Sangareddy District News
-
దైవ దర్శనానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి
శివ్వంపేట(నర్సాపూర్): దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధి చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో తూప్రాన్– నర్సాపూర్ హైవే పై శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ చింతల్ ప్రాంతానికి చెందిన గొల్ల లోకేశ్ (42) లిఫ్ట్ రిపేర్లు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం చాకరిమెట్లలోని ఆంజనేయస్వామి దర్శనం కోసం ఒక్కడే బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి లక్ష్మాపూర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. సిద్దిపేట అనారోగ్యంతో.. సిద్దిపేటకమాన్: అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. భువనగిరికి చెందిన ఎండీ నవాజ్ (40) ఏడాదిగా పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల కిందట క్యాన్సర్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నాడు. దీంతో హోటల్లో పని మానేశాడు. అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ రోడ్డు డివైడర్ పక్కన నవాజ్ మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హోటల్ యజమాని జాకీర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు శనివారం కౌడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని శేరితండా పంచాయతీ వసురాంతండాకు చెందిన దుంగావత్ గేమ్సింగ్(35) కొన్నేళ్లుగా భార్యతో కలిసి గుమ్మడిదలలో ఉంటున్నాడు. 18 తండాలో చిట్టీ డబ్బులు కట్టాలని రూ.40 వేలు తీసుకొని గ్రామానికి వచ్చాడు. రాత్రి తండాకు చెందిన మోహన్, సలాబత్పూర్కు చెందిన జహీర్తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం దాబాలో భోజనం చేస్తుండగా గేమ్సింగ్ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే కౌడిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెదక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త వెంట ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి భార్య శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక రవాణాపై చర్యలు
మద్దూరు(హుస్నాబాద్): అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని దూల్మిట్ట తహసీల్దార్ సింహాచలం మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ జాలపల్లిలోని మోయతుమ్మెద వాగు నుంచి గ్రామానికి చెందిన మెతుకు రామకృష్ణారెడ్డి, మెతుకు సంజీవ్, తుపాకుల శ్రీనివాస్ అనే వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకున్నామన్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం మద్దూరు(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన దూల్మిట్ట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుషాలపురం రమ ఇంట్లో శుక్రవారం రాత్రి వేళ ఫ్రిజ్కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగిసి పడ్డా యి. ఒక్కసారిగా మంటలు చెలరేగి కూలర్, బట్టలు, ఇతర సామగ్రికి నిప్పంటుకొని కాలిపోయాయి. అదే విధంగా విలువైన డాక్యుమెంట్స్తోపాటు ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన నగదు కాలిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిని రెవెన్యూ అధికారులు శనివారం సందర్శించారు. ఫామ్ హౌస్లపై పోలీసుల దాడి ● 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ మనోహరాబాద్(తూప్రాన్): ఫామ్ హౌస్లపై పోలీసులు దాడి చేసిన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కూచారం, జీడిపల్లి శివారుల్లో ఫామ్ హౌస్లపై దాడి చేశాం. ఈ దాడిలో వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో 8 మంది పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నాం. వీరినుంచి పేకముక్కలు, రూ. 11 వేల నగదు, 3 కార్లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ గార్డుపై దాడి పటాన్చెరు టౌన్: ఓ పరిశ్రమలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ కథనం మేరకు.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో గల ఉషా కాపర్ వైర్స్ పరిశ్రమలో సదాశివపేట పేటకు చెందిన కై రత్ మియా (53) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పరిశ్రమ గేటు ఎదుట డ్యూటీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ముఖంపై టవల్ కప్పి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గాయాలతో ఉన్న సెక్యూరిటీ గార్డును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పటాన్చెరుకు తీసుకెళ్లారు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీడీఎల్ పోలీసులు పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉండాలి ● హంపీ పీఠాధిపతి భారతీ స్వామి మిరుదొడ్డి(దుబ్బాక): భారతీయ సంస్క ృతీ సాంప్రదాయాలు, సనాతన ధర్మం ఎంతో శ్రేష్ఠమైనవని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని అందె గ్రామంలోని శంభుని దేవాలయంలో శనివారం నిర్వహించిన బాణ లింగాభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. లింగాభిషేకంలో పాల్గొన్న ఆయన గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతాయన్నారు. సమాజంలో ధర్మబద్ధంగా జీవిస్తేనే మోక్షం లభిస్తుందన్నారు. గ్రామాల్లో ఈర్ష, అసూయలు తగ్గించి అందరూ కలిసి మెలసి ఐక్యంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్జీ, శివలింగం, యాదగిరి, సుమన్, పోచయ్య, ప్రవీణ్, కుమార స్వామి, కనకరాజు పాల్గొన్నారు. -
జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
హుస్నాబాద్రూరల్: దేశవ్యాప్తంగా విడుదల చేసి న జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపించి 26 మంది అర్హత సాధించారు. శనివారం గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలలో ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ రాజు అభినందించారు. కళాశాల నుంచి 31 మంది పరీక్షలకు హాజరైతే 26 మంది అర్హత సాధించగా 10 మంది మంచి మా ర్కులు పొందినట్లు చెప్పారు. బీ.సునీల్ (81.98), టీ.రాజేశ్(81.94), జే.హర్షవర్ధన్ (81.72), డీ.సిద్ధార్థ (77.33), బీ.మోక్షజ్ఞ (77.04) మార్కులు సాధించారు. గురుకులాల కేంద్ర కార్యాలయం అందించిన స్టడీ మెటీరియల్ చదువడం ద్వారానే మా విద్యార్థులు ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
చేగుంట(తూప్రాన్): ఈత కొట్టడానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. చేగుంటకు చెందిన తిరుపతి సంజయ్ (21) రామాయంపేట మండలం దామర చెరువులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామంలో బంధువులు, స్నేహితులు అంతా కలిసి స్విమ్మింగ్ పూల్లో ఈతకొట్టడానికి వెళ్లారు. స్విమ్మింగ్పూల్ లోకి దూకిన సందీప్ తలకు గాయమై ఫిట్స్ రాగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్స్లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సందీప్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాల్రాజ్ కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన బొగ్గుల అమృత (40) శుక్రవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి గాను సమీపంలో ఉన్న పాండ చెరువు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆమె మృతదేహం నీటిలో తేలగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.కామారెడ్డి జిల్లాలో చేగుంట యువకుడు మృతి -
ఇంజనీర్ల ఇలాకా..
40 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది వీరే..● చదువుకోవడానికి8 కిలో మీటర్లు వెళ్లే యువత ● వలసలు వెళ్లి చదివించిన తల్లిదండ్రులు ● ఒకరిని చూసి మరొకరుఉద్యోగాల వైపు అడుగులు ● గతంలో బాహ్య ప్రపంచానికితెలియని తండా ● నేడు ఆదర్శంగా నిలిచిన కంగ్టిమండలంలో జమ్గి(బీ) సాధు తండా సాధించాలనే పట్టుదలతో .. మా ఇద్దరు కూతుళ్లు ఒకరు ఎంబీబీఎస్ పూర్తి చేయగా మరో అమ్మాయి ఎన్ఐటీ త్రిచిలో సీటు సాధించింది. తల్లి ఉపాధ్యాయురాలు. దీంతో ఇంటిల్లిపాది ఉద్యోగాలు పొంది ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. మారుమూల తండానుంచి ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. కే. పండరి, హైదరాబాద్ జిల్లా మేనేజర్(టీజీఆర్ఈడీసీఓ) పోటీతత్వంతో ఉన్నత చదువులు తండాలో యువకులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తితో ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం అభినందనీయం. తల్లిదండ్రులు సైతం పిల్లల చదువుల కోసం ప్రోత్సహించడంతో మా తండావాసులు ఉన్నత స్థాయిలో నిలుస్తున్నారు. – నారాయణ, ఏఈ ట్రాన్స్కో, నారాయణఖేడ్ వలసలు వెళ్లి చదివించారు మా తల్లిదండ్రులు వలసలు వెళ్లి డబ్బు సంపాదించి మాకు మంచి చదువులు చదివించడంతో మా జీవితాలు మారాయి. మేము మా పిల్లలను సైతం ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నాం. తండాలోని యువతలో పోటీతత్వం, పోరాట పటిమ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – మోతీరాం,ఏఈ ట్రాన్స్కో, మనూరు మంచి పేరు ప్రఖ్యాతలు గడించాం సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇరిగేషన్లో ఏఈగా ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. మా తండా నుంచి యువకులు, విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి సాధిస్తుండటంతో మంచి ఖ్యాతి ఉంది. యువకులకు ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహం అందిస్తున్నాం. – కుషాల్, ఏఈ ఇరిగేషన్, నిజామాబాద్ వలసలు వెళ్తే గాని పూట గడవదు తండాలో 120 ఇల్లు, కుటుంబాలు 152 ఉంటాయి. ఇక్కడ ఉన్న భూములు కూడా సాగు నీటి వసతి లేని ఎర్ర చెలుక భూములే. ఏడాదిలో ఎనిమిది నెలలు చెరకు నరికేందుకు, ఇటుక బట్టీలకు వలసలు వెళ్తే తప్ప బతుకు బండి నడవదు. పిల్లలను బడికి పంపేకంటే కూలీకి పంపితేనే బాగుంటుందని భావించే దుస్థితి. అలాంటి దుర్భర పరిస్థితిలో నుంచి ఏక కాలంలో నలుగురు ఇంజనీర్లను అందించింది ఈ సాధుతండా. అప్పటి నుంచి ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వరిస్తుందనే నమ్మకం కల్గింది తండాలోని గిరిపుత్రులకు. ఏకంగా 20 మంది ఇంజనీర్లు అయ్యి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.కంగ్టి(నారాయణఖేడ్): అదో మారుమూల తండా. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. రోడ్డు వసతి ఉన్నా బస్సు ఎరగరు. తీవ్ర సమస్యలుంటే తప్ప అధికారులు సందర్శించిన దాఖాలాలుండవు. తాగునీటి కోసం తంటాలు పడాల్సిన దుస్థితి. సాగు భూములంతగా లేవు. వ్యవసాయ కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి తండా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు బయటకు కొచ్చా రు. ఒక్కరి నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగం.. ఆ తర్వాత ముగ్గురు.. ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరింది. ఒకప్పుడు ఎవరికీ తెలియని కంగ్టి మండలంలో జమ్గి(బీ) సాధుతండా ఇప్పుడు అందరి నోటా వినబడుతుంది. చదువుకోవడానికి 8 కిలో మీటర్లు జమ్గి(బీ) సాధుతండాలో పాఠశాల లేదు. మండల కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి పిల్లలు చదువుకోవాలంటే నిత్యం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తడ్కల్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లేవారు. తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదని చదివించారు. మొదట 1998లో ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. తండాకు చెందిన 1998లో కే.పండరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించాడు. తర్వాత నారాయణ, మోతీరం 2000 సంవత్సరంలో ఒకేసారి ఉద్యోగం సాధించారు. అనంతరం 2004లో కుషాల్ ఇరిగేషన్ ఏఈగా ఉద్యోగం సాధించాడు. ఇలా ఒకరి వెనుక మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.40 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో.. ప్రస్తుతం మండలంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న తండాగా సాధు తండా పేరొందింది. దాదాపు 40 మందికి పైగా యువతీ, యువకులు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే బ్యాంకుల్లోనూ, ఉపాధ్యాయులుగాను, వ్యవసాయాధికారులుగాను, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనూ, దేశ సరిహద్దుల్లో సైనికులుగాను విధులు నిర్వహిస్తూ తండా ఖ్యాతిని నలుదిశలకు వ్యాపింపజేశారు. ఇంతే కాకుండా బయోటెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన అక్కాచెల్లెళ్లు చైతన్య, సింధూ యూఎస్ఏ లో స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నారు. తండాకు చెందిన రవిందర్ అనే యువకుడు దేశ సరిహద్దులో సైనికుడిగా పని చేస్తున్నాడు. తండాలో ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొంది చదువులు కొనసాగిస్తున్నవారు ఉన్నారు. ప్ర భుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. -
చెరకు సాగులో నూతన వంగడాలు
● 3102 రకం సాగుపై రైతుల ఆసక్తి ● ఎకరాకు 60 టన్నుల దిగుబడి ● జహీరాబాద్లో సుమారు3 వేల ఎకరాల్లో సాగు ● పెరుగుతున్న పంట విస్తీర్ణం జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక వాణిజ్య పంట కావడంతో సంవత్సరం కాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. పాత రకాలనే సాగు చేయడం, మరో వైపు పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు రైతులు ఎంచుకుంటారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంత రైతులు 3102 రకం చెరకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – జహీరాబాద్ టౌన్ జహీరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన రకాలనే పండిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 40 టన్నుల వరకు దిగుబడి రావాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 25 టన్నులు దాటడం లేదు. అందుకని రైతులు అధిక దిగుబడి ఇచ్చే రకాల సాగుపై మొగ్గు చూపుతుంటారు. జిల్లాలో అధికశాతం కో 86032, కో 808005, 87025, 83ఎ30 తదితర రకాలను పండిస్తున్నారు. వీటిలో చెక్కర శాతంతోపాటు దిగుబడి కూడా వస్తుందని కర్మాగారాల యాజమాన్యాలు వీటినే సూచిస్తున్నారు. పెద్దగా లాభాలు లేకున్నా నష్టం రాదన్న ఉద్దేశ్యంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ఈ రకాల పంటను పండిస్తున్నారు. పెరిగిన 3102 రకం పంట విస్తీర్ణం జహీరాబాద్ ప్రాంతంలో రెండు, మూడేళ్ల నుంచి కొంత మంది రైతులు అధిక దిగుబడినిచ్చే 3102 కొత్త రకం చెరకు పంటను పండిస్తున్నారు. ఈ రకం పంట అధిక దిగుబడి వస్తుందని సాగుపై మొగ్గు చూపడంతో పంట విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాల్లో ఈ రకం చెరకు పంట సాగవుతోంది. అధిక విస్తీర్ణంలో సాగవుతున్న కో 86032, కో 808005 తదితర రకాల చెరకు పంట ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అదే 3102 రకం అయితే 60 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. చెరకు గడలు ఏపుగా పెరుగుతాయి. ఎరువులు, కలుపు మొక్కల నివారణ ఖర్చులు తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కొత్త రకం పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతుండటంతో విత్తనంకు డిమాండ్ పెరిగి టన్నుకు రూ. 5 వేలు పలుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. లాభాలు వస్తున్నాయి శాస్త్రవేత్తలు, చెక్కర కర్మాగారం కంపెనీ యాజమాన్యం సూచించిన కో 86032, కో 808005 రకాలకు కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. పెట్టుబడులు పెరగడం తప్ప ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. లాభాలు తగ్గడంతో రెండేళ్ల నుంచి 3102 రకం పంటను సాగు చేస్తున్నా. పంట దిగుబడి పెరిగి లాభాలు వస్తున్నాయి. విత్తనం కూడా మంచి డిమాండ్ ఉంది. -
పేదోడి కడుపు నింపేందుకే సన్న బియ్యం
● గరిబోళ్ల ఆరోగ్యం, ఆత్మగౌరవంపెంచిన కాంగ్రెస్ సర్కార్ ● కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ● ముత్తంగిలో దళితుల ఇంట్లో భోజనంపటాన్చెరు టౌన్: ప్రతీ పేదోడి కడుపు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో దళిత సోదరుడు విఠల్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న పాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనికి ఆ కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల ప్రజలు సానుకూలంగా సమాధానం చెప్పి ఇందిరమ్మ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీతో అన్నం తినలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారని మరో పక్క దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి దళారుల దందాకు ఉపయోగపడేవన్నారు. అందుకే నిరంతరం పేదల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ పేద బిడ్డ కడుపు నింపాలనే తలంపుతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ముత్తంగి మాజీ ఎంపీటీసీ గడ్డ యాదయ్య, నాయకులు శ్రీను, అశోక్, సన్నీ యాదవ్, శంకర్, దశరథ్, వెంకటేశ్, శ్రీను, ప్రవీణ్, కాళిదాస్, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి జోన్: వేసవి కాలం ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...మూడు నెలల పాటుపంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి నీటి సమస్యను అధిగమించాలన్నారు. ప్రతీ పది రోజులకు ఒకసారి జిల్లాలోని తాగునీటి సరఫరాపై సమీక్ష జరిపి, అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తూ.. ఉస్సూరుమనిపిస్తూ!
నిమ్జ్ కోసం భూసేకరణ సరే..పరిశ్రమలేవీ..? ● భూములు కోల్పోయి దశాబ్దం గడుస్తున్నా.. ● ఉపాధి దక్కేదెన్నడంటున్న నిర్వాసితులు.. ● ఇప్పటికే సేకరించిన భూములు 5,109 ఎకరాలు.. ● తాజాగా 941 ఎకరాల సేకరణకు మరో నోటిఫికేషన్సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) భూసేకరణ తీరు విమర్శలకు దారితీస్తోంది. ఈ నిమ్జ్ కోసం దశాబ్ద కాలంగా వందల ఎకరాల భూములు సేకరిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఈ నిమ్జ్లో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. భూములు పొందిన ఒకటీ రెండు పరిశ్రమలు కూడా కనీసం వాటి నిర్మాణం పనులకు కూడా శ్రీకారం చుట్టలేదు. అయితే భూముల సేకరణ ప్రక్రియ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా న్యాల్కల్ మండలం హుస్సెల్లీలో 653 ఎకరాలు, హద్నూరులో 288 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా ఈ నిమ్జ్ కోసం వందలాది మంది రైతులు భూములు కోల్పోతున్నప్పటికీ.. తమకు కనీస ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం రావడం లేదని నిర్వాసిత రైతులు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి కొనసాగుతున్న సేకరణ తొలిసారిగా ఈ నిమ్జ్ కోసం 2014లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామం పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను 2015లో పంపిణీ చేశారు. అలాగే చీలపల్లి, ఎల్గొయి తదితర గ్రామాల్లో కూడా భూములను సేకరించారు. ఇలా తొలి విడతలో 2,892 ఎకరాలను సేకరించి దాదాపు దశాబ్దం గడిచినా ఒక్క పరిశ్రమ కూడా ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఒక్క ఉద్యోగాన్నివ్వలేదు. ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. ఉన్న భూములు కోల్పోయి రైతుల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైంది. ఏళ్ల తరబడి జాప్యం.. పలు బహుళజాతి కంపెనీలు ఈ నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి. ఈ మేరకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ వాహనాల ఉత్పత్తి సంస్థ ట్రైటాన్ ఈ నిమ్జ్లో రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అలాగే రక్షణరంగ ఉత్పత్తులు చేసే మరో సంస్థ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని భావించాయి. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ నిర్మాణం దిశగా శ్రీకారం చుట్టలేదు. ఉత్పత్తిని ప్రారంభించలేదు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు మాత్రం నిర్వాసితులుగా మారుతున్నారు.12,635 ఎకరాల లక్ష్యం..మూడు లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..రూ.వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం 2012లో జహీరాబాద్ వద్ద ఈ నిమ్జ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ నిమ్జ్ కోసం న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూములు సేకరించి ఇవ్వాలని టీజీఐఐసీ రెవెన్యూశాఖను అభ్యర్థించింది. తొలివిడతలో సేకరించిన 2,892 లతో రెండో విడతలో సేకరించిన భూములతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,109 ఎకరాలను తీసుకున్నారు. మిగిలిన 7,526 ఎకరాలను ఇంకా సేకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజా నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ను నియమించిన సంగతి తెలిసిందే. -
పోయింది అధికారం మాత్రమే
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారం మాత్రమేనని ప్రజల గుండెల్లో ఉండేది గులాబీ జెండానే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని ఎన్గార్డెన్లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ...బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న హన్మకొండలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. గ్రామాల్లో రజతోత్సవ సభ గురించి ప్రజలకు వివరించి వాల్పోస్టర్లు అతికించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు,కార్యదర్శి అరిఫోద్దిన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సుధీర్రెడ్డి, మల్లాగౌడ్, తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. హోప్ ఆస్పత్రికి రూ.50 వేల జరిమానాసంగారెడ్డి: నిబంధనలు పాటించకుండా వైద్యం చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగారెడ్డిలోని హోప్ న్యూరో ఆస్పత్రికి రూ.50 వేల జరిమానా విధించడంతోపాటు నోటీసులు అందించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి శనివారం మీడియాకు వివరించారు. కోహీర్ మండలం పైడి గుమ్మల్ గ్రామా నికి చందిన నవీన (37) హోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2న మరణించాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 4న ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఇందులోభాగంగా నిబంధనలు పాటించకుండా వైద్యం చేసినట్లు విచారణలో తేలింది. మరో ఐదు రోజుల్లో రోగి మృతికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొనట్లు ఆమె వెల్లడించారు. పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలిజిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సంగారెడ్డి టౌన్: రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలో శనివారం రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పత్తి పంట పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతిలో వేసిన పంటలను సాగు చేస్తే మేలైన దిగుబడి ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులకు పత్తి సాగులో మెళకువలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త కో ఆర్డినేటర్ రాహుల్ విశ్వక్, మండల అధికారి ఝాన్సీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో telanganams.cgg.in వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. మండుతున్న ఎండలు 42డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జోన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 41డిగ్రీలు దాటి 42కు చేరువలో నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకురావటం లేదు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఇళ్లలో ఉక్కబోతకు భరించలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యుత్తు సరఫరా లేని సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో శనివారం 16 మండలాలల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యధికంగా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్లో 41.8డిగ్రీలు నమోదు కాగా అత్యల్పంగా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్లో నమోదైంది. -
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
భోజనంలో నాణ్యతలోపిస్తే జైలుకేసంగారెడ్డి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారిని ఆదుకునే పథకాలను తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్రంలో కులగణన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకతీతంగా గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాయితీ రుణాలను ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వ్లెడించారు. త్వరలో మరో 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్ ,టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.● మంత్రి దామోదర హెచ్చరిక ● అందోలులో కేజీబీవీ, నర్సింగ్ కళాశాలల సందర్శన జోగిపేట(అందోల్): విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే అందుకు బాధ్యులైన వారినందరినీ జైలుకే పంపిస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. అందోలులోని ప్రభుత్వ నర్సింగ్, మహిళా పాలిటెక్నిక్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో మంత్రి విద్యార్థినిలతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రిన్సిపాల్, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ల్యాబ్లలో కొత్త కంప్యూటర్లు, డైనింగ్ హాల్లో కొత్త టేబుళ్లు, ఇతర సామగ్రి సమకూర్చినందుకు మంత్రికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ల్యాబ్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కళాశాల పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి హాస్పిటల్కు, హాస్పిటల్ నుంచి కాలేజీకి వెళ్లడానికి కొత్త బస్సు ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు మంత్రి హమీ ఇచ్చారు. అందోలులోని 1141 సర్వే నంబరులోని స్థలంలో నిర్మాణంలో ఉన్న 50 బెడ్ల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, వంద బెడ్ల ఏరియా హాస్పిటల్, నూతన నర్సింగ్ కళాశాల భవనాలతోపాటు కళాశాల ముందు నిర్మిస్తున్న బస్టాండ్లు, ఫోర్లైన్ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆర్డీఓ పాండు, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు, స్థానికులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ -
ఊళ్లల్లో ఉపాధి జోరు
39.96లక్షల దినాల కల్పన లక్ష్యం ● గతేడాది లక్ష్యాన్ని మించి పనులు ● రోజురోజుకు పెరుగుతున్న కూలీల సంఖ్య ● పెరిగిన కూలితో కూలీలకు గిట్టుబాటుసంగారెడ్డి జోన్: గ్రామాలలో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలన్నదే ఉపాధి హామీ లక్ష్యం. ఇందులో పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి జాబ్ కార్డులు మంజూరు చేసి 100 రోజుల పని కల్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులతోపాటు మరి ఏ ఇతర పనులు లేకపోవడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జోరుగా సాగుతున్నాయి. పని ప్రదేశాలు కూలీలతో సందడిగా కనిపిస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకే.. ఉపాధి హామీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 39.96 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ ఆర్థిక ఏడాదిలో చేపట్టి పనులను గుర్తించేందుకు గతేడాది డిసెంబర్లో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి ఉపాధి పనులను గుర్తించారు. గుర్తించిన పనుల ఆధారంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వాటిని చేపడుతున్నారు. అవసరమైతే ప్రజలు, రైతుల అవసరం మేరకు మరిన్ని పనులు చేపడుతున్నారు. లక్ష్యాన్ని మించి పనులు గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఎక్కువగా పనులు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక ఏడాదిలో 49.56లక్షలు నిర్దేశించగా ఈ ఏడాది 50.02లక్షల పని దినాలు కల్పించారు. సుమారు 50 వేల పని దినాలు అదనంగా కల్పించారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీలో పనులు ప్రారంభించిన నాటి నుంచి రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలో 24 మండలాల్లో 619 గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలవుతుంది. జాబ్కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతీరోజు 40 వేలమందికి పైగా పనులకు హాజరవుతున్నారు. పెరిగిన కూలీతో... ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో పనులు చేస్తున్న కూలీలకు రూ.7లను అదనంగా పెంచింది. దీంతో కూలి రూ.307లకు పెరిగింది. దీంతో కూలీలకు గిట్టుబాటు లభించినట్లయ్యింది. అంతేకాకుండా కూలీలకు గిట్టుబాటు వేతనం అందేవిధంగా పనులు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఉపాధి పథకం వివరాలు గతేడాది పనిదినాల లక్ష్యం 49.56లక్షలు గతేడాదిలో పూర్తి చేసిన పనిదినాలు 50.02లక్షలు ఉపాధిహామీ అమలవుతున్న పంచాయతీలు 619 రోజూ హాజరవుతున్న కూలీల సంఖ్య 42,600అవగాహన కల్పిస్తున్నాం సొంత గ్రామంలోనే పని కల్పించటం ఉపాధి పథకం యొక్క లక్ష్యం. ప్రతీ ఒక్కరు పనులకు హాజరయ్యేవిధంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ కూలీకి గిట్టుబాటు అయ్యేవిధంగా ప్రణాళికబద్ధంగా పనులు కల్పిస్తున్నాము. ఉపాధి హామీని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. –జ్యోతి, డీఆర్డీఏ, సంగారెడ్డి జిల్లా -
భూభారతితో సులభతరం
కలెక్టర్ వల్లూరు క్రాంతిపుల్కల్(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతులకు సంబంధించిన భూలావాదేవీలు సులభతరమవుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. పుల్కల్లో శనివారం రైతువేదికలో ఏర్పాటుచేసిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాలలో పర్యటించి, మేధావుల, పలు రైతు సంఘాలతో చర్చించి ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందన్నారు. గతంలోలాగా కాకుండా భూ భారతిలో భూసమస్యలు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని సూచించారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి 8,9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు,తహసీల్దార్ కృష్ణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.దుర్గారెడ్డి, నాయకులు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం మెదక్లోని కేవల్ కిషన్ భవన్లో ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, సామాన్యులపై భారం మోపుతుందన్నారు. కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమర్రి మల్లేశం, జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ, కోరింకల మల్లేశం, సంతో ష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందం, వివిధ రంగాల కార్మికులు, ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై మే 20 సమ్మె సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంట లార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద -
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయండి
తూప్రాన్: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని టీఎస్యూఈఈయూ –సీఐటీయూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏ.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కా ర్మికులను విద్యార్హతలను బట్టి వారికి సబ్ ఇంజనీర్, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కార్మికులకు హామీ ఇచ్చిన విషయంను గుర్తుచేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో మెరుపు సమ్మెకు కూడా వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడల రవీంద్ర ప్రసాద్, సురేశ్, జీవన్, రాజిరెడ్డి, శ్రీను, సలీం, దుర్గయ్య, సిద్ది రాములు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి అరుదైన గౌరవం ● వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలు సాగు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లోని పీజేటీఏయూలో గురువారం ఆర్ఈఏసీ సమావేశం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ ప్రసాద్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1న జహీరాబాద్ నుంచి రైలులో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఇప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి వృద్ధుడు మిరుదొడ్డి (దుబ్బాక ): వృద్ధుడు అదృశ్యమైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై బోయిని పరశురామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వనం యాదయ్య(55) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. 14న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లపల్లిలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధి గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుల్ల మల్లేశం 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. తిరుపతికని వెళ్లి వ్యక్తి -
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..
● ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్ మండలంలో ఘటననారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్ మండలం శాఖాపూర్కు చెందిన గడ్డమీది అశోక్ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేశాడు. ట్రాక్టర్ను తోలుకుంటూ అశోక్ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న రైతు అశోక్ ట్రాక్టర్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్ శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి చిన్నశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు గజ్వేల్రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్(26) బైక్పై ప్రజ్ఞాపూర్ నుంచి తీగుల్ వైపు వస్తున్నాడు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు ● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పంట నష్ట పరిహారం ఏది? వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే! మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు. రూ.5 లక్షల వరకు నష్టం గాంధీనగర్లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది. – మాదాడి రాజేశ్వర్రావు, గాంధీనగర్ హుస్నాబాద్2 ఎకరాలు ఎండింది వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే. – దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా -
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నీరజ్కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్సుఖ్నగర్లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్సింగ్లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీలు చేసింది తామే అని ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాము తెచ్చిన తంటా..
● నాలుగు గ్రామాలకు నిలిచిన కరెంట్ కౌడిపల్లి(నర్సాపూర్): ఓ పాము సబ్స్టేషన్లోకి దూరింది. అంతటితో ఆగకుండా స్తంభాలపై నుంచి తీగలపైకి ఎక్కింది. విద్యుత్షాక్కు గురై చనిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో సబ్స్టేషన్లోని సీటీ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. దీంతో కౌడిపల్లి 132/11కేవీ సబ్స్టేషన్ పరిధిలోని కౌడిపల్లి, దేవులపల్లి, మహమ్మద్నగర్, ధర్మసాగర్ గ్రామాలకు కరెంట్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్ విద్యుత్ సిబ్బంది పరిశీలించి రాత్రి వరకు మరమ్మతు చర్యలు చేపట్టారు. 100 ట్రిప్పుల ఇసుక సీజ్ చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్ గురువారం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వేచరేణి శివారు వాగులో నుంచి కొందరు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి ఒక చోట డంప్ చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు వెళ్లి ఇసుక సీజ్ చేశామన్నారు. ఆయన వెంట ఆర్ఐలు రాజేందర్ రెడ్డి, ఐలయ్య, స్థానిక రైతులు ఉన్నారు. విషపు ఆహారం తిని.. ● మూడు ఆవులు మృతి హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం కేసులో జైలుమర్కూక్(గజ్వేల్): దొంగతనం కేసులో కోర్టు ఇద్దరికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు మర్కూక్ ఎస్ఐ దామోదర్ తెలిపారు. 2017 సెప్టెంబర్లో మర్కూక్ గ్రామానికి చెందిన తుప్పటి కొమురవ్వ వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి వెళ్తుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన అందనాగారం సాయిగౌడ్, బెండి రజనీకాంత్ ద్విచక్రవాహనంపై వచ్చి కొమురవ్వ మెడలో నుంచి రూ.60 వేలు విలువ చేసే బంగారు గొలుసును అపహరించారు. వెంటనే మర్కూక్ పోలీసులో ఫిర్యాదు చేశారు. గురువారం ఇద్దరు నిందితులను పట్టుకొని గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక ఎదుట హాజరు పర్చగా సంవత్సరం జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు చోరీ రామాయంపేట(మెదక్): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన రామాయంపేటలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాల్రాజ్ కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న చర్చి ఫాదర్ మాసాయిపేట దయానంద్ 14న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి ఊరికి వెళ్లాడు. 15న ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పాడు. దయానంద్ వెంటనే వచ్చి చూడగా ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఆకస్మిక తనిఖీలు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం రాత్రి పలు టీస్టాల్స్, పాన్షాపులు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్ ఆదేశాల మేరకు మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచనలతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. టీ స్టాల్స్ పాన్ షాపులు, హోటళ్లలో గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. డాగ్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్తో తనిఖీలు చేశామన్నారు. ఎస్ఐ అమర్, ఆర్ఎస్ఐ భవానీ కుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
సంగారెడ్డిటౌన్/సదాశివపేట: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని నాగపూర్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల వద్ద దళారులకు ఎక్కడా తావు లేకుండా చూడాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నిర్మలరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ అంతకుముందు సదాశివపేటలో విలేకరులతో ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ... హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బహిరంగసభ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నియోజకవర్గ నాయకుడు శివరాజ్పాటిల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, విద్యాసాగర్రెడ్డి, ముబిన్, తదితరులు పాల్గొన్నారు.సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ -
వామ్మో... చిరుత!
