపేందర్, మనీషా(30) ఇద్దరు పిల్లలతో రెండేళ్ల నుంచి బొల్లారంలోని లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నారు. ఉపేందర్ ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మూడు నెలల నుంచి ఆర్థిక పరమైన విషయాల్లో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మనీషా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు.బీరయ్య మృతదేహం -
కరపత్రం ఆవిష్కరణ
సిద్దిపేటజోన్: కేధారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికులకు అన్నదానం చేస్తున్న నేపథ్యంలో బుధవారం సమితి రూపొందించిన కరపత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రత్నాకర్, శ్రీనివాస్, నవీన్ ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి వెళ్లి అయోధ్య, అమర్నాథ్, కేధారినాథ్ లాంటి ప్రాంతాల్లో అన్నదానం చేయడం గొప్ప విషయమని అభినందించారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో సమితి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మే 3న సిద్దిపేట నుంచి లారీల్లో అన్నదాన సామగ్రి వెళ్లనుందని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. అంతకుముందు వివిధ గ్రామాల, కుల సంఘాల ప్రతినిధులు గ్రామాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని హరీశ్ రావును కలిసి కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిప ల్ మాజీ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో మునిగి వ్యక్తి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేశం(46) మంగళవారం మధ్యాహ్నం నస్కల్ శివారులోని కాల్వలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుమారుడు, భార్య చెరువులో, కాల్వలో, గ్రామ శివారులో గాలించినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు వెతుకుతున్నారు. కాల్వ పక్కనే ఉన్న చెక్ డ్యామ్లో మునిగిపోయి ఉండొచ్చని అనుమానంతో వెతకగా కాళ్లుపైకి తేలి కనిపించాయి. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చిక్కుకొని చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడికి భార్య నీరటి కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
సరదాగా కాసేపు..
● స్విమ్మింగ్పై పెరుగుతున్న ఆసక్తి ● ఉత్సాహం చూపుతున్న విద్యార్థులుమెదక్జోన్: స్విమ్మింగ్ నేర్చుకోవడంపై యువతతోపాటు బాల, బాలికలు ఆసక్తి చూపుతున్నారు. ఈత శరీరానికి మంచి ఎక్సర్ సైజ్తోపాటు ప్రమాదవశాత్తు నీటిలో మునిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడటానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కు వగా కొడుతుండటంతో చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. పట్టణంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లో బాల, బాలికలు ఈత నేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో వ్యక్తికి నెలకు రూ.3 వేల ఫీజు చెల్లిస్తే తమ కోచ్ ఈత నేర్పిస్తాడని నిర్వాహకుడు చెబుతున్నాడు. అందరూ నేర్చుకోవాలి బాల, బాలికలందరికీ తల్లిదండ్రులు ఈత నేర్పించాలి. నాకు ఇద్దరు పిల్లలు వారికి ఈత నేర్పించేందుకు స్విమ్మింగ్ ఫూల్కు తీసుకొస్తున్నాను. ఈత వచ్చిందంటే నీటి ప్రమాదం నుంచి సునాయాసనంగా తప్పించుకోవచ్చు. – మహీందర్,డిప్యూటీ తహసీల్దార్, చిన్నశంకరంపేట స్విమ్మింగ్ ఎంతో ఇష్టం.. నాకు స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈత నేర్చుకుంటే భవిష్యత్లో ఎంతో ఉపయోగ పడుతుందని మమ్మీ, డాడీలు తరుచూ చెబుతుంటారు. దీని వల్ల శరీరానికి మంచి ఎక్సర్ సైజ్ సైతం లభిస్తోంది. – నిఖిల్, విద్యార్థి -
ఘనంగా సీతారాముల కల్యాణం
● ఆలయాల్లో మార్మోగిన రామనామం ● తరలివచ్చిన భక్తజనంగజ్వేల్రూరల్: శ్రీరామనవమి పురస్కరించుకొని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ప్రజ్ఞాపూర్లోని సీతారాములను పల్లకిపై ఊరేగింపుగా కోదండరామాలయం వరకు తీసుకురాగా వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదే విధంగా గజ్వేల్ పట్టణంలోని షిరిడీసాయి దేవాలయం, మురళీ కృష్ణాలయం, సత్యసాయి మందిరం, క్యాసారంలోని శివాలయంతో పాటు రిమ్మనగూడలోని గోలోకాశ్రమంలో శ్రీసీతారాము ల కల్యాణోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశంతోపాటు కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ మండలం మక్తమాసన్పల్లి గ్రామానికి చెందిన అక్షయతో శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్గౌడ్కు గత నెల 30న వివాహమైంది. ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి అత్తగారింటి నుంచి అక్షయ వెళ్లిపోయింది. ఓ యువకుడి బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నవీన్గౌడ్ తండ్రి వెంకట్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. వడదెబ్బకు గురై పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, 5.2 ఎత్తు, చామన చాయ రంగుతో, తెలుపు రంగు షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే డయల్ 100 లేదా సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమి విక్రయంనిందితుడి రిమాండ్ రామచంద్రాపురం(పటాన్చెరు): ఒక వ్యక్తికి సంబంధించిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయించిన వ్యక్తిని బుధవారం రిమాండ్కు తరలించారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్లో నివాసం ఉండే మనోజ్కుమార్జైన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 177లోని 2.27గుంటల భూమిని గతంలో ఆ భూమికి సంబంధించిన భూ యజమానులు ఇతరులకు విక్రయించారు. అయితే భూమిని విక్రయించారని తెలిసి కూడా మనోజ్కుమార్ జైన్ వారి కుటుంబ సభ్యులతో కుమ్ముకై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూమిని మనోజ్కుమార్ జైన్ 2006లో తన పేరు పైన సేల్ డిడ్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ను చూపించి 2023లో కమిడి రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలుసుకున్న అసలు భూమి యాజమాని సుభాష్గౌడ్ కొల్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మనోజ్ కుమార్ జైన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గృహోపకరణాలు దగ్ధం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యుత్ హై ఓల్టేజీతో మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలోని పలు వార్డుల్లో గృహోపకరణాలు బుధవారం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒక్కసారిగా హైఓల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్ బల్బులు పేలిపోయాయి. ఫ్రిజ్లు, టీవీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 40 ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం సిద్దిపేట ఫైర్ ఇన్చార్జి అధికారి నరేష్ ● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ● గజ్వేల్లో బీఆర్ఎస్ ప్రచార రథాలుసిద్దిపేటకమాన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అగ్నిమాపక శాఖ ఇన్చార్జి అధికారి నరేష్ సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని సిబ్బంది, ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం ఫైర్ సిబ్బందితో కలిసి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పట్టణంలోని ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలన్నారు. పట్టణంలో ఎక్కువగా విద్యుత్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ఐఎస్ఐ మార్క్ కలిగిన వైర్లు, ఉపకరణాలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో షాపుల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ నరేష్, ఫైర్ స్టేషన్ సిబ్బంది సంపత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. గజ్వేల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్, అహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం..రాములోరి కల్యాణం
గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వైభవంగా శ్రీరామ నవమి వేడుకలుశ్రీరామ నవమి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా వైభవంగా సాగాయి. పల్లెపల్లెనా రాములోరి పెళ్లిసందడి కనిపించింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణ క్రతువు కనుల పండువగా సాగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కల్యాణాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయాలన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. జోగిపేటలోని పబ్బతి హనుమాన్, వీర హనుమాన్ ఆలయాల్లో జరిగిన కల్యాణ వేడుకల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని పూజలు చేశారు. అలాగే సంగారెడ్డి రామ మందిరంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో మహేశ్వర సిద్ధాంతి నిర్వహించిన సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి/ సంగారెడ్డి టౌన్/ జోగిపేట (అందోల్) -
నామినేషన్లకు వేళాయే..
