breaking news
Sangareddy District News
-
లైంగిక వేధింపుల నివారణకు..
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పోష్ చట్టంతో పాటు షీ–బాక్సు పోర్టల్ను తప్పకుండా అమలు చేయాలని డీడబ్ల్యూఓ హేమభార్గవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా ఉండేలా 2013లో భారత ప్రభుత్వం వీటిని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా ఉండేందుకు అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి షీ– బాక్స్ పెట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని వివరించారు. దీనికి సంబంధించి కమిటీ సభ్యుల వివరాలను సమర్పించడానికి 10 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ షీ–బాక్స్ ఆన్లైన్ ప్లాట్ఫారాన్ని ప్రారంభించిందని తెలిపారు. దీని ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 181 ఫిర్యాదు, సహాయానికి సంప్రదించాలని కోరారు.జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి హేమభార్గవి -
బోల్తా పడిన కోడిగుడ్ల వాహనం
కొండపాక(గజ్వేల్): కోడిగుడ్ల వాహనం రాజీవ్ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన కుకునూరుపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలోని పౌల్ట్రీఫాం నుంచి టాటా ఏసీ వాహనంలో కోడిగుడ్లను హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి శివారులో అదుపు తప్పి వాహనం సుమారు 20 గజాల దూరం వరకు డివైడర్ను ఢీకొట్టుకుంటూ వెళ్లి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో వాహన డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కోడిగుడ్లు పగిలి రోడ్డుపై పడటంతో ద్విచక్ర వాహనదారుడు అందులోంచి వెళ్తూ స్కిడ్ అయి పడగా గాయాలు సైతం అయ్యాయి. సుమారు 15 నిమిషాల పాటు వాహనాలు నిలిపోయాయి. పోలీసులు కోడిగుడ్ల వాహనాన్ని రోడ్డు పైనుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా ఇదే ప్రదేశంలో ఇటీవల ద్విచక్ర వాహన దారుడు డివైడర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరారు.డ్రైవర్, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... దుబ్బాక గ్రామానికి చెందిన నూనె అశోక్, సుశాంత్ బైక్పై సిద్దిపేట నుండి దుబ్బాకకు వెళుతున్న క్రమంలో ధర్మారం శివారులో అదుపు తప్పి ప్రమాద సూచిక బోర్డును బలంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో ఢీకొని.. నారాయణఖేడ్: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారిపై నిజాంపేట్ మండలం బాచేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం నుంచి ఆటోలో యూరియా బస్తాలను కంబాపురం తరలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మందాల వీరప్ప, అమృత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
శ్రీకృష్ణాష్టమి వేడుక ప్రధానం
సంప్రదాయ వేషధారణలో కాయితీ లభాణీ పురుషులువీరి ప్రధాన పండుగలో శ్రీకృష్ణాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి వేడుక సైతం అందరితో పాటు జరుపుకోకుండా దసరా ముందు వచ్చే మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాలం ఆరంభంలో యువతులు తీజ్ ఉత్సవం జరుపుకుంటారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు, పురుషులు బృందాలుగా నృత్యాలు చేస్తారు. శ్రీకృష్ణుని వంశస్తులుగా చెప్పుకొనే కాయితీ లభాణీలు మద్యం తాగరు. మాంసాహారం భుజించరు. నియమ, నిష్టలకు పెట్టింది పేరుగా ఉంటుంది వీరి జీవన విధానం. -
3787 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్లో సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల విలువైన సమయం, డబ్బులు ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోదలచిన క్రిమినల్, గృహహింస, చెక్ బౌన్స్, మోటారు ప్రమాద కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్లో 3,733 క్రిమినల్, 39 సివిల్, 15మోటారు ప్రమాద కేసులతో పాటు మొత్తం 3,787 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. మోటారు ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.1కోటి75వేలు బాధితులకు ఇప్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్కాంబ్లి, సంతోష్కుమార్, సాధన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, న్యాయవాదులు సత్యనారాయణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి -
డబ్బుల విషయంలో వివాదం
● పన్నెండేళ్ల తర్వాత అన్నాచెల్లెలు రాజీ ● లోక్అదాలత్లో కేసు పరిష్కారం గజ్వేల్రూరల్: డబ్బుల విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో కేసులు నమోదు చేసుకున్న అన్నాచెల్లెలు పన్నెండేళ్ల తరువాత లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. గజ్వేల్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... 2012 జూలై 29న నాసిరుద్దీన్తో పాటు అతని కుటుంబ సభ్యులకు తండ్రి అబ్దుల్ నబీ దుబాయ్ నుంచి పంపించిన డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. 12ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. శనివారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన లోక్ అదాలత్లో జడ్జీ స్వాతిగౌడ్ ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ రవికుమార్, పీపీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పొలానికి వెళ్లొస్తుండగా..ఆటో ఢీకొట్టడంతో రైతు మృతి కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్డి గ్రామానికి చెందిన చింతల భూమయ్య(35) టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకొని కృష్ణాపూర్కు వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతడిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భూమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, కూతురు అంజలి, కొడుకులు ప్రసాద్, గణేశ్ ఉన్నారు. విద్యార్థి అదృశ్యం జహీరాబాద్ టౌన్: విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం... పట్టణంలోని మోమిన్ మొహల్లాకు చెందిన ఇస్మాయిల్ కుమారుడు ఎండీ అర్బాస్(17) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 12న మార్కెట్కు వెళతానని చెప్పి తిరిగి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అన్న ముబీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో చోట వివాహిత..పటాన్చెరు టౌన్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంజీ రోడ్డుకు చెందిన శ్రీనివాస్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న భార్య స్వరూప శ్రీనివాస్ గొడవ పడ్డారు. అదేరోజు సాయంత్రం శ్రీనివాస్ వాష్ రూమ్కి వెళ్లి వచ్చేసరికి భార్య ఇంటి నుండి వెళ్లిపోయింది. వెంటనే భార్య కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. -
యూరియా ‘బ్లాక్’!
పరిగి: యూరియా కోసం ఓ వైపు రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం బ్లాక్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట అధిక ధరలకు అమ్ముతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ కేంద్రంలోని చిన్నారి ఆస్పత్రి పక్కన ఉన్న గోదాం నుంచి శనివారం రాత్రి దుకాణదారుడు యూరియాను ఆటోలో తరలిస్తుండగా ఓ రైతు వీడియో తీసి వాట్సప్లో వైరల్ చేశాడు. ఒక్క బస్తా కోసం పగలురాత్రి తేడాలేకుండా తాము లైన్లో నిలబడినా, స్టాక్ అయిపోందని వెనక్కి పంపిస్తూ.. ఇలా రాత్రి వేళ బ్లాక్ మార్కెట్కు తరలించడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ
సిద్దిపేటకమాన్: భారతదేశంలో ఒకటే పన్ను విధానం ఉండాలని జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ అని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సిద్దిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. అప్పట్లో పదేండ్లు పాలించిన కాంగ్రెస్ జీఎస్టీ బిల్లును ఎందుకు పాస్ చేయలేకపోయిందని ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీవీ, ఫ్రిడ్జ్, కార్లు, పన్నీరు, పిండిపదార్థాలు, డైరీ ఉత్పత్తులు వంటి 85వస్తువులపై ధరలు తగ్గనున్నట్లు తెలిపారు. ఓటు, నోటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని చెప్పుకొచ్చారు. దేశంలో ఒక కోటి 51 లక్షల మంది జీఎస్టీ చెల్లిస్తున్నారన్నారు. 173దేశాల్లో ఏ ప్రధాని కూడా చేయని విధంగా 11ఏళ్ల నుంచి మన దేశానికి మోదీ ప్రధానిగా చేస్తున్నారన్నారు. దేశంలో 11 ఏళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు, వ్యాపారస్తులు గంప కృష్ణ, భూపతి, వీరేశం, సత్యనారాయణ, సుతారి కార్తీక్ పాల్గొన్నారు. అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్రావు కాంగ్రెస్ పాలనలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు -
బైక్ చోరీ
నిజాంపేట(మెదక్): పొలం వద్ద ఉంచిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంపె నాగరాజు తన వ్యవసాయ పొలంలోని గుడిసె వద్ద బైక్ను ఉంచి పని చేసుకుంటున్నాడు. పనులు ముగించుకుని వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో సీసీ కెమెరాల ఆధారంగా వ్యక్తిని గుర్తు పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాసాయిపేటలో... వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రమైన మాసాయిపేటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కిరాణం షాపు, లాండ్రీ షాపు తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. నగదుతోపాటు వస్తువులు చోరీకి గురైనట్లు షాపు యజమానులు తెలిపారు. ఇదిలా ఉండగా దగ్గరలోనే ఉన్న సాయిబాబ దేవాలయం వద్ద గల తాళాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..నిజాంపేట(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో పడిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బదనకంటి (గొల్ల) లక్ష్మి , పర్శరాములు దంపతుల కుమారుడు మహేశ్(24) శుక్రవారం ఉదయం గేదెలను మేపడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతుకుతుండగా గ్రామంలో ఉన్న హైదర్ చెరువు వద్ద మృతుని చెప్పులు కనబడటంతో పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ సహాయంతో వెతకగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. చెరువులోకి దిగిన గేదెలను బయటకు తోలుకురావడానికి మహేశ్ నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సింగూరు నీరు విడుదల
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో ఒక గేట్ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత రెండు రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో 9వ నంబర్ గేట్ను మీటరున్నర ఎత్తుకు ఎత్తి దిగువకు 7262 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం నుంచి 2500 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 9230 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ఫ్లో 9675 క్యూసెక్కులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 17.345 టీఎంసీలు నిల్వ ఉంచి, మిగితా నీటిని దిగువకు వదులుతున్నారు. ఏడుపాయల ఆలయం మూసివేత పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయాన్ని శనివారం మళ్లీ మూసివేశారు. సింగూరు నుంచి 9675 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి వరద వెళ్తుండటంతో ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్ వేర్వేరుగా అమ్మవారికి పూజలు చేసి మంజీరా వరదను పరిశీలించారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంధ విద్యార్థికి ఆర్థిక సాయం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండాకు చెందిన అంధ బాలుడు వికాస్ నాయక్ నిజామాబాద్లోని అంధుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే చూపు కోల్పోయాడు. తండ్రి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ నిరుపేద కుటుంబం శనివారం జగ్గారెడ్డి వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకోగా, వైద్య ఖర్చుల కోసం వికాస్కు రూ. 7.50 లక్షల నగదు అందజేశారు. వికాస్ కొమురవెల్లి మల్లన్న, బీరప్ప, సీతారామచంద్రులు వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక గాయాలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించారు. కాగా అతడికి కొత్త సెల్ఫోన్ అందజేసి, యూట్యూబ్ చానెల్ పెట్టించేందుకు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అంనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ పాల్గొన్నారు. నియమాలు పాటిద్దాం.. ● ప్రమాదాలను నివారిద్దాం రామాయంపేట(మెదక్): కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డులు పొందేవారికి ప్రభుత్వం కొత్త తరహాలో అవగాహన కల్పిస్తోంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరిట ప్రత్యేకంగా లేఖ ప్రతితో పాటు కార్డులను పోస్టులో పంపుతోంది. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. భద్రతా నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దామని లేఖలో పేర్కొంది. ఇదే విషయమై జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో కనీసం 600 మందికిపైగా వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్ కార్డులతో పాటు మంత్రి పేరిట లేఖలు పంపించామని తెలిపారు. -
గురువులు.. సమాజ నిర్దేశకులు
పటాన్చెరు: దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని.. అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి గౌరవించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు కొనియాడారు. శనివారం డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికై న వారిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభమై, నేడు పార్లమెంటు సభ్యుడి వరకు ఎదగడం వెనక తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల కృషి ఉందని ప్రశంసించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థి చదువుతో పాటు మానసిక ప్రవర్తనను గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలల ద్వారా పోటీ ఉన్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వివిధశాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ఖాళీలు భర్తీ చేయాలి