●ఇక్రిశాట్లో సంచారం ●భయాందోళనలో ప్రజలుఎక్కడ నుంచి వస్తున్నాయి..? అసలు ఇక్రిశాట్లో చిరుతలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం మాత్రం చిక్కడం లేదు. గతంలో వచ్చిన చిరుతను ఎవరో పెంచుకుని ఇక్రిశాట్లో వదిలేఽశారని చర్చ జోరుగా సాగింది. దాని కారణంగా దానిని పట్టుకోవడం కోసం బోనులో మేకను ఉంచితే అది దానిని తినకుండా మేకతో ఆడుకుని పోయిందనే ప్రచారం జరిగింది. ఇక్రిశాట్ వెనుక భాగంలో రైల్వేలైన్ ఉండటంతో వికారాబాద్ అటవీ ప్రాంతంలో నుంచి రైల్వేట్రాక్ మీదగా ఇక్రిశాట్లోకి వస్తున్నాయన్న వాదన సైతం వినిపిస్తోంది. చిరుతలకు రాత్రి సమయంలో సంచరించే అలవాటు ఉంటుందని అలా కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్రిశాట్లో పెద్దపెద్ద చెట్లు ఉండటంతో పాటు వాటికి కావలసిన నీరు, ఆహారం లభించడంతో ఇక్కడ తిష్ట వేసే అవకాశం కూడా లేకపోలేదని వాదన కూడా వ్యక్తమవుతోంది. రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణంలోని ఇక్రిశాట్లో తాజాగా చిరుత చిక్కడంతో స్థానిక ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇక్రిశాట్లో చిరుత సంచరిస్తున్న విషయం అధికారులు గోప్యంగా ఉంచి వేట మొదలు పెట్టారు. ఎవరూ ఊహించని విధంగా బోను ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే చిరుత చిక్కడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే మరోవైపు ఇక్రిశాట్లో మరో చి రుత కూడా సంచరిస్తుందన్న అనుమానంతో అటవీ శా ఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. గతంలో చిక్కిన రెండు చిరుతలు.. ఇక్రిశాట్లో మొట్టమొదటిసారిగా 2014 ఆగస్టులో ఇక్రిశాట్లో చిరుత చిక్కింది. ఆ సమయంలో చిరుత కనిపించిన 150 రోజులకు తర్వాతగానీ బోనుకు చిక్కలేదు. తిరిగి 2019లో ఇక్రిశాట్లో చిరుత కనిపించడంతో రంగంలోకి దిగిన అధికారులు 120రోజులు శ్రమిస్తేగానీ చిరుత చిక్కలేదు. తాజాగా చిరుతను గుర్తించిన కొద్ది రోజుల్లోనే చిరుత చిక్కడం విశేషం. ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు ఇక్రిశాట్లో మూడు చిరుతలను పట్టుకున్నారు. మరికొన్ని ఉండవచ్చని అనుమానం! తాజాగా ఓ చిరుత అధికారులు చిక్కినప్పటికీ, మరొకటి కూడా ఇక్రిశాట్లోనే సంచరిస్తుందన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికీ ఓ నిర్ధారణకు రాకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక్రిశాట్లో వెయ్యి ఎకరాలకు పైగాభూమి ఉంటుంది. దాంతో ఇందులో మరిన్ని చిరుతలు ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. భయాందోళనలో స్థానికులు.. ఇక్రిశాట్ను ఆనుకొని రామచంద్రాపురం, పటాన్చెరు పట్టణంతోపాటు, తెల్లాపూర్, ఈదుల నాగులపల్లి, వెలిమెల గ్రామాలు ఉంటాయి. ప్రధానంగా మాక్స్సొసైటీ కాలనీ, విద్యుత్నగర్, ఇక్రిశాట్ పెన్సింగ్ ఏరియా, పటాన్చెరులోని పలు కాలనీలు ఇక్రిశాట్కు ఆనుకుని ఉంటాయి. చిరుత చిక్కడంతో ఈ ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు జన నివాసాల మధ్యలోకి చిరుతలు వచ్చే అవకాశం ఉండవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే రైల్వేస్టేషన్.. ఇక్రిశాట్ ఫెన్సింగ్ను ఆనుకునే రామచంద్రాపురం ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ ఉంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్ రైలు ఇక్కడనే ఉంచి తిరిగి ఉదయం బయల్దేరి వెళ్తుంది. రాత్రి సమయంలో ఎంఎంటీఎస్లో వచ్చే అవకాశం ఉంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఇక్రిశాట్లో మరొక చిరుత ఉందని మేము నిర్థారించ లేదు. కానీ, చిరుత కోసం ఏర్పాటు చేసిన ఆధునిక కెమెరాలను అలాగే ఉంచి పరిశీలిస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. –విజయ్ కుమార్, రేంజ్ అధికారి, అటవీ శాఖ -
సిటీ స్కాన్ సెంటర్ సీజ్
నారాయణఖేడ్: అనుమతిలేకుండా పట్టణంలో కొనసాగుతున్న సిటీ స్కాన్ కేంద్రంతోపాటు జీవవ్యర్థాల అమలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ల్యాబ్ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గురువారం నారాయణఖేడ్లో జిల్లా వైద్యాధికారిణి డా.గాయత్రీ దేవి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, సిటీస్కాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతిలేకుండా సిటీ స్కాన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించిన అధికారులు వెంటనే నోటీసులిచ్చి సీజ్ చేశారు. కాగా, ఈ సిటీ స్కాన్ కేంద్రానికి రెండేళ్ల క్రితం కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ అనుమతులు తీసుకోకపోవడంతోనే సీజ్ చేసినట్లు గాయత్రీదేవి చెప్పారు. జిల్లాలో మూడేళ్ల కాలంలో 74 అనుమతి లేని ఆస్పత్రులను సీజ్ చేశామని, 48 ఆస్పత్రులకు రూ.3.78లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.సంధ్యారాణి, ఇన్చార్జీ డీఐఓ డా.మనోహర్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ జెట్ల భాస్కర్ ఉన్నారు.సక్రమంగా విధులు నిర్వహించాలి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు విధి నిర్వహణలో తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం రెండు రోజులపాటు నిర్వహించిన ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్తోపాటు ఎంఎస్సీడీ పాపిలోన్ డివైస్పై రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ పింకీ కుమారి, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫెయిల్ విద్యార్థులకు మరోసారి అవకాశం సదాశివపేట(సంగారెడ్డి): డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి గురువారం తెలిపారు. 2016 నుంచి 2021 మధ్య డిగ్రీ చదివి 1 నుంచి 6 సెమిస్టర్ వరకు ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్టైం సెటిల్మెంట్ ప్రకారం పరీక్షలు రాసేందుకు ఉస్మానియా వర్సిటీ అవకాశం కల్పించిందని ఆమె వెల్లడించారు. పరీక్షలకు అపరాధ రుసుం లేకుండా మే 19 వరకు అపరాధ రుసుంతో మే 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9701956872, 8341298597 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించాలి డీఈఓ వెంకటేశ్వర్లు కంది(సంగారెడ్డి): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. కందిలోని లక్ష్మీనగర్లో గల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన క్యాలెండర్ను డీఈఓ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...పాఠశాలకు అదనపు తరగతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలు కాశీనాథ్, సురేశ్నాయక్, మహమ్మద్ తయ్యబ్లను అభినందించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటలక్ష్మి, పాఠశాల హెచ్ఎం లీలావతితోపాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేటరూరల్(సంగారెడ్డి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొల్కుర్ గ్రామంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కష్టపడి పండించిన పంటను దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాణిక్రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కలెక్టర్ వల్లూరు క్రాంతి కొండాపూర్(సంగారెడ్డి): రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మండల పరిధిలోని గోకుల్ గార్డెన్ ఫంక్షన్ హాలులో రైతులకు భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం –2025 పై అవగాహన సదస్సును టీజీఐఐసీ చైరపర్సన్ నిర్మలారెడ్డితో కలసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. లోప భూ ఇష్టమైన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. భూభారతితో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అంబాదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రవీందర్రెడ్డి, సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి పాల్గొన్నారు. -
క్యాన్సర్ అంటే భయం వద్దు
● సకాలంలో గుర్తిస్తే ఆదిలోనేజయించే అవకాశం ● మున్సిపల్ చైర్మన్ మంజుల ● సిద్దిపేటలో 19న ఉచిత వైద్య శిబిరంసిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే ప్రజల్లో ఒక భయం ఉందని, అలా భయపడొద్దని ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే జయించే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాంలు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక చొరవతో కిమ్స్ ఆస్పత్రి సౌజన్యంగా ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 19న స్థానిక విపంచి ఆడిటోరియంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో మమోగ్రఫీ, పాప్ స్మియర్, బోత్బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్ తదితర పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఈర్షద్, వర్మ, రాములు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
అతి పెద్ద జైన విగ్రహాన్ని కాపాడాలి
నంగునూరు(సిద్దిపేట): నంగునూరులోని చిన్న కొండపై వేల ఏళ్ల కింద వెలసిన వర్ధమాన మహావీరుడి విగ్రహం వద్ద క్వారీ పనులను ఆపి విగ్రహం ధ్వంసం కాకుండా చూడాలని పురావస్తు పరిశోధకుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని జాకీరమ్మ బండపై ఉన్న జైన శిల్పం గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ శివనాగిరెడ్డికి వివరించడంతో బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు బండలను తొలుస్తున్న క్రమంలో విగ్రహం ధ్వంసం అయ్యే అవకాశం ఉందన్నారు. 9 అడుగుల జైన శిల్పం కాయోత్సర్గాసనంలో నిలబడి ఉందని, విగ్రహం తలపై ఊష్ణిష చిహ్నం రాష్ట్ర కూటుల కాలపు జైన తీర్థంకర లక్షణానికి అద్దం పడుతోందని తెలిపారు. కొండకు దిగువన ఇటుక రాతి శకలాలు, రాతి స్తంభంపై పద్మాసనం వేసుకొని కూర్చున్న మహావీరుడి శిల్పంతోపాటు గ్రామంలో హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో జైన తీర్థంకరుల శిల్పాలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నంగునూరులోని అరుదైన విగ్రహం చుట్టూ రాతిని తొలగించడంతో 11వ శతాబ్దపు ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయని వీటిని కాపాడాలన్నారు. కార్యక్రమంలో అహోబిలం కరుణాకర్, పవన్, శిల్పి సుధాకర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి -
ఉచిత కరెంట్తో ఇటుక బట్టీలు
ట్రాన్స్కో ఆదాయానికి భారీగా గండి తూప్రాన్: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంట్ అక్రమ ఇటుకల వ్యాపారులకు వరంగా మారింది. పంటల సాగు కోసం వినియోగించాల్సి న ఉచిత విద్యుత్ను తమ వ్యాపారానికి వినియోగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం అవసరమయ్యే నీటి కోసం విద్యుత్ను వినియోగిస్తున్నారు. ఓ పక్కా రైతులు వేసిన పంటలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించలేక, లో వోల్టేజీ కారణంగా బోరుమోటార్లు కాలిపోతున్నా యి. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టినట్లైతే విద్యుత్ సరఫరా మారింత మెరుగుపడనుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్కో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మండలంలో 16 బట్టీలు ఉమ్మడి మండలంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో తదితర గ్రామల్లో కొంతమంది ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. నిత్యం లారీలు, ట్రాక్ట ర్లలో ఇతర ప్రాంతాలకు సరఫరా తరలిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లోని ఉచిత కరెంటు వినియోగిస్తూ జోరుగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ప్రజలు నూతన ఇళ్ల నిర్మా ణాలను అధికంగా చేపడుతున్నారు. దీంతో ఇటు కల అవసరం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోరుగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. సుమా రు ఉమ్మడి మండలంలో 16 బట్టీలకు పైగా మండలంలో కొనసాగుతున్నాయి. వీటికి నిర్వాహకులు ఉచిత కరెంట్ను వినియోగిస్తున్నారు. బావుల దగ్గర నడవని మోటార్ల నుంచి కరెంట్ తీసుకొని వాడుకుంటున్నారు.వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటిది ఏదీ తీసుకోవడం లేదు. దీంతో రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం ట్రాన్స్కో అధికారులకు తెలిసినా నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటూ... పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు విసిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకం ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని ప్రభుత్వ భూముల్లోంచి లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారు జామువరకు ముడి సరుకును గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో, చెరువులు, కుంటలు ఎక్కడబడితే అక్కడ వీరి అక్రమ వ్యాపా రానికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై దృష్టి సారించి వ్యాపారులను ను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ బావుల నుంచి అక్రమంగా తీసుకుంటున్న నిర్వాహకులు ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తవ్వకం చోద్యం చూస్తున్న అధికారులుచర్యలు తీసుకుంటాం ఇటుక బట్టీలకు ఉచిత విద్యుత్ను వినియోగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశాం. వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో వారిని గుర్తించి చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం. – వెంకటేశ్వర్లు, ట్రాన్స్కో ఏఈ, తూప్రాన్ -
ధాన్యం కుప్పను ఢీకొట్టిన బైక్
యువకుడికి తీవ్ర గాయాలు రామాయంపేట(మెదక్): ధాన్యం కుప్పను బైక్ ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఝాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మంగళవారం బైక్పై ఖాజాపూర్ గ్రామానికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో రో డ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. -
మొగులు..
ఈ ఫొటోలో కనిపిస్తుంది దుబ్బాకకు చెందిన కౌలు రైతు మల్లారెడ్డి. యాసంగిలో వేసిన 3 ఎకరాల వరి పంట ఇంకో 15 రోజులైతే కోతకొచ్చేది. ఆకాశంలో మబ్బులు అవుతుండటంతో భయంతో వరి గొలుసు ఎర్రబడక ముందే కోయించాడు. వర్షం పడితే ఇత్తు చేతికి రాదు ఉన్న పంటనన్నా చేతికొస్తే చాలనుకొని పచ్చిగా ఉన్నా వరిని కోశాడు. ఇది ఈ ఒక్క రైతు మల్లారెడ్డిదే పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. మొగులు గుబులుతో నష్టం అయినా సరే పంటనన్నా కాపాడుకోవాలనే పచ్చి వరిని కోయిస్తున్నారు. దుబ్బాక : ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న వేళ రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ క్షణాన గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి కండ్లళ్ల ఒత్తులు వేసుకొని యాసంగిలో పంటలు కాపాడుకుంటూ వస్తున్న రైతులకు వాన మొగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరి పంటలు చేతికొచ్చే దశలో వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. 20 రోజుల కిందట వడగండ్ల వానలు పడటంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ గాలి దుమారం, వడగండ్ల వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతోపాటు వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు పచ్చి వరి పంట చేలనే కోస్తున్నారు. 20 శాతంకు పైగా నష్టమైనా.. వర్షాలు పడే సూచనలు ఉండడంతోపాటు వారం రోజులుగా చినుకులు కూడా పడుతుండటంతో రైతులు భయంతో 70 శాతం కూడా పూర్తి కాని వరి పంటలను కోయించుకుంటున్నారు. భూమి ఆరక దిగబడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా చైన్ మిషన్లను పెట్టి కోయిస్తున్నారు. సుమారుగా 20 శాతంకు పైగా గింజలు తాలుపోయి నష్టం జరిగే అవకాశాలు ఉంది. జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా చాలా వరకు నీరందక పంటలు ఎండిపోయాయి. గతంలో కురిసిన వడగండ్ల వర్షంతో కొంత వరి పంటలకు నష్టం వాటిల్లింది. తీరా మళ్లీ ఆకాశంలో మార్పులతో పూర్తిగా కాని చేలనే కోస్తుండటంతో చాలా నష్టం వాటిల్లేటట్లు కనిపిస్తుంది. -
ట్రాక్టర్ బోల్తా : యువకుడు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి ఘటన అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగాల భాను(23) వ్యవసాయ పనుల నిమిత్తం తన మామయ్య లింగాల యాదయ్య దగ్గర నుంచి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. పనులు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున తీసుకొస్తుండగా గ్రామ శివారులో కల్వర్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో భాను ట్రాక్టర్ ఇంజన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. అందరితో కలివిడిగా ఉండే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైక్ ఢీకొని వ్యక్తి టేక్మాల్ (మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని లక్ష్మణ్ తండాలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. జోగిపేట– లక్ష్మీనగర్ రోడ్డుపై 14న తండాకు చెందిన కాట్రోత్ పోమ్లా నాయక్ (55) వడ్లు ఆరబోస్తుండగా అతివేగంగా బైక్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సాయంతో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధ వారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు బిక్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైన్స్లోని పర్మిట్ రూమ్లో యువకుడు జోగిపేట(అందోల్): వైన్స్లోని పర్మిట్ రూమ్లో యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన యాదుల్ (45) చౌరస్తాలోని టీ స్టాల్లో పనిచేస్తుంటాడు. బుధవారం మద్యం సేవించేందుకు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న పద్మావతి వైన్స్కు వెళ్లాడు. అతిగా మద్యం సేవించి కూర్చున్నచోటే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ అనిల్కుమార్, ఎస్ఐ పాండు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫర్వీన్ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు? రామాయంపేట(మెదక్): వడదెబ్బ లక్షణాలతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(68) ప్రతిరోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు రోజులుగా అస్వస్థతకు గురై పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి వాంతులు చేసుకున్న బాలయ్యను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. తన భర్త వడదెబ్బతోనే మృతి చెందినట్లు మృతుని భార్య తెలిపింది. సమాచారం అందుకుని వైద్యశాఖ అధికారులు మృతుడి ఇంటికెళ్లి వివరాలు సేకరించారు. వడదెబ్బతో మృతి చెందలేదని, అలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. -
హైనా దాడిలో గొర్రెలు మృత్యువాత
మద్దూరు(హుస్నాబాద్): హైనా దాడిలో గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని రేబర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన ఈరి శ్రీనివాస్ తన వ్యవసాయ బావి వద్ద షెడ్డు నిర్మించుకొని గొర్రెల పెంపకం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గొర్రెలను షెడ్డులోకి తోలి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం షెడ్డు వద్దకు వెళ్లి చూడగా హైనా దాడిలో ఏడు గొర్రెలు మృతి చెంది కనిపించాయి. మరో మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సూమారు రూ.లక్ష వరకు నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తండ్రిపై హత్యాయత్నం ● కుమారుడు రిమాండ్ నర్సాపూర్ : తండ్రిపై హత్యాయత్నం చేసిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన వడ్ల నాగరాజు తన తండ్రి దశరథను ఎలాగైనా చంపాలన్న ఉద్దేశ్యంతో 12న నర్సాపూర్లో కత్తి కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి తండ్రితో గొడవ పడి కత్తితో దాడి చేశాడు. ఆస్తి పంచడం లేదని, తనకు మరో పెళ్లి చేయడం లేదన్న నెపంతో కత్తితో తండ్రిపై దాడి చేశాడని పేర్కొన్నారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడి కేసులో ఇద్దరు అరెస్ట్ నంగునూరు(సిద్దిపేట): రెండు వేర్వేరు చోట్ల దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనట్లు రాజగోపాల్పేట ఎస్ఐ అసీఫ్ తెలిపారు. నర్మేటకు చెందిన సాయికుమార్ మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ మద్యం తాగించాలని కోరాడు. డబ్బులు లేవని చెప్పడంతో దాడి చేయగా సాయికుమార్కు గాయాలయ్యాయి. అలాగే, మంగళవారం హుస్నాబాద్లో జరిగిన వెళ్లి వేడుకల్లో జరిగిన గొడవ విషయమై మాట్లాడుతుండగా నంగునూరుకు చెందిన జిడ్డి రజినీకాంత్, సంపత్లపై ముండ్రాయికి చెందిన జున్నుబోయిన అనిల్ దాడి చేశాడు. రెండు ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని బుధవారం రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. అంబేడ్కర్నురాజకీయాలతో ముడిపెట్టొద్దు ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాక : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను స్వార్థ రాజకీయాలకు ముడిపెట్టడడం బాధాకరమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 13న దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టడడం తగదన్నారు. ముబారస్పూర్లో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాతోపాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, డీబీఎఫ్ జాతీయ నాయకులు శంకర్ అక్కడే ఉన్నామని కింద ఉన్న వ్యక్తి జెండా కావాలని అడుగడంతో ఎమ్మెల్యేపై నుంచి జెండాను ఆ వ్యక్తికి వేశాడని అన్నారు. అనవసరంగా దీనిపై రాజకీయాలు చేయడం మంచి పరిణామం కాదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి జెండాను కింద పడేస్తే మేమే ఖండించేవారిమని దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. తల్లీకొడుకులమృతిపై కేసు నమోదు కల్హేర్(నారాయణఖేడ్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తల్లీకొడుకులు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్ ఎస్ఐ వెంకటేశం బుధవారం తెలిపారు. నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగోడ్ మండలం పట్టెపొలం తండాకు చెందిన తల్లీకొడుకులు లావుడ్య సక్రిబాయి, సుభాష్ దుర్మరణం చెందారు. మృతురాలు సక్రిబాయి కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
10 రోజులకు కోసేదుండే..
నేను 4 ఎకరాల్లో వరి పంట వేసిన. ఇంకో 10 నుంచి 15 రోజులైతే వరి పూర్తిగా కోతకు వచ్చేది. వాన భయంతో ముందుగానే కోయించిన. కొంత పొల్లు పోయినా వాన పడితే ఇత్తు చేతికి రాదనే భయంతోనే కోయించిన. ఏం చేస్తాం బాకీ ఉన్న కాడికి అయితాయి. ఇంకా 10 రోజులు ఉంచితే చేతికొస్తదనే గ్యారంటీ లేదాయే. నేనే కాదు చాలా మంది పచ్చి చేలనే కోయిస్తుండ్రు. – గన్నె వెంకట్రాజిరెడ్డి, రైతు దుబ్బాక 20 రోజుల కిందటే వరి ఈనుతున్న దశలోనే వడగండ్ల వర్షం పడింది. మళ్లీ చేతికొస్తదనుకున్న సమయంలో మొగుల్లు కావట్టే. మళ్లీ రాళ్లు పడితే పంటగింజ కూడా దక్కదు. పచ్చిగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కోయించిన. యాసంగిలో పంట చేతికొచ్చేది నమ్మకం లేదు. పోయిన యాసంగిలో రాళ్లవాన పడి పంట చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మొగుల్లు అవుతుండటంతో 2 రోజుల కిందటనే పచ్చిచేనునే కోయించినా. – ఎంగారి నరేశ్ రెడ్డి, రైతు వానపడితే చేతికిరాదనే భయం.. -
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి టౌన్: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పీఎసీఎస్ కార్యాలయ ఆవరణలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ..రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సగం మందికి చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి మద్దతుధరతోపాటు క్వింటాల్కు రూ.500 బో నస్ ఇస్తామన్నారని, దొడ్డు రకం ధాన్యానికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్నం మాణిక్యం, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నారాయణఖేడ్: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న గురువారం సత్యసాయి మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి బాధ్యులు తెలిపారు. శిబిరంలో కంటి సమస్యలున్న వారికి ఉచితంగా చికిత్సతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని వెల్లడించారు. పూర్తి వివరాలకు 9676171527 నంబరులో సంప్రదించాలని సూచించారు. 28 నుంచి వేసవి శిక్షణ తరగతులు నారాయణఖేడ్: ఖేడ్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 18 వరకు సంస్కార సాధనావర్గ వేసవి శిక్షణా శిబిరం–2025 నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్ల బాలబాలికలకు చిత్రలేఖనం, రంగులు వేయడం, సాంస్కృతిక కళలకు సంబంధించిన చెక్కభజన, యోగా, కోలాటం, డంబుల్స్, భారతీయ ఆటలు, కర్రసాముల్లో రోజూ ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు శిక్షణనిస్తారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాలకు 8099811208, 9391845885, 814322 2295 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పెండింగ్ బిల్లులు చెల్లించండి ట్రాన్స్కో సీఎండీని కలిసిన కరెంట్ కాంట్రాక్టర్లు సంగారెడ్డి: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ అలీని విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు కలసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ప్రజాభిప్రాయసేకరణజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలు 71వ రోజుకు చేరుకున్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై అధికారులు వారం రోజులుగా కొనసాగిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రి య గురువారంతో ముగియనుంది. ఈ మేరకు తహసీల్దార్ పరమేశం బుధవారం మీడియాకు వెల్ల్లడించారు. కార్యక్రమం ముగిసేలోపు ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలు అందించవచ్చన్నారు. సేకరించిన అభిప్రాయాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో అందించనున్నట్లు తెలిపారు. -
డెక్కన్ టోల్ వేస్కు గ్రీన్ హైవేస్–2023 అవార్డు
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు 65వ జాతీయ రహదారిని ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకుగాను సంగారెడ్డికి చెందిన డెక్కన్ టోల్ వేస్ సంస్థకు గ్రీన్ హైవేస్–2023 కేటగిరీలో రజత పురస్కారం లభించింది. మంగళవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో డెక్కన్ టోల్ వేస్కు చెందిన ప్రాజెక్టు హెడ్ రాజేశ్ విచారెకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అవార్డును ప్రదానం చేశారు. జాతీయ రహదారి పొడుగునా పచ్చదనం నింపడం, పునరుత్పాదక ఇంధన సృష్టి, నీటి సేకరణ, వినూత్న మొక్కలు నాటడం, నీటి నిర్వహణ పద్ధతులపై చేస్తున్న కృషికిగాను డెక్కన్ టోల్ వేస్ సంస్థకు అవార్డు లభించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో ప్రభుత్వం టీఎన్జీఎస్ నూతన భవన నిర్మాణంకు కేటాయించిన స్థలంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్లతో కలిసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. అలాగే భవన నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామని, కలెక్టర్ ఉద్యోగుల పక్షానే ఉంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. టీఎన్జీవోస్కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి జావేద్ అలీ, సంఘం జిల్లా కార్యదర్శి వి.రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, పి.వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ జిల్లా లోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ టీఎన్జీవో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ -
పోషకాహార లోపాన్ని అరికట్టాలి
సంగారెడ్డి: ఎప్పటికప్పుడు మహిళల్లోనూ, గర్భస్థ శిశువుల్లోనూ పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. చౌటకూరు మండలం, శివంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి రెండేళ్లవరకు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒత్తిడి తగ్గేందుకు వ్యాయా మాలు, యోగాలు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో నేర్పించాలని సూచించారు. ప్రతీ నెలలో రెండవ శుక్రవారం, నాలుగో శుక్రవారం తల్లికి కుటుంబ సభ్యులకు పౌష్టికాహారంపై కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఇంట్లోని వయో వృద్ధులను, తల్లిదండ్రులను భారంతో కాకుండా బాధ్యతతో చూడాలని చెప్పారు. తల్లిదండ్రుల్ని వద్ధుల్ని ఇబ్బంది గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూ ఓ లలితకుమారి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి వసంతకుమారి, డీఈఓ వెంకటేశ్వ ర్లు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఆర్డీఓ పాండు, సీడీపీఓలు, సంబంధిత అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. శివంపేటలో పోషణ పక్షం కార్యక్రమం కలెక్టర్ వల్లూరు క్రాంతి -
నీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణఖేడ్: వేసవి తీవ్రత అధికంగా ఉండడానికి తోడు భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రస్తుతం కొన్నిచోట్ల విద్యుత్ సమస్య ఇతర కారణాలతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలియడంతో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సక్రమంగా సరఫరా చేయించడం కోసం ప్రత్యేకంగా రూ.70 లక్షలతో డెడికేటేడ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించామన్నారు. ఇందిరమ్మ గృహాల కోసం అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు వినోద్పాటిల్, దిగంబర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు. విద్యుత్ సమస్య నివారణకు రూ.70లక్షలతో డెడికేటెడ్ లైన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష -
వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ప్రజా సంఘాలు, దళిత నేతల డిమాండ్ సంగారెడ్డి టౌన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలు సృష్టించి అవమానించిన అరుణ్కుమార్, నాగార్జునపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని అటువంటి వ్యక్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం ఆయనను తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ హెచ్చరించారు. శివాజీ మహారాజ్ పాదాలకు అంబేడ్కర్ నమస్కరించినట్లుగా పోస్ట్చేసిన అరుణ్ కుమార్, నాగార్జున అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్ఝరాసంగం/న్యాల్కల్ (జహీరాబాద్): ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్లకు పాల్పడకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని బుధవారం పోలీస్ స్టేషన్తోపాటు న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పీఎస్ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రతీ కేసును పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నైట్ బీట్, పెట్రోలింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. సరిహద్దుల వద్ద తనిఖీలు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, రూరల్ సీఐ హన్మంతు, ఎస్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అధ్యాపకుడికి ప్రతిభా అవార్డు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న డాక్టర్ వైకుంఠం కళారంగంలో చేసిన సేవలకుగాను సౌత్ ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్స్ ఉగాది పురస్కారాల్లో భాగంగా అవార్డును అందుకున్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కల్చరల్ ఫైన్ఆర్ట్స్ ఫెడరేషన్ హైద్రాబాద్, ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో అక్కడి లోక్ కళామంచ్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందించినట్లు చెప్పారు. ఐటీ శాఖ సూపరింటెండెంట్ నాగేశ్వర్రావు, సినీ నిర్మాత మంత శ్రీనివాస్, ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రావు, ఆది ఫౌండేషన్ చైర్మన్ ఆది నారాయణ, సీనియర్ కూచిపూడి నాట్యగురు సీతనాగజ్యోతి తదితరులు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని కళామతల్లి సేవలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటానన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ పిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డాక్టర్ గోపాలసుదర్శనం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రద్ధానందం, ఇన్చార్జి పీడీ విశ్వనాథం తదితరులు వైకుంఠంను అభినందించారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారం – అరుణోదయ సాంస్కృతిక నాయకురాలు విమలక్క హుస్నాబాద్: పీపుల్స్వార్ చర్చలకు ముందుకు రావడం, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఇరుపక్షాల చర్చలతో సమస్యలు పరిష్కామవుతాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో జనశక్తి నాయకుడు రిక్కల సహదేవ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. బూటకపు ఎన్కౌంటర్లో సహదేవ రెడ్డి అమరుడయ్యాడని తెలిపారు. తాను ఏదైతే సమ సమాజం కోసం కలలు కన్నాడో దాని కోసం పోరాడటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. కలలు నెరవేర్చడానికి పౌర సమాజం ఆ దిశగా ఆలోచించాలన్నారు. ముంచుకొస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల దృక్పథంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి జరగాలన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ముందుకురాలని అన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మనోహరాబాద్(తూప్రాన్): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దానప్ప సత్యనారాయణ బంధువుల పెళ్లి నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. సోమవారం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని అరతులం బంగారం, ఆరు తులాల వెండి, రూ.80 వేల నగదు కనిపించలేదు. దొంగలు చోరీ చేసినట్లు గుర్తించి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపారు. తడిసిన ధాన్యం.. రైతుల దైన్యం మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని పలు గ్రామాలలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఆకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొన్ని చోట్ల వడగళ్లు కురవడంతో వరి పంట దెబ్బతింది. మండలంలోని వల్లంపట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. -
ఫ్లెక్సీ తొలగింపు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, చలివేంద్రం చాటున ప్రైవేట్ ప్రచారం పేరుతో సోమవారం ‘‘సాక్షి’’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. వెంటనే వైద్యాధికారులు సిబ్బందితో ఫ్లెక్సీని తొలగించారు. ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫ్లెక్సీలు, ప్రచారానికి సంబంధించినవి ఏర్పాటు చేయకూడదని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూడదని వైద్యాధికారులు సిబ్బందికి సూచించినట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులకు ఎవరినైనా రెఫర్ చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
నర్సాపూర్ : కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని కాపాడారు. ఎస్ఐ లింగం కథనం మేరకు.. నర్సాపూర్కు చెందిన మన్నె జయ మ్మ సోమవారం నాలుగేళ్ల కుమారుడితో కలిసి స్థానిక రాయరావు చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెరువులో దిగి నీటి లోపలికి వెళ్తుండగా వాచ్మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసు హెడ్ కానిస్టేబుల్ పాండరి, కానిస్టేబుల్ భిక్షపతి, యాదయ్య, నాగరాజు వెంటనే చెరువు వద్దకు వెళ్లి తల్లి కుమారుడిని నీటిలోంచి బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని జయమ్మ నిశ్చయించుకుందని ఎస్ఐ తెలిపారు. అనంతరం జయమ్మ భర్త అనిల్కుమార్ను స్టేషన్కు పిలిపించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిచారు. తల్లికుమారుడిని కాపాడిన సిబ్బందిని ఎస్ఐతోపాటు పలువురు అభినందించారు.చెరువులోకి వెళ్తుండగా కాపాడిన పోలీసులు -
మహనీయుడా.. మన్నించు
– దాత పేరు లేదని విగ్రహావిష్కరణ వాయిదా పాపన్నపేట(మెదక్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహ దాత తన పేరు పెట్టాలన్న డిమాండ్ ఆవిష్కరణకు బ్రేకులు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేటలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించాలని గ్రామంలోని మూడు యువజన సంఘాలు సంకల్పించాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దాత విగ్రహం వితరణ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ మేరకు యువజన సంఘాలు మండల కాంప్లెక్స్ సముదాయం ముందు సుమారు రూ.2 లక్ష లు ఖర్చు చేసి గద్దె నిర్మించారు. అనుకున్న ప్రకారం వారం రోజుల కిందట విగ్రహం వచ్చింది. ముసుగు వేసి గద్దైపె ఉంచారు. మంగళవారం ఓ ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించాలనుకున్నారు. విగ్రహం ప్రతిష్టించే గద్దైపె తన పేరు ఉండాలని దాత డిమాండ్ చేశాడు. యువజన సంఘాలు ఇందుకు ససేమీర అనడంతో విగ్రహాన్ని వెనక్కి తీసుకెళ్లారు. బోసిపోయిన గద్దెను చూసి మండల ప్రజలు అవాక్కయ్యారు. -
దైవ దర్శనానికి వెళ్తుండగా..