ఎన్నికల అధికారిసంగారెడ్డి టౌన్ : లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేయనున్న అభ్యర్థుల నుంచి నామినేషన్లను సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటిని స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 25 వరకు గడువు ఉంది. బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్లు వేయనున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,971 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుంటుంది. అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోకి అనుమతి ఇస్తారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు రూ.25 వేలు సెక్యురిటీ డిపాజిట్ జమ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 జమ చేయాల్సి ఉంటుంది. నగదు రూపంలో గానీ, చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ పార్టీల తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు ఆ నియోజకవర్గంలో ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. రిజిష్టర్ పార్టీల తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులు, స్వతంత్రులకు పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేందుకు కార్యాలయానికి వచ్చే అభ్యర్థులు పార్టీ కండువాలు, టోపీలు ధరించేందుకు అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు నామినేషన్పై లెటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర లోక్సభ నియోజకవర్గాలకు చెందిన వారై ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు రూ.95 లక్షలు.. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.95 లక్షల పరిమితి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ద్వారానే ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లావాదేవీలు జరిపి రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉంటే నామినేషన్ పత్రంలోని పార్ట్–3ఏ లో కేసు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి గానీ, ప్రతిపాదించిన వారే స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది.నామినేషన్చివరి గడువు ఏప్రిల్ 25 పరిశీలన ఏప్రిల్ 26 ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29నేటి నుంచి ప్రక్రియ షురూ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం దాఖలుకు చివరితేదీ ఈనెల 25.. ప్రక్రియ ఇలా.. ఓట్ల లెక్కింపు జూన్ 4 పోలింగ్ తేదీ మే 13 -
పొంచి ఉన్న ప్రమాదం
ఝరాసంగం(జహీరాబాద్): నిర్వహణ లోపంతో బ్రిడ్జిల వద్ద ప్రమాదం పొంచి ఉంది. మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులపై అవసరం ఉన్నచోట బ్రిడ్జిలను నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జిల వద్ద రోడ్లు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. మండలంలోని బోరేగావ్, ఇస్లాంపురం, జీర్లపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం మండల కేంద్రమైన ఝరాసంగం తోపాటు నియోజకవర్గ కేంద్రం జహీరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆయా గ్రామాల రహదారుల మధ్యన ఉన్న బ్రిడ్జిల వద్ద రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జికి సమాంతరంగా రోడ్డులేకపోవడంతో అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. వాహనాలు సైతం పాడవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుల సమయంలో గుంత ఉన్న విషయం తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా బ్రిడ్జిల వద్ద రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి
జహీరాబాద్ టౌన్: ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. పట్టణంలో గడి వీధి హరి మసీద్ కమిటీ సభ్యులు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా బుధవారం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా దర్శనం చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనికుమార్ యాత్రీకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తంజీమ్, మచ్చేందర్, సంజీవ్రెడ్డి, అక్బర్, ముర్తుజా, మిథున్రాజ్, పర్వేజ్, అలీ, హాశం, జప్పార్ పాల్గొన్నారు.జనహితం కోసం హోమం పటాన్చెరు టౌన్: మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో చిట్కూల్లో శ్రీరామనవమి సందర్భంగా వసంత నవరాత్రుల పూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. నీలం సతీసమేతంగా పాల్గొని పూజలు చేశారు. సకల జనులు సుభిక్షంగా ఉండాలని యజ్ఞం జరిపించినట్లు ఆయన పేర్కొన్నారు. పదకొండు రోజులుగా జరుగుతున్న ఈ మహా యజ్ఞం బుధవారం లక్ష పుష్పార్చనతో ముగిసింది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా కంగ్టి(నారాయణఖేడ్): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రఫీయొద్దీన్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్వాడి చెక్పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్ పోలీసు కానిస్టేబుల్ సాయులు, ఏఈఓ సంతోష్ ఉన్నారు. మూడు సార్లు పర్వతారోహణ గజ్వేల్రూరల్: గజ్వేల్లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ కార్పోరల్ రాజేష్ వరుసగా 3 సార్లు పర్వతారోహణ చేసినట్లు ఆ కళాశాల ఎన్సీసీ లెఫ్టినెంట్ ఆఫీసర్ డాక్టర్ భవాని బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కళాశాలకు చెందిన రాజేష్ 2022 అక్టోబర్ 1 నుంచి 26 వరకు సుమారు 26 రోజుల పాటు హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో బేసిక్ మౌంటైనీరింగ్ శిబిరాన్ని 2023లో ఏప్రిల్ 1 నుంచి 28వ వరకు సుమారు 28రోజుల పాటు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్లో అడ్వాన్స్ మౌంటేనేరింగ్ క్యాంప్ను, 2024లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 11వరకు సుమారు 20 రోజుల ఉత్తరాఖాండ్లోని ఉత్తర కాశీలో సెర్చ్ అండ్ రెస్క్యూ క్యాంప్ను పూర్తి చేశారన్నారు. -
సబ్సిడీపై విత్తు !