జహీరాబాద్ టౌన్: ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్ కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. చాలాకాలంగా ఇన్చార్జి ఎంఈఓలుగా కొనసాగుతున్నారని, దీని వల్ల సబ్జెక్టుల కొరత ఏర్పడుతుందన్నారు. ఖాళీలను సీనియర్ ప్రధానోపాధ్యాయులతో పదోన్నతి ద్వారా భర్తీ చేయాలన్నారు. నూతన పీఆర్సీ అమలుచేసి రెండు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. యూనియన్ నాయకులు రమణకుమార్, బషీర్ అహ్మద్, బూర్ఖన్ పాల్గొన్నారు. 4,334 కేసులు పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలను సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,334 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబుజహీరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శించారు. శనివారం జహీరాబాద్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ అభ్యాస వర్గ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో యాజమాన్యాలు విద్యాసంస్థలను నడపలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్య కోసం బడ్జెట్లో 13 నుంచి 14 శాతం కేటాయింపులు చేస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం అందులో సగం కూడా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారందన్నారు. గ్రూప్–1 నియామకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపడితేనే వాస్తవాలు బహిర్గతం అవుతాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఆకాష్, రాజు, ఆదిత్య, లక్ష్మణ్, జిల్లా ప్రముఖ్ మాధవరెడ్డి, అగ్రి విజన్ స్టేట్ కన్వీనర్ మానస, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం.. ఆర్టీసీకి నష్టం
మెదక్ కలెక్టరేట్: భారీ వర్షాలు ఆర్టీసీకి నష్టం మిగిల్చాయి. ఆగస్టు చివరి వారంలో మెతుకు సీమలో కురిసిన కుంభవృష్టితో భారీగా వరద పొటెత్తింది. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో 63 కిలో మీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం కాగా, 15 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఆర్అండ్బీ శాఖ పరిధిలో 29 రోడ్లు ఉండగా, 53 కిలో మీటర్ల మేర ధ్వంసం అయ్యాయి. దీంతో మెదక్ నుంచి ఎల్లారెడ్డికి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి సిద్దిపేటకు ప్రతిరోజు పది బస్సులు నడుస్తాయి. సిద్దిపేట వరకు మెదక్ బస్సు వెళ్లడంతో రోజుకు రూ. 20 వేల ఆదాయం వస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు తెగిపోవడంతో ప్రస్తుతం రామాయంపేట వరకే బస్సును నడిపిస్తున్నారు. దీంతో సగం ఆదాయం పడిపోయింది. ఈ లెక్కన ఈ రూట్లో ఇప్పటివరకు రూ. 15 లక్షల ఆదాయం తగ్గింది. అలాగే ఎల్లారెడ్డి రూట్లో మెదక్ బస్సులు రోజుకు 5 చొప్పున నడుస్తాయి. ఒక్కో ట్రిప్కు రూ. 2 వేల చొప్పున రోజుకు రూ. 10 వేల ఆదాయం వస్తుంది. పోచారం డ్యాం పొంగిపొర్లి రోడ్డు తెగిపోవడంతో 5 రోజులు బస్సులను నిలిపివేశారు. దీంతో సుమారు రూ. 1.30 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే పాపన్నపేట రూట్లో బొడ్మట్పల్లి వరకు రోజుకు 6 బస్సులు నడుస్తాయి. రెండు రోజులు బస్సులు నిలిచి పోవడంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం చేకూరింది. ఇలా మొత్తం 5 రోజుల పాటు ఆయా రూట్లలో 42,090 కిలో మీటర్ల మేర బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా మెదక్ ఆర్టీసీ డిపో రూ. 2,69,580 ఆదాయం కోల్పోయినట్లు డీఎం సురేఖ తెలిపారు. -
స్మార్ట్ సిటీకి అడుగులు
ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాంతంసంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న స్మార్ట్ సిటీకి అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించి ఏడాది పూర్తి కావొస్తున్నా, అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ఆమోదించిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 3,200 ఎకరాలు.. రూ. 2,361 కోట్లు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్– నాగపూర్ పారిశ్రామిక అభివృద్ధి అమలులో భాగంగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. ఇందుకోసం సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,361 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటవుతున్న నిమ్జ్ (జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి) పరిధిలోని బర్దిపూర్, ఎల్గోయి, చిలపల్లి, చీలపల్లి తండా గ్రామాల శివారులో స్మార్ట్ సిటీ ఏర్పాటు కాబోతుంది. ఇందులో భాగంగా పారిశ్రామికవాడలో రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కోసం అభివృద్ధి చేయనున్నారు. కేటాయించిన భూములను ఇటీవల టీజీఐఐసీ ఎండీ శశాంక్తో పాటు కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు రూపకల్పన చేస్తున్నారు. కొనసాగుతున్న భూ సేకరణ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో వివిధ గ్రామాల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు గుర్తించారు. 12 వేల ఎకరాలకుపైగా భూములు స్వీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో బర్ధిపూర్, ఎల్గోయి, చీలపల్లి, చిలపల్లి తండా గ్రామాల్లో 3,600 ఎకరాల భూమిని సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ నిలిచిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 8,000 ఎకరాల వరకు భూమి సేకరణ పూర్తి కాగా, మిగితా భూమి సేకరణ కొనసాగుతోంది. నిమ్జ్ పరిసర గ్రామాల్లో ఏర్పాటు 3,200 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2,361 కోట్లు త్వరలో టెండర్ ప్రక్రియ, ప్రారంభం కానున్న పనులుమారనున్న రూపురేఖలు స్మార్ట్ సిటీ రాకతో జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాలతో పాటు సరిహద్దు కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్– ముంబై హై స్పీడ్–బుల్లెట్ రైలు వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే హుగ్గెల్లి నుంచి నిమ్జ్ ప్రాంతానికి రహదారి ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిశ్రమలు రావడంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. -
ఇక ఇసుక బజార్లు..
జిల్లాలో 10చోట్ల ఏర్పాటుకు చర్యలు ● అనుమతి ఇచ్చిన ‘టీజీఎండీసీ’ ● ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు పంపిణీనారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగడంతో పాటు నిర్మాణ దారులకు ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో 10 ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందులో మూడింటికి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆందోల్, నారాయణఖేడ్ మండలంలోని జకల్ శివారులో ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. మరో వారం పది రోజుల్లో కోహీర్ మండలంలోని కవేలి వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జహీరాబాద్ నియోకవర్గంలోని సింగీతం, జహీరాబాద్, ఝరాసంఘం మండలంలోని మాచ్నూర్, సంగారెడ్డి, సదాశివపేట్ మండలంలోని సిద్దాపూర్, పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్, జిన్నారం, ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలంలోని మునిగేపల్లి గ్రామాల్లో ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటి ద్వారా లబ్ధిదారులకు వారి వారి ఇళ్ల నిర్మాణాల స్టేజీలను బట్టి ఇసుకను అందించనున్నారు. అన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి ఇసుకను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఇసుక బజార్లకు నల్గొండ, సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా జరిగింది. ప్రస్తుతం టన్నుకు రూ. 1,200 చొప్పున అందజేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కామారెడ్డి జిల్లాలోని రీచ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడి నుంచి ఇసుక సరఫరా జరిగితే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. జోరుగా నిర్మాణాలు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 4 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో 14,538 ఇళ్లు మంజూరు కాగా, 4,291 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. 655 ఇళ్లు రూఫ్లెవల్, 183 ఆర్సీసీ స్టేజీలో ఉన్నాయి. వివిధ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు డబ్బులు జమ చేశారు. -
తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మిగిలిన సీట్లకు ఈనెల 15, 16వ తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మే రకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 94410 69020ను సంప్రదించవచ్చని తెలిపారు. సింగూరుకు 6,136క్యూసెక్కుల నీరుపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 6,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా..దిగువకు 2,329 క్యూసెక్కుల ఇన్ఫ్లో వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా రెండు టర్బయిన్లను ఆన్చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. లోక్ అదాలత్ను విజయవంతం చేయాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఐ పాఠంపై విద్యార్థుల ఆసక్తి: డీఈఓపటాన్చెరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలో కృత్తిమ మేథ(ఏఐ) బోధనపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాల తరగతిగదిలో పర్యటించి, అక్కడ ఉపాధ్యాయులు చెపుతున్న బోధన తీరును పరిశీలించారు. అనంతరం ఏఐ బోధన ద్వారా పాటలు వింటున్న విద్యార్థులను చూశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కంప్యూటర్ ఆధారిత బోధన ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షిజహీరాబాద్: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్–2 గా విశాలాక్షి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ కార్యాలయంలో జేడీగా పని చేసిన ఆమెను జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె జహీరాబాద్ ఇన్చార్జి ఆర్డీఓ డెవుజాతో సమావేశమయ్యారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలిచుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో శుక్రవారం సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘మతోన్మాదదాడులు–రాజ్యాంగం–లౌకికవాదం ఆవశ్యకత’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...సీతారాం ఏచూరి మృతి ప్రజలకు, పార్టీకి తీరని లోటన్నారు. -
మీడియాపై దాడి అప్రజాస్వామికం
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. నిరంకుశంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. కేసుల నమోదు అప్రజాస్వామికం జహీరాబాద్: పాత్రికేయులపై కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామికం. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. తపస్ ఉపాధ్యాయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. – దత్రాత్తి, తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు,జహీరాబాద్అది రాజ్యాంగం కల్పించిన హక్కు సంగారెడ్డి జోన్: ప్రజాస్వామ్యంలో వార్తలు రాసే హక్కు పాత్రికేయులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అణిచి వేయబడుతున్న వారికి మద్దతుగా నిలబడి, అన్యాయం చేస్తున్న వారి దౌర్జన్యాలను నిలదీస్తూ ప్రజలకు తెలియజేసే హక్కు పత్రికలకు ఉంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారు. – రాంచందర్ భీం వంశీ, ఉపాధ్యాయుడు,టీజేఏసీ చైర్మన్, జహీరాబాద్కేసులు పెట్టడం సరికాదు సంగారెడ్డి టౌన్: పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు మూలస్తంభాలు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉండే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. – మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్, న్యాయవాది ప్రశ్నించే గొంతు నొక్కడమే జీహరాబాద్: సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే వారిపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే అవుతుంది. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు విలేకరులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే. – తులసీరాం రాథోడ్, టీబేస్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్ -
కేంద్రం వల్లే యూరియా కొరత
రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ విధానాలే యూరియా కొరతకు కారణమని, రైతులకు కావలసిన యూరియాను వెంటనే అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా, ఎరువులను సరఫరా చేయలేదని విమర్శించారు. రసాయన ఎరువులపై సబ్సిడీని కేంద్రం క్రమంగా కోత పెడుతూ నానో యూరియాను బలవంతంగా మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సకాలంలో ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యూరియా కొరతను తీర్చాలని కోరారు. -
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: ఇటీవల కూలిపోయిన లింగపల్లి గురుకుల హాస్టల్ భవనం స్లాబ్ శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ స్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను కలెక్టర్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల కోసం తాత్కాలికంగా రేకుల షెడ్డును పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నూతన భవనం నిర్మించడానికి స్థలాన్ని త్వరితగతిన గుర్తించాలని, లేదంటే కూలిపోయిన భవనం స్థానంలోనే నిర్మించాలంటే శిథిలాలను తొలగించి స్థలం చదను చేయాలని సూచించారు. నూతన భవన నిర్మాణానికి, ఫర్నీచర్, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను త్వరగా తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు, ఎంపీడీఓ హరినంధ్రావు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ భవనంలో శిక్షణ జహీరాబాద్: యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా హోటల్ మేనేజ్మెంట్ భవనంలో త్వరలో ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కోహీర్ మండలంలోని కవేలి గ్రామ శివారులోని నిరుపయోగంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ భవనాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వారంలోగా ఈ భవనాన్ని శుభ్రం చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లూరులోని డ బుల్బెడ్ రూమ్ ఇళ్లను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నీతమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా ఉపాధికల్పనాధికారి అనిల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జరామ్, జహీరాబాద్ ఆర్డీఓ డెవుజా, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య -
సేవాభావంతో మెలగాలి
ఎంపీ రఘునందన్రావు జిన్నారం(పటాన్చెరు): ప్రతీ కార్యకర్త ప్రజలతో సేవాభావంతో మెలగాలని ఎంపీ రఘునందన్రావు సూచించారు. జిన్నారం పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాకార్యక్రమాలను నిర్వహించాల ని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు పరిష్కరించేలా ముందుకు వెళ్లాల ని చెప్పారు. ఈ నెల 17న ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో ప్రతీ కార్యకర్త పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దోమడుగు రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చేపా..చేపా ఎప్పుడొస్తావు!