రామచంద్రాపురం(పటాన్చెరు): దైవ దర్శనానికి వెళ్తుండగా టెంపో వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్రోడ్డుపై సోమవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. కొల్లూరు ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. కర్ణాటకలోని బీదర్కు చెందిన హరి కిసాన్ హజారీ బీదర్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. తిరుపతి, శ్రీశైలం వెళ్దామని తనకు తెలిసిన వ్యక్తి మాదయ్య(45) టెంపో వాహనం అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు తల్లి సునీత బాయి, అతడి భార్య శిల్పరాణి, కూతురు అనుష్క, కుమారుడు ఆయూష్, తమ్ముడు దీపక్ కిసాన్ సింగ్, అతడి భార్య అమృత, కూతురు ఆరాధ్య, చెల్లెలు హారతి, ఆమె భర్త అజయ్ సింగ్, పిన్ని జీవన్ బాయి, వారి ఇంట్లో డ్రైవర్ ధనరాజ్తో కలిసి ఇంటి నుంచి దైవ దర్శనానికి బయలుదేరారు. ముత్తంగి సమీపంలోకి రాగానే రింగ్రోడ్డు ఎక్కారు. సోమవారం తెల్లావారుజామున 2 గంటల సమయంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డుపై ముందు ఉన్న వాహనాన్ని తప్పించబోయి టెంపో మొదట డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన 12 మందిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హరి కిసాన్ హజారీ, కుమార్తె అనుష్క, ధన్రాజ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్శనానికి వెళ్లొస్తుండగా కారు ప్రమాదం – నలుగురికి గాయాలు కొండపాక(గజ్వేల్): మంచిర్యాలలోని శివాలయంలో దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో గల కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన తన్మయి, గీత, రోహిత్ రుద్రన్స్ కలిసి కారులో ఆదివారం మంచిర్యాలలోని శివాలయంలో దర్శనం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుద్దెడ శివారులోకి రాగానే వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న ట్రాక్టరును ఢీకొడుతూ డివైడర్ దాటుకొని అవతలి వైపును కారు దూకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక 108 అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీ టౌన్ కేసు నమోదు చేశారు. టెంపో వాహనంబోల్తా పడి ఒకరు మృతి 12 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘటన -
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
పటాన్చెరు టౌన్: భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త రోకలి బండతో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన అత్త పై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వినాయక రెడ్డి కథనం మేరకు.. జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురేశ్కి పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన రమీలా(24)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉండగా పటాన్చెరు మండలం ఇంద్రేశం సాయి కాలనీలో ఉంటున్నారు. సురేశ్ ఓ ప్రైవేటు వెంచర్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రమీలా పాపను తీసుకొని పెద్ద కంజర్లలోతల్లిగారింటికి వెళ్లింది. కాపురానికి రమ్మంటే రావడం లేదని సోమవారం అత్తగారింటికి వచ్చి భార్యతో సురేశ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రేకుడై రోకలి బండతో భార్యపై దాడి చేయగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డువచ్చిన అత్తపై దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని ఎస్ఐ వెంకట్ రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాం. మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాపురానికి రావడం లేదని ఘాతుకం అడ్డొచ్చిన అత్తపై దాడి పటాన్చెరు మండలంలో ఘటన -
వసతి.. ఇదీ దుసి్థతి
కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్వృథాగా మంచాలు, డైనింగ్ టేబుల్స్ వసతి గృహంలోని గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. లైట్లు వెలగడంలేదు. ఇక్కడి సమ స్యలు ఎవరికై నా చెబితే హాస్టల్ సిబ్బంది ఇబ్బందులు పెడతారని వాపోయారు. అలా గే, వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యం కోసం రూ.లక్షలు వెచ్చించి మంచాలు, టేబుల్స్ కొనుగోలు చేసినా వినియోగించడం లేదు. దీంతో విద్యార్థులు కిందనే పడుకుంటున్నారు. కొత్త మంచాలు స్టోర్రూంలో పడేసి పాడైపోయేలా చేస్తున్నారు. బెడ్ షీట్స్సైతం వాడకపోవడంతో చిరిపోతున్నాయి. దీనికితోడు విద్యార్థులు డైనింగ్ స్టీల్ మెటీరియల్ టేబుల్స్, బెంచీలు డైనింగ్ హాల్లో వాడకుండా పడేశారు. విద్యార్థులు కింద కూర్చోని భోజనం చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం ఫ్యూరీఫైడ్ మిషన్ పాడైపోయి ఏడాది గడిచినా బాగు చేయించలేదు. విద్యార్థులకు ఇచ్చిన డ్రెస్లు సైతం ఇవ్వకుండా మూలన పడేశారు. కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి న వారిని అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. భోజనంలో వెంట్రుకలు వస్తాయి.. ఇంకొంచం పెట్టమంటే పెట్టరు. ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు. చిరిగిపోతున్న బెడ్లు, వృథాగా మంచాలు పడి ఉన్నాయి. అయినా ఎవరూ పట్టించుకోకరు. దీంతో విద్యార్థులు అరకొర వసతుల మధ్యే కొంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగు చూశాయి. వసతి గృహంలో మొత్తం 154 మంది విద్యార్థినీలు ఉన్నారు. వార్డెన్ నర్సమ్మతోపాటు కుక్, వాచ్మెన్, కామాటీ విధులు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులు 34 మంది పరీక్షలు పూర్తి అవడంతో ఇటీవల వెళ్లిపోయారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో ప్రస్తుతం 97 మంది వసతి గృహంలో ఉంటున్నారు. కాగా, ఉదయం టిఫిన్తోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సరిగా వండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. భోజనంలో వెంకట్రుకలు వస్తున్నాయని, నీళ్ల చారు ఇష్ట మొచ్చినట్లు వండుతున్నారని చెబుతున్నారు. రెండు నెలలుగా గుడ్డుపెట్టడంలేదని వాపోతున్నారు. హాస్టల్ సిబ్బందికి మంచి భోజనం వండుకొని తమకు మాత్రం ఇష్టం వచ్చినట్లు వండి పెడుతున్నారని ఆరోపించారు. మరోసారి భోజనం పెట్టాలని వెళ్తే సిబ్బంది తిడుతున్నారని చెప్పారు. వర్కర్లు లేక ఇబ్బంది వసతి గృహంలో వర్కర్లు లేక సామగ్రిని వాడటంలేదు. భోజనం మంచిగా చేసేందు చర్యలు తీసుకుంటాం. సెలవులు పూర్తి అయిన తర్వాత అన్నింటినీ వినియోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తాం. – నర్సమ్మ, వార్డన్ సమస్యల వలయంలోఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు పాడైన వాటర్ ఫ్యూరీఫైడ్ మిషన్ చిరిగిన బెడ్ షీట్స్, వృథాగా మంచాలు భోజనంలో వెంట్రుకలు,మళ్లీ పెట్టమంటే తిట్లు -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం
కొమురవెల్లి(సిద్దిపేట): అంబేడ్కర్ జయంతి రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. కొమురవెల్లి మండల కేంద్రంలో గోషాల సమీపంలో వైజంక్షన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, మాజీ ఎంపీపీ తలారి కీర్తన కిషన్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో 40 ఏళ్ల కిందటే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, కొంత మంది వ్యక్తులు తమకు చెప్పకుండా ప్రభుత్వ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎంపీడీవో శ్రీనివాస వర్మ, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్కు ఫిర్యా దు చేశారు. వెంటనే ఆవిష్కరణ నిలిపివేయాలన్నారు. వారి మాట వినకుండా సిద్దప్ప, కీర్తన కిషన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొంత మంది కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు మోహరించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయని, శిలాఫలకం తొలగించాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి శిలాఫలకానికి రంగు వేయడంతో సమస్య సద్దు మనిగింది. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు అంబేడ్కర్కు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శిలాఫలకంపై పేర్లు ఉన్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం చివరకు శిలాఫలకంపై రంగు -
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
మనోహరాబాద్(తూప్రాన్): యువతి అదృశ్యమైన ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసముంటున్న చామంతుల గణేశ్, మంజులకు కూతురు నాగలక్ష్మీ(19), కుమారుడు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాగలక్ష్మీ 10 రోజుల నుంచి మేడ్చల్ మండలంలోని అత్వెల్లి గ్రామ పరిధిలోని నేషనల్ మార్ట్లో పనికి వెళ్తుంది. 12న ఉదయం పనికి వెళ్లిన యువతి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. యువతి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్లాపూర్లో గృహిణి శివ్వంపేట(నర్సాపూర్): గృహిణి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ పంచాయతీ పిట్టల వాడలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం మేరకు.. పిట్టలవాడకు చెందిన సునీత 6న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం సునీత భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. – సంగారెడ్డిలో యువకుడు, గృహిణి సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. మెదక్ జిల్లా రంగంపేట మండలానికి చెందిన ఎరుపుల వెంకట్ (37) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఏడాది కిందట పట్టణంలోని శాంతినగర్కి వచ్చి మేసీ్త్రగా పని చేస్తూ జీవిస్తున్నారు. గత నెల 28న దంపతులు గొడవ పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి అదే రోజు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బేగరి ప్రసన్న కుమార్, సరళ భార్యాభర్తలు. సరళ (30) భర్తతో గొడవపడి 11న నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.పనికని వెళ్లి యువతి -
ప్రాణం తీసిన అతి వేగం
● స్నేహితులను కలిసేందుకు వెళ్తుండగా..● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా● యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుకొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని మర్పడ్గ శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేటు గ్రామానికి చెందిన నామాల అనిల్ (24) హైదరాబాద్లోని బోడుప్పల్ ఉంటూ హోటల్లో పని చేస్తున్నాడు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేటకు చెందిన సాయిబాబ(24) హైదరాబాద్లోనే ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అనిల్, సాయిబాబ ఇద్దరూ స్నేహితులు కాగా గతంలో వీరు సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో గల ఓ హోటల్లో పని చేశారు. ఆ సమయంలో వీరికి అక్కడ కొందరు స్నేహితులు అయ్యారు. వారిని చూసేందుకు ఆదివారం రాత్రి బోడుప్పల్ నుంచి కారులో అనిల్, సాయిబాబ బయలు దేరారు. రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా రుసుం తప్పించుకోవడానికి మర్పడ్గ మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నారు. మర్పడ్గ శివారులో కారు అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనిల్ తలకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిబాబకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు చూసి 108 అంబులెన్స్కు సమాచారం అందించి ఇద్దరినీ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. లారీని ఢీకొని వ్యక్తి.. సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అకోలా నాందేడ్ రహదారిపై శివ్వంపేట శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పు ల్కల్ ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ కథనం మేరకు.. ఓ లారీ సంగారెడ్డి వైపు నుంచి జోగిపేట వైపు వెళుంది. అలాగే అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన జర్నయ్య (43) బైక్పై జోగిపేట వైపే వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో కుడి వైపు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి రామచంద్రాపురం(పటాన్చెరు): టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. శేరిలింగంపల్లి పరిధిలోని నేతాజీనగర్కు చెందిన ప్రభాకర్(55) క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం బెక్పై తెల్లాపూర్ నుంచి కొల్లూరు వైపు వెళ్తున్నాడు. రాజ్ పుష్ప సర్కిల్ వద్దకు రాగానే టిప్పర్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.62.28 కోట్లు
ఉపాధి బకాయిలునిధుల విడుదలలో జాప్యం ● రెండు నెలలుగా రాని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ● కూలీల డబ్బులు కూడా కొందరికి రాలె.. ● త్వరలోనే విడుదల అవుతాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావడంలో ఆలస్యమవుతోంది. కొందరు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా కొంత మేరకు పెండింగ్లో ఉంది. మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాలో పలు అభివృద్ది పనులు జరిగాయి. సీసీ రోడ్లు, డ్రైనే జీల నిర్మాణంతో పాటు, నిర్దేశించిన పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధు లు నిలిచిపోయాయి. నిబంధనల ప్రకారం పక్షం రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలి. కానీ కొందరికి దాదాపు రెండు నెలలుగా కూలీ డబ్బులు రాలేదు. చేసిన పనికి సకాలంలో కూలీ చేతికందకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కూలీలు ఈ పనులకు వెళు తున్నారు. కానీ చేసిన కష్టం చేతికందడంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.62.28 కోట్ల మేరకు బకాయిలు జిల్లాలో మొత్తం 2.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 4.02 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్గా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు 2.09 లక్షల మంది ఉంటారు. అయితే ఈ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద కొన్ని రకాల అభివృద్ది పనులు చేస్తుంటారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో సుమారు రెండు నెలలుగా జాప్యం జరుగుతోంది. అలాగే కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కలిపి మొత్తం రూ.62.28 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో గత ఆర్థిక సంవత్సరం 2024–25లో మార్చి 31 వరకు రూ.61.89 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెండింగ్లో ఉండగా, రూ.20 లక్షల వరకు కూలీలకు చెల్లించాల్సిన కూలీ డబ్బులు రాలేదు. ఈ నెల ఏప్రిల్ మాసానికి సంబంధించి కూడా మెటీరియల్ కాంపోనెంట్, కూలీ డబ్బులు కలిపి రూ.18 లక్షలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ నిధులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడం, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో జాప్యం జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. మూడు నెలలుగా ఎదురు చూస్తున్నాం మూడు నెలల నుంచి కూలీ డబ్బులు చెల్లించడం లేదు. 15 రోజులకు డబ్బులు చెల్లించాలి కానీ.. అలా జరగడం లేదు. డిసెంబర్లో చేసిన పనులకు గాను మొన్న వారం రోజుల డబ్బులు చెల్లించారు. పెండింగ్ కూలీ డబ్బుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వీలైనంత త్వరగా కూలీ డబ్బులు చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –విఠల్, ఉపాధి హామీ కూలి, మొగుడంపల్లి -
నా సినిమాలో నిరసన సన్నివేశాలు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తాను తీస్తున్న సినిమాలో ఒక కలెక్టర్కు వ్యతిరేకంగా తాను చేసిన ధర్నాలు, రాస్తారోకోలు.. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు చేసిన నిరసనలకు సంబందించిన సన్నివేశాలు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడి యాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, ప్రేమ జంటకు అండగా నిలిచే పాత్రలో తాను నటిస్తున్నానని చెప్పారు. గతంలో తనపై పోలీసులు చేసిన ఒత్తిడిలు, నిర్బంధాలు, ఎస్పీతో జరిగిన వాగ్వాదాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో నీటి సమస్య నెలకుంది. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించడంలేదని వారు సమ్మెకు దిగారు. పట్టణంలో నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో బోరుమోటారు లేవు. కేవలం మిషన్భగీరథ నీటిపైనే ప్రజలు ఆధారపడి ఉన్నారు. తాడగానికి వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తుండగా.. ఇంటి అవసరాల నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం సోమవారం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అవగాహనతో అగ్ని ప్రమాదాలకు చెక్ న్యాయమూర్తి భవానీ చంద్ర సంగారెడ్డి క్రైమ్: అవగాహన ఉంటే అగ్ని ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చని జిల్లా న్యాయమూర్తి భవానీ చంద్ర అన్నారు. సంగారెడ్డిలో అగ్నిమాపక దళ వారోత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలకు ప్రమాదాలు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహించినట్లు పట్టణ అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తొలుత 1944లో ముంబై డాక్యార్డ్స్లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక అధికారులతో కలిసి వారోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ‘రన్ ఫర్ ’ అంబేడ్కర్ సంగారెడ్డి జోన్: బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవ్ రావు ‘రన్ ఫర్’ను జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొండాపురం జగన్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. -
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ 2010లో జూన్ 7న ఏర్పాటు చేయగా నాటి నుంచి ఎస్బీఐ సౌజన్యంతో యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు 435 బ్యాచ్లకు శిక్షణ కల్పించి ఎంతోమంది ఉపాధికి బాటలు వేశారు. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అండగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తుండడంతో ఈ శిక్షణ కేంద్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో రోజురోజుకు దీనికి ఎంతో ఆదరణ పెరుగుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గత 15 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్, మగ్గంవర్క్, కంప్యూటర్ శిక్షణతోపాటు ఇటీవల ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ అందిస్తుండగా పురుషులకు మోటార్ వెహికల్ మెకానిక్, సెల్ ఫోన్ రిపేరింగ్, సీసీ టీవీ, ఫొటోగ్రఫీ, కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు. 30 రోజులపాటు శిక్షణ 2010 జూన్ 7న ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 శిక్షణ తీసుకోగా అందులో 8,116 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. 3,303 మందికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించారు. 834 మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, ఉచిత నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది. 30 రోజులపాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తారు. సొంతంగా బైక్ మెకానిక్ షాప్ పెట్టుకున్న స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా బైక్ మెకానిక్లో శిక్షణ పొంది అనంతరం సొంతంగా గ్రామంలోనే మెకానిక్ షాప్ పెట్టుకుని ఉపాధి పొందుతున్నాను. నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తూ నాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. –సురేశ్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామంకుటుంబానికి ఆసరాగా నిలుస్తా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మెషీన్ శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ అనంతరం ఎస్బీఐ ద్వారా రుణం పొంది సొంతంగా కుట్టు మెషీన్ ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా ఉంటాను. –అర్చన, మెదక్ జిల్లా, టేక్మాల్ మండలం, సూరంపల్లిబ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న న్యూస్ పేపర్లో వచ్చిన ఉచిత శిక్షణ ప్రకటనను చూసి సంగారెడ్డి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాను. ఆ తర్వాత ఉచితంగా హాస్టల్లో ఉంటూ బ్యూటీషియన్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం సంగారెడ్డిలో పార్లర్ నడుపుతున్నాను. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను. –అశ్విని రాథోడ్, విట్టు నాయక్ తండ, మొగుడంపల్లి మండలం11,545 మంది ఉచిత శిక్షణ పొందారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణతోపాటు బ్యాంకు ద్వారా రుణాలను కల్పిస్తున్నాం. ఉచిత వసతితోపాటు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. శిక్షణ ఇవ్వడంతోపాటు సొంతంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజేంద్ర ప్రసాద్, గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ ఉపాధి పొందుతున్న యువత ఎస్బీఐ సౌజన్యంతో వ్యాపార రుణాలు 11,545 మందికి ఉచిత శిక్షణ పూర్తి లబ్ధి పొందుతున్న నిరుద్యోగులు -
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ● రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు సంగారెడ్డి జోన్: సామాజిక వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీ ఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికి సమాన హక్కులు కల్పించారు: ఎమ్మెల్యే హరీశ్రావు రామచంద్రాపురం(పటాన్చెరు): చీకట్లో ఉన్న వారికి వెలుగును చూసిన మహానీయుడు అంబేడ్కర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రమేష్, నర్సింహ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదాం: ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు అన్నారు. సోమవారం జహీరాబాద్లో అంబేడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. అనంతరం హోతి(బి)లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బి,నర్సయ్య, కాంగ్రెస్, బీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్రెడ్డి, ఎంపీ కార్యాలయ పార్లమెంట్ ఇంచార్జి జి.శుక్లవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..
బీజేపీ నేతలను పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్హత్నూర (సంగారెడ్డి): అకారణంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినంతమాత్రాన అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్లో ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆరు మంది బీజేపీ నాయకులపై కేసు పెట్టి రిమాండ్కు తరలించారు. అయితే.. బాధిత కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. రాజకీయ కక్షతో కొంతమంది నాయకులు బీజేపీ నేతలపై అకారణంగా దాడి చేసి, పైగా పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, అయినా భయపడాల్సిన అససరం లేదన్నారు. ఆఖరుకు న్యాయమే గెలుస్తుందని, జైలు నుంచి విడిపించేందుకు అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్, ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్, నాయకులు సంఘసాన్ని సురేష్, రమేష్ గౌడ్, సతీష్, గ్రామ బిజెపి నాయకులు పాల్గొన్నారు. -
ఇక మద్యం ముట్టం
మల్లారెడ్డిపేట గ్రామస్తులు ప్రతిన మునిపల్లి(అందోల్): ఇంటిని ఒంటిని గుల్ల చేస్తున్న మద్యాన్ని ఇక నుంచి ఎవరం తాగబోమని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆదివారం అంతా ఓ చోట చేరి ప్రమాణం ప్రమాణం చేశారు. జిల్లా మంజీర రైతు సమైఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మద్య నిషేధం కోసం చర్చించి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ...మద్యానికి బానిసై యువత పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం వల్ల భార్యాభర్తల మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరిగుతున్నాయన్నారు. ఇప్పటివరకు చాలామంది యువత మద్యానికి బానిసలై మృతి చెందినట్లు మంజీర రైతు సమైఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తెలిపారు. -
మున్సిపాలిటీపై నిరసనల సెగ
● ఆందోళనలో జిన్నారంమండల వాసులు ● రైతులు నష్టపోతారంటున్న ప్రజలుజిన్నారం (పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీగా మార్చాలన్న ప్రభుత్వ వైఖరిపై ఆ మండల వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన విరమించుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిన్నారం మండలంలో గుమ్మడిదలతోపాటు గడ్డపోతారం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీగా మార్చారు. నగరానికి సరిహద్దు ప్రాంతమైన జిన్నారం మండలాన్ని సైతం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన మండలవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ వాతావరణం గల మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన చేయవద్దంటూ నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దాదాపు 80% గ్రామీణ ప్రాంతాలతో కళకళలాడే మండలాన్ని మున్సిపాలిటీ చేయడం స్వార్థ రాజకీయాలకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఇంటి పన్నులు, వ్యాపార సంబంధిత ట్రేడ్ లైసెన్సులు తీసుకోవడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మున్సిపాలిటీ ఏర్పాటు ఆలోచన చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీకి వ్యతిరేకం.. కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీలను కలుపుతూ మండలాన్ని మున్సిపాలిటీగా మార్చడం సరైంది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది. మేమంతా ఏకమై మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. – శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, జిన్నారంరైతులు నష్టపోతారు జిన్నారం మండలంలో దాదాపు పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామపంచాయతీలపరంగా వ్యవసాయ ఆధారిత గ్రామాలే ఉన్నాయి. మున్సిపల్ ఏర్పాటుతో వ్యవసాయ భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుంది. రైతన్నలకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – కొత్తకాపు జగన్ రెడ్డి, బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడు -
రెండు లక్షల ఉద్యోగాలు బోగస్సే: హరీశ్ రావు
సిద్దిపేటజోన్: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగసేనని, నేటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘నాడు నిరుద్యోగుల కోసం కోదండరాం, రియాజ్, వెంకట్, మురళి, రేవంత్రెడ్డి అశోక్నగర్ కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపట్టారు .. రాహుల్ గాంధీని అశోక్ నగర్కు తీసుకొచ్చి ప్రామిస్ చేయించారు. మీకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి .. కానీ నిరుద్యోగులకు రాలేదు.. ఎందుకు మీ గొంతులు మూగ పోయాయని హరీశ్ రావు ప్రశ్నించారు. -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మాణిక్రావు పిలుపు జహీరాబాద్ టౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొగుడంపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని మండిపడ్డారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్రెడ్డి, జహీరాబాద్ అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు గుండప్ప, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా భ్రమరాంబికామల్లికార్జున స్వామి కల్యాణంరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లన్న గంపలు తీయటం, మల్లన్న కొట్నం, గొలుసు తెంపు, మల్లన్న బోనాలు సమర్పించడం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దాంకేవీపీఎస్ పిలుపు నారాయణఖేడ్: అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, ఖేడ్ రక్తదాతల గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు ముజాహిద్ చిష్తీ, మానవహక్కుల పరిరక్షణ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ఓంప్రకాష్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఖేడ్ పల్లవి పాఠశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ఆయా సంఘాల బాధ్యులు సంతోష్, గణపతి, సంతోష్రావు పాటిల్, కాన్షీరాం, సురేశ్గౌడ్, అరుణ్, మోహన్, శంకర్, సాయిలు, గౌతం పాల్గొని వలంటరీ సేవలు అందించారు. అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలినారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్పాటిల్, దిగంబర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
కేతకీలో కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సొంతిల్లు కలేనా!
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి నారాయణఖేడ్: ఇందిరమ్మ పథకంతో పేదోడి సొంతింటి కల తీరుస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పథకం పనితీరు మందగించింది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సొంత స్థలాల్లో ఇండ్లను నిర్మించుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న పేదవారి కలలు సుదూర ప్రాంతాల్లో కానరావడంలేదు. పథకం ప్రారంభంలో ఉన్న ఉత్సాహం క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చే సరికి కనిపించడంలేదు. తాము సూచించిన యాప్ద్వారానే లబ్ధిదారులను నమోదు చేయాలని చెబుతూ హౌసింగ్ స్కీమ్పై కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తాము ఇందిరమ్మ యాప్లో పకడ్బందీగానే నమోదు చేశామని చెప్తుండటం చివరకు ఈ వాదనలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ పథకం అమలు తీరులో మాత్రం మందగమనం నెలకొంది. మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుకింద ఎంపిక చేయడంతోపాటు తొలివిడతలో పలువురు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలో ఇళ్ల కోసం 3,18,435మంది అర్జీలు సమర్పించారు. 1,36,821మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో జిల్లాలో 3,939మంది లబ్ధిదారులను తొలివిడతగా ఎంపిక చేశారు. కాగా వీరిలో కొందరు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం వీరిలో అనర్హులు ఎక్కువమంది ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో రీ వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు రీ వెరిఫికేషన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులు ఉంటే ఇచ్చిన మంజూరీ పత్రాలను సైతం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండటం, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారిగురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మంజూరు అయినా అనర్హులు ఉన్న పక్షంలో రద్దు చేయడం, మంజూరు పత్రాలను తిరిగి వెనక్కి తీసుకోనున్నారు. పథకంలో అర్హులనే ఎంపిక చేస్తామని అనర్హులు ఉన్న పక్షంలో వారి మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కాగా ప్రభుత్వం ఇలా రీ వెరిఫికేషన్ అనడంతో లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిర్మాణాల్లో ఆలస్యం.. జిల్లాలో 3,939మంది లబ్ధిదారులు ఎంపిక కాగా 1,231 ఇళ్లు నిర్మాణానికి మంజూరు చేశారు. వీరిలో 350మంది నిర్మాణ పనులు ప్రారంభించారు. బేస్మెంట్ లెవల్లో 60 ఇళ్ల పనులు జరిగాయి. మిగతా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేదు. ఇప్పటివరకు బేస్మెంట్ వరకు పనులు జరిగినా వారికి పైసా విడుదల కాలేదు. మంజూరీ పత్రాలు ఇచ్చి నెల రోజులు కావస్తున్నా చాలా గ్రామాల్లో నిర్మాణపు పనులు ప్రారంభం కాలేదు. పైగా తిరిగి రీ వెరిఫికేషన్ చేస్తామని చెబుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.నారాయణఖేడ్: లబ్ధిదారుల ఎంపికకోసంవెరిఫికేషన్ చేస్తున్న అధికారులు (ఫైల్) జిల్లాలో ఇళ్ల నిర్మాణ తీరు ఆది నుంచి తాత్సారమే అనర్హులుంటే రద్దుకు ప్రభుత్వం చర్యలు!కాగా ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గ దర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారాయి. లబ్ధిదారు పాత ఇంటిని ఆనుకొనిగానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికి గానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయకూడదు. ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు. ఒక ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలంలో ఫొటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. రెండు గదులు, ఒక వంటగది, బాత్రూం ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి. ప్రతీ దశలోనూ ఫొటో తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆశించిన చాలామంది లబ్ధిదారులకు పథకం ప్రారంభం నుంచి వస్తున్న సందేహాలు, ఆదేశాలతో అమలు మందగిస్తుంది. ఇందిరమ్మ పథకం ప్రారంభం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గదర్శకాలు అటు అధికారులు, ఇటు లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. -
ఉల్లి రైతు
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఇన్నాళ్లు వినియోగదారులను కంట తడి పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు ఆ పంట పండించిన రైతులను కంటతడి పెట్టిస్తోంది. సీజను ప్రారంభానికి ముందు మంచి ధర పలికిన ఉల్లిగడ్డ ఇప్పుడు ధర పడిపోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజను ప్రారంభమయ్యే వరకు క్వింటాల్కు గరిష్టంగా రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ధర పలికింది. పక్షం రోజుల్లో ఈ ధర పూర్తిగా పడిపోయింది. గరిష్టంగా రూ.1,300లకు పడిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పంట చేతికందిన సమయంలో ధర పడిపోవడంతో తామంతా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ప్రధాన ఉల్లి మార్కెట్లలో ఒకటైన సదాశివపేట మార్కెట్యార్డులో ఈనెల 11న ఉల్లిగడ్డకు పలికిన ధరను పరిశీలిస్తే.. క్వింటాల్కు గరిష్టంగా రూ.1,369 పలకగా, కనిష్టంగా రూ.529కే పరిమితం కావడం గమనార్హం. గరిష్టంగా రూ.1,369 పలికింది అతి కొద్దిమంది రైతులకే కాగా, సుమారు 85 శాతం రైతులకు క్వింటాల్కు రూ.వెయ్యి లోపే కావడం గమనార్హం. జిల్లాలోని ఇతర ప్రధాన మార్కెట్లు పటాన్చెరు, జోగిపేట్ మార్కెట్లో కూడా దాదాపు ఇవే ధరలు పలికాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా రావంటున్న రైతులు జిల్లాలో ఉల్లిగడ్డను ఎక్కువగా మనూరు, కొండాపూర్ మండలాల్లో సాగు చేస్తారు. సదాశివపేట, నారాయణఖేడ్ మండలాల్లో కూడా రైతులు ఈ పంట వేసుకుంటారు. జిల్లావ్యాప్తంగా ఈసారి సుమారు 1,250 ఎకరాల్లో ఈ పంట సాగైనట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఈ ఉల్లిగడ్డకు మంచి ధర లభించింది. క్వింటాల్కు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలికింది. దీంతో ఈసారి మరింత ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. తీరా ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉల్లినారు ఖర్చులు, నాట్లేసేందుకు..ఉల్లిగడ్డ తవ్వేందుకు కూలీల ఖర్చులు..పురుగు మందులు.. ఇలా సాగు కోసం వెచ్చించిన ఖర్చులు తడిసిమోపెడయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటను విక్రయిస్తే కనీసం ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.న్యూస్రీల్ కనిష్టంగా క్వింటాల్ రూ.600లకే పరిమితం పక్షం రోజుల్లో క్వింటాల్కురూ.వెయ్యి తగ్గిన వైనం లబోదిబోమంటున్న రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాదని ఆవేదన -
వక్ఫ్ బోర్డ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా సంగారెడ్డి టౌన్: ఇటీవల కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కుల్ జమాత్ తహఫుజ్ ఏ షరియా కమిటీ డిమాండ్ చేసింది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో ఆదివారం పాత బస్టాండ్ నుండి ఐబీ వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ...దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేందుకు అనేక రకాల చట్టాలను అమల్లోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును రద్దు చేయకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల మైనార్టీ నాయకులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బస్సు
● ఐదుగురికి తీవ్ర , 10 మందికి స్వల్ప గాయాలు ● రెండు అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలింపుకొండపాక(గజ్వేల్): రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణానికి చెందిన జుట్టు చంద్రదీప్ కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్లోని శంషాబాద్లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగే అతడి పెళ్లికి కరీంనగర్ నుంచి మూడు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కుటుంబీకులు, బంధువులు శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ దుద్దెడ శివారులో టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రక్కన పార్కు చేసి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 24 మంది నిద్ర మత్తులో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెళ్లి కొడుకు కుటుంబీకులు జుట్టు లక్ష్మి, జుట్టు లక్ష్మినారాయణలతో పాటు బంధువులు రుద్ర, లత, ఓదెమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓదెమ్మ, శ్రీలత, రాజ్కుమార్, అన్విత్, రాజవ్వ, మాధవి, జైదేవ్, సహస్రలతో పాటు మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులను రెండు అంబులెన్సులలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మినారాయణ, లత పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. -
మంటలంటుకొని వరి చేను దగ్ధం
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఆదివారం ప్రమాదవ శాత్తు వరి చేనుకు మంటలంటుకొని దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కళవ్వ రెండెకరాల వరి సాగు చేస్తోంది. నీటి కొరత ఏర్పడగా రూ.20 వేలు ఖర్చు చేసి బావి పూడిక తీయించి వరుసతడులు పెడుతూ పంటను కాపాడుకుంటోంది. బావి దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ఎండల వేడికి ఫీజు వైర్ దగ్గర మంటలు వచ్చి వరి చేనులోకి వ్యా పించాయి. సమీప రైతులు చూసి మంటలు ఆర్పుతూ బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే కళవ్వ కుటుంబ సభ్యు లు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇటు పంట, బావిలో విద్యుత్ మోటరు, పైపులు కాలిపోయి రూ.60 వేల నష్టం జరిగిందని బాధితులు వాపో యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరి పంట కాలిపోయిందని, ప్రభుత్వం, అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఫొటో స్టూడియోలో చోరీకంప్యూటర్ ధ్వంసం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ఓ ఫొటో స్టూడియోలో దొంగతనం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... కుకునూరుపల్లిలోని మారుతిసాయి డిజిటల్ ఫొటో స్టూడియో యజమాని శనివారం రాత్రి వరకు పనులు చేసి బంద్ చేసి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్టూడియో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి డబ్బులు, విలువైన వస్తువులు ఉన్నాయా అని వెతికారు. ఏమి దొరక్కపోవడంతో ఫొటోలను డిజిటల్ చేసే కంప్యూటర్ను ధ్వంసం చేసి వెళ్లారు. దీని విలువ సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది. వీటితో పాటు కొన్ని దేశాల నాణేలను జమచేసి స్టూడియోలో పెట్టగా వాటిని ఎత్తుకెళ్లారు. యజమాని ఉప్పల రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు శివ్వంపేట(నర్సాపూర్): భూమి విషయంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... మల్లుపల్లి గ్రామానికి చెందిన గ్యాదరి శ్రీనివాస్కు సంబంధించిన భూమి విషయంలో అతడిపై పలువురు వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ప్రవీణ్, మహేష్, నెల్లూరు, మల్లేష్, భిక్షపతి, సాయిలు, ఆంజనేయులు, శ్రావణ్కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కార్మికుడి మృతి పటాన్చెరు టౌన్: పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన దేవేంద్ర (32) మండలంలోని ఇస్నాపూర్లో నివాసం ఉంటూ కిర్బీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీన విధి నిర్వహణలో ఉండగా పెయింటింగ్ మిషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిశ్రమ యాజమాన్యం అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
జిన్నారం (పటాన్చెరు): భార్యాభర్తల మధ్య గొడవలతో విసుగు చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం... గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కలగజేసుకొని నచ్చచెప్పారు. కాగా మరోసారి గొడవ జరగడంతో భార్య అనిత పుట్టింటికి వెళ్లింది. మళ్లీ తల్లిదండ్రులు నచ్చచెప్పి భర్త వద్దకు పంపించారు. అలా వచ్చిన భార్య మెడలో నగలు లేకపోవడంతో నాగ రాజు నగలు తీసుకురావా లని భార్యను పంపించాడు. ఈ నెల నాగరాజు బయటకు వెళ్తుండగా అతడి తల్లి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ఊర్లోకి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. ఆదివారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలంలో నాగరాజు వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే తన కొడుకు అత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి సాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
తోటల్లోనే టమాటా
గిట్టుబాటు ధర లేక కుదేలవుతున్న రైతులు● కిలో ధర రూ.5 నుంచి రూ.7 వరకు ● మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు ● ధర పతనమవడంతో పశువులకు మేత మర్కూక్(గజ్వేల్): ఆరుగాలం కష్టించి పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పశువులను మేపుతున్నారు. కొన్ని రోజుల క్రితం రూ.15 పలికిన టమాటా ధర ఇప్పుడు రూ.5 నుంచి రూ.7వరకు పలుకుతోంది. కోటి ఆశలతో పంట సాగుచేస్తే పెట్టుబడి, రవాణా ఖర్చులు రాకపోగా చివరికి రైతులకు చెమట చుక్కలే మిగిలాయి. సాగు చేసే ముందు ధరలు బాగానే ఉన్నా తీరా పంట చేతికొచ్చేసరికి పూర్తిగా ధర పతనమై నష్టాల పాలయ్యామని రైతులు వాపోతున్నారు. మర్కూక్ మండలంలో పెద్ద ఎత్తున సాగు.. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు చాలా వరకు టమాటాను సాగు చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే కనీసం కూలీల డబ్బులు రావడం లేదని ఏమీ చేయలేక పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటిమామిడి, గజ్వేల్, జగదేవ్పూర్ ఈసీఐఎల్ లాంటి పెద్ద మార్కెట్లకు.. టమాటాను తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నా కొనేవారు కరువయ్యారు. చివరికి ఎంతో కొంత తక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలోని ఎర్రవల్లి, మర్కూక్, పాములపర్తి, దామరకుంట, వర్ధరాజ్పూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ప్రతి వారం ఏర్పాటు చేసే సంతకు రైతులు టమాటను తీసుకెళ్తున్నారు. కానీ ఎవరు కొనడం లేదని, కొన్నా చివరికి రూ.5 నుంచి రూ.7లకు కిలో ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. మిగిలిన పంటను పశువులకు మేతగా వేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంటను కోసి మార్కెట్కు తరలిస్తే రవాణా చార్జీలు కూడా రావడం లేదని చెబుతున్నారు. గత సంవత్సరం కిలో టమాటా ధర రూ.20 నుంచి రూ.30 పలికింది. ఈ సారి టమాటాను సాగుచేస్తే లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ ధర పతనమవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెట్టుబడి కూడా రాలేదు..