● వానాకాలంలో ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ● ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ ● ఆనందంలో రైతాంగం ● ఐదేళ్ల క్రితం ఎత్తేసిన గత ప్రభుత్వంజిల్లాలో సాగైన వానాకాలం పంటలు (ఎకరాల్లో).. పంట 2022 2023 సోయాబీన్ 56,470 81,560మొక్కజొన్న 23,120 15,764కంది 90,655 12,400మినుము 16,526 6,275పెసర 22,367 13,562వరి 1,13,783 1,38,380జహీరాబాద్: వానాకాలం సీజన్ నుంచి రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి ప్రతిపాదనలు సేకరించినట్లు తెలుస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు సబ్సిడీ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వర్షాకాలంలో సాగు చేసే మొక్కజొన్న, కంది, వరి, పెసర, మినుము, జనుము, జీలుగ తదితర పంటల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సోయాబీన్, పప్పు ధాన్యాలపై సబ్సిడీ ఎత్తి వేశారు. పచ్చిరొట్టెగా ఉపయోగపడే జనుము, జీలుగ విత్తనాలను మొక్కుబడిగా అందిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను అందజేస్తోంది. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం సోయాబీన్ విత్తనాలను అవసరం మేరకు ప్రతి ఏటా వర్షాకాలంలో అందజేస్తోంది. కేంద్రం నుంచి విత్తన సబ్సిడీ కింద నిధులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన విధంగానే గతంలో రైతులకు ఇచ్చిన విధంగానే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 30 నుంచి 65 శాతం వరకు సబ్సిడీ అందించనున్నారు. సోయాబీన్కు 37 శాతం, జీలుగ, జనుము, పిల్లిపెసర్లకు 65 శాతం, కంది, పెసర, మినుము విత్తనాలకు 35 శాతం మేర సబ్సిడీ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా రైతులు పండించే పంటల వివరాలను పరిగణనలోకి తీసుకుని విత్తనాలను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక వైపు చూపు ఐదేళ్లుగా రైతులకు సబ్సిడీపై సోయాబీన్ విత్తనాలు అందజేయడం లేదు. దీంతో రైతులు కర్ణాటక ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేసుకుంటున్నారు. తమ బంధువులు, స్నేహితుల ద్వారా సబ్సిడీ విత్తనాలను తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను అందిస్తే కర్ణాటకకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుందని రైతులు చెబుతున్నారు. -
అమలు కాని హామీలతో మోసం
● మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వట్పల్లి(అందోల్): అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న తొలి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 లక్షల మంది రైతులకు, 50 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హామీలకు ఏడాదికి రూ.3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. అమర వీరుల స్థూపం వద్ద దండ వేయకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ అవమాన పరిచారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే రేవంత్కు ద్వేషమని చెప్పారు. తెలంగాణ నుంచి చంద్రబాబును కేసీఆర్ వెళ్లేలా చేశాడని రేవంత్కు కోపమని.. సీఎం నరనరాల్లో బాబు ఉన్నాడన్నారు. -
హస్తం గూటికి జహీరాబాద్ నేతలు
జహీరాబాద్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో హస్తం గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తనయుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ తన్వీర్తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ జెడ్పీటీసీ కిషన్రావు పవార్, మాజీ కౌన్సిలర్లు యూనూస్, జహంగీర్, అరుణ్కుమార్, రాములునేత, మోతిరాం, మహిపాల్రెడ్డి, పుణ్యమ్మ, మొగుడంపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు కుత్బుద్దీన్, హన్నాన్ జావీద్లతో పాటు శ్రీకాంత్రెడ్డి, సుల్తాన్, బి.జి.సందీప్, బాబీ, నవీద్, సమి, గోవర్ధన్రెడ్డిలకు సీఎం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్, ఎస్.ఉజ్వల్రెడ్డి, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్రెడ్డిలు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి?