చేప పిల్లల పంపిణీలో ఈసారి మరింత ఆలస్యం! ● టెండర్లకు ముందుకురాని కాంట్రాక్టర్లు ● త్వరలోనే పంపిణీ చేస్తామంటున్నఅధికారులు వట్పల్లి(అందోల్): మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం అమలు ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జూలై మూడో వారంలోనే చేపట్టాల్సిన చేప పిల్లల పంపిణీ సెప్టెంబర్ వచ్చేసినా ఈ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135 నీటి వనరులు ఉండగా మూడు రిజర్వాయర్లు, 79 పెద్ద చెరువులు, 1,059 చిన్న చెరువులున్నాయి. 234 మత్య్స సహకార సంఘాలు ఉండగా వీటిలో 12,889 మంది సభ్యులున్నారు. ఈ ఏడాది 3.50 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకోగా 68,31,132 చేప పిల్లలను వదిలినట్లు అధికారులు చెబుతున్నారు. బిడ్లు దాఖలుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ప్రభుత్వం జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలకు సంబంధించి గత నెల ఆగస్టు 18 నుంచి 30 వరక్లు టెండర్లను పిలువగా ఒక్కరూ కూడా టెండర్ వేయడానికి రాలేదు. ఇందుకు గతంలో ప్రభుత్వానికి సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి బిల్లులను చెల్లించకపోవడం వంటివి కారణాలుగా తెలుస్తోంది. దీంతో మరోసారి బిడ్లు వేయడానికి ఈనెల (సెప్టెంబర్) 12 వరకు బిడ్లు వేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా శుక్రవారం బాక్స్లను ఓపెన్ చేయగా ఒక్కరు మాత్రమే టెండర్ దాఖలు చేశారు. సాధారణంగా రాజమండ్రి, కై కలూరు ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఈ ప్రాంతంలో చాలాకాలంగా టెండర్లలో పాల్గొంటున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమవుతుండటంతో మత్స్యకారులు సొంత ఖర్చులతో ప్రైవేట్గా కొనుగోలు చేసి చెరువులలో వదులుకుంటున్నారు. ప్రభుత్వం పంపిణీచేసే చేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో చెరువుల్లో నీరు తగ్గే సమయానికి చేప అరకిలో వరకు బరువు పెరగడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఉచిత చేప పిల్లల కోసం ఎదురు చూడకుండా సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చి వదులుతున్నామంటున్నారు. ఇటీవల అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లిలో మత్య్సకారులు సుమారుగా రూ.3లక్షలు వెచ్చించి ప్రైవేట్గా కొనుగోలు చేసి చెరువులలో వదిలారు. పెరుగుదలపై ప్రభావం చెరువుల్లో రెండు పరిమాణాల్లో చేప పిల్లలను వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45రోజుల వయసున్న 35–40 మి.మీ. పొడవున్న వాటిని, ఏడాది మొత్తం నీరు నిల్వ ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75 రోజుల వయసున్న 80–100 మి.మీ. పొడవున్న వాటిని వదులుతారు. నీటిలో వదిలిన తర్వాత కిలో పరిమాణానికి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. జూన్, జూలై నెలల్లో వదిలితే డిసెంబరు నుంచి రెండు, మూడు నెలలపాటు చేపలను పట్టి విక్రయించుకునే అవకాశముంటుంది. దీంతో మత్స్యకారులు చేపల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో! జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసేందుకు బిడ్లు ఆహ్వానించినా ఎవరూ రాకపోవడంతో రెండుసార్లు గడవు పొడిగించాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నాం. మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. నాణ్యమైన చేప పిల్లలు చెరువుల్లో వదులుతాం. – మధుసూదన్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
బాలికలకు చదువే భరోసా
● మంత్రి దామోదర రాజనర్సింహ ● ఆస్పత్రులకు వెళితే ఆర్థిక భారంపడకూడదన్నదే లక్ష్యం ● 126 మంది ఉపాధ్యాయులకు సన్మానంవట్పల్లి (అందోల్): తాను గతంలో విద్యాశాఖ మంత్రిగా ఎనిమిదేళ్లు పనిచేశానని, ఇప్పటికీ ఆ శాఖ అంటే చాలా ఇష్టమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోలు మండలం అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గురువు ఉన్న ప్రదేశంలో అక్కడి సమాజ ప్రవర్తన తెలుస్తుందని చెప్పారు. ఆస్పత్రికి వెళితే ప్రజలకు ఆర్థికభారం కలగకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం రెండు శాఖలు ముఖ్యమైనవేనని అందోల్ నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలు, మండలానికొక మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సమాజానికి బాలికల చదువు చాలా ముఖ్యమని, అమ్మాయిలు చదివితేనే కుటుంబానికి సంపూర్ణ భరోసా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో బాలికల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజనర్సింహ అంటే గుర్తింపు రావడం అందోల్ నుంచే లభించిందన్నారు. అందుకే ఈ ప్రాంతానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పీఆర్టీయు అధ్యక్షుడు ఎ. మాణయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, ఆర్డీఓ పాండు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు
● ఆర్థిక శాఖ ఆమోదం ● పోస్టింగ్ల కోసం 27 మందివిలీన కార్యదర్శుల ఎదురు చూపులు ● మిగతా సిబ్బందికి ఇప్పటికే సర్దుబాటుసంగారెడ్డి జోన్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసిన నేపథ్యంలో నాటి నుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖలో వేతనం పొందుతూ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ఏర్పడిన మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 165 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జిల్లాకు 27 పోస్టులు ఉన్నాయి. పోస్టులు మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం జిల్లాలో నాలుగు విడతల ద్వారా 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. మొదటి, రెండవ విడతలలో విలీనం ఆయన కార్యదర్శులను మున్సిపల్ శాఖలోకి మార్చేందుకు కొత్తగా జిల్లాకు 27 పోస్టులను ఆర్ధిక శాఖ మంజూరు చేసింది. పోస్టులు మంజూరు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవటంతో పోస్టింగుల కోసం ఎదురుచూపులు తప్పలేదు. మూడు, నాలుగు విడతలలో విలీనమైన అధికారులకు పోస్టుల మంజూరు ఎప్పుడు చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరంతా మున్సిపల్ లోనే తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక పోస్టులతో విధుల నిర్వహణ జిల్లాలో విలీన పంచాయతీ కార్యదర్శులు 45తోపాటు మల్టీపర్పస్ వర్కర్లు కూడా ఉంటారు. విలీనం అయిన నాటి నుంచి మున్సిపాలిటీలలో వారి గ్రేడ్ల ఆధారంగా రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్, వార్డ్ అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్గా వివిధ స్థాయిలలో తాత్కాలిక పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని పంచాయతీరాజ్ శాఖలోని కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది విలీన కార్యదర్శులు మున్సిపల్ శాఖలోని విధులు నిర్వహిస్తామంటూ కోర్టును ఆశ్రయించారు. విలీన కార్యదర్శులకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్ శాఖకు మార్చే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. -
వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలి
యువశాస్త్రవేత్తలకు అవగాహన కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్లాల్ చిలప్చెడ్(నర్సాపూర్): వ్యవసాయాభివృద్ధికి యువశాస్త్రవేత్తలు కృషి చేయాలని ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్లాల్ తెలిపారు. మండలంలోని శిలాంపల్లిలో కౌడిపల్లి మండలం తునికి కేవీకే, ఐసీఏఆర్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నామ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శుక్రవారం 115వ వ్యవసాయ పరిశోధన శిక్షణ కార్యక్రమంలో భాగంగా 22రాష్ట్రాలకు చెందిన 107మంది యువశాస్త్రవేత్తలకు వ్యవసాయంపై అవగాహన, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాల్లాల్ మాట్లాడుతూ...వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు యువశాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు క్షేత్రపర్యటన నిర్వహించి రైతులతో మాట్లాడారు. సాగు పెట్టుబడులు, నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, మార్కెటింగ్ గురించి వివరించారు. అనంతరం గ్రామం చిత్రపటాన్నివేసి యువశాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే విభాగాధిపతి డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రతాప్రెడ్డి, ఐసీఏఆర్ ప్రతినిధులు డాక్టర్ దామోదర్రెడ్డి, డాక్టర్ వెంకట్కుమార్, డాక్టర్ వెంకటేశన్, రైతులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
యువకుడు ... పటాన్చెరుటౌన్: యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం తన అన్న విట్టల్ వాట్సాప్కు ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టాడు‘. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తమ్ముడి అదృశ్యంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ... నర్సాపూర్ రూరల్: గిరిజన మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని తుజల్పూర్ పంచాయతీ పరిధిలోని అర్జున్ తండాలో జరిగింది. ఎస్సై జగన్నాథం కథనం ప్రకారం.. తండాకు చెందిన కొర్ర పవన్ భార్య మౌనిక (20). గురువారం మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడంతో పాటు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడు ... తూప్రాన్: మతి స్థిమితం సరిగాలేని బాలుడు అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన ఘనపూర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్కు చెందిన మనోజ్ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ఘనపూర్ సమీపంలోని ఓ సీడ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడు సందీప్కుమార్(16)కు చిన్నప్పటి నుంచి మతి స్థితిమితం సరిగా లేదు. హైదరాబాద్లో వైద్యం చేయించేందుకు బిహార్ నుంచి ఇటీవల తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న సందీప్కుమార్ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేనేత హస్తకళ ప్రదర్శన
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో చేనేత హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, జైపూర్ స్టోన్స్, ఉడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఒడిశా పెయింటింగ్ తదితర ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. చేగుంట(తూప్రాన్): మండలంలోని కరీంనగర్ అటవీ ప్రాంతంలో మేకలతో పాటు కాపరి రాజుపై చిరుత దాడి చేసిన స్థలాన్ని ఫారెస్టు అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి చిరుత దాడి చేసిన ప్రదేశానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజు ఇంటికి వెళ్లి పరిశీలించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దన్నారు. ఒకవేళ చిరుత ఆనవాలు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో సెక్షన్ ఆఫీసర్ కిరణ్కుమార్, బీట్ ఆఫీసర్ రవికిరణ్తో పాటు గ్రామస్తులు ఉన్నారు. పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పోచారానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళకు పురటి నొప్పులు రా వడంతో 108 వాహ నంలో తరలిస్తున్నా రు. మార్గమధ్యలోకి రాగానే నొప్పులు అధికం కావడంతో సిబ్బంది ప్రసవం చేశారు. దీంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధరిపల్లిలో అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ నారాయణగౌడ్ తెలిపారు. ధరిపల్లి శివారులోని వాగునుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచరం మేరకు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్చేసీ కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దుబ్బాకరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ హరీశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పుసుకూరి సతీశ్ పలు గ్రామాల్లో ప్రతి ఇల్లు తిరిగి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. వాటిని ఎక్కువ ధరకు కోళ్ల ఫారాలకు ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ట్రాక్టర్ను గ్రామ శివారులో పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిరుదొడ్డి ఎంఎల్సీ పాయింట్కు, ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కార్లు అద్దెకు తీసుకుని..