టమాటా ధర కిలో రూ.5నుంచి రూ.7 లు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 2 ఎకరాల్లో వెదురు కట్టెలతో పందిరితో సాగు చేశా. ఎకరాకు లక్షా 20 వేల పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా, కూలీలకు అప్పు తెచ్చి ఇవ్వాల్సి వస్తోంది. రవాణా చార్జీలు కూడా రావడం లేదు. పంటను పారబోయాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితం కిలో ధర రూ.15 పలికిన టమాటా అమాంతం రేటు పడిపోయి రూ.7 కు చేరడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. – కానమైన రాజు, శివారు వెంకటాపూర్ -
మల్లన్న టర్నోవర్ రూ.45 కోట్లు
2024–2025 ఆర్థిక సంవత్సరానికి మల్లన్న ఆలయ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల టర్నోవర్ కాగా.. రూ.20 కోట్ల మేర నికర ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆలయ అధికారులు ఆదాయ, వ్యయ వివరాలను ఆదివారం వెల్లడించారు. ఏడాది కాలంలో టికెట్లు, సేవల ద్వారా రూ.8.39 కోట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 6.31 కోట్లు, హుండీ లెక్కింపు ద్వారా రూ.7.59 కోట్లు, పెట్టుబడుల ద్వారా రూ.12.51 కోట్లు, వడ్డీల రూపంలో రూ. 92.25లక్షలు, లీజ్ అండ్ లైసెన్సుల ద్వారా రూ.2.88 కోట్లు, అన్నదానం ద్వారా రూ.25.72 లక్షలు, ఇతర ఆదాయం రూ. 81.78 లక్షలు, అడ్జెస్ట్మెంట్స్ ద్వారా రూ. 63.30 లక్షలు, ప్రారంభ నిల్వ రూ.55.60లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.5.03 కోట్లతో కలిపి మొత్తం రూ. 45కోట్ల 81లక్ష 77,096 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. వ్యయాల కింద ఉత్సవాల నిర్వహణకు రూ.95.78లక్షలు, ప్రసాదం తయారికీ 4.08 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలు రూ.5.72 కోట్లు, స్ట్యాటూటరీ చెల్లింపులు రూ.3.18 కోట్లు, అడ్జెస్ట్మెంట్ రూ. 12.77కోట్లు, ఇతరాలు రూ.74.72 లక్షలు , అన్నదానం రూ. 36లక్షలు, జాతర నిర్వహణ ఖర్చులు రూ. 94లక్షల 89 వేలు, వేతనాలు రూ.1.61కోట్లు, నిర్మాణాలు రూ.5.69 కోట్లు, శానిటేషన్కు రూ.1.03 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపారు. ముగింపు విలువగా నగదు రూ.15లక్షల 10,221, బ్యాంకు నిలువ రూ.7కోట్ల 2లక్షల 58వేల 281 ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం రూ.18.74 కోట్లు రాగా ఈ సంవత్సరం రూ.20 కోట్ల 97 లక్షల 93 వేల 956 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం కంటే 2.23కోట్లు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
చలివేంద్రం చాటున ‘ప్రైవేట్’ ప్రచారం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఎదుట ఓ ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవి దృష్ట్యా ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు చలివేంద్రం ఏర్పాటు చేసి నిర్వహణ మరిచారు. గత నాలుగు రోజులుగా చలివేంద్రంలో నీరు ఉండటం లేదని, వాటిని పట్టించుకునే వారు లేరని పలువురు చర్చించుకుంటున్నారు. చలివేంద్రం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన పేషెంట్లను కమీషన్లకు ఆశపడి ఆస్పత్రి సిబ్బంది వారిని ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ముందు చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పక్కన అంబులెన్స్ వాహనాలు నిలపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోనికి వెళ్లే సమయంలో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో సాయంత్రం తర్వాత మంచినీరు రావడం లేదని, బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్ పెషెంట్స్ వార్డులలోని వాష్ రూమ్లలో కూడా నీరు రావడం లేదని చికిత్స పొందుతున్న సైతం ఆరోపిస్తున్నారు. ఓ ఆస్పత్రి నిర్వాకం కమీషన్లకు ఆశపడి పట్టించుకోని అధికారులు -
మూర్చ వ్యాధితో కుంట లో పడి..
శివ్వంపేట(నర్సాపూర్): ఒడ్డున ఉన్న వ్యక్తికి మూర్చ రావడంతో కుంటలో పడి నీటి మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నీలం శేఖర్(28) శనివారం కొత్తపేట గ్రామంలో ఉన్న తన బావ జగ న్ ఇంటికి వచ్చాడు. బావ, బామ్మర్ది కలిసి గ్రామ శివారులో ఉన్న రాయునికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. జగన్ చేపలు పట్టేందుకు కుంటలోకి దిగాడు. ఒడ్డున ఉన్న శేఖర్కు మూర్చ రావడంతో కుంటలో పడిపోయాడు. గుర్తించిన జగన్ కుంటలో నుంచి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకట్స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. కల్హేర్ ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం... మండలంలోని బీబీపేటకు చెందిన కుమ్మరి సునీత ఈ నెల 12న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆమె ఆచుకీ లభించలేదు. భర్త కుమ్మరి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనికి వెళ్లిన మహిళ.. శివ్వంపేట(నర్సాపూర్): మహిళ అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్ర శ్యామల శనివారం ఉదయం ఇంట్లో నుంచి కూలి పనికి వెళ్లి సాయత్రం వరకు ఇంటికి రాలేదు. భర్త సత్తయ్య తన విధులు ముగించుకొని ఇంటికి రాగా భార్య కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మల్లన్నకు కాసుల గలగల
● వార్షిక నికర ఆదాయం రూ.20 కోట్లు ● ఏటా కోటిమందికి పైగా భక్తుల దర్శనం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొనే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఆలయ అధికారులు, పాలకమండలి, అర్చకులు, ఒగ్గుపూజారులు, సిబ్బంది సైతం భక్తులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. భక్తుల ఆదరణతో రోజురోజుకు కోరమీసాల స్వామికి కాసుల వర్షం కురుస్తోంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జితసేవలు, హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో భక్తులు బ్రహ్మోత్సవాల సమయంలోనే ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం సంవత్సరం పాటు ప్రతి ఆది, బుధ వారాల్లో వచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులు సంవత్సరం పొడవున స్వామి వారి దర్శనానికి వస్తుండటంతో ఆదాయం భారీగా పెరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో మొదలై ఉగాది పర్వదినానికి వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. మూడు నెలల పాటు కొనసాగే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా కోటి మందికి పైగా భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. పెరుగుతున్న ఆదాయం ఆలయానికి వచ్చే వార్షిక నికర ఆదాయంలో జాతర బ్రహ్మోత్సవాల్లోనే సగం వరకు సమకూరుతోంది. 2023 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ. 4.90 కోట్లు, హుండీ ద్వారా 4.32 కోట్లు, 2024 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ 6.22 కోట్లు హుండీ ద్వారా రూ.4.22 కోట్ల ఆదాయం సమకూరింది. 2025 బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి భక్తులు ఆర్జిత సేవలు, పట్నం, బోనాలు, అభిషేకం, ప్రసాద విక్రయం, కేశఖండన, వసతి గదుల అద్దె మొదలగు సేవల ద్వారా రూ. 5.64 కోట్లు, హుండీ ద్వారా 3.92 కోట్లు సమాకూరాయి. గత రెండు బ్రహ్మోత్సవాలకంటే ఈ సంవత్సరం కొంత ఆదా యం తగ్గినా వార్షిక నికర ఆదాయం పెరిగింది. -
తపాస్పల్లిలో అక్రమ మైనింగ్
అధికారుల అండతో దర్జాగా వ్యాపారం కొమురవెల్లి(సిద్డిపేట): మండలంలోని తపాస్పల్లి గ్రామశివారులో కొందరు ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. సంబంధిత అధికారుల అండదండలతో దర్జాగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామంలోని సర్వే నం.93లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి రాయిని విక్రయిస్తున్నారు. రాయిని కట్ చేయడం కోసం అక్రమంగా విద్యుత్ను వాడుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వందలాది ట్రిప్పుల రాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా బండరాళ్లను కటింగ్ చేసిన విషయమై స్థానికుల ఆందోళనతో అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ కొద్ది రోజులుగా అక్రమార్కులు తిరిగి బండరాళ్లను కట్చేయడం ప్రారంభించారు. స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రస్తుతం పనులు నిలిపివేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
మక్కల ట్రాక్టర్ బోల్తా
కోహెడరూరల్(హుస్నాబాద్): మక్కల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన మండలంలోని బస్వపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి జనార్దన్ అనే రైతు మక్కల లోడ్తో సిద్దిపేటకు వెళ్తున్నాడు. బస్వపూర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. మక్కలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి. దొంగతనం కేసులో ఇద్దరు రిమాండ్ వర్గల్(గజ్వేల్): దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం కోర్టులో రిమాండ్ చేసినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సహస్రనగర్కు చెందిన వేముల చంద్రప్రకాశ్ అలియాస్ చందు(27), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్(19) గతంలో దొంగతనం కేసుల్లో అరెస్టయ్యారు. కరీంనగర్ జైలులో వీరికి పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని 10న గురువారం వర్గల్ మండలం గౌరారం చేరుకున్నారు. అర్థరాత్రి వేళ పాములపర్తి చౌరస్తా వద్ద ఉన్న పూదరి శ్రీనివాస్గౌడ్ కిరాణషాపు షట్టర్ను పైకిలేపి మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి రూ.5,000 నగదు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన నిందితుల నుంచి రూ.800 నగదు, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకొని శనివారం గజ్వేల్ కోర్టులో రిమాండ్ చేశామని సీఐ పేర్కొన్నారు. బాలుడిపై కుక్కల దాడినర్సాపూర్: బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని హన్మంతాపూర్లో శనివారం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హన్మంతాపూర్కు చెందిన స్వప్న, రాజు దంపతుల ఐదేళ్ల కుమారుడు ఉద్బవ్ ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. నాలుగైదు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. వార్డులో వీధి కుక్కల బెడద బాగా పెరిగిందని, వాటిని అదుపు చేయాలని కోరారు. అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య ములుగు(గజ్వేల్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు మండలం జప్తిసింగాయిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలం శ్రీవర్దన్రెడ్డి(34) ఇంటి వద్దనే ఉంటూ చెడు వ్యసనాల బారిన పడ్డాడు. కొంత మేరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చలేక తరచూ బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బాగిరెడ్డి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి పుల్కల్(అందోల్): విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందాడు. పుల్కల్ మండల పరిధిలోని మిన్పూర్ తండాలో చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ క్రాంతికుమార్ కథనం మేరకు.. మిన్పూర్ తండాకు చెందిన రమావత్ రమేశ్ (32) నీళ్లు పారించడానికి శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. అంత కు రెండు రోజుల ముందు.. గాలి వానకు విద్యుత్ తీగ తెగి కింద పడి పడింది. ఇది గమనించని రమేశ్ పొలం నుంచి అలాగే వెళ్తుండగా.. కాలికి తీగ తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి అయినా రమేశ్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఉదయం మరోసారి వెతుకుతుండగా పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుని భార్య రమావత్ లత ఫిర్యాదు మేరకు పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
● ఇంట్లో చెప్పకుండా 2014లో వెళ్లిపోయిన యువకుడు ● అప్పటి నుంచి వెతుకుతున్న తల్లిదండ్రులు ● వారం కిందట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ● సాంకేతికతను ఉపయోగించి పట్టుకున్న పోలీసులు ● అమ్మానాన్నలకు భారం కావొద్దని వెళ్లానంటున్న తే జసాయి మెదక్ మున్సిపాలిటీ: తల్లిదండ్రులకు భారం కావొద్దని, సొంతంగా డబ్బులు సంపాదించి ఇంటికొస్తానని లక్ష్యంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన యువకుడు 11 ఏళ్ల తర్వాత దొరికాడు. దీంతో ఎప్పటికై నా తమ కుమారుడు ఇంటికొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం వెల్లు విరిసింది. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన కూనమనేని శారద–శ్రీనివాస్రావు కుమారుడు కూనమనేని తేజసాయి హైదరాబాద్లోని డీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం 2014లో చేశాడు. తల్లిదండ్రులపై భారం కావద్దన్న ఉద్దేశ్యంతో 7 సెప్టెంబర్ 2024లో ఎవరికీ ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎక్కడా వెతకినా ఆచూకీ లభించలేదు. పదకొండేళ్లు గడిచిపోయినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో 3న పాపన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. తేజ సాయి పేరు మార్చుకోకుండా అదేపేరుతో కొనసాగుతుండటం కేసు త్వరగా ఛేదించేందుకు దోహదపడింది. అతడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట నమోదైన మిస్సింగ్ కేసును త్వరగా మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ను ఎస్పీ అభింనందించారు. ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయానని, బెంగుళూరులో ఉంటూ అక్కడే జీవనం సాగిస్తున్నట్లు తేజ సాయి చెప్పాడు. కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఆర్థికంగా కొంత ఆర్థికంగా ఎదిగాడు. తల్లిదండ్రులపై ఆధార పడకుండా ఏదైనా సాధించాలన్న ఉద్దేశ్యంతో వెళ్లానని, ఆర్థికంగా ఎదిగిన తర్వాతనే ఇరవై ఏళ్లకు వస్తానని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. -
దంపతుల మధ్య గొడవవాటర్ ట్యాంక్పై నుంచి దూకిన భర్త
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిమిరుదొడ్డి(దుబ్బాక): భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ భర్త ఆత్మహత్యకు దారి తీసింది. క్షణికావేశంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మల్లుపల్లిలో శనివారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాలమాకుల కనకయ్య (38) సరిత దంపతులు. వీరికి 18 ఏళ్లలోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కనకయ్య వ్యవసాయ కూలీ పనులతో పాటు, హమాలీ పనులు చేస్తుంటాడు. కొద్ది కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం డబుల్ బెడ్రూంల సమీపంలో భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. సరిత దంపతులు కలుగజేసుకొని కనకయ్యను తిట్టడంతో అవమానంగా భావించి క్షణికావేశంలో పక్కనే ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్పై ఎక్కాడు. గమనించిన స్థానికులు కిందికి దిగి రావాలని వారించినా వినకుండా ఒక్కసారిగా దూకే శాడు. మొదట ట్యాంక్ సమీపంలోని కరెంటు తీగలపై పడ్డాడు. విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలై అక్కడి నుంచి మళ్లీ కిందపడ్డాడు. స్థానికులు వెంటనే సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బోయిని పరుశరామ్ తెలిపారు. -
ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ
కావ్యగాన సభలో కవి అందెశ్రీ సిద్దిపేటజోన్: ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఎంతో అదృష్టమని రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక విపంచి ఆడిటోరియంలో జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ శ్రీ శూద్ర గంగ కావ్యగానం చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంతో తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మంజీర రచయిత సంఘంలో సిద్దిపేట కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. శ్రీ శూద్ర గంగ కావ్య గానం చేసిన సుద్దాల అశోక్ తేజ తన అనుభవాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాల కింద ఉండే వారు శూద్రులు అయినప్పుడు పాదాల కింద నుంచి వచ్చే గంగ శూద్ర గంగ ఎందుకు కాదనీ దాని నుంచే పుస్తకం పుట్టిందన్నారు కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, జిల్లా జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు రంగాచారి, విష్ణు ప్రసాద్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు వర్మ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. దత్తగిరిలో ఘనంగా హనుమాన్ జయంతి ఝరాసంగం(జహీరాబాద్): బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జయంతిని పురస్కరించుకుని బర్దీపూర్తోపాటు వివిధ గ్రామాల్లో వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, డోలారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలం రంగంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోసన్న గారి యాదగిరి, రామమ్మ దంపతుల చిన్న కుమారుడు రంజిత్ కుమార్(22) 6న రాత్రి కోనాపూర్లో స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కోనాపూర్ శివారు మార్గమధ్యలో బైక్ పూర్తిగా దెబ్బతిని, తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న రంజిత్ కుమార్ను అటు వైపు వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడిపై ఎవరో దాడి చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మంచంపై నుంచి కిందపడ్డ వ్యక్తి.. పాపన్నపేట(మెదక్): చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చీకోడ్లో శనివారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పెంటారెడ్డి (72) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 3న ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా ప్రమాద వశాత్తు కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో మొదట స్థానికంగా వైద్యం చేయించారు. 11న మెరుగైన వైద్యం కోసం మెదక్కు అక్కడి నుంచి హైద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. -
వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా లారీ ఢీకొని
నర్సంపల్లి గ్రామంలో రైతు మృతితూప్రాన్: లారీ కింద పడి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నర్సంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి నడిమి తండాకు చెందిన కట్రోత్ గోపాల్(55) అనే రైతు టీవీఎస్ వాహనంపై శనివారం నర్సంపల్లి తండాలోని బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో వెనుకాల నుంచి లారీ ఢీకొట్టింది. గోపాల్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. పాముకాటుతో వ్యక్తి.. గజ్వేల్రూరల్: పాముకాటు తో వ్యక్తి మృతి చెందిన ఘట న మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పాండవుల శ్రీనివాస్(35)కు భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజు మాదిరిగానే శనివారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా శ్రీనివాస్ను పాముకాటు వేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్తున్నట్లు గుర్తించి అక్కడే ఉన్న స్థానికులకు సమాచారం అందించాడు. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
జానపదమే జీవితంగా ముందుకు సాగుతూ..
● గతంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు గొంతెత్తిన గళాలు ● ప్రస్తుతం సోషల్ మీడియా ఫోక్ స్టార్స్గా జిల్లా యువతీ, యువకులు ● వందల సంఖ్యలో పాటలు, లక్షల్లో వ్యూస్ ● పల్లె పదాల పాటల్లో నటిస్తూ.. ఆడుతూ పాడుతూ దివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి దివ్యాంగుడైనా కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ.. పల్లె సవ్వడి ఛానెల్ ద్వారా ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. 6 పాటలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించి కొత్త కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాడు. దుబ్బాకటౌన్: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గజ్జె కట్టి, మైక్ పట్టి ధూంధాం వంటి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన ఎంతో మంది కళాకారులు యూట్యూబ్ను వేదికగా చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. యూట్యూబ్ల్లో లక్ష్యల్లో వ్యూస్ పొందుతున్నారు. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాలతో మనం నేర్చుకున్న విద్య, చేస్తున్న వృత్తి, జీవితంలో ఎంచుకున్న మార్గం పెద్దల బాటల్ని బట్టే ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి సాహిత్యంలో మంచి గౌరవం ఉన్నట్లే భార్గవి తల్లి భూదవ్వకు మంచి గుర్తింపు ఉంది. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాల్లో జానపద పాటలతో అలరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల్లో తన ఆట, పాటలతో జనాన్ని కట్టి పడేసింది. ప్రస్తుతం జాన పదాలను పాడుతూ.. తానే స్వయంగా నటిస్తూ యూట్యూబ్లో ఫోక్ స్టార్గా పేరు గాంచింది. ప్రముఖ జానపద గాయకుడు కళాకారుడు శ్రీనివాస్ భార్గవిని చాలా ప్రోత్సహించేవాడు. ఆయన అప్పటికే జానపదాలు పాడుతుండేవాడు. డప్పు కొట్టుకుంటూ పాడడం, డ్యాన్స్ చేస్తూ పాడడం నేర్పించి కొత్త భార్గవిగా తయారు చేశాడు. ఆయన వల్లె రేలారే రేలాలో భార్గవికి అవకాశం వచ్చింది. కళను నేర్పిన కళాకారుడితోనే వివాహం పాటతో ప్రారంభమైన భార్గవి జీవితంలో మరో పాటగాడు ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు.. ఆట, పాట నేర్పిన కళాకారుడు ముక్కపల్లి శ్రీనివాస్ను భార్గవి వివాహం చేసుకుంది. భార్గవి, శ్రీనివాస్ కలిసి పాడి నటించిన.. కుటుంబ నేపథ్యానికి చెందిన జానపదాలైన బంతి పూల వాసన నీ బానిన్ల, చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు, పోంగ పోంగా పొట్లా చెరువు, కొత్త కుండాల రెండిత్తునాలత్తో .. వంటి పాటలు అధ్యశ్రీ మ్యూజిక్ ద్వారా యూట్యూబ్లో విడుదలై ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. మరికొందరు కళాకారులు దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన కమ్మరి నర్సింలు, పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన బిట్ల ఎల్లం, దుబ్బాకకు చెందిన తుమ్మల ఎల్లంఆస రామారావు, తదితర కళాకారులు, కవి గాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి నేడు సోషల్ మీడియా ద్వారా తమ కళను నిరూపించుకుంటున్నారు. హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి మూడు తరాల నుంచి మా ఇంట్లో జానపదాలు జాలువారుతూ వస్తున్నాయి. జాన పదాలంటే నాకు ప్రాణం. ధూంధాంలో వివిధ సభల్లో జాన పదాలు పాడుతుంటే ఆడ పిల్లవైన నీకు ఈ సభలలో పాడడం అవసరమా అని చాలా మంది హేళన చేసేవారు. కానీ వారే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అమ్మ నేర్పిన పాటను జీవన పాఠంగా నేర్చుకొని గురువు నేర్పిన బాటలో ముందుకు సాగుతున్నాను. ఇప్పటి వరకు 10 పాట్లల్లో నటించగా, ఆధ్యశ్రీ మ్యూజిక్ ఛానల్కు 2.90 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. భవిష్యత్లో మరింతగా రాణిస్తాను. –ముక్కపల్లి భార్గవి సోపతి మ్యూజిక్ సత్తా చాటుతూ.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పిల్లి కార్తీక్ ముదిరాజ్ 2019 సంవత్సరంలో వస్తావ పిల్ల ఓ మధుబాల పాట ద్వారా పరిచమమై సోపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా సత్తా చాటుతున్నాడు. 30కి పైగా పాటల్లో నటించి జిల్లాలో ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల ప్రారంభించిన సోపతి యూట్యూబ్ ఛానల్కు 7 వేల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అత్తని చూడది అన్నమెయ్యది పాట 1.5 మిలియన్ వ్యూస్తో మంచి ఆదరణ పొందింది. పీఎం క్రియేషన్స్: 8 లక్షల సబ్స్క్రైబర్లు సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన పార్వతీ మహేశ్ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగంలో కళాకారుడిగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో పలు వేదికల్లో ఆట, పాటతో అలరించాడు. పీఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లె పదాలను అందిస్తున్నాడు. మంచి పాటల రచయితగా గుర్తింపు పొందిన మహేశ్ 50 పాటలు పైగా రచించి, 30 పాటలకు ప్రొడ్యూస్ చేశాడు. 40 పాటల్లో నటనతో అలరించాడు. 8 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. భార్య సంజన సైతం సింగర్ కావడం విశేషం. నాయి దొరో.. నా రాజమని పాట 100 మిలియన్ వ్యూస్తో జనాధారణ పొందింది. 200 పైగా పాటల్లో మౌనిక డింపుల్ మౌనిక డింపుల్ డ్యాన్స్లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దాదాపు 200కు పైగా పల్లె పదాల పాటల్లో నటించింది. చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మౌనిక మొదట సైడ్ డ్యాన్సర్గా వచ్చి డ్యాన్స్లో మెళుకువలు నేర్చుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎంతో మంది ఆదరాభిమానాలు పొందింది. పల్లెదనం ఉట్టిపడేలా పల్లెటూరి యువతీల పాటల్లో నటిస్తూ హోరెత్తిస్తుంది. ఇన్స్ర్ట్రాగమ్లో రీల్స్ చేస్తూ..ముందుకు సాగుతుంది. డ్యాన్స్లో, యాక్టింగ్లో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నేను 200 పల్లె పదాల్లో నటించడానికి నా గురువులే కారణం. నన్ను ప్రోత్సహించిన కార్తీక్ ముదిరాజ్, హరీశ్ పటేల్కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. -
ఇక ప్రజలకు విస్తృత సేవలు
జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ జహీరాబాద్: పార్లమెంట్ కేంద్రమైన జహీరాబాద్లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించనున్నట్లు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జహీరాబాద్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జిగా సీనియర్ నాయకుడు పస్తాపూర్కు చెందిన జి.శుక్లవర్ధన్రెడ్డిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, ఐడీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, కాంగ్రెస్ నాయకులు పి.నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శౌకత్, భాస్కర్రెడ్డి, మక్సూద్, అర్షద్, అశోక్, అస్మాతబస్సుమ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంతోరైతుల్లో చిగురించిన ఆశలు
● జూన్లో వరి, జొన్న, పప్పుధాన్యాల విత్తనాలు అందుబాటులోకి ● ముందుగా అభ్యుదయ రైతులకుపంపిణీకి నిర్ణయం ● ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్జహీరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గత ఐదేళ్ల నుంచి వ్యవసాయ శాఖ తరఫున విత్తనాల పంపిణీ లేకపోవడంతో రైతులు హైబ్రీడ్ రకాల వైపు మొగ్గుచూపారు. హైబ్రీడ్ విత్తనాలకు బదులు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి, అన్ని రకాల నాణ్యతా పరీక్షలు చేసి విత్తనాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఒక్కో గ్రామంలో ముగ్గురి నుంచి ఐదుగురికి విత్తనాలు అందిస్తారు. వారు పండించిన తర్వాత వచ్చిన పంటను రైతులకు రెండో పంటగా అవే విత్తనాలను వాడుకోవచ్చు. ఇలా మూడేళ్ల కాలంలో గ్రామంలోని రైతాంగానికి అంతా తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా రైతాంగానికి నకిలీ విత్తనాల మోసాల బారి నుంచి రక్షించబడటంతోపాటు నాణ్యమైన విత్తనం ద్వారా 10 నుంచి 15% మేర అదనంగా దిగుబడులు సాధించే అవకాశాలుంటాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేయగా, అందులో ముఖ్యమైన విత్తనాలను మాత్రం రైతులకు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.సాగు పెరుగుతుంది ప్రభుత్వం నాణ్యవంతమైన పప్పుధాన్యాల రకాల విత్తనాలు అందుబాటులోకి తీసుకువస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. దీంతో సాగు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. హైబ్రీడ్ విత్తనాలపైనే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిర్ణయం సంతోషకరంగా ఉంది. పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండేలా చూడాలి. – గోవర్ధన్రెడ్డి, రైతు గుడ్పల్లి గ్రామం, మొగుడంపల్లి మండలంప్రణాళికలను సిద్ధం చేస్తోంది పప్పుధాన్యాలతోపాటు వరి, జొన్న రకాల విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ముందుకు విత్తనాలను వానాకాలం సీజన్లో అభ్యుదయ రైతులకు అందిస్తారు. వారు పండించిన పంటను తిరిగి విత్తనంగా ఉపయోగించుకునేందుకు తోటి రైతులకు అందజేస్తారు. దీంతో గ్రామంలోని రైతులందరికీ విత్తనాలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా విత్తన సమస్య తీరుతుంది. – భిక్షపతి, ఏడీఏ–జహీరాబాద్సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఏడాది లక్ష ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఇందుకోసం అవసరమైన విత్తన రకాల అందుబాటులో లేకపోవడంతో రైతులు హైబ్రీడ్ విత్తనాలనే కొనుగోలు చేసుకుని సాగుచేస్తున్నారు. ఇందుకోసం అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. 84వేల ఎకరాల్లో కందిపంట, 15 ఎకరాల్లో పెసర పంట, 8వేల ఎకరాల్లో మినుము పంటలు సాగవుతున్నాయి. 1.40లక్షల ఎకరాల్లో వరి, రెండు వేల ఎకరాల్లో జొన్న పంటను రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం విత్తనాల రకాలను అందుబాటులో ఉంచితే పప్పుధాన్యాల సాగు రెట్టింపు అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
రాజ్యాంగంతో అన్ని వర్గాలకు లబ్ధి
జహీరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్): రాజ్యాంగం ద్వారా కేవలం దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని గంగ్వార్ ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్తో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అంబేడ్కర్ వల్లే ఆర్బీఐ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాయన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని, ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.900కోట్ల నిధులను పేదలకు అందజేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లకు నిధులను అందజేస్తున్నట్లు తెలిపారు. రూ.13వేల కోట్లతో పేదలకు సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ: ఎంపీ సురేశ్ షెట్కార్ బీజేపీ మతతత్వ పార్టీ అని, దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆరోపించారు. నిమ్జ్ ఏర్పాటు వల్ల జహీరాబాద్ ముఖచిత్రం మారిపోతుందన్నారు. డాక్టర్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ...రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం మొదలైందని అందులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ తన్వీర్, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్యస్వామి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే వివేక్ -
పచ్చని చెట్ట్టే పర్యావరణానికి చేటు
పటాన్చెరు టౌన్: పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న కోనోకార్పస్ మొక్కలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారుతున్నాయి. దుబాయి చెట్టుగా పిలవబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవర పెడుతోంది. ముఖ్యంగా వీటి పుష్పాలు వెదజల్లే పుప్పొడితో శ్వాసకోశ, అలర్జీ సమస్యలు తలెత్తుతాయనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ మొక్కలను నిషేధించింది. జిల్లా పరిధిలో...జీహెచ్ఎంసీ సర్కిల్–22, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారి డివైడర్ల మధ్య, గ్రామాల్లో విరివిగా కోనోకార్పస్ మొక్కలు నాటారు. ఇప్పటికే ఇవి చెట్లుగా మారాయి. ప్రతీ చెట్టుకు పుష్పాలు రాగా...అవి వెదజల్లే పుప్పొడితో పలు శ్వాసకోశ వ్యాధులు, అలర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనో కార్పస్ మొక్కలు నాటడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇటీవలే శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనో– కార్పస్ మొక్కలను తొలగించాలని చెప్పిన విషయం తెలిసిందే. పలు ఆరోగ్య సమస్యలకు కారణం... కోనోకార్పస్ మొక్క పర్యావరణానికి హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతోందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటని మరికొన్ని అరబ్ దేశాలు గుర్తించాయి. రహదారుల గుండా ఏపుగాపెరిగిన కోనోకార్పస్ నిషేధించిన ప్రభుత్వంమొక్కలను తొలగించాలి... సర్కిల్ – 22 పరిధిలో రహదారి డివైడర్లపై, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ చూసినా నేటికీ కోనోకార్పస్ మొక్కలు కనిపిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి భారీగా పెరిగిన మొక్కలను తొలగించాలి. – మహేందర్, అంబేడ్కర్ కాలనీ పటాన్చెరు శ్వాసకోశ, అలెర్జీలకు దారితీస్తుంది కొనోకార్పస్ అనేది విదేశీ మొక్క. ఇది వేగవంతమైన పెరుగుదల, పచ్చదనం కఠినమైన పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వలన దీనిని పరిశ్రమలు, రోడ్ల పక్కన ప్రకృతి దృశ్యాలకు సమీపంలో నాటడానికి ఉపయోగిస్తారు. కానీ, దురదృష్టవశాత్తు దీని పుప్పొడి మానవులలో శ్వాసకోశ సమస్యలు, అలెర్జీ, దగ్గుకు దారితీస్తోందని తేలింది. పర్యావరణ వ్యవస్థకు కూడా పెద్దగా ఉపయోగపడదు. ఇది ఎక్కువగా భూగర్భ జలాలను గ్రహిస్తుంది, మన స్థానిక జాతుల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. – మల్లిక, వృక్షశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
నారాయణఖేడ్: హనుమాన్ జయంతి వేడుకలు నారాయణఖేడ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయంలో డోలాహరణం, అభిషేకం, అలంకరణ, పూజ, మహాహారతి నిర్వహించారు. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొని హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాంమహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. హనుమాన్ దీక్షాధారులు దీక్షల్ని విరమించారు. ఖేడ్ కల్పన హనుమాన్ ఆలయంలో సుప్రభాతసేవ, మాన్యసుక్తాభిషేకం, చందనం తదితర కార్యక్రమాలను నిర్వహించగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఖేడ్లో భజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వంఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి కల్హేర్(నారాయణఖేడ్): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. సిర్గాపూర్ మండలం కడ్పల్, నిజాంపేట్ మండలం నాగధర్లో శనివారం వరి ధాన్యం, జొన్న కోనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం చివరి గింజ వరకు కోనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనీశ్పాటీల్, నాయకులు యాదవరెడ్డి, మల్దోడ్డి తుకారాం, పీఏసీఎస్ చైర్మన్లు సంగారెడ్డి, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. డంపింగ్యార్డ్ మాకొద్దు67వ రోజుకు చేరిన నిరసనలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 67వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొసాగుతున్నాయి. మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ జైపాల్రెడ్డి మాట్లాడుతూ...డంపింగ్యార్డ్ ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యాలతోపాటు, పాడిపశువు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించేవరకు నిరసనలు ఆపేదిలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంజహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలు అలాగే 6వ తరగతి(మైనార్టీ)లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ జే.రాములు ప్రకటనలతో తెలిపారు. 5వ తరగతిలో ముస్లిం మైనార్టీ సీట్లు 51, క్రిస్టియన్ 5, జైన్, పార్శీ, బౌద్దులు, సిక్కులకు 4, నాన్మైనార్టీ విద్యార్థులకు 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్లున్నట్లు ఆయన చెప్పారు. ఆన్లైన్లో లేదా గురుకుల పాఠశాలలో ఏప్రిల్ 30 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. -
పాడి పరిశ్రమకు రుణాలు
ఎన్ఎల్ఎం అందించే పథకం.. రాయితీ వివరాలు మేకలు, గొర్రెలు+పొట్టెలు యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం 500+25 రూ.కోటి రూ.50లక్షలు రూ.10లక్షలు రూ.40లక్షలు 400+20 రూ.80లక్షలు రూ.40లక్షలు రూ.8లక్షలు రూ.32లక్షలు 300+15 రూ.60లక్షలు రూ.30లక్షలు రూ.6లక్షలు రూ.24లక్షలు 200+15 రూ.40లక్షలు రూ.20లక్షలు రూ.4లక్షలు రూ.16లక్షలు 100+5 రూ.20లక్షలు రూ.10లక్షల రూ.2లక్షలు రూ.8లక్షలు పందులు మగ+ఆడ యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం 100+10 రూ.30లక్షలు రూ.15లక్షలు రూ.3లక్షలు రూ.12లక్షలు 50+5 రూ.15లక్షలు రూ.7.5లక్షలు రూ.1.5లక్షలు రూ.6లక్షలు నాటుకోడి పుంజు యూనిట్ విలువ సబ్సిడీ రైతువాటా బ్యాంకు రుణం 1000+100 రూ.50లక్షలు రూ.25లక్షలు రూ.5లక్షలు రూ.20లక్షలు దాణా, గడ్డి రూ.కోటి రూ.50లక్షలు రూ.10లక్షలు రూ.40లక్షలుసంగారెడ్డి జోన్: రోజురోజుకీ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గణనీయంగా పెరుగుతున్న మాంసం వినియోగానికి సరిపడా మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పశువులతోపాటు మేత, దాణా లభ్యతను పెంపొందించేందుకు సైతం జాతీయ పశు సంపద మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా రుణ అవకాశం కల్పిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలు, పొట్టేలు, పందులు, నాటుకోళ్లు, పుంజులతోపాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం పశుసంవర్థక శాఖ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువుల పెంపకానికి ఆసక్తి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తుంది. రూ.10లక్షల నుంచిరూ.50 లక్షల వరకు సబ్సిడీ ఎన్.ఎల్.ఎం పథకం ద్వారా రూ.10లక్షల రూ.50 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడికి విడతల వారీగా సబ్సిడీ అందించనున్నారు. యూనిట్ నెలకొల్పిన తర్వాత సబ్సిడీ వచ్చేంత వరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ పర్యవేక్షిస్తుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు యూనిట్ స్థాపించేందుకు ఆసక్తి గలవారు www.nlm.udyamimitra.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తుదారుడి ఫొటో, అడ్రస్, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ తదితర పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవగాహన లేక పథకానికి దూరం పశువుల పెంపకానికి ప్రోత్సాహకంగా ఎన్ఎల్ఎం పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి సబ్సిడీని అందిస్తుంది. పథకం ప్రారంభించి రెండు, మూడేళ్లు గడుస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో పథకానికి దూరంగా ఉన్నారు.మాంసం ఉత్పత్తి పెంచే దిశగా... రూ.50 లక్షల వరకు రాయితీ రుణం ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల ఆహ్వానం అవగాహన లేక పథకానికి దూరం సద్వినియోగం చేసుకోవాలి పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. ప్రతీ యూనిట్పై 50% సబ్సిడీ అందిస్తారు. ఆన్లైన్ విధానంలో ఆసక్తి కలిగి ఉండి, అనుభవం కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగి ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – వసంతకుమారి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి, సంగారెడ్డి -