కొల్చారం(నర్సాపూర్): గుర్తుతెలియని శవం లభ్యమైన సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధికి వెళ్తున్న భక్తులు.. పోతంశెట్టిపల్లి గ్రామశివారులో ఉన్న మంజీరా వాగులో మృతదేహం ఉందన్న సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లి జాలర్ల సహాయంతో బయటకు తీశారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు 26–28 మధ్య ఉండొచ్చు. అతడి కుడి చేయిపై స్టార్ ఆకారంలో పచ్చబొట్టు ఉంది. బ్లూ కలర్ జీన్ పాయింట్, ఆరెంజ్ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఎస్ఐ కొల్చారం 87126–57919, మెదక్ రూరల్ సీఐ 87126–57916 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్
నేను విజిల్ వేస్తే..సాక్షిప్రతినిధి సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ లోకసభ స్థానం పరిధిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భారీగా ఈ సభకు ఆందోల్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, నర్సాపూర్ తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, జనాలు తరలివచ్చారు. సాయంత్రం 6.45 ప్రాంతంలో సభాస్థలానికి చేరుకున్నా కేసీఆర్.. సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కారు విఫలమైందని తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిల్లీపుట్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించిన మాదిరిగానే తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారును తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్అలీ, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, గూడెం మహిపాల్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతారెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు సేవాభావం ఉండాలి
కంది(సంగారెడ్డి): విద్యార్థులు విద్యతో పాటు సేవాభావం కలిగి ఉండాలని రాజేంద్రనగర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కళాశాల విద్యార్థులు కంది మండలంలోని మక్త అల్లూర్లో జాతీయ సేవా పథకం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎన్ఎస్ఎస్ వలింటర్లు (విద్యార్థులు) గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, పంటల సాగులో యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడి సాధించడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ అమీర్ బాషా, శ్రీలత, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష
సంగారెడ్డి టౌన్ : సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులకు జేజేలు అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘం మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదీవే నుంచి అంబేడ్కర్ జయంతుల సందర్భంగా సామాజిక సంఘీభావ నిధి సేకరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కార్మికుల నుంచి రూ.1,61,547 విరాళం సేకరించారు. మంగళవారం ఆ నగదును హైదారాబాద్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి పాలడుగు భాస్కర్, చుక్క రాములు చేతుల మీదుగా రాష్ట్ర కమిటీ కి అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. దళిత, బహుజన, మైనార్టీల సమస్యలు పరిష్కరించకుండా పాలకులు వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నేటికీ కుల వివక్ష, అంటరానితనం, పేదరికం తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. పాలకులు వివక్షతను రూపుమాపకుండా చోద్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల పేరుతో విభజన పాలనసాగిస్తుందని ఆరోపించారు. సామాజిక ఉద్యమాలకు సీఐటీయూ సంఘీభావంగా అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, జె.మల్లికార్జున్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య, నాయకులు మహిపాల్ పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
అబద్ధాలతో రేవంత్ పాలన :హరీశ్
సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలైతే కాంగ్రెస్కు ఓటెయ్యాలని.. లేదంటే కారు గుర్తు ఓటేసి గెలిపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ కోరారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్తేనే హామీల అమలుకు కొట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ చాలాచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ చేశారని, 24 గంటల కరెంటు నుంచి 12 గంటలకు తగ్గించారని పేర్కొన్నారు. తాగునీటి కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు. రేవంత్ అబద్దాలతోనే పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనలో ఒక్క మంచి కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చారా అని నిలదీశారు. విదేశాల్లో నుంచి నల్ల ధనం తెచ్చి పంచుతామన్నారు.. 20 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందన్నారు. మతాలతో బీజేపీ పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డిని తానే ఒప్పించి బరిలో ఉంచానని చెప్పారు. గాలి అనిల్కుమార్ ఉద్యమకారుడు అని.. వీళ్లిద్దరిఇని గెలిస్తే ప్రజలకు సేవ చేస్తారని పేర్కొన్నారు. -
యాప్లో కుష్ఠు బాధితుల వివరాలు
ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి సిద్దిపేటకమాన్: జిల్లా వ్యాప్తంగా కుష్ఠు బాధితులను గుర్తించి వెంటనే ఓరియంటేషన్, నిక్యూస్ట్ యాప్లో వారి వివరాలను నమోదు చేయాలని ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నోడల్ పర్సన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యాప్పై కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాధితులను గుర్తించిన వెంటనే యాప్లో వివరాలను నమోదు చేయాలన్నారు. తద్వారా వ్యాధి నిర్మూలన చేపట్టేందుకు యాప్ ఎంతగానో దోహదం పడుతుందన్నారు. వివరాల మేరకు మందుల సరఫరా, నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శిక్షకులు రాష్ట్ర లెప్రసీ సొసైటీ సభ్యులు, కామేశ్వరరావు, నరసింహ స్వామి, డీపీఎంఓలు, ఎన్ఎల్ఈపీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సస్యరక్షణతో అధిక దిగుబడులు
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్ పామ్ పంటలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి సువర్ణ అన్నారు. మంగళవారం అక్కేనపల్లిలో ఆయిల్పామ్ తోటలను పరిశీలించి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్కల సంరక్షణ, మెలకువలు, యాజమాన్య పద్ధతులను రైతులకు ఆమె వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఎండా కాలంలో మొక్కల మధ్య జీలుగ, జనుము విత్తనాలు వేసుకోవడం ద్వారా గాలిలో తేమ శాతం పెరుగుతుందన్నారు. ఇది మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. నర్మేటలో ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని, రెండు నెలల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్నందున ఎవరూ అధైర్యపడొద్దన్నారు.కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.