సిద్దిపేటకమాన్: కార్లు కిరాయికి తీసుకుని విక్రయిస్తున్న ముఠాలో ఒక సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన సమీర్ తన వద్ద రంగారెడ్డి జిల్లా చర్లపటేల్ గూడకు చెందిన పట్నం నరేశ్ కారును అద్దెకు తీసుకెళ్లి తిరిగి ఇవ్వడం లేదని ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నరేశ్, చిన్నకోడూరుకు చెందిన మిద్దెల మహేశ్, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాతృ, నల్గొండ జిల్లాకు చెందిన సంతోష్ ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా కార్లను అద్దెకు తీసుకుని, తాకట్టు పెట్టడం, కొన్నింటిని విక్రయించి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఆరు నెలలుగా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో 17 కార్లు కిరాయికి తీసుకుని విక్రయించారు. నిందితుడు నరేశ్ను రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. విక్రయిస్తున్న ముఠాలో ఒకరి అరెస్టు ఆరు కార్లు స్వాధీనం.. -
నిమ్జ్ భూబాధితులకు బాసట
జహీరాబాద్ టౌన్: ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత రైతులకు మేలు చేసే 2013 భూసేకరణ చట్టాన్ని ప్రఽభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆరోపించారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం చట్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములను తీసుకోవడానికి నిరసిస్తూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రామిక్ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం నిమ్జ్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సమగ్ర భూచట్టాలను అమలు చేస్తేౖ రైతులకు పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వాలు స్వార్థప్రయోజనాల కోసం భూసేకరణ చట్టానిక తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. భూముల ధరలను సవరించకుండా ఏకపక్షంగా నిమ్జ్ భూసేకరణకు ఎందుకు నోటిఫికేషన్లు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఽరెండు పంటలు పండే సారవంతమైన భూములకు 15 లక్షల పరిహారం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.50 లక్షలు పలుకుతుంటే రూ.15 లక్షలు ఎలా ఇస్తారన్నారు. చట్ట ప్రకారం భూమిలేని కూలీలకు పునరావాసం కూడా ఇవ్వడంలేదన్నారు. రైతుల భూముల్లో పనులు చేపడుతూ చట్టాన్ని ఉల్లఘిస్తున్నారని ఆరోపించారు. పరహారం పెంచాలని, ఎకరానికి 120 గజాల ప్లాటు, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్, నాయకులు సుకుమార్, నర్సింలు, శంకర్, సీఐటీయూ నాయకులు మహిపాల్, నిమ్జ్ భూబాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ -
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్
మహిళ కడుపులోంచి 3.2 కిలోల గడ్డ తొలగింపు దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. మండలంలోని హబ్షీపూర్ గ్రామానికి చెందిన శోభ(43) కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి రాగా వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి కడపులో పెద్ద గడ్డ ఉందని నిర్ధారించారు. శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి శోభ కడపులోంచి 3.2 కిలోల పెద్ద పైబ్రాయిడ్ గడ్డను తొలగించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని బాధిత కుటుంబీకులు అభినందించారు. -
నా భర్త ఆచూకీ కనిపెట్టండి
మంత్రి పొన్నంకు జవాన్ భార్య విన్నపంఅక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని ఐనపూర్ గ్రామానికి చెందిన తోట అనీల్ (ఆర్మీ జవాన్) ఆచూకీని కనిపెట్టాలని భార్య అనూష మంత్రి పొన్నం ప్రభాకర్ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీన ఇంటి నుంచి పంజాబ్లో విధి నిర్వహణకు వెళ్లాడని, మరుసటి రోజునుంచి సెల్ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందన్నారు. నెలరోజులుగా భర్త ఆచూకీ కోసం వెతికినా సరైన సమాధానం రాలేదని అనూష కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి కమాండర్ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె అమ్మగారి ఇల్లు చౌటపల్లి గ్రామం కావడంతో మంత్రి మల్లంపల్లి–చౌటపల్లి గ్రామాల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకుని వచ్చారు. పూర్తి వివరాలతో కూడిన ఒక లెటర్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేస్తే పంజాబ్లోని ఆర్మీ కమాండర్తో మాట్లాడి వివరాలను తెలియజేస్తామని మంత్రి భరోసా కల్పించారు. -
నీవు లేని లోకంలో ఉండలేను..
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య● భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య ● అనాథలైన పిల్లలుసిద్దిపేటరూరల్: అనారోగ్యంతో భర్త మృతిచెందగా, ఒకరోజు గడవక ముందే భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్అలీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు మహేందర్(40)కు చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్కు చెందిన కావ్యతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం మహేందర్ అనారోగ్యానికి గురి కాగా, సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య కావ్య గంటల వ్యవధిలోనే ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించగా, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కావ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బావిలో దూకి యువకుడి ఆత్మహత్యపెద్దశంకరంపేట(మెదక్): జైలు నుంచి వచ్చిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముసాపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బైకాని దేవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో చిన్నవాడైన బైకాని గంగమేశ్వర్కు కొన్నేళ్ల క్రితం టేక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లికి చెందిన మానసతో వివాహం జరిగింది. గంగమేశ్వర్ అత్తగారింటికి ఇల్లరికం వెళ్లాడు. మూడు నెలల క్రింతం కుటుంబ కలహాల నేపథ్యంలో మానస ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గంగమేశ్వర్పై కేసు నమోదు కాగా జైలుకు కెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చాడు. శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగాఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు వెతుకుతుండగా గ్రామశివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోల్కంపల్లి సంజీవులు(39) కూలీ పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం మండలంలోని ఆత్మకూర్ శివారులోని రావుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చేగుంట(తూప్రాన్): చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పోలంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి లక్ష్మి (42)కి పంచాయతీ కార్యదర్శి స్రవంతితో ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవపై గ్రామస్తులు గురువారం గ్రామ పంచాయతీ వద్ద మాట్లాడారు. అయితే ఆ తర్వాతి రోజే లక్ష్మి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శితో జరిగిన గొడవపై మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రవీంద్రనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవీంద్రనగర్ గ్రామానికి చెందిన నాలగం కనకయ్య(40) బీడీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం పని ఉండడంతో తన ఇంటిపైకి వెళ్లాడు. బిల్డింగ్పైన ఉన్న డిష్ వైర్ను సరిచేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుకునూర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కూటమి నిరంకుశత్వాన్ని ఖండిద్దాం
రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ‘సాక్షి’పత్రిక విషయంలో వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఏపీ పాలకుల ప్రోద్బలంతో అక్కడి పోలీసులు ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా అక్కడి పోలీసులు తీరును తప్పుబడుతున్నాయి. ఏపీలో జరుగుతున్న దమననీతిని ప్రతీఒక్కరు ఖండించాల్సిందేనంటున్నారు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డి, విలేకరులకు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సంఘీభావాన్ని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఏపీలో నియంతృత్వ పాలన పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలోని కూటమి సర్కారు నియంతృత్వ పాలన సాగిస్తోంది. తమను విమర్శించే వార్తలు ప్రచురితమైతే వివరణ ఇవ్వాలే కానీ, పాలకుల ప్రోద్బలంతో పత్రికలపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదు. పత్రికల విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. – మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి. మెదక్పత్రికా స్వేచ్ఛను హరించడమే ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఏపీలో జరుగుతున్న దమన నీతిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, ఈ పత్రికా రిపోర్టర్లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – బండారు యాదగిరి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడుహక్కులను కాలరాయడమే ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమే. ‘సాక్షి’ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతు నొక్కడమే. – అక్కపల్లి యోగానందరెడ్డి,జిల్లా అధ్యక్షుడు, టెంజు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిత్యం ప్రతికలు వెలుగులోకి తెస్తాయి. పత్రికల్లో వచ్చే రాజకీయ విమర్శల వార్తల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు రాజ్యంగబద్ధంగా వ్యవహరించాలి. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం మాత్రమే ముందుకెళ్లాలి. – చిన్నమైల్ గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గొంతు నొక్కే ప్రయత్నమే పత్రికలపై కేసులు పెట్టడం..ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా వ్యవహరించడం ఏ ప్రభుత్వాలకు మంచిదికాదు. నేతలు మాట్లాడిన మాటలు ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై కేసులు పెట్టడం అంటే కక్షసాధింపే అవుతుంది. నిత్యం ప్రజాసమస్యలను వెలికి తీసే పత్రికల గొంతునొక్కడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. – నిర్మలారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కక్ష సాధింపు సరికాదు పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, అక్కడి విలేకరులపై కేసులు పెట్టడం అంటే ఆ ప్రభుత్వం అభద్రతాభావంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పత్రికల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యాన్ని హరించడం, దాడి చేయడమే అవుతుంది. – చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే -
భూములు గుర్తించి ఫెన్సింగ్ వేయాలి
ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్ పరిసరాల్లో స్మార్ట్ సిటీఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. టీజీఐఐసీ ఎండీ శశాంక్, కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ..స్థానిక అధికారులు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. త్వరలో అభివృద్ధి పనులకు టెండర్ వేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,300 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అనంతరం నిమ్జ్ ప్రాంతాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.స్మార్ట్ సిటీ భూముల పరిశీలనలో టీజీఐఐసీ ఎండీ -
పంట నష్టం అపారం