ఎన్సీసీతో యువతకు బంగారు భవిష్యత్
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఎన్సీసీ ద్వారా దేశ సేవ చేయడానికి, అదే విధంగా అపార ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, యువత బంగారు భవిష్యత్కు పునాదులు పడుతాయని తెలంగాణ–9వ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జయంత అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సీసీ సర్టిఫికెట్ ద్వారా రాత పరీక్ష లేకుండానే ప్రత్యేక ఎంట్రీ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలతోపాటు, త్రివిధ సాయుధ దళాలు, అగ్నివీర్ వంటి ఉద్యోగాలు నేరుగా పొందవచ్చన్నారు. తద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యే అవకాశం ఉందన్నారు. కళాశాల వాతావరణం చాలా బాగుందని, పూర్వ విద్యార్థుల (అలుమ్ని) గురించి తెలుసుకున్న కమాండింగ్ ఆఫీసర్ మరలా కళాశాల సందర్శించడానికి వస్తానని, స్పెషల్గా సమావేశం అవుతానని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఎన్సీసీ విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ కలిగి ఉంటారని, ఎన్నో యూనిఫామ్ ఉద్యోగాలు సాధించారన్నారు. అగ్నివీర్ ద్వారా ప్రతీ ఏడాది 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జయంత ప్రభుత్వ డిగ్రీ, మహిళా కళాశాల సందర్శన -
మతం పేరుతో మారణ హోమం
హుస్నాబాద్: మతం పేరుతో మారణ హోమం సాగిస్తూ హిందూ సెంటిమెంట్తో మళ్లీ అధికారంలోకి రావాలని నరేంద్ర మోదీ పూనుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తుందని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. అంతక ముందు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే, సావిత్రీ బాయి పూలేలు ఉద్యమ సంస్కరణలకు పునాది వేశారన్నారు. ఒక మతం పై మరో మతం పెత్తనం చేయకూడదని అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఉండేలా మానవత్వం పూనుకున్న వ్యవస్థను నిర్మించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపడితే, కేంద్రం ఎందుకు చేయదని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా కుల, జనగణన చేపడితేనే వాస్తవాలు బయటపడుతాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు జాగిరి సత్యనారాయణ, వనేష్, జనార్దన్, భాస్కర్, కుమార్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. హిందూ సెంటిమెంట్తో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న మోదీ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి -
వేర్వేరు కారణాలతో ఐదుగురు బలవన్మరణం
సిద్దిపేట, మెదక్ జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు కారణాలతో ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కడుపునొప్పి తాళలేక యువకుడు ములుగు(గజ్వేల్): ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం మేరకు.. మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన జమాల్పూర్ స్వామి(23) కడుపునొప్పి బాధను భరించలేక 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని బావమరిదికి వీడియో కాల్ చేసి చెప్పాడు. కుటుంబీకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వామి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు మందలించారని వ్యక్తి దుబ్బాకటౌన్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కాకల్ల యాదయ్య (59) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మొదటి భార్య సత్తవ్వ మృతి చెందడంతో 25 ఏళ్ల కిందట ఐలవ్వను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు కూతుర్లు, రెండో భార్యకి కుమారుడు ఉన్నాడు. యాదయ్య మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఇలా తాగితే ఎలా అని మందలించారు. దీంతో మనస్తాపానికి గురై యాదయ్య శుక్రవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఐలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వృద్ధుడు చిన్నశంకరంపేట(మెదక్): అనారోగ్య సమస్యలతో వృద్ధుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండలం భీమ్రావుపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నార్సింగి మండలం భీమ్రావుపల్లి గ్రామానికి చెందిన కొంగల సిద్ధయ్య(60) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అనారోగ్య సమస్యలతో సిద్ధయ్య బాధపడుతున్నాడు. భార్య నర్సమ్మ కూడా ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది సిద్ధయ్య గ్రామ శివారులోని కాల్వ గట్టు వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఎలక్ట్రీషియన్.. దుబ్బాక: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మోహన్(50) రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు, ఎలా భూమి లేదు. కుటుంబం గడవడానికి అప్పు లు చేశాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఆలయంలో విధులకు హాజరై శుక్రవారం తెల్లవారుజామున ఆలయం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పుల బాధతో యువకుడు చిన్నకోడూరు(సిద్దిపేట): అప్పుల బాధతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిన్నకోడూరులో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్ఐ బాలకృష్ణ కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేపాక యాదవ్వ–రమేశ్ దంపతుల కుమారుడు రేపాక రోహిత్(22) ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఉపాధి కోసం తండ్రి హైదరాబాద్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. రోహిత్, తల్లి, చెల్లితో చిన్నకోడూరులో ఉంటున్నాడు. అప్పుల వాళ్లు అడుగుతుండటంతో మనస్తాపం చెంది రోహిత్ గురువారం అర్థరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.. మృతుడి తల్లి యాదవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే లాభాలు
శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ వట్పల్లి(అందోల్): అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే దిగుబడి పెరిగి లాభసాటిగా ఉంటుందని సంగుపేట ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అన్నారు. శుక్రవారం అందోలు మండల పరిధిలోని అల్మాయిపేట గ్రామంలో అధిక సాంద్రత పత్తి పంట సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ పత్తి సాగు కంటే ఈ అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే మేలైన దిగుబడి, మొక్కల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎకరాకు 22 వేల నుంచి 25 వేల వరకు మొక్కలు వస్తాయన్నారు. ఒకేసారి పూత కాత వచ్చి పంట తొందరగా చేతికి వస్తుందన్నారు. తద్వారా గులాబీ రంగు, కాయ తొలుచు పురుగు బారి నుంచి తప్పించుకొని నికర ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి కుమార్, ప్రతాప్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీహరి, ఏఈఓ లక్ష్మీకాంత్, రేఖా మనోజ్, శ్రీకాంత్, ఓ.ఆకాశ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రవాణా కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు రామచంద్రాపురం(పటాన్ చెరు): గంజాయి రవాణా కేసులో ఇద్దరికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. కొల్లూరు పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన కార్తీక్ రవికిరణ్ దేశ్ముఖ్, కమల్ సంజయ్ ఇద్దరూ కలిసి 2023 సెప్టెంబర్లో కారులో గంజాయిని విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు అప్పట్లో పోలీసులు ఓఆర్ఆర్ కొల్లూరు వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. శుక్రవారం నిందితులను మొదటి అదనపు న్యాయమూర్తి జయంతి ఎదుట హాజరుపర్చగా ఇద్దరికీ 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వరరావు వాదించారు. నిందితులకు శిక్ష పడటంలో ముఖ్య పాత్ర వహించిన అప్పటి సీఐ సంజయ్ కుమార్, ప్రస్తుత సీఐ రవీందర్, కోర్ట్ కానిస్టేబుల్ నర్సింహులు, ఏఎస్ఐ రవీందర్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. జేసీబీ గుంతలో పడి యువకుడు మృతి కొల్చారం(నర్సాపూర్): ప్రమాదవశాత్తు చెరువు జేసీబీ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పోతగోని ఆగమయ్య గౌడ్ పెద్ద కుమారుడు రాము గౌడ్(27)కు చెవులు వినిపించవు. పాడి గేదెలను మేపుతూ వస్తున్నాడు. గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం గేదెలు ఇంటికి వచ్చినప్పటికీ రాము గౌడ్ మాత్రం రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామంలోని పెద్ద చెరువు వద్ద వెతుకుతుండగా జేసీబీ గుంత వద్ద చెప్పులు కనిపించాయి. మత్స్యకారులతో కలిసి రాత్రి వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా నీటిపై రాము గౌడ్ మృతదేహం కనిపించింది. కాలుజారి ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చెక్డ్యాంలో మునిగి మరో యువకుడు పాపన్నపేట(మెదక్): చెక్ డ్యాంలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. ఏఎస్ఐ సంగన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి అనిల్ (22) కూలీ పనులతోపాటు, స్టార్ కలెక్షన్ బిల్లులు వసూలు చేస్తుంటాడు. గురువారం సాయంత్రం బైక్పై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు గ్రామశివారులో వెతికినప్పటికీ జాడ దొరక లేదు. శుక్రవారం ఉదయం మంజీరా నదిలో నిర్మించిన చెక్డ్యామ్ వద్ద అనిల్ బైక్ కనిపించింది. అనుమానంతో నదిలో వెతకగా మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతిపై తండ్రి పోచయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆలయంలో చోరీమునిపల్లి(అందోల్): పెద్దచల్మెడ దుర్గా భవానీ అమ్మవారి దేవాలయంలో వెండి కిరీటం, బంగారు జింకలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. -
ఏఐతో సాంకేతిక విప్లవం
నర్సాపూర్: వారం రోజుల పాటు చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రెండు రోజుల్లో పూర్తి చేసే విధంగా సాంకేతిక విప్లవాలు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వ టీ వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) తనికెళ్ల జోగిందర్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీ 28వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగిందర్ పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విప్లవాలను విద్యార్థులు నేర్చుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని హితవు పలికారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆదిత్య విస్సాం మాట్లాడుతూ వసతులను వివరించారు. కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ పాల్గొన్నారు. అనంతరం పీహెచ్డీ పూర్తి చేసిన ప్రొఫెసర్లను శాలువాలు, మెమోంటోలతో సన్మానించారు. -
అరటి.. లాభాల్లో మేటి
అరటికి ఏ సీజన్లో నైనా మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడువునా సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు పంట పండిస్తున్నారు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరిచుకోవడంతో ఆసక్తి చూపుతున్నారు. అరటిలో కేవలం పండు మాత్రమే కాకుండా పిలకలు, ఆకులకు గిరాకీ ఉంటుంది. లాభాలు రాకున్నా నష్టం మాత్రం ఉండదు. అందుకని రైతులు అరటి సాగు పట్ల ఆసక్తి చూపుతుంటారు. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక లాభాలు సాధించవచ్చు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు. – జహీరాబాద్ టౌన్ జహీరాబాద్లో సాగవుతున్న అరటి తోట● పంట సాగుకు అనువైన సమయం ● అన్ని సీజన్లలో మంచి డిమాండ్ ● పిలకలు, ఆకులకు సైతం గిరాకీ ● సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులుఅరటి ఉష్ణ మండల పంట. ఏడాది పొడుగునా సాగు చేయొచ్చు. 10 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనూ దిగుబడి వస్తుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే గెలల్లో ఎదుగుదల తగ్గుతుంది. నీరు ఇంకే సారవంతమైన నేలలు అరటి పంటకు అనుకూలం. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలల్లో మొక్కలు నాటడం వల్ల సమస్యలు తగ్గి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. చౌడు భూములు అనుకూలం కావు. భూమిని దుక్కి చేసి చదును చేసిన తర్వాత ఆరడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పుతో నాటుకోవాలి. గుంత పైభాగం మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 300 గ్రాముల ఆముదం లేదా వేప పిండి, 150 గ్రాముల సూపర్ఫాస్పేట్ కలిపి గుంతలు పూడ్చాలి. నీరు పెడితే గుంతలో మట్టి సర్దుకుంటుంది. టిష్యూ కల్చర్ మొక్కలను మట్టి గడ్డి చెదరకుండా పాలథీన్ సంచులను తీసి గుంతల మద్యలో పెట్టి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెట్టాలి. తెగళ్లు– నివారణ: ● వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ● అరటి సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+2.5 మి.లీ మోనోక్రాటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. ● అరటి పెరుగు దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోప్యురాన్ 3జీ గులకలను మొక్కల దగ్గరగా వేయాలి. ● అరటి కాయల చివర మెచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. నివారణ చర్యగా ఒక గ్రామ్ కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ● ఆకుమచ్చ తెగుళ్లు వర్షాకాలంలో ఆశిస్తుంది. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.పిలకలు తీసివేస్తే మేలు అరటి చెట్టుకు 3 నుంచి 8 వరకు పిలకలు వస్తాయి. అవసరానికి మంచి నత్రజని వేసినప్పుడు తదితర కారణాల వల్ల పిలకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడూ తీయాలి. లేకుంటే తల్లి చెట్టుతో సమానంగా పోటీ పడి తెగుళ్లు, పురుగుల బెడద పెంచుతుంది. టిష్యూ కల్చర్ మొక్కలను పోషక పదార్థాలు నిల్వ ఉండే దుంపలుండవు. ఇవి నాటిన వెంటనే తొందరగా పెరగవు. ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. నాటిన నాలుగైదు నెలల్లో గెల అంకురం ఏర్పడి కాయల సంఖ్య నిర్ణయమవుతుంది. అందుకని సిఫారసు మేరకు ఎరువులు అందించాలి.జాగ్రత్తలు పాటిస్తే లాభాలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అరటిలో సాగులో అధిక లాభాలు సాధించవచ్చు. పంట సాగు విషయంలో అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేపట్టి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. నీరు, ఎరువులు సమయానికి అందించాలి. అధికంగా రసాయనాలు వాడొద్దు. –పండరి, ఉద్యానశాఖ అధికారి, జహీరాబాద్ -
డబ్బుల కోసమే మహిళ హత్య
● నిందితుడి రిమాండ్ ● గతంలోనూ పలు హత్యలు చేసి జైలుకి ● ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డినర్సాపూర్: డబ్బుల కోసం మహిళను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక సీఐ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ మండలంలోని జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ (52) గత నెల 25న కనిపించడం లేదని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భుజాలీ 3న మెదక్ మార్గంలోని అడవిలో కుళ్లిన మృతదేహమై కనిపిచింది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా మహబూబ్నగర్ జిల్లా అదే మండలంలోని అయ్యగారిపల్లె తండాకు చెందిన కెథావత్ గోపాల్ హత్య చేసినట్లు గుర్తించారు. భుజాలీకి మాయ మాటలు చెప్పి స్థానిక బస్టాండ్ ఏరియా నుంచి మెదక్ మార్గంలోని డంప్యార్డు పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమెకు మద్యం తాగించి చీరతో ఉరేసి చంపి ఆమె వద్ద ఉన్న రూ.400 తీసుకొని వెళ్లాడని వివరించారు. గతంలోనూ హత్యలు చేసి జైలుకి గోపాల్పై గతంలోనే పలు కేసులు ఉన్నాయని, డబ్బులతోపాటు వారి వద్ద ఉండే చిన్నపాటి వెండి నగల కోసం హత్యలు చేస్తుంటాడని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మూడు హత్యలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో సైతం రెండు కేసులు ఉన్నాయన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాస్పేట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఓ హత్య కేసులో పదేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని ఎస్పీ వివరించారు. సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, స్థానిక సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ లింగం, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు ● కుందనవానిపల్లి తోటలు పరిశీలనఅక్కన్నపేట(హుస్నాబాద్): ప్రతీ ఒక్క రైతు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ సలహాదారుడు నాగరాజు అన్నారు. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో ఏలేటి స్వామిరెడ్డి అనే రైతు సాగు చేసిన కూరగాయల తోటను సందర్శించి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అదే విధంగా మైసమ్మవాగు తండా, గండిపల్లి గ్రామాల్లో సాగు చేసిన కూరగాయల పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్ నెట్ల కింద కూరగాయలు, పూలు, సుగుంధ ద్రవ్యాల మొక్కలు తదితర పండించవచ్చునన్నారు. కర్రలపై షెడ్ నెట్లు పరిచి వాటి కింద మిరప, క్యారెట్ తదితర కూరగాయలు, ఆకు కూరలు పండించవచ్చన్నారు. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నీటి ద్వారా పోషకాలు, ఎరువులు అందించవచ్చు అన్నారు. తద్వారా నీటిని పొదుపు చేయడంతోపాటు ఎరువుల వృథా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత, రైతులు స్వామిరెడ్డి, శ్రీ ను, వెంకటేష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
బస్సు వచ్చే.. బాధలు తీరే
● సొంత నిధులతో కలెక్టర్ మనుచౌదరి బస్సు ఏర్పాటు ● గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలకు అందజేత ● మూడు గ్రామాల విద్యార్థులకు తీరిన కష్టాలుకొమురవెల్లి(సిద్దిపేట): తమ గ్రామాలకు పాఠశాల దూరంగా ఉందని, కాలినడకన రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని గురువన్నపేట పాఠశాల విద్యార్థులు కలెక్టర్ మను చౌదరికి తమ కష్టాలను చెప్పుకున్నారు. వెంటనే స్పందించి ఆయన సొంత నిధుల నుంచి పాఠశాలకు బస్సు వేయించారు. సుమారు 212 మంది విద్యార్థులు మండలంలోని గురువన్నపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో సుమారు 212 మంది విద్యార్థులు గురువన్నపేట, పోసాన్పల్లి, కొండపోచమ్మ గ్రామాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల మూడు గ్రామాలకు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిల్లలు నడిచి వెళ్లలేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేశారు. దీనికి నెలకు ఒక విద్యార్థికి రూ.700 చొప్పున చెల్లిస్తున్నారు. రూ.17 లక్షలు వెచ్చించి విద్యార్థుల సామర్థ్యలు పెంపొందించేందుకు గురువన్నపేట ఉన్నత పాఠశాలలో మార్చి 15న కలెక్టర్ మనుచౌదరి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కలెక్టర్తో మాట్లాడారు. తమ గ్రామాలకు పాఠశాల దూరంగా ఉందని, రావడానికి వెళ్లడానికి చిన్న పిల్లలు, ఆడ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని బస్సును వేయించాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సొంత నిధుల నుంచి సూమారు రూ.17 లక్షలు ఖర్చు పెట్టి బస్సును కొనుగోలు చేసి పాఠశాలకు అందజేసి వారి కష్టాలను తీర్చారు. మూడు గ్రామాలకు కలిపి గ్రామానికి ఒక ట్రిప్పు చొప్పు బస్సు వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుంది.చాలా సంతోషంగా ఉంది కోరిన వెంటనే కలెక్టర్ మా పాఠశాలకు బస్సు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులం అందరం కలెక్టర్కు రుణపడి ఉంటాం. ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనానికి నెలకు రూ.700 చెల్లించడంతో తల్లిండ్రులపై అధిక భారం పడేది. పాఠశాలకు కలెక్టర్ బస్సు ఇవ్వడంతో ఆ భారం తగ్గింది. – పుట్ట పవిత్ర 9 తరగతి విద్యార్ధిని 12 మందితో కమిటీ పాఠశాలకు కలెక్టర్ బస్సు అందజేయడం శుభపరిణామం. బస్సు మెయింటెనెన్స్ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థులకు మంచి బోధనను అందించేందుకు పాఠశాల ఉపాధ్యాయులం అందరం కృషి చేస్తాం. విద్యార్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి – రాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు -
పదోన్నతులు.. బదిలీలు
● 6 ఏళ్ల తర్వాత పశుసంవర్థక శాఖలో కదలికలు ● జిల్లాలో 33మందిలో28మందికి అవకాశం ● సీనియారిటీ, రోస్టర్ పద్ధతిలోకేటాయింపు సంగారెడ్డి జోన్: పశుసంవర్థక శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు పదోన్నతులివ్వడంతోపాటుగా మరికొంతమందికి స్థానచలనం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా అధికారులు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సీనియారిటీ, పని తీరును బట్టి అవకాశాలు కల్పించారు. ఎల్.ఎస్.ఏగా ప్రమోషన్ పశువైద్యశాలలో వెటర్నిటీ అసిస్టెంట్లు (వీఏ)గా విధులు నిర్వహిస్తున్న వారికి లైవ్స్టాక్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ప్రతీఏటా ప్రమోషన్లు కల్పించాల్సి ఉండగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో కల్పించలేకపోయారు. జిల్లాలో 28 మందికి పదోన్నతులు జిల్లాలో 44 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 53 ఉపకేంద్రాలు, 5 ఏరియా వెటర్నరీ హాస్పిటల్, జిల్లా కేంద్రంలో ఒకటి ఉన్నాయి. ఆయా కేంద్రాలలో 33 మంది వీఏలు ఉండగా 28మంది ఎల్.ఎస్.ఏగా పదోన్నతులు కల్పించింది. జోన్ 6 లో భాగంగా స్థానచలనం అయిన వారిలో నలుగురికి ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయగా మిగతా 24 మంది అధికారులకు సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ఇతర జిల్లాల నుంచి మరో నలుగురు సంగారెడ్డి జిల్లాకి పదోన్నతిపై రానున్నారు. సీనియారిటీ, రోస్టర్ సిస్టమ్ ప్రకారం... పశుసంవర్థక శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఏలకు సీనియారిటీతోపాటు రోస్టర్ పద్ధతిలో కేటాయించారు. పదోన్నతులకు నిర్దేశించిన అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉద్యోగుల సీనియారిటీ, పనితీరును బట్టి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రమోషన్ల ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఆరేళ్ల తర్వాత... జోనల్ 6 ఏర్పడిన అనంతరం సుమారు ఆరేళ్ల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది. జోనల్ 6లో సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చ ల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. జోనల్ వ్యవస్థ ఏర్పాటు అనంతరం పదోన్నతులు బదిలీలు చేపట్టడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశుగణన పూర్తయిన తర్వాతే.. ఇటీవల చేపట్టిన పశుగణన జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 15తో ప్రక్రియ పూర్తి కానుంది. పదోన్నతి పొందిన వారు వారి పరిధిలోని పశుగణన పూర్తి అయిన తర్వాతే రిలీవ్ కావలసి ఉంటుందని అధికారుల చెబుతున్నారు. -
గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
జహీరాబాద్ టౌన్: పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ డివిజన్ కార్యదర్శి నర్సిహులు మాట్లాడుతూ గ్యాస్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించినా ఒక్క రుపాయి కూడా రావడం లేదన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు వినయ్కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
అతివలే పనిమంతులు
‘ఉపాధి’ పనుల్లో మహిళలే ఎక్కువఉపాధి పనుల వివరాలు.. జిల్లా జాబ్ కార్డులు కూలీలు వినియోగించుకున్న పని దినాలు (లక్షల్లో..) (లక్షల్లో..) మహిళలు పురుషులు సిద్దిపేట 1.97 3.94 33,39,192 17,46,320 మెదక్ 1.64 3.32 26,41,819 19,02,208 సంగారెడ్డి 2.19 4.03 31,07,773 19,60,788 ● ఉమ్మడి మెదక్ జిల్లాలో జాబ్ కార్డులు 5.8లక్షలు ● కూలీలు 11.29లక్షలు ● వసతులు కల్పిస్తే సంఖ్య మరింత పెరిగే అవకాశం మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలీ పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. గ్రామీణ నిరుపేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరం లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా (2024–25)లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని దినాలను ఉపయోగించుకుని భేష్ అనిపించారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 5.8లక్షల జాబ్ కార్డులుండగా 11.29లక్షల మంది ఉపాధి కార్మికులున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన కొత్తల్లో పురుషులే పనులకు వెళ్లేవారు. రానురాను క్రమంగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో మహిళలలే ముందు వరుసల్లో నిలిచారు. ఉమ్మడి జిల్లాలో మహిళలు 90,88,784 పని దినాలను, పురుషులు 56,09,316 పని దినాలను ఉపయోగించుకున్నారు. నైపుణ్య శిక్షణ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన కుటుంబాల్లో యువతీ యువకులుంటే వారికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్నతి అనే పథకం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఉన్నతి శిక్షణలో సైతం అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ శిక్షణతో మరింత రాణించి ఆర్థికంగా ముందుకు సాగుతున్నారు. మరిన్ని వసతులు కల్పిస్తే.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అన్ని వసతులు కల్పిస్తే మహిళల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 3 నుంచి 5గంటల వ్యవధిలో రూ.307 వరకు సంపాధించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రామచంద్రాపురం(పటాన్చెరు): రైతుల సమస్యలను పరిష్కారానికి తన వంతు చేస్తున్నా నని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెల రైతు వేదిక కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు రైతు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించామన్నారు. రైతులు దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని తెలిపారు. రైతులందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ప్రభుత్వం సన్న రకం వడ్ల పైన క్వింటాలకు రూ.2320తో పాటు అదనంగా రూ.500 బోనస్గా చెల్లిస్తుందని తెలిపారు. దీనిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, నాయకులు దేవేందర్ యాదవ్, విజయ్ కుమార్, ఇంద్రారెడ్డి, నాగరాజు, సాగర్లు పాల్గొన్నారు. అండర్పాస్ బ్రిడ్జి నిర్మించండికేంద్రమంత్రి గడ్కరీకి బీఎంఎస్ వినతి జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ క్రాస్రోడ్డు వద్ద 65వ జాతీయ రహదారిపై అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కె.లక్ష్మారెడ్డి కేంద్రమంత్రి నితిన్గడ్కరీని నాగపూర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అండర్పాస్ నిర్మించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. అండర్పాస్ నిర్మించే వరకు హై మాస్ లైట్లను ఏర్పాటు చేయించాలని కోరారు. సిద్దేశ్వర్ మందిరం వద్ద అండర్పాస్ నిర్మించినా ప్రజలు జాతీయ రహదారిపైకి వెళ్లేందుకు సర్వీస్రోడ్డు నిర్మించలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. సర్వీస్రోడ్డును సైతం నిర్మించేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు, సాధ్యమైనంత త్వరలో పనులు చేపడతామని చెప్పినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవాలినారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో వడగళ్లతో కూడిన అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రాంతంలో గురువారం ఈదురు గాలు లు, వడగళ్లతో భారీ వర్షం కురవడంతో వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉందని, ఈ క్రమంలో ఒక్క సారిగా వడగళ్లతో కూ డిన భారీ వర్షం కురియడంతో పంటకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రధానంగా కల్హేర్ మండలం బీబీపేట్, ఖానాపూర్, క్రిష్ణాపూర్, మార్డి తదితర గ్రామాల్లో వందలాది ఎక రాల్లో వరి పంట నేలకు ఒరిగిందన్నారు. ప్రభు త్వం పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలిసదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామపంచాయతీల్లో అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గ్రామపంచాయతీ సిబ్బంది నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,గ్రీన్ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి
టెలీకాన్ఫరెన్స్లో డీపీఓ సాయిబాబా సంగారెడ్డి జోన్: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.సాయిబాబా సూచించారు. జిల్లాలోని డి.ఎల్.పీ.ఓ లు, ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ...వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరా కోసం ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
కొండాపూర్(సంగారెడ్డి): వడగళ్ల వానతో నష్టపోయిన మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లిలో మామిడి తోటలను సందర్శించి, రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ...గాలితోపాటు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి తోటలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మామిడి రైతులు వీరన్న, మల్లేశం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా విద్యకు ఆద్యుడు పూలే
సంగారెడ్డి/సంగారెడ్డి జోన్ : దేశంలో మహిళా విద్యకు ఆద్యుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. జిల్లాలో జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మహనీయునికి నివాళులర్పించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఐఐసీ నిర్మలారెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహనీయుడు పూలే అన్నారు. సత్యశోధక సమాజం ద్వారా నిరుపేదలకు వివాహాలు జరిపించడంతోపాటుగా ఎన్నో పాఠశాలలు, వసతిగృహాల ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాల్లో పూలే వెలుగులు నింపారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలుమహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అధికారులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరింయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాలో ఘనంగా పూలే 199వ జయంతి వేడుకలు -
డంపింగ్ యార్డ్ వద్దు
ప్రజాభిప్రాయంలో తేల్చిచెప్పిన గ్రామస్తులు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని నల్లపల్లి సమీపంలో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు 66వ రోజు చేరుకున్నాయి. జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక ఎమ్మార్వో పరమేశంకు నోటీసుకు నల్లవల్లి, కొత్తపల్లి, లక్ష్మాపూర్, ప్యారానగర్ వాసులు స్పందించారు. భారీ సంఖ్యలో హాజరైన నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాదాపు 1,200 అర్జీలు డంపింగ్యార్డ్కు వ్యతిరేకంగా వచ్చినట్లు తహసీల్దార్ పరమేశం వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మార్వో, ఆర్డీవో ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం తహసీల్దార్ కార్యాలయానికి డంపింగ్యార్డు వద్దని అర్జీలు పెట్టేందుకు వచ్చిన నల్లవల్లి గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభ్యంతరాలు తెలిపేందుకు వచ్చిన గ్రామస్తులపై పోలీసు చర్యను స్థానికులు తీవ్రంగా ఖండించారు. -
కార్పొరేటర్లకు రూ.లక్షల కోట్లు మాఫీ
● పేదల బతుకులతో మాత్రం కేంద్రం చెలగాటం ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ దుబ్బాక: కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తున్న కేంద్రం, పేద ప్రజల బతుకులతో మాత్రం చెలగాటం ఆడుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం దుబ్బాక పట్టణంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ అప్పగిస్తూ దేశ సంపదను కేంద్రం లూటీ చేస్తుందని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మారుస్తూ శ్రమదోపిడికి పాల్పడుతుందన్నారు.గ్యాస్పై మళ్లీ రూ.50 పెంచి పేదలను మోసం చేస్తుందన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోపాల స్వామి, భాస్కర్, పద్మ, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, శ్యామల, భారతమ్మ, శారద తదితరులు ఉన్నారు. కామ్రేడ్ విమలరనదివే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: స్వయం ఉపాధి కల్పించే వివిధ కోర్సులకు హుస్నాబాద్ పట్టణంలోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని సెట్విన్ శిక్షణ కేంద్ర జిల్లా కో ఆర్డినేటర్ అమీనా భాను కోరారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మొగ్గం వర్క్, ఫాబ్రిక్ పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, మెహందీ, బ్యూటీషన్, కంప్యూటర్ ఎలక్ట్రీషి యన్ తదితర కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కోర్సుల పై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పిడుగుపాటుతో ఆవు మృతి చేర్యాల(సిద్దిపేట): పిడుగుపాటుతో ఆవు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేసిరెడ్డి సురేందర్రెడ్డి రోజువారి పనులు ముగించుకొని బుధవారం రాత్రి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసి వెళ్లాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా పిడుగు పడి ఆవు మృతి చెంది ఉంది. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు అల్లాదుర్గం(మెదక్): రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు అయ్యా యి. ఈ ఘటన అల్లాదుర్గం మండలం 161 రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్ వైపు నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్తున్న కారు అల్లాదుర్గం సబ్ స్టేషన్ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా అంబులెన్సులో జోగి పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో హైదరాబాద్ నుంచి పెద్దశంకరంపేట వైపు వెళ్తున్న బూలోరా వాహనం కాయిదంపల్లి శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య హవేళిఘణాపూర్(మెదక్): కుటుంబ కలహాలతో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఔరంగాబాద్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం మేరకు.. ఔరంగాబాద్ గ్రామానికి చెందిన ఆడెపు ధన్రాజ్(32) ఇంట్లో కొంత కాలంగా కుటుంబ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన ధన్రాజ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిషేధిత మాదకద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నంసిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం నిషేధిత మాదకద్రవ్యాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ పవన సంధ్య పీపీటీ ద్వారా మాదకద్రవ్యాలు వాటి రకాలు, అందులో ఉపయోగకరమైనవి, హానికరమైనవి వివరించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ మెంబర్ బాలకిషన్ మాట్లాడుతూ.. నేటి యువత మాదకద్రవ్యాలకు ఏ విధంగా ఆకర్షితులై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారో వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్య రెడ్డి, ఐక్యూ ఏసీ కో ఆర్డినేటర్ మధుసూదన్, సీఓఈ గోపాల సుదర్శనం, ఆంటీ డ్రగ్ కమిటీ కన్వీనర్ బాలకిషన్, కృష్ణయ్య, శ్రద్ధానందం, విశ్వనాథం, రాణి, పుణ్యమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పోలీసుల అదుపులో ఇద్దరు రామచంద్రాపురం(పటాన్చెరు): క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరిని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. బెల్ టౌన్షిప్లోని స్టేడియం వద్ద కొందరు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అడుతున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. పటాన్చెరుకు చెందిన కృష్ణ, చిరంజీవి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. చిరంజీవి అనే వ్యక్తి బెట్టింగ్ కట్టిన వారి నుంచి నగదు తీసుకొని రంజిత్కు అందజేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణ, చిరంజీవి నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్కు చెందిన బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేయగా, అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ఆటోలు ఢీ :
ఆరుగురికి తీవ్ర గాయాలుహుస్నాబాద్: రెండు ఆటోలు ఢీ కొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వేలేరు గ్రామానికి చెందిన మణికంఠ, పవన్, సాయి, దిలీప్, అలుగునూర్కు చెందిన గణేశ్ పట్టణంలోని ఆరపల్లె వద్ద జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. కొద్దిసేపటికి పని నిమిత్తం ఆటోలో బస్టాండ్కు వెళ్లారు. ఇదే సమయంలో సిద్దిపేట రోడ్ నుంచి కరీంనగర్కు మహీంద్ర మాక్సిమో ఆటో వాహనం వెళ్తుంది. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని నుజ్జు నుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మాక్సిమోలో ఉన్న విజయ్ అనే యువకుడి కాలు విరిగింది. ఐదుగురు క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, విజయ్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
రక్త పరీక్షే..