● ఆందోళనలో రైతులు ● నివేదిక తయారుచేసిన అధికారులుజహీరాబాద్ టౌన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నారింజ వాగు పరీవాహక ప్రాంతాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండలాలు మండలాల్లో వేసిన పెసర, మినుము,పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెసర, మినుము, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక పత్తి చేలలోనీళ్లు నిలిచి కాయలనుంచి పత్తి బయటకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే రైతుల పట్టపాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను అధికారులు సేకరించారు.జాగ్రత్తలు తీసుకోవాలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నారింజ వాగు ప్రాంతంలో పంట నష్టం అధికంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలలో నీరు నిలువ ఉండటం వల్ల చీడపీడల బెడద కూడా పెరగకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలి. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ప్రభుత్వం ఆదుకోవాలి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాం. కోత దశలో ఉన్న పెసర, మినుము పూర్తిగా దెబ్బతింది. పత్తి పంట కూడా రంగు మారుతోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. – శ్రీనివాస్, రైతు కంబాలపల్లి -
కుమ్మేసిన వాన
మెదక్లో అత్యధికంగా17 సెం.మీ వర్షపాతం ● కొల్చారంలో 8 సెం.మీ నమోదు ● లోతట్టు ప్రాంతాలు జలమయంమెదక్జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. -
మొక్కనాటు.. ఫొటో పెట్టు
న్యాల్కల్ (జహీరాబాద్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపకంపై దృష్టిని సారించాయి. హరితహారం, వనమహోత్సవం లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా, ఏక్ పేడ్ మా కే నామ్ 2.0 పేరుతో తల్లి పేరిట ప్రతీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 1,709 మొక్కలను విద్యార్థులు నాటగా వాటి ఫొటోలను ఉపాధ్యాయులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఉపాధ్యాయులకు అవగాహన జిల్లాలో 864 ప్రాథమిక, 187ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్ స్కూళ్లు ఉండగా, 109 గురుకుల, సాంఘిక సంక్షేమ తదితర ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటితోపాటు సుమారు 500 వరకు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 3.40లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’కార్యక్రమంలో భాగంగా ప్రతీ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తమ తల్లి పేరిట మొక్కలు నాటి వాటి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్లో వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశాలపై ఎంఈఓలు, శిక్షణ పొందిన ఆర్పీలు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. వివరాలు నమోదు ఇలా..https://ecoclubs.education.gov.in పోర్టల్లోకి వెళ్లి విద్యార్థి పేరు, తరగతి, తల్లిదండ్రుల పేర్లు, చదువుతున్న పాఠశాల వివరాలను నమోదు చేయాలి. పాఠశాల ఆవరణలో తల్లితో కలిసి మొక్కలు నాటిన ఫొటోను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థి తల్లితో కలసి నాటిన ఫొటోతో సర్టిఫికెట్ వస్తుంది. సరఫరా చేస్తున్న ఉపాధి పథకం సిబ్బంది అన్ని పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. అవసరమైన మొక్కలను ఉపాధి పథకం సిబ్బంది సరఫరా చేస్తుండగా అవి సరిపోకపోతే ఎక్కడైనా కొనుగోలు చేసి మరీ మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. జూలైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలో 1,900లకు పైగా పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 164 పాఠశాలల్లో 1,709 మొక్కలు నాటినట్లు సమాచారం. అయితే చాలా పాఠశాలల్లో మొక్కలు నాటినప్పటికీ పోర్టల్లో నమోదు చేయలేదని అధికారులు చెబుతున్నారు. మంచి కార్యక్రమం స్కూల్ ఆవరణలో తల్లి పేరిట మొక్కలు నాటడం చాలా మంచి కార్యక్రమం. బిడ్డతో కలసి మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ చెట్ల వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించనుంది. – శకుంతల, విద్యార్థి తల్లి, కల్బెమల్ నెలాఖరుకు పూర్తి చేయాలి విద్యార్థులు తమ తల్లితో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. – వెంకటేశ్వర్లు, డీఈఓపాఠశాలల్లో పచ్చని ఆహ్లాదం -
పేషీల ప్రక్షాళన
● సదరు అధికారి పనిచేసే మండలానికి పంపిన అధికారులు ● ఇప్పటికే తన పేషీలోని సీసీలనుమార్చిన కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో ఏళ్లుగా పాతుకుపోయి పెద్ద పెద్ద వ్యవహారాలను సైతం నడిపే క్యాంపు క్లర్క్ (సీసీ)లపై కలెక్టర్ ప్రావీణ్య దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎక్కువకాలం ఒకే చోట పనిచేయడం వల్ల అవినీతి వ్యవహారాల్లో ఆరితేరిన కొంతమందిని నెమ్మదిగా కలెక్టరేట్ నుంచి పంపించే యోచన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పేషీల్లో ప్రక్షాళన చేపట్టిన కలెక్టర్ తాజాగా మరో ఉన్నతాధికారి వద్ద పనిచేసే సీసీపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కలెక్టరేట్లో ఆయా ఉన్న తాధికారుల పేషీల ప్రక్షాళన కొనసాగుతోంది. ఇప్పటికే తన పేషీలో పాతుకుపోయిన సీసీ (క్యాంపు క్లర్క్)లను మార్చి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కలెక్టర్ ప్రావీణ్య.. తాజాగా మరో కీలక ఉన్నతాధికారి వద్ద పాతుకుపోయిన మరో సీసీని మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అతన్ని ఆయన పనిచేయాల్సిన మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సదరు సీసీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో కలెక్టరేట్కు వచ్చే బడాబాబులకు వ్యవహారాల ను చక్కబెట్టడంలో సదరు సీసీ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్రావీణ్య తక్షణం అతడి పోస్టు ఉన్న మండలానికి పంపారు. జిల్లా కలెక్టర్గా మూడు నెలలక్రితం బాధ్యతలు తీసుకున్న ప్రావీణ్య కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేరుకే క్లర్కులు.. నడిపేది పెద్ద వ్యవహారాలు పేరుకు క్లర్కులైనా పెద్ద పెద్ద వ్యవహారాల్లో వీరి పాత్ర చాలా కీలకంగా మారింది. సదరు అధికారి వద్దకు ఏ ఫైలు త్వరగా వెళ్లాలన్నా వీరు చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలున్నాయి. బడాబాబుల భూముల వ్యవహారాలు, ప్రజాప్రతినిధుల పైరవీలతో వచ్చే వారికి సంబంధించిన ఫైళ్లు ఉన్నతాధికారుల ముందుకు తీసుకెళ్లి పనులు పూర్తి చేయడంలో వీరు ఆరితేరి పోయారు. ఒకరిద్దరి పనితీరు అయితే సీసీని కలిస్తే సరిపోతుంది..పని అయిపోయినట్లే..అనే స్థాయికి ఎదిగారంటే వీరు ఏ స్థాయిలో వ్యవహారాలు నడిపారనేది అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులను కలిసి తమ గోడును వెళ్ల బోసుకుందామని వచ్చే సామాన్యులను లోనికి అనుమతించని ఈ సీసీలు పైరవీకారులను, బడాబాబులను, రాజకీయ పలుకుబడి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తారనేది బహిరంగ రహస్యం. మరోవైపు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాలనాపరమైన విషయాలను చర్చించేందుకు, ఫైళ్లకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు కలెక్టర్ వద్దకు వస్తుంటారు. ఇలాంటి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ సీసీలకు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని శాఖలకు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు జిల్లా బాస్లుగా ఉంటారు. ఈ స్థాయి అధికారులు ఈ క్లర్కుల వద్దకు వచ్చి వినయం ప్రదర్శించాల్సిన పరిస్థితిలో వ్యవహారాలు నడిపారు. ఏళ్లుగా పాతుకు పోయి.. జిల్లాలో కొందరు కీలక ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్న క్యాంపు క్లర్కులు పాతుకు పోయా రు. జిల్లాకు ఏ అధికారి బదిలీపై వచ్చినా వారే సీసీలుగా కొనసాగుతుండటం పరిపాటైపోయింది. గతంలో ఓ కలెక్టర్ వద్ద పనిచేసిన ఓ సీసీ..సదరు అధికారి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిపోతే..ఆయనతో పాటే సీసీని కూడా తాను పనిచేసే జిల్లాకు తీసుకెళ్లిన ఘటనలున్నాయంటే వీరి వ్యవహారాలు ఏ స్థాయిలో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. ఒకరిద్దరు సీసీలైతే గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన కీలక అధికారి సంతకాలను పాత తేదీల్లో పెట్టించుకువచ్చిన ఘనులు కూడా ఉన్నారు. ఇలా క్లర్కులుగా పనిచేసిన వీరిలో కొందరు కోట్లకు పడగలెత్తారు. కీలక ఉన్నతాధికారుల స్థిరాస్తులకు బినామీలుగా ఉన్న సీసీలు కూడా ఉన్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా ఏళ్లుగా పాతుకు పోయి..తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీలను ఒక్కొక్కరిగా పంపించివేస్తుండటం కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆక్రమిస్తే అంతే సంగతులు
రామాయంపేట(మెదక్): అటవీ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణదారులపై ఆ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇందులోభాగంగా ఆక్రమణదారులపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు చేసి సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారు. ఆనుకున్న భూమిని ఆక్రమించుకుని.. జిల్లా పరిధిలో 57 వేల హెక్టార్లకు పైగా అటవీభూమి ఉంది. గతంలో కొన్ని గిరిజన తండాల్లో ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్న వారికి ప్రభుత్వం అటవీ హక్కుల పట్టాలిచ్చింది. ఇలా పట్టాలు పొందినవారితోపాటు మారుమూల గ్రామాల్లో కొందరు తమ భూములను ఆనుకుని ఉన్న అటవీ భూమిని నెమ్మదిగా ఆక్రమించేసుకుంటున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి ఏటా కొంతమేర కబ్జాకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ అధికారులు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటుగా సదరు భూముల్లో దున్నకాలు చేపట్టిన ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన భూమిలో మొక్కలు నాటుతున్న అధికారులు కాగా ఆక్రమణదారులనుంచి తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న భూముల్లో అధికారులు ఇప్పటివరకు 40 వేల మొక్కలు నాటారు. మరో 60 వేల మొక్కలు నాటుతామని చెబుతున్నారు. జిల్లా పరిధిలో సుమారుగా ఆరు వేల ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన అటవీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గత జూలైలో రామాయంపేట మండలం బాపనయ్య తండాలో ఐదెకరాలమేర అటవీ భూమి కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు. గతేడాది హవేళీఘనపూర్ మండల పరిధి తండాల్లో ఆక్రమణకు గురైన భూములను విడిపించే క్రమంలో గిరిజనులకు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఆక్రమిస్తే కఠిన చర్యలే అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని మండలాల్లో కేసులు నమోదు చేశాం. స్వాధీనం చేసుకున్న భూముల్లో 40 వేల మొక్కలు నాటాం. – జోజి, జిల్లా అటవీ అధికారి అటవీ భూమి పరిరక్షణపై దృష్టిసారించిన అధికారులు ఆక్రమణదారుల చేతుల్లో ఆరువేల ఎకరాల అటవీ భూములు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్న వైనం -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ ● బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు ● క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభం నర్సాపూర్ రూరల్: తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. బుధవారం అర్ధరాత్రి ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ జరగడం కలకలం రేగింది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ ప్రాంతానికి చెందిన నీరుడి స్వరూప, ఎడ్ల పోచయ్య, రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలు ధ్వంసం చేసి బంగారం, వెండి, నగదు తీసుకెళ్లారు. అయితే నీరుడి స్వరూప ఇంటికి తాళం వేసి గ్రామంలోనే ఉన్న తన కూతురు ఇంట్లో నిద్రించింది. ఆమె ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 20 వెండి గొలుసులు, రూ.60 వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఎడ్ల పోచయ్య కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లగా దొంగలు తాళం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న 8 తులాల వెండి, రూ 16వేల నగదు దోచుకెళ్లారు. అదే విధంగా రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు ధ్వంసం చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు నారాయణపూర్లో తాళాలు వేసిన ఉన్న ఐదు ఇళ్లల్లో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్ఐ లింగం, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్లు క్లూస్ టీంతో దొంగతనం జరిగిన ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్