వారం రోజులుగా నిలిచిన ముఖ్యమైన టెస్టులు● టీ హబ్లో అందుబాటులో లేని కెమికల్స్ ● ఈ కారణంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొరగా శాంపిల్స్ సేకరణ ● జిల్లాలోని 53 హెల్త్ సెంటర్లకు ఇదే ప్రధాన కేంద్రం ● అధికారుల పర్యవేక్షణ కరువు ● ఇబ్బందులు పడుతున్న రోగులుసిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళా శాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలోని టీహబ్లో రోగ నిర్ధారణకు కెమికల్స్ అందుబాటులో లేకపోవడంతో పలు ముఖ్యమైన పరీక్షలు నిలిచిపోయాయి. జిల్లాలోని 53 ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన శాంపిల్స్ను ఈ టీహబ్కు పంపిస్తుంటా రు. టీహబ్లో రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే కెమికల్స్ లేకపోవడంతో ఎల్ఎఫ్టీ (లివర్ ఫంక్షనింగ్ టెస్ట్), కాల్షియం, లిఫిడ్ ప్రోఫైల్, హెచ్బీ ఏఐ సీ (షుగర్ లెవెల్స్), ఎస్ టైఫాయిడ్ వంటి ముఖ్య మైన పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పరీక్షల కో సం వచ్చిన పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ప్రైవేటు ల్యాబ్స్కు వెళ్తున్నారు. 53 కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరణ సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ 300 పడకల జనరల్ ఆస్పత్రి ఆవరణలో టీహబ్ను 2021లో ఏర్పాటు చేసి మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల నుంచి ప్రతి రోజూ పేషెంట్ల నుంచి రక్త నమునాలు (బ్లడ్ శాంపిల్స్) సేకరించి ఐదు రూట్ల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల ద్వారా టీ హబ్కు పంపిస్తారు. ఇలా ప్రతి రోజూ 53 కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి 115 రకాల పరీక్షలు చేస్తారు. వివరాలు టీహబ్ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేసి, పరీక్షల అనంతరం మరుసటి రోజు పేషెంట్ మొబైల్ నంబర్కు ఫలితాలు పంపిస్తారు. ఈ రిపోర్టుల ఆధారంగా పేషెంట్లు వైద్య సేవలు పొందుతారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం గత ప్రభుత్వ హయాంలో టీ హబ్ను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పలు యంత్రాలు కొనుగోలు చేసి, సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. కెమికల్స్ లేకపోవడంతోనే.. టీహబ్లో పలు రకాలు పరీక్షలు నిలిచిపోవడంతో పేషెంట్లు, ప్రజలు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. ఈ కారణంతో పలు ముఖ్య పరీక్షలు ఆగిపోయాయి. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయని సిబ్బందిని అడిగితే కెమికల్స్ లేవనే సమాధానం చెబుతున్నారని.. ఎప్పుడు వస్తాయో తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు పేషెంట్లు చెప్పుకొచ్చారు. జిల్లా నుంచి రోజు సుమారు 500 నుంచి 600 మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. వీటిలో హెచ్బి, టైఫాయిడ్, డెంగీ, ఇతర విష జ్వరాలు, థైరాయిడ్, విటమిన్లు, రక్త కణాలు, కిడ్నీ, లివర్, కొలెస్ట్రాల్ వంటి మొత్తం 115 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజు లుగా కెమికల్స్ అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమైన 15 రకాల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. కెమికల్స్ రాగానే చేస్తాం టీ హబ్లో రోగ నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించే కెమికల్స్ కోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టడం జరిగింది. కెమికల్స్ రాగానే అన్ని రకాల పరీక్షలు జరుగుతాయి. జీజీహెచ్లోని ఓపీ, ఐపీ పేషెంట్లకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. పీహెచ్సీల నుంచి వచ్చే శాంపిల్స్కు మాత్రం కావడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. – అనిల్, నోడల్ ఆఫీసర్ కొరవడిన అధికారుల పర్యవేక్షణ తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో స్థానికంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఉండటంతో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించారు. కానీ ప్రస్థుత పరిస్థితులలో వైద్యారోగ్యశాఖ మంత్రి వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించపోవడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది సైతం సమయ పాలన పాటించడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టీహబ్లో అన్ని రకాల పరీక్షలు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అడుగంటిన నీళ్లు.. ఎండిన చేన్లు
పడిపోయిన భూగర్భ జలాలు ట్యాంకర్లతో నీళ్లు.. చేతికొచ్చే దశలో ఎండిపోతున్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.చాలా మంది రైతులు ట్యాంకర్ల ద్వారా వేరే బోర్ల నుంచి నీళ్లు తెచ్చి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్కు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారు. చెరువులు, కుంటలు, ఇతర బోర్ల నుంచి, చాలా దూరం నుంచి పైపుల బెండలు వేసుకొని కంటిమీద కునుక లేకుండా రాత్రింబవళ్లు తమ పంటలకు నీళ్లు పెడుతున్నారు. దుబ్బాక: వరి పంటలు చేతికొస్తాయనుకుంటున్న దశలోనే నీరందక ఎండిపోతుండడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా నీళ్లు అందక ఇప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో ఎండిపోయినట్లు సమాచారం. వరితోపాటు మొక్కజొన్న, కూరగాయల పంటలు సైతం పెద్ద ఎత్తున ఎండిపోవడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్, రాయపోల్, గజ్వేల్, నంగునూర్, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, వర్గల్ మండలాల్లో వేల ఎకరాల్లో చేతికొచ్చే దశలో బోర్లు నీళ్లు పోయకపోవడంతో ఎండిపోయాయి. పశువులకు మేతగా.. చేతికొచ్చే దశలో వరి పంటలు ఎండిపోవడంతో పశువులు, గొర్రెలకు మేతగా మారాయి. ఎండిపోయిన వరి పంటలను రైతులు తమ పశువులను మేపుతున్నారు. కొందరు రైతులు ఎండిన పంటను గొర్రెల కాపరులకు అమ్ముకుంటున్నారు. గొర్రెలను మేపడానికి ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.4 వేలకు ఎండిన పంట పొలాలను కొంటున్నారు. దుబ్బాక ప్రాంతంలో ఎక్కడ చూసిన ఎండిపోయిన వరి పొలాల్లో గొర్రెలు మేపుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. పంటలు ఎండిపోయి పెట్టుబడులు మీద పడి దుర్భరపరిస్థితుల్లో ఉన్న తమకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. నీరు లేక ఎండిపోతున్న వరి పంటలు కాపాడుకునేందుకు రైతుల పడరాని పాట్లు రూ.వేలు వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు 60 వేలకు పైగా ఎకరాల్లో నష్టం పశువులకు మేతగా మారిన వైనం పంటలు ఎండిపోయాయి3 ఎకరాల మొక్కజొ న్న, 2 ఎకరాల్లో వేసిన వరి పంట నీళ్లు లేక ఎండిపోయాయి. మొదట్లో బోర్లు బాగానే నీరు పోయడంతో ముందుగానే 3 ఎకరాల్లో మొక్కజొన్న వేసిన. తీరా కంకులు వస్తున్న దశలో బోర్లలో నీరు తగ్గిపోయింది. ఉన్న వరి పంటకు కూడా నీరు పారుతలేదు. పెట్టుబడులు మీద పడే పరిస్థితి దాపురించింది. ఏం చేయాలో తోస్తలేదు. ట్యాంకర్లతో ఎన్ని తెచ్చిపోసిన ఫలితం లేదు. – భూపతిరెడ్డి, రైతు -
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి
మెదక్ ఎంపీ రఘునందన్రావుమిరుదొడ్డి(దుబ్బాక): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పెద్ద చెరువుకు, కూడవెల్లి వాగుకు అనుసంధానంగా ఉన్న నాగయ్య వాగుపై ఏర్పాటు చేసే బ్రిడ్జి నిర్మాణం కోసం గురువారం భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక ప్రాంతానికి తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు అక్బర్పేట–భూంపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సిద్దిపేట–మెదక్ జాతీయ రహదారి ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులను ఢిల్లీ వరకు తీసుకెళ్లి వారికి నష్ట పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. ప్రతీ మండలానికి రోడ్డు డివైడర్లు, ప్రతీ గ్రామానికి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెదక్ ఎంపీగా గెలుపొందిన 10 నెలల కాలంలో రూ. 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్సులు ఇప్పించానన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రతీ గ్రామానికి సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామం నుంచి దుబ్బాక మండలం హబ్షీపూర్ వరకు నిర్మించే రోడ్డుకు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎల్ముల దేవరాజు, మద్దెల రోశయ్య, టెలికాం బోర్డు మెంబర్ మల్లేశం, మండల అధ్యక్షుడు జిగిరి అమర్ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. పోలీస్
సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులుశివ్వంపేట(నర్సాపూర్): ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి కొన ఊపిరితో ఉండగా పోలీసులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. దెవమ్మగూడం గిరిజన తండాలో మంగళ, బుధ వారాల్లో దసరా పండుగ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. తండాకు చెందిన లున్సవత్ రాజు మద్యం మత్తులో బుధవారం అర్థరాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండటంతో అతడి అన్న 100 కాల్ చేశాడు. విధుల్లో ఉన్న శివ్వంపేట పోలీస్స్టేషన్ బ్లూ కోర్టు సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ తండాకు చేరుకునే సరికే రాజు ఇంట్లోని గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. బ్లూ కోర్టు సిబ్బంది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే కిందికి దించి కొన ఊపిరితో ఉండగా విష్ణువర్ధన్రెడ్డి సీపీఆర్ చేయడంతో శ్వాస తీసుకున్నాడు. వెంటనే కారులో చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ వల్లనే రాజుకు ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు, తండా వాసులు అన్నారు. ఈ సందర్భంగా పోలీసులను గ్రామస్తులు, అధికారులు అభినందించారు. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
జిల్లాలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ పక్షం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలలో పోషకాహారలోపాన్ని గుర్తించి, నివారించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22 వరకు కొనసాగనున్నాయి. సంగారెడ్డి జోన్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన వివరాలు ప్రాజెక్టు పేరు గర్భిణులు బాలింతలు 0–5లోపు చిన్నారులు జోగిపేట 1,986 1,964 13,086 నారాయణఖేడ్ 1,332 1,269 16,690 పటాన్చెరు 1,693 1,375 21,707 సదాశివపేట 2,911 2959 16,455 జహీరాబాద్ 1,731 1,445 27,337తల్లిపాల ఆవశ్యకతను వివరించేలా ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శిశువు జన్మించి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించడం, పౌష్టికాహారలోపం ఉన్న చిన్నారులను గుర్తించడం, అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేస్తారు. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు బరువులు తీయటం, గర్భిణీల సంరక్షణపై భర్తలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు రెండేళ్లకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన వంటివి పూర్తి చేశారు. కార్యక్రమం నిర్వహణపై సమావేశం పోషణ పక్షం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 5 ప్రాజెక్టులు.. 1,504 కేంద్రాలు జిల్లావ్యాప్తంగా ఐదు ప్రాజెక్టులు ఉండగా 154 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాలలో గర్భిణీలు 9,653 బాలింతలు 9,012, ఐదేళ్లలోపు చిన్నారులు 95,275 మంది ఉన్నారు. ఆయా కేంద్రాలలో పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలు బాలామృతం, గుడ్లు, పాలు నిరంతరం పంపిణీ చేస్తుంటారు. ఈనెల 8 నుంచి ప్రారంభమైన పోషణ పక్షం 22 వరకు అంగన్వాడీల్లో కార్యక్రమాలు పౌష్టికాహారంపై గర్భిణీలు,బాలింతలకు అవగాహనపౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తీసుకునే పౌష్ఠికాహారంపై అవగాహన కల్పిస్తాం. ప్రతీ కేంద్రం పరిధిలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో జననం, ఊబకాయలోపం ఉన్న వారిని గుర్తిస్తాం. వారి పర్యవేక్షణతోపాటు పోషకాహారాన్ని అందిస్తాం. – లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారి, సంగారెడ్డి జిల్లా -
భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్ : మండలంలో వివిధ సమస్యలపై వచ్చేవారికి త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండలంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యలపై వచ్చే వారికి క్షుణ్ణంగా సమస్యలకు పరిష్కారం చెప్పాలన్నారు. మట్టి అక్రమ రవాణాపై ప్రతీ విభాగం తనిఖీలు చేయాలని సూచించారు. కుల,ఆదాయ, నివాస ధ్రువపత్రాలను త్వరగా మంజూరు చేయాలని చెప్పారు. ఆర్డీవో వెంట మండల అధికారులు,సిబ్బంది తదితరులున్నారు.సంగారెడ్డి ఆర్డీవో రవీందర్రెడ్డి -
సమస్యల పరిష్కారానికే కంట్రోల్రూమ్
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి ఎద్దడి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ సెల్ నంబర్ 08455 276155 నంబర్కు డయల్ చేసి సమస్యల పరిష్కరించుకోవాలని జిల్లా ప్రజలను గురువారం ఓ ప్రకటనలో కోరారు. కలెక్టరేట్లో చలివేంద్రం ఏర్పాటు కలెక్టరేట్కు వివిధ పనులపై వచ్చే ప్రజల దాహర్తి తీర్చేందుకు రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధికారులలతో కలసి కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధూరి, డీఆర్ఓ పద్మజరాణి, ట్రెసా అధ్యక్షుడు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ వల్లూరు క్రాంతి -
గాలి వాన బీభత్సం
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● కొన్ని మండలాల్లో నేలకొరిగినవిద్యుత్ స్తంభాలు, వృక్షాలు ● ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం ● నేలరాలిన మామిడి కాయలు ● వరి, జొన్న పంటలకు భారీ నష్టం అడుగంటిన నీళ్లు.. పంట చేతికొచ్చే దశల ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వివరాలు 8లో uసంగారెడ్డి జోన్/న్యాల్కల్(జహీరాబాద్)/కల్హేర్(నారాయణఖేడ్)/నారాయణఖేడ్/వట్పల్లి(అందోల్)/మునిపల్లి(అందోల్): జిల్లాలో గురువారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు మండలాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని మండలాల్లో జొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సంగారెడ్డి పట్టణంలో బలమైన ఈదురుగాలులు వీస్తూ ఓ మోస్తారుగా వడగళ్ల వర్షం కురిసింది. జహీరాబాద్లోని న్యాల్కల్ మండలంలో ఈదురుగాలులలతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హద్నూర్, గుంజోటి, రాంతీర్థ్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపోయి రోడ్లపై పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలు గ్రామాల్లో జొన్న పంట నేలవాలింది. ఇక నారాయణఖేడ్లోని కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో ఖానాపూర్(కె), బీబీపేట్, పోచాపూర్ శివారులో పంట పొలాల్లో వరి పంట నేలవాలింది. కృష్ణాపూర్, ఇందిరానగర్ వద్ద రోడ్లపై ఆరబెట్టిన జొన్న కంకులు తడిచిపోయాయి. మహదేవుపల్లిలో వర్షం ధాటికి ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. బాచేపల్లిలో రామాలయం వద్ద జాతరలో దుకాణాలు ఎగిరిపోయాయి. దీంతో కుస్తీ పోటీలు రద్దు చేశారు. అందోలు మండలంలో పలు చెట్ల కొమ్మలు విరిగి పడగా, మామిడి కాయలు నేలరాలాయి. పంట పొలాలకు వెళ్లే దారికి అడ్డంగా చెట్ల కొమ్మలు పడటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. నిలిచిన విద్యుత్ సరఫరా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పట్టణంలోని పలు హోటళ్లు, ఇళ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పట్టణంతోపాటు పంచగామ కమాన్ ప్రాంతంలో విద్యుత్ వైర్లు దెబ్బతినడంతో 2.30 గంటల నుంచి 7.30గంటల వరకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మామిడి కాత రాలిపోయింది. పలు మండలాల్లో వరి, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాద్వార్లో ఇళ్లపైకప్పు రేకులు ఎగిరిపడటంతోపాటు పలు చెట్లు విరిగి పడ్డాయి. నిజాంపేట్లో వరదనీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహించింది. మునిపల్లి మండలంలోని ఈదురు గాలులకు ఇండ్లపై కప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగల కింద చెట్లు ఉండటంతో చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో ఇళ్లలో షార్ట్ సర్క్యూట్తో ఆయా గ్రామాల్లో టీవీలు, విద్యుత్ బల్బులు, మోటార్లు కాలిపోయాయి. సిర్గాపూర్లో అత్యధిక వర్షపాతం... కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోనే సిర్గాపూర్ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మండలంలో అత్యధికంగా 41.8మి.మీ నమోదైంది. నాగల్గిద్దలో 30.0మి.మీ, నారాయణఖేడ్లో 19.3మి.మీ, న్యాల్కల్లో 20.5మి,మీ, సంగారెడ్డిలో 15.3, జహీరాబాద్లో 10.8, కంగ్టిలో 9.0, కల్హేర్లో 6.3, మనూరులో 5.8 మి.మీ వర్షపాతం నమోదైంది.బాచేపల్లిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టున్యూస్రీల్ -
కదిలేదేలే!