పటాన్చెరు టౌన్: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. క్రైమ్ సీఐ రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన రంగారావు గత నెల 26న మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న బంగారు చైన్ అపహరించారు. దీంతో బాధితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఇస్నాపూర్ చౌరస్తాలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మొయినా బాద్ అజిత్నగర్కు చెందిన మహమ్మద్ అబ్బాస్, మాదాపూర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షాన్వాస్ అదుపులోకి తీసుకొని విచారించారు. ఇస్నాపూర్లో చైన్ స్నాచింగ్ తామే చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరిపై పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారి నుంచి 1.3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, బైకు, ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసి వారిని రిమాండ్కి తరలించారు. -
ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల ఇసుక
ఖేడ్లో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతోపాటు 8 ట్రాక్టర్ల ఇసుకను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని మార్కెట్ యార్డు ప్రక్కన గురువారం ఇసుక బజార్ను సబ్కలెక్టర్ ఉమాహారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఇసుక పంపిణీని ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ తహసీల్ గ్రౌండ్లో 69వ స్కూల్గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ అధికారులను సంప్రదించి ఇసుకను పొందవచ్చన్నారు. చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు కూడా ముఖ్యమని తమకు నచ్చిన ఆటల్లో నైపుణ్యాలను అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు, డీఈ తివారీ, ఏఈ వంశీ, తహసీల్దారు హసీనాబేగం, క్రీడల జిల్లా ఇన్చార్జీ శ్రీనివాస్, జిల్లాలోని పీడీలు, పీఈటీలు, నాయకులు వినోద్పాటిల్, రమేశ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
దాతృత్వాన్ని చాటుకున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటి చూపు కోల్పోయి అంధుడిగా మారిన సంపూరన్ నాయక్ అనే విద్యార్థికి కంటి చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కందిలో స్థిరపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిసాన్పవార్, శాంతాబాయిల కుమారుడు సంపూరన్ నాయక్కు ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడటంతో కోమాలోకి వెళ్లిపోయాడు. తిరిగి కోలుకున్నప్పటికీ.. కంటి చూపు పోయింది. నాయక్ కోసం ఇప్పటికే రూ.ఐదు లక్షల వరకు ఆ పేద కుటుంబం ఖర్చు చేసింది. చూపు రావాలంటే రెండు ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. పది లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని వెచ్చించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం జగ్గారెడ్డిని ఆశ్రయించగా వెంటనే రూ.పది లక్షల నగదును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి చోరీలు
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్అక్కన్నపేట(హుస్నాబాద్): పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఎస్ఐ ప్రశాంత్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. హుజుర్నగర్లోని శ్రీనగర్కాలనీకి చెందిన దంపతులు మామిడి గోపి, నాగమణి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దంపతులు జాదవ్ గణేశ్, శిరీష కలిసి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాల్లో పలు రకాల దొంగతనాలు చేసి 25 కేసుల్లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించారు. చోరీ చేసిన సొత్తును స్టేషన్ఘన్పూర్, జనగామ జిల్లాలోని స్క్రాప్షాప్ నిర్వాహకురాలికి విక్రయించారు. వీరి వద్ద నుంచి రెండు గుడి గంటలు, బంగారు ముక్కుపుడక, వెండి అమ్మవారి పట్టీలు, రూ. 4 వేలతో పాటు వారు ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనంతరం వీరిని రిమాండ్కు తరలించారు. వీరిని మండలంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించగా, పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఉదయం గ్రామాల్లో చెత్త ఏరుకుంటూ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో చూసి, రాత్రి అయిందంటే చాలు గుడి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతో పాటు హుండీలను పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్తారు. అలాగే విలువైన వస్తువు లను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. -
కల్యాణం వరకు పనులు పూర్తి
మల్లన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం నాటికి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఈవో టంకశాల వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆలయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేశారు. దాతల సహకారంతో నిర్మించబోయే 100 వసతి గదులకు సంబంధించి ప్లాన్, ఎస్టిమేట్లను, మేడలమ్మ, కేతమ్మలకు బంగారు కిరీటం కోసం బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్ ద్వారా కరిగించడానికి అనుమతి కోసం దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మల్లన్న గుట్టపై నిర్మాణం చేపడుతున్న త్రిశూలం, ఢమరుకం పనులకు నిధులు సరిపోక పోవడంతో రూ.84.15 లక్షలకు పరిపాలన అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.12కోట్లతో నిర్మాణం చేపడుతున్న క్యూ కాంప్లెక్స్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. బండ గుట్టపై 50 వసతి గదుల పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రంమలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు, సురేందర్ రెడ్డి, శ్రీరాములు, మధుకర్ పాల్గొన్నారు. -
మొన్న తల్లి.. నేడు తండ్రి మృతి
● చిన్నారుల పరిస్థితి దైన్యం ● వెంటాడిన వరుస విషాదాలు ● గౌరారంలో విషాదం వర్గల్(గజ్వేల్): విధి ఆడిన వింత నాటకం.. రెండు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు, అమ్మమ్మ.. కానరాని తీరాలకు చేరారు. దీంతో చిన్నారులు ప్రేమకు దూరమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి మంజునాథ్ సెలూన్ నిర్వహిస్తుంటారు. భార్య కవిత వికలాంగురాలు. నయనిక(13), అక్షయ్(10) ఇద్దరు పిల్లలున్నారు. ఇల్లరికపు అల్లుడు కావడంతో అత్త భారతమ్మ వారితోనే ఉండేది. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తమ అనారోగ్యానికి తోడు అల్లుడు కూడా తీవ్రఅనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం (జులై 10న) చిన్నారుల తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. ఆ విషాదం మరవకముందే గురువారం తండ్రి మంజునాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లల బేలచూపులు చూస్తుండటంతో చూపరులు కన్నీంటిపర్యంతమయ్యారు. వృద్ధులైన తాత శివరాములు, నానమ్మ పెంటమ్మ, బంధుగణం దుఃఖసాగరంలో మునిగిపోయారు. పదేళ్ల కుమారుడు అక్షయ్ తలకొరివి పట్టి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఈ ఘటనతో గౌరారంలో విషాదం అలుముకున్నది. -
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచండి
● లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించండి ● ఏఈలకు హౌసింగ్ పీడీ మాణిక్యం ఆదేశం మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, లబ్ధిదారుల దగ్గరుండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం ఏఈలకు సూచించారు. బుధవారం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఏఈలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ లబ్దిదారులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వారం వారం బిల్లులు అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు తెలిపాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన చేపట్టేందుకు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎప్పటికప్పుడు నిర్మాణాలను ఫొటో క్యాప్చర్ చేసి హౌసింగ్ యాప్లో పొందు పర్చాలన్నారు. తద్వారా లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు అందుతాయన్నారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు సంప్రదించాలని కోరారు. అన్ని మండలాల ఏఈలు పాల్గొన్నారు. -
షాబుద్దీన్ దర్గాకు చాదర్ సమర్పణ
జహీరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు హజ్రత్ షేక్ షాబుద్దీన్ దర్గాకు చాదర్ను సమర్పించారు. మంగళవారం రాత్రి హరీశ్రావు మండలంలోని శేఖాపూర్లో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలపై చాదర్ పెట్టుకుని దర్గాకు సమర్పించారు. అనంతరం దర్గాను దర్శించారు. ఖవ్వాలీ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు ఖిజర్ యాఫై, తట్టు నారాయణ, సంజీవరెడ్డి, వెంకటేశం, మొహియొద్దీన్, యాకూబ్, నామ రవికిరణ్, విజేందర్రెడ్డి, చిన్నారెడ్డి, ఉర్సు కమిటీ సభ్యులు కిజర్, చస్మొద్దీన్ పాల్గొన్నారు.హామీలు వెంటనే అమలు చేయాలి ములుగు(గజ్వేల్): వికలాంగులు, చేయూత పింఛన్దారులకు ఎన్నికలకు ముందూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగె మహేశ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 15న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. వాహనం ఢీకొని యువతి మృతి పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువతి మృతిచెందిన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. బొల్లారం వైపు నుంచి ముత్తంగి రింగ్ రోడ్డు ఎగ్జిట్ సమీపంలో గుర్తుతెలియని యువతి (25)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవంతం చేయాలి
జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధి కారులు కలసి జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసులను పరిష్కరించుకోవడానికి సహకరించాలి. – భవానీ చంద్ర, జిల్లా ప్రధాన న్యాయమూర్తిసరిదిద్దుకోవచ్చు అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, పెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలి. – పరితోశ్ పంకజ్, జిల్లా ఎస్పీ -
లోక్అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘రాజీయే రాజమార్గం’అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. పెండింగ్ కేసులు ఎక్కువగానే... జిల్లా వ్యాప్తంగా 19,858కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లోక్ అదాలత్లో విద్యుత్, టెలిఫోన్ రికవరీ, సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాణాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 12బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డిలో ఏడు, జహీరాబాద్లో మూడు, నారాయణఖేడ్, జోగిపేటలో ఒక్కొక్కటి చొప్పున బెంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి టీఎల్ఎంకు నందిని ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్): సమగ్ర శిక్షా రాష్ట్ర స్థాయి టీఎల్ఎం మేళాకు శివ్వంపేట ఉపాధ్యాయురాలు ఎంపికై ంది. బుధవారం మెదక్లో నిర్వహించిన జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో శివ్వంపేట శివాలయనగర్ పీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు మెతుకు నందిని పాల్గొంది. మేళాలో ఈవీఎస్ సబ్జెక్ట్ నుంచి విద్యార్థులకు సులభంగా బోధన అర్థమయ్యేలా ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర స్ధాయిలో నిర్వహించే మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ బుచ్చనాయక్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక పట్ల పాఠశాల హెచ్ఎం శేఖర్, మండల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
కాపర్ కేటుగాళ్లు
● ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి వైర్ చోరి ● దుండగులకు పట్టుకోవాలని రైతుల విజ్ఞప్తి మద్దూరు(హుస్నాబాద్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాఫర్ వైర్ చోరి అయిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వారాల శ్రీను వ్యవసాయ బావి వద్ద గల 16కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాఫర్ వైర్ను దొంగిలించినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు వాపోతున్నారు. -
గులాంగిరి.. కాదంటే గురి!
పటాన్చెరు: జిల్లా అధికారులకు పటాన్చెరు పారిశ్రామికవాడ బంగారు బాతుగుడ్డుగా మారింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మండల స్థాయి అధికారులందరూ జిల్లా బాస్లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది. లేకపోతే మారుమూల ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. ఇది ఒక్క రెవెన్యూలోనే కాకుండా పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్ లాంటి ప్రధాన శాఖల్లో ఇదే తంతు నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డీఓ బదిలీ అంశం పారిశ్రామికవాడ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇక్కడ అధికారులపై చేసిన ఒత్తిడిపై చర్చ జరుగుతుంది. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో ప్రధానంగా ఆయన జిల్లా ఉన్నతాధికారులకు మధ్యవర్తిగా కూడా పని చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రాపురం మండలంలో ఓ అసైన్డ్ భూమికి ఎన్ఓసీ జారీ చేసే ప్రక్రియలో గతంలో ఇక్కడ పని చేసిన జిల్లా ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో వార్తలు రావడంతో మీడియాను మచ్చిక చేసుకునేందుకు ఆ ఆర్డీఓ జిల్లా ఉన్నతాధికారికి, మీడియాకు మధ్యవర్తిగా వ్యవహరించారు. సంగారెడ్డి ఆర్డీఓపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఆయనను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను గతంలో ఇక్కడ నుంచి బదిలీ చేస్తే పీసీసీ స్థాయి నేత ఒకరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి ఆర్డీఓగా తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రిత్వ శాఖ వరకు ఆ ఆర్డీఓ అవినీతి కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతోనే బదిలీ వేటు పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.మండల స్థాయి అధికారులు జిల్లా బాస్ల నుంచి అనేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు తమ అనుకూలమైన సిబ్బందిని మాత్రమే ఈ ప్రాంతంలో కొనసాగనిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసైన్డ్, వక్ఫ్, ప్రభుత్వ, చెరువు భూము లను చెరబట్టేందుకు రియల్టర్లు వేసే ఎత్తుగడలకు జిల్లా స్థాయి అధికారులే లొంగిపోతున్నారని వారి ఆదేశాల తోనే చేసేదేమీ లేక మండల స్థాయిలో అధికారులు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వారు జిల్లా బాస్లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది. మితిమీరుతున్న జిల్లా బాస్ల ఆగడాలు పారిశ్రామికవాడలో ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూ అధికారులు ఇతర శాఖల్లోనూ ఇదే తంతు -
పంటల సస్యరక్షణపై అవగాహన
తొగుట(దుబ్బాక): విద్యార్థులు క్షేత్రస్థాయిలో పొలంబాట పట్టారు. మండలంలోని గుడికందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి తోర్నాల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థినులు వ్యవసాయ పరిశోధనలో భాగంగా పంటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలకు రసాయనాలు వాడకుండా పెరమోన్, ట్రాప్ జిగురు అట్టల వాడకంపై పాఠశాల విద్యార్థులకు వివరించారు. అలాగే కృత్రిమ ఎరువుల వాడకం వివిధ రసాయనాలను చల్లడం వల్ల కలిగే నష్టాల గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు భిక్షపతి, శివయ్య పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025–26 అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకి చెందిన బుచ్చగోని ప్రజ్ఞశ్రీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. బీఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఫలితాలు మంగళవారం విడుదలవ్వగా.. ప్రియాంక కాలనీకి చెందిన శంకర్గౌడ్, మంగమ్మ చిన్న కుమార్తె ప్రజ్ఞశ్రీ ర్యాంకు సాధి ంచింది. అంతకుముందు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన ఆమె జిల్లా టాపర్గా నిలిచింది. హైదరాబాద్లోని బండ్లగూడ నిర్వహణ ఉచిత కోచింగ్ సెంటర్లో గత ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు, కాలనీవాసులు అభినందించారు. న్యాల్కల్(జహీరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చాల్కికి చెందిన గౌని గుండప్ప పత్తి పంటలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నాడు. సమాచారం మేరకు హద్నూర్ పోలీసులు, ఎకై ్సజ్ పోలీసులు రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ సుమారు 1.70లక్షలు ఉంటుందని ఎస్ఐ తలిపారు. అనంతరం నిందితుడు గుండప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. పటాన్చెరు టౌన్: ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పటాన్చెరు డివిజన్లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి ఆపన్నహస్తం అందించారు. గత శనివారం పరిశ్రమలో ప్రమాదవశాత్తు అమర్సింగ్ అనే కార్మికుడు (59) యంత్రంలో పడి కుడి చేయి కోల్పోయాడు. ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని ఆశ్రయించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి రూ. 25 లక్షల పరిహారం ఇప్పించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు. -
రైతులు సమన్వయం పాటించాలి
డీఏఓ స్వరూప రాణిమిరుదొడ్డి(దుబ్బాక): రైతులకు సరిపడా యూరియా అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్నదాతలు కాస్త ఓపికతో సమన్వయం పాటించాలని డీఏఓ స్వరూప రాణి కోరారు. బుధవారం మిరుదొడ్డిలోని రైతు వేదికను ఆమె సందర్శించారు. యూరియా టోకెన్ల పంపిణీలో జరిగిన రైతుల ఆందోళన, ఫర్నీచర్ ధ్వంసంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ కొంత మంది కావాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూడటం సరికాదన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడే రైతు వేదికలపై దాడికి పాల్పడటం విచారకరమన్నారు. ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేయడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఏడీఏ మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఏఈఓలు అఖిల్, రేఖ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత వర్గల్(గజ్వేల్): స్థానిక పూలే గురుకుల బాలికల డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సాధనకు ఉపయుక్తంగా నిలిచే అంశాలపై నంది ఫౌండేషన్ నిర్వహించిన వారం రోజుల శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. శిబిరంలో 100 మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ మెలకువలు, రెస్యూమే ప్రిపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు ఎలా సాధించాలో ట్రైనర్లు వోమిజి, శ్యామ్ వివిధ యాక్టివిటీల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉపయోగపడే మాన్యువల్ పుస్తకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాధ పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు
వర్గల్(గజ్వేల్): సమయం ఆదా, పారదర్శకత, జవాబుదారి ధ్యేయంగా మహిళా స్వయం సహాయక సంఘాల నగదు రహిత లావాదేవీల కోసం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా నుంచి వర్గల్ మండలం ఎంపికై ంది. బుధవారం వర్గల్ సెర్ప్ కార్యాలయంలో నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, యూపిఐ పేమెంట్లు తదితర అంశాలపై అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులకు, గ్రామ సంఘ సహాయకులకు కమ్యూనిటీ రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సెర్ప్ ప్రధాన కార్యాలయ బ్యాంకు లింకేజీ ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళా సంఘాల్లో డిజిటల్ పేమెంట్స్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక కావడం అభినందనీయమన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు ఇందుకు అనుగుణంగా తర్ఫీదుపొంది, నగదు లావాదేవీలతో మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి, డీపీఎం ప్రకాష్, ఏపీఎం కిరణ్ కుమార్, గజ్వేల్ ఏరియా సీబీఓ ఆడిటర్ బ్రహ్మచారి తదిరులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక ఊరూరా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం -
311 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: వికారాబాద్ జిల్లా శంకర్పల్లి ప్రాంతం నుంచి సేకరించిన రేషన్ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా బుధవారం చిరాగ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో గల ఆర్టీఏ చెక్పోస్టు వద్ద 65వ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్రమ బియ్యం లారీ పట్టుబడింది. అందులో 311 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం విలువ రూ.9,95,840 మేర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన డ్రైవర్ రమేష్ కజారీయాను అదుపులోకి తీసుకున్నారు. చెవ్వ భాస్కర్తో కలిసి రమేష్లు శంకర్పల్లి ప్రాంతంలో రేషన్ వినియోగదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని అధిక ధరలకు అమ్మేందుకు గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. దాడుల్లో పౌరసరఫరాల శాఖ అధికారి బస్వరాజ్, పోలీసులు పాల్గొన్నారు. -
మొదటికొచ్చిన ధరణి కష్టాలు!