● అధికారులపై ఎన్ని ఆరోపణలువచ్చినా చర్యలు శూన్యం ● ఫిర్యాదులు వస్తేనే ముందుకొస్తున్న అవినీతి నిరోధకశాఖ పటాన్చెరు పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్లుగా అధికారుల తిష్టరామచంద్రాపురం(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలల్లోని పోస్టింగ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసేందుకు వివిధ శాఖల ప్రభుత్వాధికారులు పోటీలు పడుతున్నారు. అందుకోసం వారికున్న పలుకుబడిని సైతం ఉపయోగిస్తున్నారు. ఎవరికై నా పనులు కావాలంటే ఇక సదరు అధికారుల ఇష్టారాజ్యం నడుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో వారు ఉద్యోగం చేసేది వారి సొంత లాభాల కోసమా లేక ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యమో తెలియడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే అధికారులపై అనేక అవినీతి ఆరోపణలున్నప్పటికీ అధికారులపై పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పైరవీలు వారివే.. నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీసు వివిధ శాఖలలో పని చేసే అధికారులు ఈ ప్రాంతాలలో పోస్టింగ్ల కోసం పోటీ పడుతున్నారు. అందుకోసం హైదరాబాద్లోని రాజకీయనాయకులు, ప్రముఖుల సిఫారుసులు తీసుకుని ఇక్కడికి బదిలీపై వస్తున్నారని స్థానికులు వాపో తున్నారు. అందుకు ఎంత ఖర్చు చేసేందుకై నా వెనుకంజ వేయడం లేదని స్థానికులు, రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. మరికొంతమంది ఎన్ని ఆరోపణలున్నా ఇక్కడి నుంచి బదీలీలు కాకుండా పైరవీలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడ పని చేస్తే అంతే.. ఈ ప్రాంతంలో ఏ ప్రభుత్వ శాఖను తీసుకున్నా ఒకసారి పని చేశారంటే ఇక ఆ అధికారి ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. మరికొంతమంది అధికారులు ఈప్రాంతంలో పని చేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా తిరిగి ఈ ప్రాంతంలోనే పోస్టింగులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలు పట్టించుకోని దుస్థితిస్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వివిధ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. వారి సొంత లాభాలు చూసుకోవడం తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక స్థానికులు ప్రధాన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకునిపోతున్నారు. ఆసక్తి చూపడానికి కారణాలు ఇవేనాపటాన్చెరు నియోజకవర్గం మహానగరానికి అనుకుని ఉండటం వల్లే చాలామంది అధికారులు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందటంతోపాటు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్తుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన పలువురి అధికారులలో ఉన్నది.ఆరోపణలున్నా చర్యలుశూన్యమే..ప్రధాన శాఖలలో పని చేసే అధికారులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారిపై పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ శాఖలలో పనిచేసే కొంతమంది అధికారులు తమని ఎవరూ ఏమి చేయలేరని బహిరంగ సవాళ్లు కూడా విసురుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమను బదిలీలు చేయడం అంత ఆషామాషీ కాదనీ తమంతట తాము వెళ్తే తప్ప తమను ఎవరు బదిలీ చేయలేరని ప్రజలకు, రాజకీయ నేతలకు సవాళ్లు విసురుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఎమ్మెల్యేకు ఆహ్వానం
సంగారెడ్డి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంత్యుత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను అంబేడ్కర్ ఉత్సవ కమిటీ కోరింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ సంగారెడ్డి : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన పట్టణ, మండల నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇందుకు సంబంధించిన సభ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్రెడ్డి, మామిళ్ల రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలనలో కాంగ్రెస్ విఫలం ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ టౌన్: వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజోత్సవ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు పిలుపు నిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్తో కలిసి గురువారం రజోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలోలేరని చెప్పారు. రజోత్సవ సభలో కేసీఆర్ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తట్టునారాయణ, గుండప్ప, నామ రవికిరణ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. హరీశ్పై అట్రాసిటీ కేసునమోదు చేయాలిఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్చెరు పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హరీశ్రావుపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ... బుధవారం గణేశ్గడ్డ దేవస్థానం వద్ద జరిగిన సమావేశంలో హరీష్రావు హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల గురించి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసులు పెట్టిస్తే ఉపముఖ్యమంత్రి కేసు ఉపసంహరించుకుం టాడంట అంటూ..తోక కుక్కను ఆడిస్తుందో లేక కుక్క తోకను ఆడిస్తుందో అర్థం కావడం లేద’ని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భట్టి విక్రమార్కను కుక్కతో పోల్చి దళితుల మనోభావాలను దెబ్బతీసిన హరీశ్రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
రైతులకు అండగా కాంగ్రెస్
● రూ.170 కోట్లతో సింగూరుకాలువలకు సీసీ లైనింగ్ ● విద్య,వైద్య హబ్గా అందోల్నియోజక వర్గం ● మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి/జోగిపేట(అందోల్) : రైతులకు అండగా ఉండేది, వ్యవసాయాన్ని పండగగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట్ డివిజన్లో గురువారం జరిగిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తో పాటు 23 మంది డైరెక్టర్లను అభినందించారు. అంతకుముందు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అందోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన శివ పార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే రూ.170 కోట్లతో సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు. విద్య వైద్య హబ్గా అందోల్ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతామని తెలిపారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ త్వరలో విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చౌటకూర్ మండలానికి పీహెచ్, అంబులెన్స్, పోలీసుస్టేషన్, కేజీబీవీ, పాఠశాలను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. -
సుస్థిరాభివృద్ధిలో మన పల్లెలు
ప్రగతి ఆధారంగా పంచాయతీరాజ్ మార్కులు ● ఉమ్మడి జిల్లాలో బీ గ్రేడ్లో 24,సీ గ్రేడ్లో 1,419, డీ గ్రేడ్లో 171 జీపీలు ● ఏ పంచాయతీకి దక్కనిఅచీవర్స్ హోదా సాక్షి, సిద్దిపేట: పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన వంటి తొమ్మిది అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి మెతుకుసీమలోని 24 పల్లెలు పురోగతిలో ఫ్రంట్రన్నర్గా నిలిచాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా మార్కుల జాబితాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు గణనీయమైన మార్కులు సాధించాయి. తొమ్మిది అంశాల ఆధారంగా... కేంద్రప్రభుత్వం పంచాయతీ ముందస్తు సూచి(అడ్వాన్స్మెంట్ ఇండెక్స్) పేరుతో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1,615 గ్రామ పంచాయతీలు దరఖాస్తు చేశాయి. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధి పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల స్వావలంబనకు అనుకూలమైన విధానాలు అనే అంశాల ఆధారంగా గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం మార్కులను కేటాయించింది. ఇందులో 24 పంచాయతీలు ఫ్రంట్రన్నర్గా నిలవడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ పంచాయతీకీ అచీవర్స్ హోదా దక్కలేదు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్ట్లో ముంపునకు గురైన గ్రామం గుడాటిపల్లి 39.39 మార్కులతో ‘ఈ’గ్రేడ్లో నిలిచింది. అలాగే బీ గ్రేడ్లో నిలిచిన పటేల్గూడ, సుల్తానాపూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామం తొమ్మిది అంశాలలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు వైకుంఠథామం, డంపింగ్యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, తాగునీటి సరఫరాను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంతో 77.90మార్కులు సాధించింది. దీంతో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో 939 గృహాలుండగా 3,184 జనాభా ఉన్నారు. 2009–10లో నిర్మల్ పురస్కారం, 2021లో పారిశుద్ధ్య నిర్వహణలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ భవనంపై సోలార్ను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్ను వినియోగిస్తున్నారు. మిట్టపల్లి గ్రామం 77.59 మార్కులు సాధించడంతో పంచాయతీ కార్యదర్శి విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్లో నిలిచేందుకు కృషి సిద్దిపేట అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. నిధులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పచ్చదనం పెంపు ఇలా విభాగాల సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ గ్రేడ్లో నిలిచేందుకు కృషి చేస్తాం. – దేవకీ దేవి, డీపీఓ, సిద్దిపేట -
హామీ కోల్పోయిన ఉపాధి
జహీరాబాద్టౌన్: జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయడంతో ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం బంద్ అయింది. కేంద్రం నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలి. పట్టణానికి సమీపంలో ఉన్న పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు పంచాయతీలను 2019 సంవత్సరంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. అప్పటినుంచి ఆ యా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోయా యి. జాబ్ కార్డులున్న పథకానికి దూరమయ్యారు. పూర్తిగా పల్లె వాతావరణం జహీరాబాద్ మున్సిపల్లో విలీనమైన పస్తాపూర్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్,రంజోల్,హోతి(కె) గ్రామాలు పూర్తిగా పల్లెవాతారణం నెలకొని ఉంది. ఆయా గ్రామాల్లో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 2019 సంవత్సరం వరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు ఏడాదికి వందరోజులు ఉపాధి అవకాశాలు కల్పించారు. కుటుంబాలకు జాబ్ కార్డులు కూడా జారీ చేసి పనులు చూపించి కూలీ డబ్బులు ఇచ్చారు. మున్సిపల్లో విలీనం తర్వాత పనులు నిలిపివేయడంతో ఆయా గ్రామాల కూలీలంతా ఇతర పనులకు వెళ్తున్నారు. మంత్రి సీతక్క ప్రకటనతో... మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా మరో పథకం అమలు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటనపై వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరంలో విలీనమైన గ్రామాలను కొత్త పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన ఐదు పంచాయతీల్లో 1,168 మంది కూలీలు ఉపాధి హామీ పథకానికి దూరంగా ఉన్నారు. రంజోల్ గ్రామంలో 1,464 కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా 261 కుటుంబాల్లోని 392 మంది కూలీలు ఉన్నారు. అల్లీపూర్లో 678 కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా 33 కుటుంబాల్లోని 44 మంది కూలీలు పనులకు వచ్చారు. పస్తాపూర్లో 762 కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా 16 మంది కూలీలు, హోతి(కె) గ్రామంలో 833 కటుంబాలకు జాబ్కార్డులు ఉండగా 337 కుటుంబాల్లో 556 మంది కూలీలు పనులకు వచ్చారు. ఇప్పుడు వీరంతా ఉపాధి పనులకు దూరంగా ఉంటూ ఇతర పనులు చేసుకుంటున్నారు.విలీన గ్రామాల్లో పనులు చేపట్టాలి జహీరాబాద్ మున్సిపల్లో విలీనమైన ఐదు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలి. విలీన వల్ల గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉన్న కూలీలకు పనులు పనిలేకుండా పోయింది. ఎండాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విషయమై సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చాం. – బి.రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడుమున్సిపల్ విలీన గ్రామాల్లోపనులు బంద్ 1,168 కూలీలు పనికి దూరం -
అంగన్వాడీకి కొత్త భవనం
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కంది(సంగారెడ్డి): కంది మండల పరిధిలోని మామిడిపల్లిలో శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి అదేస్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలోని అంగన్వాడీ భవనాన్ని బుధవారం చంద్రశేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్రెడ్డి, సీడీపీవో జయరాం నాయక్, పంచాయతీ కార్య దర్శి శ్రీధర్ స్వామి, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 332 సెల్ఫోన్లు రికవరీ ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జోన్: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ఫోన్ల రికవరీ కోసం ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణలో బుధవారం మొబైల్ రికవరీ మేళాను నిర్వహించి పోగొట్టుకున్న, చోరీకి గురైన 332 మంది మొబైల్ ఫోన్ బాధితులకు సెల్ఫోన్లను అధికారులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, బాధితులకు అందించామన్నారు. తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ప్రమోట్ చేసినా అలాంటి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు,సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగం పాల్గొన్నారు. ధర్నా విజయవంతం చేయాలిజహీరాబాద్ టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య బుధవారం విలేకరులతో మాట్లాడుతూ...ఈ నెల 13న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు. కులగణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అమృత్, సంఘం నాయకులు యూనస్, శివకుమార్, విశ్వనాథ్ రాథోడ్, కిషన్ బానోత్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కుస్తీపోటీలునారాయణఖేడ్: శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని నారాయణఖేడ్లో బుధవారం నిర్వహించిన కుస్తీపోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కుస్తీపోటీలు నిర్వహించారు. ఖేడ్తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో తలపడ్డారు. ఉత్సవాల చివరోజు ఉదయం రాములోరిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఉమ్మడి జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్, మాజీ ఆలయ చైర్మన్ ముత్యం హన్మాండ్లు, వివేకానంద్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
97.18%
పన్ను వసూలుసంగారెడ్డి జోన్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తుంటాయి. వాటితోపాటు గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తారు. జిల్లాలో గడిచిన ఆర్థిక ఏడాది(2024–25)లో ఆస్తి పన్ను వసూలు 97.18% శాతం పూర్తి చేశారు. వసూలైన పన్ను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతుంది. 633 గ్రామ పంచాయతీల్లో వసూలు... జిల్లాలో 633 గ్రామపంచాయతీలు ఉండగా ఆయా జీపీలలో రూ.23,53,58,096లు వసూలు చేయాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి మొత్తంగా రూ.22,87,24,676లు పన్ను వసూలు చేశారు. నిర్దేశించిన మార్చి 31 తేదీ లోపు వసూళ్ల ప్రక్రియను ముగించారు. వసూలు చేసిన పన్నును చలాన్ తీసి బ్యాంకులలో సంబంధిత గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేశారు. 100 శాతం పూర్తి చేసిన మండలాలు జిల్లాలోని కల్హేర్, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, సిర్గాపూర్, అమీన్పూర్, ఆందోల్, మునిపల్లి, వట్పల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో 100% పన్ను వసూలు పూర్తిచేసి జిల్లాలో ముందంజలో నిలబడ్డాయి. అదేవిధంగా మరికొన్ని మండలాలు 99% పన్ను వసూలు పూర్తి చేశాయి. అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు వసూలు చేసిన పన్నులతో సంబంధిత గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకోసం ఆ నిధులను కేటాయిస్తారు. గ్రామంలోని వీధి దీపాల నిర్వహణ, మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్య పనులతోపాటు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెచ్చిస్తారు. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారులు, సంబంధిత పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసి, అధికారుల అనుమతితో ఖర్చు చేస్తారు. పాలకవర్గం లేకపోవడం నిధులు నిలిచిపోవడంతో వసూలైన పన్నులు పంచాయతీలకు కొంతమేర ఊరటనిచ్చింది.జిల్లాలోని గ్రామ పంచాయతీలు 633 వసూలు కావాల్సిన పన్ను రూ.23,53,58,096 వసూలైన పన్ను రూ.22,87,24,676 100శాతం వసూలు చేసిన మండలాలు 11రూ.22.87కోట్ల ఆదాయం జీపీ ఖాతాలో జమ చేసిన అధికారులు ఇంటింటికీ తిరిగి పన్ను వసూలు మౌలిక వసతులకు నిధులుకేటాయించనున్న యంత్రాంగం -
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: జిల్లా కలెక్టర్
సంగారెడ్డిజోన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ పన్ను వసూలు, రాజీవ్ యువ వికాసం అంశాలపై వివిధ విభాగాల అధికారులతో బుధవారం కలెక్టర్రేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్నారు. ఘనంగా పూలే జయంతి మహాత్మా జ్యోతి బా పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ క్రాంతి వివరించారు. భారత ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అందించే ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. అదేవిధంగా అగ్నివీర్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
పటాన్చెరు: బీఆర్ఎస్ కోసం కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పటాన్చెరు మండలం గణేశ్గడ్డలో బుధవారం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశానికి హరీశ్రావు హాజరై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్కు దూరంగా ఉంటుండటంతో ఆపార్టీ కార్యకర్తలు డీలా పడిన పరిస్థితుల నేపథ్యంలో హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిపై గానీ, పటాన్చెరు స్థానిక రాజకీయాలపైగానీ హరీశ్రావు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. వరంగల్ సభలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకుంటారని స్థానికంగా ప్రచారం జోరుగా సాగుతోంది. బహుశా అదే కారణంగానే హరీశ్రావు కూడా మహిపాల్రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. వెన్నవరం ఆధ్వర్యంలో తొలిసమావేశం పటాన్చెరు నియోజకవర్గ సమన్వయకర్తగా వెన్నవరం ఆదర్శ్రెడ్డిని నియమించిన తర్వాత తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం, హరీశ్రావు రాకతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ సమావేశానికి ప్రధాన నాయకులు మెట్టుకుమార్ యాదవ్, కొలన్ బాల్రెడ్డి, సోంరెడ్డి, వెంకటేశ్(జిన్నారం), శ్రీధర్చారి, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, స్థానిక యువనాయకుడు మ్యాథరి పృథ్వీరాజ్ హాజరయ్యారు. కలసి పనిచేద్దాంః ఆదర్శ్రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో పాటే పార్టీ కేడర్ కూడా వెళ్లిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆదర్శ్రెడ్డి కొట్టిపారేశారు. అందరం కలసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని తెలిపారు. కొంతమంది నేతల్లో అసంతృప్తి! నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదర్శ్రెడ్డి నియామకం ప్రకటన పట్ల కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ నియామక ప్రకటన ప్రక్రియ తమకు ముందుగా తెలియదని ఆదర్శ్రెడ్డే స్వయంగా ఫోన్ చేసి చెప్పుకున్నారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ఇది రాజకీయ సమావేశమా లేక వ్యక్తిగత సమావేశమా అని కొంతమంది నేతలు బాహాటంగానే విమర్శించడం గమనార్హం. ఆదర్శ్రెడ్డి నియామకాన్ని హరీశ్రావే స్వయంగా తమతో చెప్పి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. పటాన్చెరు సభలో హరీశ్రావు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
జానపద సాహిత్యంపై జాతీయ సదస్సు
సిద్దిపేట ఎడ్యుకేషన్: జానపద సాహిత్య ఆధ్య పరిశోధకులు ఆచార్య బిరుదు రాజు రామరాజు శత జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 15, 16 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, సదస్సు కన్వీనర్ తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్టా సంపత్కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జానపద సాహిత్యానికి తెలంగాణం కేంద్ర స్థానమని, ఇక్కడ ఉన్నంత జానపద సాహిత్య సంపద దేశంలో మరో ప్రాంతానికి లేదన్నారు. బిరుదురాజు రామరాజు తెలంగాణ జానపదసాహిత్యంపై చేసిన విశ్వవిద్యాలయస్థాయి డాక్టరేటు పరిశోధన దక్షిణ భారతదేశంలోనే మొదటిదన్నారు. అప్పటి నుంచి జానపద సాహిత్య సేకరణ, పరిశోధన నిర్విరామంగా నడుస్తుందన్నారు. ఈ సదస్సుకు రెండు తెలుగురాష్టాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటుగా ఇతర ప్రాంతాలనుంచి పరిశోధకులు పత్రసమర్పణలు చేస్తారన్నారు. ఈ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ఆచార్యులు, పరిశోధకులు వక్తలుగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సదస్సు సమన్వయకర్త పిట్ల దాసు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, తెలుగుశాఖ అధ్యాపకులు సంపత్ కుమార్, నరేశ్, రామస్వామి, శైలజ, సాయి సురేశ్, నర్సింహులు, రమణ, సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు.15, 16 తేదీల్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ -
కిలో మీటరున్నర పైపు లైన్
ఉష్కెతెప్ప వద్ద బోరు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 800 ఫీట్ల లోతు బోరు వేశా. కిలోమీరున్నర దూరంలో పొలం ఉంది. పొలానికి సాగు నీరు పైపులైన్ వేసి పారిస్తున్నాం. ఇక్కడ 5 ఎకరాలు ఉండగా రెండు పంటలకు నీరు అందుతుంది. బోరులో 500 ఫీట్లలోతు నుంచి నీళ్లు తోడి పైపులైన్తో నీరు పారిస్తున్నాం. పైపులైన్ కోసం రూ.లక్షల్లో ఖర్చు అయినా పంటలు సాగు అవుతుండటంతో ఇబ్బంది లేదు. – గాదె రాములు, రైతు పాంపల్లి గ్రామాన్ని ఆదుకుంటుంది ఉష్కెతెప్ప గ్రామాన్ని ఆదుకుంటుంది. నాకు కట్టకింద అర ఎకరం భూమి ఉంది. బోరు లేదు. అయినా యాసంగిలో పైనుంచి వచ్చే వర్షం నీరు, ఇతర రైతుల బోర్ల నుంచి వచ్చే నీటితోనే సాగు చేస్తా. ఇక్కడ బోరు వేస్తే నీళ్లు తప్పక వస్తాయన్న నమ్మకం ఉంది. ఉష్కెతెప్ప వద్ద బోర్లతో ఇంచుమించి ఊరిలోని ఎక్కువ భూమి సాగవుతుంది. చెరువు నీటితో సంబంధం లేకుండా బోర్లు నీళ్లు పోస్తాయి. – నర్సింలు, రైతు పాంపల్లి -
10 గుంటలు.. 15 బోర్లు
‘ఉష్కెతెప్ప’తో పుష్కలంగా నీళ్లు ● పక్కపక్కనే బోర్లు వేసినా తగ్గని జలం ● సుమారు 120 ఎకరాల వరకు సాగు నీరు ● కిలో మీటరున్నర దూరం నుంచి పైపులైన్లు ● రైతులను ఆదుకుంటున్న పాంపల్లి సోమనికుంట చెరువు కింద ఉష్కెతెప్ప కౌడిపల్లి(నర్సాపూర్): ఒకే చోట పక్కపక్కనే పదిహేను బోర్లు. మీటరు స్థలంలో రెండు, నాలుగు మీటర్ల స్థలంలోనే నాలుగు బోర్లు. అయినా ఏ బోరులోనూ తగ్గని నీళ్లు. మండుటెండల్లో వేరే ప్రాంతాల్లో బోర్లు ఫైయిల్ అవుతున్నా ఇక్కడ చుక్క నీరు తగ్గదు. సుమారు 10 గుంటల స్థలంలో 15 బోరు బావులు ఉండగా గ్రామ రైతులకు చెందిన సుమారు 120 ఎకరాలు సాగు అవుతున్నాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు జీవం పోసింది కౌడిపల్లి మండలం పాంపల్లి గ్రామంలోని సోమనికుంట కిందగల ‘ఉష్కె తెప్ప’. దీంతో రైతులకు సాగు నీటి కష్టాలు తీరాయి. మండలంలోని పాంపల్లి సోమనికుంట కింద గ్రామానికి చెందిన పలువురు రైతుల సాగు భూములు ఉన్నాయి. సాగు నీటి కోసం బోర్లు వేస్తే ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పక్కనే ఉన్న ఉష్కెతెప్ప ప్రాంతంలో బోర్లు వేయగా పుష్కలంగా నీళ్లు పడ్డాయి.ఈ క్రమంలో ఆ ప్రాంత రైతులంటా అక్కడే బోర్లు వేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టి ఎలాంటి ద్వేషాలు లేకుండా పక్కపక్కనే బోర్లు వేసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఇలా సుమారు 10 గుంటల విస్తీర్ణంలో 15 బోర్లు వేశారు. వీటికి పైప్లైన్లు వేసి పదేళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. గ్రామంలోని సుమారు 120 ఎకరాల వరకు ఈబోర్లతో పంట సాగు అవుతుంది. 400 నుంచి 500 ఫీట్ల లోతులో నీళ్లు ఇక్కడ గ్రామానికి చెందిన పెరుమండ్లకాడి వెంకటయ్య, అర్జున్, శంకరయ్య, లింగమయ్య, కిష్టయ్య, గాదె రాములు, దుర్గయ్య, పోచయ్య, అంబూరి భిక్షం, కొత్తింటి రాములు, గుండు వెంకటయ్య, గుడ్డంల రాములు, వెంకటస్వామి, పాం కిష్టయ్య రైతులకు చెందిన బోరుబావులు ఉన్నాయి. మరికొంత దూరంలో మరికొన్ని బోర్లు ఉన్నాయి. రైతులు ఒక్కో బోరు 600 నుంచి 800 ఫీట్ల లోతు వరకు వేశారు. 400 నుంచి 500 ఫీట్ల లోతుకు వెళ్లాక బోరులో నీళ్లు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మీటరు దూరంలో రెండు బోర్లు, నాలుగు మీటర్ల దూరంలో నాలుగుబోర్లు ఉన్నా ఏ బోరులోనూ నీరు తగ్గడం లేదు. ఇక్కడ సగం మంది రైతులు 500 ఫీట్ల లోతు నుంచి కిలోమీటర్న్నర దూరం నాలుగు ఇంచుల పైపుతో పంటలకు నీళ్లు పారిస్తున్నారు. ప్రస్తుతం మండు టెండలోనూ బోరు బావుల్లో నీరు తగ్గలేదు. -
కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలి
సిద్దిపేట పీజీ కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసనసిద్దిపేట ఎడ్యుకేషన్: సిద్దిపేటలోని యూనివ ర్సిటీ పీజీ కళాశాల (ఓయూ) పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న వారిని కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలని పార్ట్ టైమ్ అధ్యాపకులు అన్నారు. బుధవారం యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. జీవో నంబర్ 21 కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని వెంటనే సవరించాలన్నారు. శాశ్వత నియామకాల కోసం విడుదల చేసిన జీవో నంబర్ 21లోని పార్ట్టైమ్ అధ్యాపకుల సేవకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత విద్యా కమిషన్ అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నెలకు రూ.50,000 కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వాలన్నారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నిరసనకు కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ రమేశ్, డాక్టర్ సౌజన్య కుమార్, డాక్టర్ ఛత్రపతి, డాక్టర్ శ్రీహరి, రాజేందర్ మద్దతు తెలుపారు. కార్యక్రమంలో కళాశాల పార్ట్టైమ్ అధ్యాపకులు డాక్టర్ సౌందర్య, స్వాతి, షంషాద్ అలీ, అశోక్, డాక్టర్ రత్నాకర చారి, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం
ఆర్టీసీ ఈడీ సోలోమన్హుస్నాబాద్రూరల్: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని, ఆర్టీసీ అభివృద్ధికి ప్రయాణికులు సహకరించాలని ఈడీ సోలోమన్ అన్నారు. బుధవారం రాత్రి హుస్నాబాద్ బస్టాండ్ డిపోను పరిశీలించారు. బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ బస్టాండ్ను సందర్శించి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. మహాలక్ష్మీ ప్రయాణికులకు సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు ముందుంటారని చెప్పారు. హుస్నాబాద్ డిపో బస్టాండ్ అభివృద్ధి కోసం ఉద్యోగులతో సమీక్షించి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. బస్టాండ్లో గతంలో నిర్మించిన మూత్రశాలల ఎత్తు పెంచడం, షాపింగ్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుతామన్నారు. వీరి వెంట ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, డీఎం వెంకన్న ఉన్నారు. -
చిరుత దాడిలో దూడ మృతి
హవేళిఘణాపూర్(మెదక్): చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బ్యాతోల్ అటవీ ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బ్యాతోల్ గ్రామానికి చెందిన రైతు రాజయ్య తన పశువులను అటవీ ప్రాంతంలో కట్టేసి వచ్చాడు. ఉదయం వెళ్లేసరికి చిరుత వచ్చి లేగదూడను చంపి తిని పడవేసినట్లు బాధితుడు తెలిపారు. ఘటనా స్థలాన్ని సెక్షన్ ఆఫీసర్ స్రవంతి, బీట్ ఆఫీసర్ అశ్వక్ పరిశీలించి వెటర్నరీ అధికారులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి చిరుతపులి దాడి చేసినట్లు పోస్టుమార్టంలో వెటర్నరీ అధికారులు గుర్తించారు. బాధిత రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. పులి సంచరిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు లు రాత్రివేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. బావిలో పడి వ్యక్తి మృతి అక్కన్నపేట(హుస్నాబాద్): బావిలో పూడికతీత పనులు చేస్తుండగా కాలుజారి పడిపోవడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శివరాత్రి కనకయ్య(40) ఒడ్డెర కార్మికుడు. రేగొండ గ్రామానికి చెందిన రైతు బొడిగే మల్లయ్య బావి పూడికతీత పనుల కు వెళ్లాడు. 15 రోజులుగా పనులు చేస్తు న్నారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బావి పైన మట్టి పెళ్లలు, బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారి కాలు జారి బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యా డు. 108 అంబులెన్స్లో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం కనకయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్భాస్కర్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వివాహిత.. శివ్వంపేట(నర్సాపూర్): చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధి కొంతన్పల్లి గ్రామానికి చెందిన చెల్లి వినోద(32) కుటుంబ కలహాలతో ఆరు రోజుల కిందట పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అత్తింటి వేధింపులతోనే వినోద ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. కూతురి మృతికి కారకులైన అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతురాలి తండ్రి డాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడికి జైలు శిక్ష నంగునూరు(సిద్దిపేట): గుడిలో దొంగతనం చేసిన వ్యక్తికి సిద్దిపేట అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఏడాదిపాటు జైలు శిక్ష విధించినట్లు రాజగోపాల్పేట ఎస్ఐ అసీఫ్ తెలిపారు. కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన బోదాసు యాదగిరి ఎనిమిది నెలల కిందట నంగునూరు మండల గట్లమల్యాలలోని పెద్దమ్మ గుడిలో దోపిడీకి పాల్పడ్డాడు. రూ.35 వేల నగదుతో పాటు బంగారం, ఇత్తడి గంటను దొంగిలించాడు. విచారణ అనంతరం నిందితుడిని గుర్తించి చార్జీషీట్ దాఖలు చేయడంతో రూ.500 జరిమానతోపాటు సాధారణ జైలు శిక్ష విధించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం మండల పరిధిలోని ఆకునూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉల్లెంగుల వెంకటేశ్ భార్య మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లింది. పొలం పనుల నిమిత్తం వెంకటేశ్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చిచూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.25 వేలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు బాధితుడు వాపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నీరేశ్ తెలిపాడు. -
సన్నాల సాగుకే సై
పెరుగుతున్న సాగు విస్తీర్ణం ● వానాకాలంలో మరింత రెట్టింపు ● రెండేళ్లుగా స్పష్టంగా పెరుగుదల ● బోనస్ పథకంతో రైతులకు మేలు ● సన్న బియ్యం పంపిణీతో మరింత ధీమా పెరిగిన సన్నాల వాడకం.. ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా సన్న బియ్యం వాడకం విపరీతంగా పెరిగింది. పదేళ్ల కిందట వరకు రైతులు, గ్రామీణ స్థాయిల్లో దొడ్డు బియ్యం వాడకం కొనసాగేది. రైతులు తమ కమతాల్లో సాగైన బియ్యం తినేందుకే ఇష్టపడేవారు. కానీ కాలంతోపాటు సన్నాల కొనుగోళ్లు పెరగడంతో గ్రామీణ స్థాయిలో మధ్యతరగతి వర్గాల వరకు సన్న బియ్యంను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యం కూడా జనాలు అమ్మేసి సన్న బియ్యం కొనుగోలు చేస్తుండడంతో దీన్ని నివారించేందుకు ప్రభుత్వమే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెలలో పంపిణీ జరిగిన సన్న బియ్యంను జనాలు తినేందుకు ఇష్టపడుతున్నారు. రానున్న కాలంలో సన్నాల వినియోగమే అధికంగా మారనుండటంతో రైతులు కూడా అందుకు అనుగుణంగా సన్నాల వైపు మళ్లుతున్నారు. అన్నదాతలు సన్నాల సాగుకు సై అంటున్నారు. ఇంతకాలం దొడ్డు రకాలకు, సన్నరకాలకు ఒకే కనీస మద్దతు ధర ఉండటంతో గిట్టుబాటు కాదని భావించిన రైతులు బోనస్ పథకం అమలులోకి రావడంతో సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం కూడా ప్రారంభించడంతో రైతులకు మరింత ధీమా వచ్చింది. రానున్న వానాకాలంలో వరి సాగులో 70 శాతం వరకు సన్నాలే సాగవుతాయని, సన్నరకాల విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది. – నారాయణఖేడ్ 2023–24 యాసంగిలో జిల్లాలో సన్నాలను 2,312 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 2024– 25 యాసంగిలో సాగు విస్తీర్ణం 3,640కి పెరిగింది. 2024–25 వానాకాలం వచ్చేసరికి 5,474 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. రానున్న వానాకాలం 2025–26కు గాను గత వానాకాలం కంటే రెట్టింపుగా 10,948 ఎకరాలకు సన్నాల సాగు చేరవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విస్తీర్ణం కంటే అధికంగా పెరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంటున్నారు. గతంలో సన్నాల సాగు చూద్దామంటే కనిపించని పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం రైతులు మారుతున్న కాలంతోపాటు మార్పు దిశగా పయణిస్తూ సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. బోనస్తో మేలు.. ప్రభుత్వం బోనస్ పథకం ప్రవేశపెట్టడంతో రైతులు సన్నాల సాగును పెంచేందుకు దోహదం అవుతుంది. కనీస మద్దతు ధరపై క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.2,300 ఉండగా దానికి రూ.500 కలపడంతో రూ.2,800కు చేరింది. దీంతో బహిరంగ మార్కెట్లో ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గత వానాకాలంలో జై శ్రీరాం లాంటి పలు రకాల సన్నాలకు మంచి డిమాండ్ పలికింది. జిల్లాలో డెల్టా, కావేరి, కోనవరం సన్నాలు, జగిత్యాల సన్నాలు, తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 15048) తదితర రకాలను సాగు చేస్తుంటారు. వ్యవసాయశాఖ 34 రకాల సన్నాలను గుర్తించింది. ముఖ్యంగా నల్గొండ లాంటి ప్రాంతాల్లో భారీ మిల్లులు ఉండటంతో అక్కడ మాశ్చర్ (తేమశాతం) 25 వచ్చినా కొనుగోలు చేస్తుండడం, జిల్లాలో 17 మాశ్చర్ (తేమశాతం) కావాలనడంతో రైతులకు కొంత నష్టదాయకమే. మాశ్చర్ విషయంలో మినహాయింపులు ఉండాలని రైతులు కోరుతున్నారు. సన్నాలకు ‘చీడ’ సమస్య! సన్నాల విస్తీర్ణం పెరుగుతోంది సన్నాల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. మూడేళ్ల కాలంతో పరిశీలిస్తే పెరుగుదల స్పష్టంగా కన్పిస్తుంది. ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడం, పౌర సరఫరాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం, ప్రభుత్వ ప్రోత్సాహం, వ్యవసాయ అధికారుల ప్రచారం వల్ల సన్నాల సాగు పెరిగింది. చీడ పీడల సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సలహాలు, సూచనలు పొందాలి. మంచి దిగుబడులు సాధించవచ్చు. – నూతన్కుమార్, ఏడీఏ, నారాయణఖేడ్ దొడ్డు రకం వరి ధాన్యంతో పోలిస్తే సన్న రకం వరి ధాన్యానికి చీడ పీడల సమస్య కాస్త అధికంగా ఉండనుంది. సన్నాలు, దొడ్డురకం రెండు పంటలూ 120 రోజుల కాలంలోనే కోతకు వస్తుంటాయి. సన్నాలకు మార్కెట్లో బోనస్తో కలిపితే ధర అధికంగా ఉంటుంది. అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు, ఆకుచుట్ట పురుగు తదితర తెగుళ్లు సోకే అవకాశాలు సన్నాలకు అధికంగా ఉంటాయి. -
ఉద్యాన సాగులో బయోడిగ్రేడబుల్ ప్లాస్టికల్చర్
● గ్లోబల్ వార్మింగ్కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం ● ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి ● బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో యూనివర్సిటీ ఒప్పందం ములుగు(గజ్వేల్): ఉద్యాన వ్యవసాయ పంటల సాగులో పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్ను వినియోగంలోకి తెచ్చేందుకు ఉద్యానవర్సిటీ సంకల్పించిందని ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యానవర్శిటీలో బుదవారం బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టికల్చర్తో అభివృద్ధి, శిక్షణ సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఇవి భూమిలో క్షీణిస్తున్నప్పుడు మీథేన్, ఇథలీన్ వాయువులను విడుదల చేసి గ్లోబల్ వార్మింగ్ను మరింత పెంచుతుందన్నారు.ప్లాస్టిక్ కాలుష్యం నేలను నిస్సారం చేసి పంట దిగుబడిని తగ్గిస్తుందన్నారు. కలుపు మొక్కల అణచివేత, తేమ నిలుపుదల కోసం సాంప్రదాయ ప్లాస్టిక్ మల్చ్ ఫిల్మ్లు వాడకుండా బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ ప్లాస్టిక్లు రైతులు వినియోగించేలా మార్పు తేవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఇవి సులభంగా నేలలో కరిగిపోయి పర్యావరణ హానిని తగ్గించడంతో పాటు నేలను సుసంపన్నం చేస్తాయని వివరించారు. కార్యక్రమంలో ములుగు ఉద్యానవర్సిటీ, బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాస్టికల్చర్ అధికారులు భగవాన్, శుభం రతి, చీనానాయక్, లక్ష్మీ నారాయణ, సురేశ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్, వీణజోషి, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా
ఇద్దరికి తీవ్ర గాయాలు కొండపాక(గజ్వేల్): అదుపుతప్పి గూడ్స్ ఆటో బోల్తా పడిన ఘటన కొండపాక గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ కాజీపేట నుంచి ఆయిల్ ప్యాకెట్లను లోడ్ చేసుకొని గూడ్స్ ఆటో హైదరాబాద్లోని నాగోల్కు వెళ్తుంది. కొండపాక శివారులోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అదుపుతప్పి రాజీవ్ రహదారిపై పల్టీ కొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న రామకృష్ణ, డ్రైవర్ నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పట్టపగలే ఇంట్లో చోరీ నంగునూరు(సిద్దిపేట): పట్ట పగలే దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం వెంకటాపూర్లో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రేకులపల్లి శ్యామల ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.15 వేల నగదు, రెండున్నర తులాల బంగారం దోచుకెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న శ్యామల దొంగతనం జరిగినట్లు గుర్తించి రాజగోపాల్పేట పోలీసులకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. నార్సింగి మండల కేంద్రానికి చెందిన బేడబుడగ జంగాల దుర్గయ్య కుమారుడు శివకుమార్(30) గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ స్టవ్, మిక్సీ కుక్కర్లు బాగు చేస్తుంటాడు. సోమవారం చేగుంట మండలం మక్కరాజ్పేటలో గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఎక్సెల్ పై నార్సింగి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి దుర్గయ్య ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నీటి కుంటలో పడి యువకుడు అల్లాదుర్గం(మెదక్): నీటి కుంటలో పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్ఐ ప్రవీణ్రెడ్డి కథనం మేరకు.. టేక్మాల్ మండలం దన్నూర గ్రామానికి చెందిన నాయికిని సురేశ్(25) ముస్లాపూర్ గ్రామానికి చెందిన మమతతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.పెళ్లి చేసుకొని ఇల్లరికం అల్లుడిగా వెళ్లారు. సోమవారం సురేశ్ అదే గ్రామానికి చెందిన ఆగమయ్య, సంగమేశ్తో కలిసి సీతారామా కుంటలో ఎడ్లను కడగడానికి వెళ్లారు. సురేశ్ కుంటలో మునిగిపోయాడని ఆగమయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సురేశ్ను బయటికి తీసి జోగిపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు మనోహరాబాద్(తూప్రాన్):అనారోగ్యంతో పారిశ్రామిక వాడలో సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. మంగళవారం ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజు గాంధీ (58) ఆరు నెలల నుంచి మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో మూతపడిన తనయ్ ఎకోవేర్స్ విస్తరాకుల పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. షిఫ్ట్ ఛేంజ్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున తోటి సెక్యూరిటీ గార్డ్ అరుణ్ మిశ్రా పరిశ్రమ వద్దకు వచ్చాడు. అప్పటికే సెక్యూరిటీ రూం వద్ద రాజు గాంధీ కిందపడి మృతి చెంది ఉన్నాడు. వెంటనే మృతుడి కుటుంబీలకు, పరిశ్రమ యజమానికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెందాడని మృతుడి కుమారుడు శివరాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చివరికి బుగ్గిపాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటంతా విద్యుదాఘాతంతో బుగ్గి పాలైంది. ఈ ఘటన అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన తొందూరు ఎల్లయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏర్పడిన షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగాయి. దీంతో 30 గుంటల వరి పంటంతా కాలిపోయింది. పైపులు, బోరు మోటారు, 100 మీటర్ల సర్వీస్ వైర్, తదితర వస్తువులు కాలిపోయ్యాయి. సమాచారం అందుకు న్న ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలార్పేశాడు. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లి నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో 30 గుంటల వరి దగ్ధం పైపులు, మోటార్ కాలిబూడిద రూ. 3 లక్షల వరకు నష్టం -
తల్లిని వేధిస్తున్నాడనే యువకుడి హత్య
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులుజహీరాబాద్: తన తల్లిని తరచూ ఫోన్లో వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇద్దరు నిందితులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం చిరాగ్పల్లి పోలీసు స్టేషన్లో హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రామ్మోహన్రెడ్డి వెల్లడించారు. మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామానికి చెందిన అబ్బస్అలీ ఆటో నడుపుతూ జీవినం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఖలీషా అనే వ్యక్తి తల్లిని అబ్బాస్అలీ తరచూ బూతులు తిడుతుండేవాడు. ఫోన్ చేసి చేసి వేధించేవాడు. ఈ విషయమై ఖలీషా పలుమార్లు అబ్బాస్ ను హెచ్చరించాడు. అయినా వేధింపులు మానుకోలేదు. ఇదే విషయాన్ని ఖలీషా తన స్నేహితుడు మహతాకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి అబ్బాస్అలీని చంపాలనుకున్నారు. 6న అబ్బాస్అలీ గ్రామ శివారులోని ఓ ఫాంహౌస్లో ఉన్నాడని తెలిసింది. ఖలీషా, మహతాబ్లు మారణాయుధాలతో మోటారుసైకిల్పై వెళ్లి అబ్బాస్పై దాడి చేసి హత్య చేశారు. అడ్డుగా వచ్చిన అబ్బాస్ స్నేహితుడు షేక్ అబ్బాస్అలీ ముఖంపై బీర్ బాటిల్తో కొట్టి గాయపర్చారు. అనంతరం పారిపోతూ శేఖర్ అనే వ్యక్తిని దారిలో అడ్డగించి ఎయిర్ గన్, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను చూపించి బెదిరించి మోటారు సైకిల్ను తీసుకొ పరారయ్యారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఫుగట్నగర్లో మహతాబ్ ఇంటి వద్ద నిందితులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శివలింగం, ఎస్ఐ రాజేందర్రెడ్డి, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం దళారుల పాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తోటపల్లి గ్రామానికి చెందిన రాంగోపాల్రావు. వారం రోజుల కిందట వరి కోసి నాలుగు ట్రాక్టర్లలో 50 క్వింటాళ్ల ధాన్యం మిల్లుకు తీసుకుపోయిండు. వ్యాపారులు తాలు సాకు చూపి క్వింటాల్కు 5 కిలోల ధాన్యం కోత పెట్టారు. 50 క్వింటాళ్లకు 2.5 క్వింటాల్లు కోత పెట్టడంతో రూ.4,500 నష్టం జరిగింది. అలాగే ప్రభుత్వ మద్దతు క్వింటాల్కు రూ.2,320 ఉంటే వ్యాపారులు మాత్రం రూ.1,800కి కొన్నారు. ఇందులోనూ రూ.500 వ్యత్యాసంతో 50 క్వింటాళ్లకు రూ.25,000 నష్టం పోయాడు. అనంతరం హమాలీ ఖర్చుల కింద క్వింటాల్కు రూ.40 చొప్పున 50 క్వింటాళ్లకు రూ.2,000 తీసుకున్నారు. మొత్తంగా 50 క్వింటాళ్ల ధాన్యం అమ్మితే రూ.31,500 నష్టపోయాడు. డబ్బులకు 12 రోజులు వాయిదా పెట్టారు. ఇది ఒక రాంగోపాల్రావు కష్టమే కాదు మిల్లుకు ధాన్యం తీసుకొచ్చే ప్రతీ రైతులందరిది ఇదే పరిస్థితి.చర్యలు తీసుకోవాలి రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు. మిల్లులను తనిఖీ చేసి రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం పరిశీలించాల్సి బాధ్యత లేదా.? అధికారులు వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడితే రైతులు దోపిడీ గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అక్కడే రైతులు ధాన్యం అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలి. దోపిడీ చేసే వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే మిల్లుల ముందు రైతులతో ఆందోళనకు దిగుతాం. – మల్లికార్జున్రెడ్డి, రైతు సంఘం నాయకుడు అధికారులతో తనిఖీలు చేయిస్తాం రైతులు పచ్చివడ్లు అమ్ముకోవద్దు. గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ము కోవాలని చెబుతున్నాం. కొందరు రైతులు ఆరబెట్టడం ఏంటని చేనులోనే వరి కోసిన వెంటనే మిల్లుకు తీసుకుపోతున్నారు. వ్యాపారులకు ఇది వరకే చెప్పాం. రైతుల ధాన్యం కొనుగోలు చేయొద్దని ఒక వేళ చేస్తే మద్దతు ధర చెల్లించాలని చెప్పినాం. తూకములో మోసం గురించి అధికారులతో తనిఖీ చేయించి చర్యలు తీసుకుంటాం. – టీ.తిరుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్,హుస్నాబాద్ హుస్నాబాద్రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. రైతులకు ధర తక్కువగా చెల్లించి నిలువునా దోచుకుంటున్నారు. వరి కోసం మిల్లులకు ధాన్యం తెచ్చిన తర్వాత ధాన్యం పచ్చిగా ఉందని, తాలు సాకు చూపించి క్వింటాల్ రూ.100 కోత పెడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320లు ఉంటే వ్యాపారులు రూ.1760కే కొనుగోలు చేసి క్వింటాల్కు రూ.560 లాభం పొందుతున్నారు. రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొస్తే మిల్లులోని వే బ్రిడ్జి పై ధాన్యం తూకం వేస్తారు. బయటి వే బ్రిడ్జిలకు మిల్లుల వే బ్రిడ్జిలకు 10 నుంచి 20 కిలోల వ్యత్యాసం చూపిస్తుందని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ అధికారులు ఎప్పుడు మిల్లుల వే బ్రిడ్జిలను తనిఖీ చేయరు. రైతుల ఫిర్యాదు మేరకు మిల్లులకు వచ్చిన అధికారులు ముడుపుల ఆశ చూపించి పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 29 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 19 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు లేని రైతులు దళారులను ఆశ్రయించడంతో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. శనివారం రోజు గోమాత కాటన్ మిల్లులో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు ధర చెల్లింపులో కోతలు పెట్టడంతో ఆగ్రహించి ఆందోళనకు దిగారు. రైతులను శాంతింప చేసిన వ్యాపారులు క్వింటాల్కు రూ.1800లు చెల్లించడంతో రైతులు అందోళన విరమించారు. పత్తి మిల్లులో ధాన్యం కొనుగోలు చేయరాదు. పార బాయిలర్ మిల్లులోనే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం బోగస్ రైతుల పేరున ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి లాభాలను పొందుతున్నారు. తూకంలో మోసం, ధరలో వ్యత్యాసం క్వింటాల్కు రూ.500ల తేడా తాలు సాకుతో క్వింటాల్కు 5 కిలోలు కోత విధిస్తున్న వైనం రైతులను నిలువునా ముంచుతున్న వ్యాపారులు క్షేత్రస్థాయిలో గమనించని అధికారులుపత్తి అమ్మిన రైతుల పేరునే ధాన్యం అమ్మకాలు -
తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ మోసం
● పలువురు నుంచి రూ.90 లక్షలు వసూలు ● నిందితుడి రిమాండ్సిద్దిపేటకమాన్: తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ పలువురు నుంచి డబ్బులు వసూలు చేసిని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన చేపూరి రవికుమార్ పట్టణంలో బంగారం షాపును నిర్వహిస్తున్నాడు. కొద్ది నెలలుగా షాపునకు వచ్చే కస్టమర్లను తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ నమ్మిస్తున్నాడు. సుమారు 25 మంది బాధితుల నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇచ్చిన వారికి రవి బంగారం ఇవ్వడం లేదు. పట్టణానికి చెందిన అంబడిపల్లి భాస్కర్ పలు విడతలుగా రూ.7 లక్షలు, జక్కుల కుంటయ్య నుంచి రూ.6.9 లక్షలు, వెంకటభాస్కరరావు నుంచి రూ.9 లక్షలు రవి తీసుకొని బంగారం, డబ్బులు ఇవ్వలేదని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది కనకరాజు, అజయ్, స్వామి నిందితుడైన రవికుమార్ను పట్టణంలోని అతడి దుకాణం వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
మట్టి పరీక్ష.. పంటకు రక్ష
● భూసార పరీక్షలు చేయిస్తేనే అధిక దిగుబడి ● అవసరం మేరకు ఎరువులు వాడితేనే మేలు ● రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు చిన్నకోడూరు(సిద్దిపేట): పంటలు సాగు చేసే రైతులు మేలైన దిగుబడి సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. అయితే ఏ భూమిలో ఎంత మేరకు పోషకాలున్నాయనే విషయం భూసార పరీక్షలతోనే తేలిపోతుంది. భూములు ఖాళీగా ఉన్నందున భూసార పరీక్షలకు ఇదే సరైన సమయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ఆవశ్యకతను వివరిస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మండలంలో 5,391 మట్టి నమూనాలు సేకరించినట్లు ఏఓ జయంత్ కుమార్ తెలిపారు. 2 నుంచి 3 ఏళ్లకోసారి చేయించాలి నేలలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ పంటల దిగుబడి కోసం వ్యాపారులపైనే ఆధారపడుతున్న పలువురు రైతులు అదనంగా సేంద్రియ, రసాయనిక ఎరువులను వాడుతున్నారు. తద్వారా సాగు ఖర్చు పెరగడమే కాక నేల తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇలా జరగొద్దంటే ప్రతీ రైతు 2 నుంచి 3 ఏళ్ల కోసారి భూసారాన్ని తెలుసుకోవాలి. తద్వారా అవసరమైన ఎరువులు వాడితే ఫలితం ఉంటుంది. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలిసిపోతుంది. సమస్యాత్మకమైన భూములు ఉంటే వాటిని సవరించుకునే విధానాలు తెలుసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా.. భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యతను తెలుసుకునే వీలు ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువుల వినియోగానికి అవకాశం ఉంటుంది. రైతులు భూమిని కాపాడుకునేందుకు మట్టి పరీక్షలు తప్పక చేయించుకోవాలని సూచిస్తున్నారు. భూసార పరీక్షలతో మేలు.. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. రైతులు తమ భూమిలో భూసార పరీక్షలను ప్రతీయేటా చేయించుకోవాలి. భూమికి కావాల్సిన పోషక విలువలు తెలసుకోవచ్చు. ఆపై అవసరమున్నంత ఎరువులను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – జయంత్ కుమార్, ఏఓ, చిన్నకోడూరు -
జిన్నారం ఇక బల్దియా..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబోతోంది. జిన్నారం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేస్తూ జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిన్నారంతో పాటు తొమ్మిది గ్రామాలను కలిపి ఈ మున్సిపాలిటీగా ఏర్పాటు కానుంది. జిన్నారం, కొడకంచి, ఊట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకత్వ, అండూర్, జంగంపేట, మంగంపేట గ్రామాలు కలిపి కొత్త బల్దియాగా రూపాంతరం చెందనుంది. మొత్తం 17,956 మంది జనాభా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే ఈ మండలంలో గడ్డపోతారం గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసిన విషయం విదితమే. తాజాగా జిన్నారంను కూడా మున్సిపాలిటీగా మారుస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. జిన్నారం మొత్తం అర్బన్ మండలమే.. జిన్నారం మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన గడ్డపోతారం మున్సిపాలిటీలో ఐదు గ్రామపంచాయతీలను విలీనం చేశారు. ఇప్పుడు మిగిలిన పది గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీగా చేయడంతో ఈ మండలంలో అసలు గ్రామ పంచాయతీలే ఉండవు. దీంతో ఈ మండలం మొత్తం అర్బన్ మండలంగా రూపుదిద్దుకోనుంది. కాగా జిల్లాలో ప్రస్తుతం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిన్నారంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 13కు చేరనుంది. తీర్మానాలు చేస్తున్న జీపీల స్పెషల్ ఆఫీసర్లు ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరుతూ ఆయా పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఈ గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు కలిసి ఈ తీర్మానాలు చేసి కలెక్టరేట్కు పంపారు. ఈ తీర్మానాల ఆధారంగా ఈ పది గ్రామాలతో కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. జిల్లాలో మరో కొత్త మున్సిపాలిటీ ప్రభుత్వానికి కలెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు జిన్నారం, తొమ్మిది గ్రామాలతో కలిపి ఈ మున్సిపాలిటీ ఏర్పాటు -
ఖేడ్ తహసీల్దార్గా హసీనాబేగం
నారాయణఖేడ్: ఖేడ్ తహసీల్దార్గా హసీనాబేగం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన సి.భాస్కర్ కంగ్టి తహసీల్దార్గా బదిలీపై వెళ్లగా మొగుడంపల్లి తహసీల్దారుగా పనిచేస్తున్న హసీనాబేగం ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆమె ఇక్కడ బాధ్యతలను స్వీకరించగా.. డిప్యూటీ తహసీల్దార్ రాజుపటేల్ తోపాటు ఆర్ఐ మాధవరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానించారు. డిజిటల్ భిక్షాటన నారాయణఖేడ్: భిక్షాటనను డిజిటలైజ్డ్ చేసిన అంశాన్ని సినిమాల్లో, సీరియల్స్ల్లో కామెడీ సీన్గానే ఇన్నాళ్లు చూశాం. కానీ అన్ని రంగాల్లో అప్డేటెడ్ అవుతున్న తరహాలోనే ఓ బిచ్చగాడు అప్డేటెడ్ అయి సినిమా సీన్ను నిజం చేశాడు. మహారాష్ట్రలోని బాల్కికి చెందిన శ్రీను (21) తలలో డప్పు వేసుకొని అడుక్కొంటూ డప్పు కు ఏకంగా డిజిటల్ యూపీఐ స్కానర్ను ఏర్పాటు చేశాడు. చిల్లర లేవని ఎవరైనా పంపిస్తే ఫోన్పే, లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి ధర్మం చేయడంటూ కోరుతున్నాడు. సంత రోజుల్లో నారాయణఖేడ్, శంకర్పల్లి, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, హైదరాబాద్, బీదర్, ఉద్గీర్ తదితర పట్టణాల్లో భిక్షాటన చేస్తానని తనకు నిత్యం రూ.800కు పైగా గిట్టు బాటు అవుతుందని తెలిపాడు. డిజిటల్ బెగ్గింగ్ను చూసి వ్యాపారులు నవ్వుకుంటూ యూపీ ఐ స్కాన్ చేసి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు. మూల్యాంకనంపై ఆరా రామచంద్రపురం (పటాన్చెరు): రామచంద్రపురం పరిధిలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలు జరుగుతున్న పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఈవీ నరసింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కృష్ణారావు అధికారులు సందర్శించారు. మూల్యంకన కేంద్రంలోని బోధన, బార్ కోడింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ లింభాజీ పాల్గొన్నారు. డీకే అరుణను కలిసిన రైతు హక్కుల నేతలు జహీరాబాద్: పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణను జహీరాబాద్కు చెందిన రైతు హక్కుల సాధన సమితి నాయకులు, వక్ఫ్ భూ బాధిత రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం రాత్రి డీకే అరుణను ఆమె నివాసంలో కలిశారు. ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆమెకు స్వీటు తినిపించారు. జేపీసీ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె రైతుల తరఫున తగిన సమాచారం సేకరించి కమిటీకి అందజేశారు. రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వైభవంగా జోగినాథ రథోత్సవం జోగిపేట (అందోల్): జోగిపేటలో జోగినాథ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగింది. ఐదు అంతస్తులలో నందీశ్వరుడు, గణపతి, శివలింగం, దుర్గామాత, జోగినాథ స్వామి దివ్యమూర్తులను ఏర్పాటు చేశారు. మొదటగా గౌనిచౌరస్తాలో సంప్రదాయాల ప్రకారం జోగినాథ రథోత్సవ కమిటీ అధ్యక్షుడు శివశంకర్, కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎన్నాళ్లీ తిప్పలు
కుప్పలు తెప్పలుఇతర శాఖల దరఖాస్తుల వివరాలు శాఖ పేరు మొత్తం పరిష్కారం పెండింగ్లో దరఖాస్తులు అయినవి ఉన్నవి రెవెన్యూ 835 317 518 మున్సిపల్ 149 0 149 ఎంపీడీఓ 89 19 70 డీఆర్డీఓ 36 11 25 హౌసింగ్ కార్పొరేషన్ 32 12 20 జిల్లా పంచాయతి 20 10 10 సర్వే ల్యాండ్ రికార్డ్స్ 12 6 6 పోలీస్ శాఖ 45 5 40 వైద్య ఆరోగ్యం 16 11 5 కాలుష్యం 6 2 4 ఇతరములు 226 136 90 మొత్తం 1,466 529 937సంగారెడ్డిజోన్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నా యే తప్ప అవి పరిష్కారానికి మాత్రం నోచుకోవడంలేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో అధికారలు అర్జీలను స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తున్నా.. మిగతావి మాత్రం పెండింగ్లోనే ఉండటంతో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎనిమిది నెలల్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 1,466మంది ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. అందులో 529 సమస్యలు పరిష్కరించగా.. 937 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కటీ పరిష్కారం కాలేదు.. జిల్లాలోని మున్సిపల్ పరిధిలో వచ్చిన అర్జీలు ఒకటి కూడా పరిష్కారం కాలేదని గణాంకాల బట్టి తెలుస్తుంది. అందోల్–జోగిపేట 8, అమీన్పూర్లో 84, సంగారెడ్డిలో 22, తెల్లాపూర్లో 17, జహీరాబాద్లో 11, సదాశివపేటలో 6, బొల్లారంలో ఒకటి చొప్పున అర్జీలు రాగా.. అధికారులు వీటన్నింటినీ పరిష్కారం చూపక పెండింగ్లోనే ఉంచారు. వచ్చిన వారే మళ్లీ వస్తూ... తమ సమస్యలు పరిష్కా రం కాకపోవటంతో వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా, డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే ప్రధాన సమస్యలు ప్రజావాణిలో సుమారు 50కి పైగా శాఖలకు సంబంధించిన అర్జీలు వస్తుంటాయి. ప్రధానంగా ధరణిలో భూ వివరాలు లేకపోవటం, పట్టాపాసు పుస్తకం లేదని, డబుల్ రిజిస్ట్రేషన్, ఉన్న భూమి కంటే ఎక్కువ గా, తక్కువగా చూపించటం, పింఛన్ ఇప్పించాలని, రైతుబంధు రావటం లేదని, ఉపాధి కల్పన, రహదారుల మరమ్మతులు, భూముల సర్వే, వేతనాలు రాకపోవటం, ఇళ్ల మంజూరు, మిషన్ భగీరథ, పౌరసరఫరాలు, పంచాయతీశాఖ, మున్సిపల్తోపాటు తదితర శాఖలపై ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. పరిష్కారం చూపని ప్రజావాణి పెండింగ్లో 937 అర్జీలు రెవెన్యూ సమస్యలే అధికం కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు -
నాణ్యమైన సన్న బియ్యమివ్వాలి
సింగూరు కాల్వలకు సింగారంసంగారెడ్డి జోన్: నాణ్యతతో కూడిన సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని మూడవ వార్డులో కిట్టు, స్వప్నల ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలసి కలెక్టర్ భోజనం చేశారు. సన్న బియ్యం పంపిణీతో తమ కుటుంబం సంతోషంగా ఉందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ షాపును పరిశీలించి, సన్న బియ్యం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3లక్షల,78 వేల728 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం నాణ్యత లేక పోవటంతో రీసైక్లింగ్ చేయడం, ఇతరులకు అమ్మడం జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు తగిన వసతులు కల్పించాలి వయో వృద్ధులకు తగిన వసతులు సమకూర్చాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధాశ్రమం, బాల రక్షాబంధన్ను ఆమె సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేయనున్న జనరిక్ మెడికల్ షాపు స్థలాన్ని, ఐకేపీ మహిళల పెట్రోల్ బంక్ను కూడా పరిశిలించారు. వృద్ధాశ్రమంలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి వనజా రెడ్డి, డీఈ దీపక్, డీసీపీఓ రత్నం, ఎఫ్ఆర్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న దివ్యాంగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో దివ్యాంగుల ప్రజావాణి నిర్వహించారు. ఈ మేరకు 23 వరకు అర్జీలు వచ్చాయి. సదరం సర్టిఫికెట్, రెన్యూవల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సదరం క్యాంపులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్, నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధూరి, వైద్యారోగ్య శాఖ, డీఆర్డీఏ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుల్కల్(ఆందోల్): సింగూరు కాల్వలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పనులు దక్కి ంచుకున్న కాంట్రాక్టర్ మొదట కాల్వల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి కొలతల ప్రకా రం మట్టిని తీసేశారు. కాల్వలకు కాంక్రీట్ పోయడానికి వీలుగా మార్కింగ్ చేస్తున్నారు. దశాబ్దం క్రితం నుంచి సాగునీరు అందిస్తున్న కాల్వలకు నీటి పారుదలశాఖ అధికారులు ఇప్పటివరకు మరమ్మతు లు చేయలేదు. దీంతో కాల్వల్లో మట్టి పేరుకుపోయి ముళ్లకంప మొలిచింది. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయడానికి నిధులు మంజూరు చేశారు. రూ.169.30 కోట్లతో మరమ్మతులు సింగూరు డ్యామ్కు కుడి, ఎడమన 60 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ, 160 కిలోమీటర్ల మేర డైవర్షన్ కెనాల్లు ఉన్నాయి. దశాబ్దం నుంచి మరమ్మతులు చేయకపోవడంతో కాల్వల్లో పిచ్చి మొక్కలు మొలిచి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక చౌటకూర్, అందోల్ మండలాల్లోని పిల్ల కాల్వలకు నీరందడం లేదని రైతులు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ఉండటంతో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించి సిమెంట్ లైనింగ్ మరమ్మతులకు రూ.169.30 కోట్లు మంజూరు చేశారు. అధికారులు రూ.133.51 కోట్లకు టెండర్ ప్రక్రియ ప్రారంభించగా.. హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ 4.95 ఎక్సెస్తో పనులు దక్కించుకున్నారు. ఈ పనులకు కాంట్రాక్టర్ 18 నెలలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. పంటలకు క్రాఫ్ హాలిడే.. కాగా, కాల్వల్లో నీటి ప్రవాహం ఉంటే పనులకు ఆటంకం కలుగుతుందని ఆయకట్టు కింద రెండు పంటలకు సాగునీరు వదలడం లేదు. దీంతో బోరు బావులతోనే సాగు చేసుకున్నారు. సిమెంట్ లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నారు.కలెక్టర్ క్రాంతి ఆదేశం లబ్ధిదారులతో కలసి భోజనం పేదలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య రూ.169.30 కోట్లతో సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించిన గుత్తేదారు కాంక్రీట్ వేయడానికి మార్కింగ్ ఏడాదిన్నరలో పనులు పూర్తికి ఒప్పందం -
‘నారింజ’కు జలకళ
● వేసవిలోను నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు ● పెరిగిన భూగర్భజలాలు జహీరాబాద్ టౌన్: వేసవికాలం ప్రారంభమైనప్పటికీ జహీరాబాద్ ప్రాంతంలోని నారింజ ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోరు బావులు నిండుగా నీరు పోస్తున్నాయి. బోరు బావుల కింద ఉన్న పంటలు పచ్చగా కనిపిస్తున్నాయి. శాశ్వత నీటి వనరులు లేనందున ఈ ప్రాంత రైతులు బోరు బావులపై ఆధారపడి పంటల పండిస్తున్నారు. చెరువులు లేనందున వేల రుపాయలు ఖర్చు చేసి బోరు తవ్వించి పంటలు పండిస్తుంటున్నారు. అయితే అనావృష్టి వల్ల 500 అడుగుల లోతు ఉన్న బోర్లలో కూడా నీరు ఇంకిపోయే పరిస్థితులు ఉండేవి. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. వేసవిలోనూ రైతులు హాయిగా పంటలు పండించుకుంటున్నారు. కాలువలు దెబ్బతినడంతో.. పంటల సాగు కోసం నిర్మించిన నారింజ ప్రాజెక్టు పలు కారణాల వల్ల ఊట చెరువుగా మారింది. ప్రాజెక్టు ఎడుమ, కుడి కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో గేట్లు మూసి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని నిలువ ఉంచడం ప్రారంభించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నారింజ ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడంతో లీకేజీతో నీరు ఖాళీ అయ్యేది. ప్రాజెక్టులోని నీరంతా వృథాగా కర్ణాటకకు తరలిపోయేది. దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతూ వస్తున్నారు. అప్పటి కలెక్టర్ హన్మంత్రావు స్పందించి ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించి పేరుకుపోయిన పూడిక మట్టిని తీయించారు. అప్పటి నుంచి గేట్ల నుంచి లికేజీలు బంద్ అయ్యాయి. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్టులో నీరు చేరి జలకళ సంతరించుకుంది. భూగర్భ జలాలు పెరిగి కొత్తూర్(బి), మల్కాపూర్, బూచినెల్లి, బుర్దిపాడ్, సత్వార్, రేజింతల్, అల్గోల్, మిర్జాపూర్(బి) తదితర గ్రామాల పరిధిలోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. బోరు బావుల్లో నీరు ఉండటంతో వాణిజ్య పంటలైన చెర కు, అల్లం, కూరగాయాలను రైతులు పండిస్తున్నారు. -
నెత్తిన బండ
ఆదాయం ఫుల్.. వట్పల్లి గ్రామ పంచాయతీకి ఆదాయం దండిగా ఉన్నా గ్రామసంతలో మాత్రం వసతులేమితో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వివరాలు 9లో u● ఒక్కో గ్యాస్ సిలిండర్ రూ.50 పెంపు ● రూ.855 నుంచిరూ.905లకు చేరిన ధర ● వినియోగదారులపైరూ.2.83కోట్ల అదనపు భారంసంగారెడ్డి జోన్: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. కేంద్రం ఒక్కో సిలిండర్పై ఏకంగా రూ. 50లు పెంచింది. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ సిలిండర్ రూ.855 ఉండగా రూ.50లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ.905లకు చేరింది. జిల్లా వ్యాప్తంగా 35 ఏజెన్సీలు ఉండగా గ్యాస్ కనెక్షన్లు 5.66లక్షలు పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో కుటుంబాలపై ప్రతీ నెల దాదాపుగా రూ.2.83కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ పెంపు ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్లకు సైతం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద మధ్య తరగతి కుటుంబాలకు రూ.500లకు సిలిండర్ను అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరను మహాలక్ష్మి లబ్ధిదారులది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ.500లకు అందజేస్తున్న సిలిండర్ ధరను సైతం రూ.550లకు పెంచడంతో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఈ పెంపు వర్తింపజేస్తుందా లేదా అనే నిర్ణయం తీసుకోలేదు. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ పెంపు ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై భారీగానే పడనుంది. -
మరో తహసీల్దార్పై చర్యలకు రంగం సిద్ధం
● రూ.40 కోట్ల భూమి విషయంలోజిమ్మిక్కులు! ● కొనసాగుతున్న అంతర్గత విచారణ ● ఇటీవల కొండాపూర్ తహసీల్దార్పై బదిలీ వేటు, ఆర్ఐ సస్పెన్షన్.. ● ముడుపుల కోసం అడ్డదారులుతొక్కుతున్న అధికారులు ● చర్చనీయాంశంగా తహసీల్దార్ల వ్యవహారాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కొందరు రెవెన్యూ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముడుపులిస్తే చాలు తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారే లేరన్నట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కో ఎకరం భూమి రూ.కోట్లలో పలుకుతోంది. ఇది ఇలాంటి అక్రమార్కులకు వరంగా మారింది. నిబంధనల ప్రకారం పనిచేయాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. ఆయా భూమి మార్కెట్ విలువ ఎంతుంటుందో అదే స్థాయిలో వీరికి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇక నిబంధనలకు విరుద్ధంగా చేయాల్సిన పనులు వస్తే చాలు వీరి పంట పండుతోంది. రూ.లక్షల్లో ముడుపులు దండుకుంటున్నారు. ఒకటీ రెండు వ్యవహరాలు బెడిసికొట్టి బయటకు వస్తే...ఇలా బదిలీ వేటులు, సస్పెన్షన్లతో సరిపోతోంది. ఈ వ్యవహరం సద్దుమణిగాక తిరిగి పోస్టింగ్లు పొందుతుండటం రెవెన్యూశాఖలో పరిపాటిగా మారింది. తహసీల్దార్ల బదిలీల్లోనూ ఇంతే.. ఇటీవల జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు జరిగిన విషయం విదితమే. తమకు అనుకూలమైన మండలాలు, భూముల ధరలు ఎక్కువగా ఉన్న మండలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉన్నవి, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మండలాల్లో పోస్టింగ్ల కోసం కొందరు తహసీల్దార్లు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నారు. పట్టున్న మండలాలకు వెళితే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే కారణంగా వీరు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇదిలా ఉండగా అయితే కొండాపూర్ మండలంలో జరిగిన పట్టా భూమి పౌతీ విషయంలో అధికారుల జిమ్మిక్కులు బయటకు రావడంతో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టారు. ఇలా బయటకు రాకుండా లోలోపల జరిగిన అనేక భూ వ్యవహరాలపై షోకాజ్ నోటీసులు, మెమోలతో సరిపెడుతున్న వ్యవహరాలు అనేకం ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రంజోల్ గ్రామంలో పీఆర్ఏ
పటం ద్వారా పంటల సాగుపై రైతులకు అవగాహన జహీరాబాద్: భాగస్వామ్య గ్రామీణ అనుభవ కార్యక్రమం(పీఆర్ఏ)లో భాగంగా కొండాలక్ష్మణ్ ఉద్యాన కళాశాల విద్యార్థినులు మండలంలోని రంజోల్ గ్రామాన్ని సందర్శించారు. నెలరోజులుగా విద్యార్థినులు రైతుల పొలాల వద్దకు వెళ్లి సాగు మెళకువలు నేర్చుకున్నారు. సోమవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామం రూపురేఖలను, సాగు చేసే పలు రకాల పంటల వివరాలను రంగులతో ముగ్గుల రూపంలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ కార్యాలయాలు, మందిరాలు, చర్చి, మసీదులతోపాటు పలు అంశాలను గుర్తించారు. అనంతరం పంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో ప్రదీప్కుమార్, రైతులు విద్యార్థినులు కాత్యాయని, మహాలక్ష్మి, వర్ష, మేఘన, సంధ్య, యామిని, యశస్విని, మాధురి, రవీనా, జ్యోతి, నవ్య, ప్రియాంక, రేచల్, సాయి లేఖన, సబిహా, స్నేహ,వర్షిత, స్వప్న, శ్రీజ, తనయ, సంస్కృతి, ఫిలోమిన, మానస, శిరీష పాల్గొన్నారు. -
ఎంఆర్ఐ,సీటీ స్కాన్లను ఏర్పాటు చేయండి
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటుతో పాటు వైద్య సిబ్బందిని పెంచాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ కు ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రతో కలసి ఫోరమ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కి అనుబంధం కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న స్కానింగ్ యంత్రాలు, సిబ్బంది సేవలు, ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపోవడం లేదని వివరించారు. 13న లింగాయత్సమాజ్ సమావేశంనారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని బసవ మండపంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు తాలుకా స్థాయి లింగాయత్ సమాజ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తాలుకా లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు ఆనంద్ స్వరూప్ షెట్కార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలోని బసవేశ్వర్ చౌక్లో సంఘసంస్కర్త బసవేశ్వరుడి నూతన విగ్రహం ఏర్పాటు కోసం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
నారాయణఖేడ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రమాదంలోపడ్డ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ మండలం పైడిపల్లి గ్రామంలో జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలు, కులాలకు చెందిన పార్టీ అని అన్నారు. దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన, రాజ్యాంగాన్ని రచించిన మహాత్ములపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద వర్గాల అభ్యున్నతికి చాలా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. అందువల్లే కోపం వచ్చిన రాముడు అయోధ్యలో బీజేపీని గెలవకుండా చేశాడని పేర్కొన్నారు. పైడిపల్లిలో కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు తన నిధులనుంచి ఇస్తానని ఎంపీ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్లో సీసీరోడ్లు... సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. జగన్నాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమ ఖేడ్ నియోజకవర్గ ఇన్చార్జి ధనలక్ష్మి, టీపీసీసీ సభ్యులు కర్నెశ్రీనివాస్, యువజనకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, తాహెర్అలీ, వినోద్పాటిల్, రమేశ్ చౌహన్, పండరీరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.