కలెక్టరేట్లో భూభారతి సహాయ కేంద్రం వద్ద ఉన్న ఈ మహిళా రైతు పేరు ఎర్కొల్ల సత్తమ్మ. ఈమెది ఝరాసంఘం మండలం ఎల్గొయి గ్రామం. ఈమెకు 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ధరణి పోర్టల్లో 23 గుంటలకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకం రాగా, మిగిలిన ఎకరం 30 గుంటల భూమికి సంబంధించిన పాసుపుస్తకం కోసం 2022 నుంచి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది. ఈ మిస్సింగ్ సర్వే నంబర్ కేటగిరీకి చెందిన దరఖాస్తులను పరిష్కరించే అధికారం ధరణి పోర్టల్లో సీసీఎల్ఏ కార్యాలయానికే ఉండేది. ఈ దరఖాస్తుకు సంబంధించిన స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ ఇచ్చిన నివేదికలు.. ఇన్నాళ్లు సీసీఎల్ఏ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు భూభారతి వచ్చాక ఈ మిస్సింగ్ సర్వే నంబర్ను సరిచేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రక్రియంతా తిరిగి తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, అక్కడి నుంచి మళ్లీ నివేదికలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి పోర్టల్లో కొన్ని మాడ్యూల్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ మళ్లి మొదటి కొచ్చింది. ఇప్పటికే ధరణి పోర్టల్ ఉన్న తహసీల్దార్లు ఇచ్చిన నివేదికలతో కూడిన ఫైళ్లు పక్కన బెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. కొన్ని కేటగిరీలకు చెందిన దరఖాస్తుల ప్రక్రియను తిరిగి తహసీల్దార్ స్థాయి నుంచి ప్రారంభిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో బాధిత రైతులు కష్టాలు తప్పడం లేదు. మిస్సింగ్ సర్వే నంబర్తోపాటు, ఆర్ఎస్ఆర్ వేరియేషన్స్ వంటి మాడ్యుల్లలోని భూసమస్యలను తిరిగి తహసీల్దార్స్థాయి నుంచి ప్రక్రియప్రారంభిస్తున్నారు.సుమారు 2 వేలకు పైగా ఇలాంటి దరఖాస్తులే..ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 604 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో మొత్తం 13,897 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తిరిగి తహసీల్దార్ నుంచి ప్రక్రియ ప్రారంభం కావాల్సిన కేటగిరీల దరఖాస్తులు సుమారు రెండు వేలకు మించి ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.రైతులకు అవే తిప్పలుభూభారతి వచ్చినా రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. తమ భూసమస్యల పరిష్కారం కోసం వారు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఈ భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన రైతులే అధికంగా ఉంటున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం రైతులు కలెక్టరేట్కు వస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చాక వారికి ఫైల్ తహసీల్దార్ల వద్ద ఉందని అధికారులు చెప్పి పంపుతున్నారు. భూభారతి సహాయ కేంద్రానికి వెళ్లి తమ దరఖాస్తు పరిష్కారం ఎంత వరకు వచ్చిందని ఆరా తీసి నిరాశగా ఇంటికి వెళుతున్నారు. -
మొక్కుబడిగా ప్రణాళిక
మున్సిపాలిటీల్లో ఘనంగా ప్రారంభించిన వందరోజుల ప్రణాళిక అంతగా ఫలితాలనివ్వలేదు. అమలులో నిర్లక్ష్యం, నిధుల లేమి, పాలనాధికారుల బదిలీలు వంటి అంశాలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రణాళిక అమలులో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒకటి రెండు బల్దియాలు ఇందుకు మినహాయింపుగా నిలిచాయి. అన్ని మున్సిపాలిటీలలో వందరోజులు ప్రణాళిక ఏమేరకు సత్ఫలితాలనిచ్చిందోనని సాక్షి బృందం చేసిన పరిశీలనలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.నెరవేరని లక్ష్యంజోగిపేట(అందోల్): మున్సిపాలిటీల్లో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక మొక్కుబడిగానే సాగింది. మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమం చేపడుతున్న సమయంలోనే కమిషనర్గా పనిచేస్తున్న తిరుపతి బదిలీ అయి వేరొక కమిషనర్ నియామకం, బాధ్యతల స్వీకరణ వంటి వాటితో వందరోజుల ప్రణాళిక అమలులో కొంత జాప్యం జరిగింది. దీంతో పట్టణంలోని ఓపెన్ ప్లాట్లల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి పాములు ఇళ్ల మధ్యనే సంచరించి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా పట్టణంలోనే ఇద్దరు పాము కాటుతో మరణించిన ఘటనలున్నాయి.కొంతవరకే పనులు పూర్తినారాయణఖేడ్: వందరోజుల ప్రణాళికలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలో చేపట్టిన కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేసినా మరికొన్ని ప్రాంతాల్లో సమస్యలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ప్రధాన రహదారి వెంట పూర్తిగా తొలగించిన చెత్తకుప్పలు తిరిగి పునరావృతమవుతున్నాయి. ప్రధాన రహదారితోపాటు పలు ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో శిథిలావస్థలో ప్రమాదకరంగా మారి కూలేందుకు సిద్ధంగా ఉన్న 6 ఇళ్లను కూల్చివేశారు. నీటి క్లోరినేషన్, రహదారులపై గోతులు పూడ్చివేత పనులు పూర్తిచేశారు.పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాంపారిశుద్ధ్య సమస్యను చాలావరకు నివారించాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేశాం. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాం. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాం. – జగ్జీవన్, మున్సిపల్ కమిషనర్మున్సిపాలిటీలో పనులు చేపట్టాంవంద రోజుల ప్రణాళికలో భాగంగా వార్డుల్లో ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించాం. 38,328 మొక్కలను నాటాం. దోమల నివారణకు ఫాగింగ్ చేశాం. వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఎస్హెచ్జీ గ్రూపులకు సంబంధించి రూ.5.73 కోట్ల రుణాలకు సంబంధించి లింకేజీ చేశాం. కళాశాలలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. - రవీందర్, కమిషనర్,జోగిపేట మున్సిపాలిటీవంద రోజులతో ఒరిగిందేమీలేదుపటాన్చెరు: వంద రోజుల ప్రణాళికతో అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ కార్యక్రమానికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. కొన్ని రోజులుగా ప్రత్యేకాధికారి అమీన్పూర్కు రాకపోవడం, ఆమె నిర్లక్ష్యం కారణంగా సాధారణ నిధులు కూడా విడుదల కాలేదు. అదనపు కలెక్టర్ అమీన్పూర్కు ప్రత్యేకాధికారిగా నియమితులైన తర్వాతే సింఫనీ వెళ్లే చౌరస్తా, మండే మార్కెట్ చౌరస్తా వద్ద కూడళ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. 1,273 ఇళ్లకు అసెస్మెంట్లు నిర్వహించి రూ.కోటి 23 లక్షల వసూలు చేశారు. వరద సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజ్లను శుభ్రం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లింది.ప్లాస్టిక్పై అవగాహన కల్పించాంప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాం. ఇళ్ల వద్ద తడి పొడి చెత్త సేకరిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు రూ.కోట్ల నిధులు మంజూరయ్యాయి.– జ్యోతి రెడ్డి, కమిషనర్పారిశుద్ధ్యం పనులు అరకొరజహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పనులు సుమారు 90% మేర పూర్తయ్యాయి. 13 వేల నల్లా కనెక్షన్లను ఆన్లైన్లో చేయాల్సి ఉండగా 11వేల వరకు పూర్తి చేశారు. ఆరు వ్యాటర్ ట్యాంకులను క్లీన్ చేశారు. 80% మేర శానిటేషన్ పనులు పూర్తి చేశారు. కాలువల్లో పేరుకు పోయిన మురికి, చెత్తను క్లీన్ చేయడం వంటి పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా కాలువలను పూర్తి చేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ట్రేడ్ లైసెన్సులను 60% మేర అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు స్టాళ్లను కేటాయించారు. రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చివేసే పనులు పూర్తి చేశారు.లక్ష్యం మేరకు పనులు పూర్తివంద రోజుల ప్రణాళికలో ఇచ్చిన పనులను లక్ష్యం మేరకు పూర్తి చేశాం. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయడంతో లక్ష్యాన్ని అందుకున్నాం. ఇదే స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాం.– సుభాష్రావు, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్నిధుల కేటాయింపులేవీ?సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపాలిటీలో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక నామమాత్రంగానే జరిగింది. నిధులు కేటాయించకపోవడంతో రోజువారీ పనులనే ప్రణాళికలో చేర్చి పూర్తి చేశారు. పారిశుద్ధ్య పనులు, 8,800 మొక్కలు నాటించడం, 51వేల మొక్కల పంపిణీ, 202 కుక్కలకు శస్త్రచికిత్సలు, 303 వ్యాక్సినేషన్, స్ట్రీట్ వెండర్ ఫుడ్ స్టాల్స్ ప్రదర్శన, 50ఎస్హెచ్సీ గ్రూపులకు రూ.కోటి 35లక్షల రుణాల చెక్కుల పంపిణీ, నూతన గ్రూపుల ఏర్పాటు, నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. గుంతల పూడ్చివేత, పాతభవనాల కూల్చివేత వంటి పనులు పూర్తి చేశారు. ట్యాంకుల క్లీనింగ్, దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్లు మంజూరు పనులు పూర్తి చేశారు. సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించకుండా రోడ్ల పక్కనే పడేశారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం ముందు మురుగునీటి కాలువలో పేరుకుపోయి అపరిశుభ్రతకు నిలయంగా మారింది.రోజువారీ పనులే చేపట్టాం15 రోజుల కిందటే కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. రోజువారీ పారిశుద్ధ్య పనులకే ప్రాధాన్యతనిచ్చాం. ప్రతీ రోజు నిర్వహించే శానిటేషన్, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.– శివాజీ, మున్సిపల్ కమిషనర్పనులు నామమాత్రంగాసంగారెడ్డి: సంగారెడ్డిలో పారిశుద్ధ్యం పడకేసింది. వందరోజుల ప్రణాళిక పేరుతో చేపట్టిన చర్యలు ఫలితాలనివ్వలేదు. వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపంతో ఎక్కడ ఏ పని చేపట్టి పూర్తి చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోపం కారణంగా పనులు నామమాత్రంగానే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన 11 భవనాలను కూల్చివేశారు. అయితే మున్సిపాలిటీలో మొత్తంగా 80 వరకు శిథిలావస్థకు చేరిన పాతభవనాలను గుర్తించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే వీటి జోలికి పోలేదన్న విమర్శలున్నాయి.స్వచ్ఛ సంగారెడ్డికి ప్రయత్నిస్తాస్వచ్ఛత విషయంలో సంగారెడ్డి మున్సిపాలిటీని నంబర్వన్గా తయారు చేసేందుకు కృషి చేస్తా. ప్రణాళిక పనులపై సమగ్ర విచారణ చేశాకే బిల్లులు చేస్తాం.– శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది, అధికారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొ న్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్లో ఎస్పీ మాట్లాడుతూ..వర్టికల్ నియమాలను పాటి స్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు. వర్టికల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందిస్తామని వెల్లడించారు. ఇన్చార్జి ఆర్డీఓగా పాండు బాధ్యతల స్వీకరణసంగారెడ్డి : సంగారెడ్డి ఇన్చార్జి ఆర్డీఓగా ఆర్.పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జోగిపేట ఆందోల్ డివిజన్ ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయనకు సంగారెడ్డి ఇన్చార్జిగా కలెక్టర్ ప్రావీణ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ ఆర్డీవోగా ఉండి పని చేసిన రవీందర్రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న పాండును రెవెన్యూ డివిజన్ శాఖ సిబ్బంది ఆయనకు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యాలయ ఏవో తన్మొళి, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్, సిబ్బంది తదితరులున్నారు. -
తప్పని యూరియా తిప్పలు
హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. పనులు మానుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకడం కష్టంగానే ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన హత్నూర సొసైటీ కార్యాలయం, దౌల్తాబాద్లోని ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం ఉదయం నుంచి ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూశారు. బుధవారం సుమారు 90 మెట్రిక్ టన్నుల యూరియా (2000 బస్తాలు) రావడంతో ఒక్కసారిగా దుకాణాల ముందు ఎగబడ్డారు. ఆధార్ కార్డుకు ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరుసలో నిలబెట్టారు. అయినా కొంతమందికి సరిపడా యూరియా దొరకలేదు. వరి పత్తి సాగు చేసి నెలలు గడిచిపోయిన యూరియా అవసరమున్నంత మేర దొరకకపోవడంతో పంటలు ఎదగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి హత్నూర మండలం రైతులకు అవసరం ఉన్న యూరియాను సరఫరా చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావును సంప్రదించగా ఇప్పటికీ సుమారు 1,700 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి వచ్చిందని మరో రెండు రోజుల్లో హత్నూర సొసైటీ సిరిపురం ఎరువుల దుకాణానికి రానుందని తెలిపారు. ఇంకా సుమారు 300 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి అవసరం ఉందని ప్రతిపాదనలు నివేదించామని వివరించారు. -
పరిషత్ ఓటర్లు 7,44,157
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రాదేశిక పరిషత్ ఎన్నికలకు 7,44,157 మంది ఓటర్లు ఉండగా 1,458 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలో నిర్వహించే పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుధవారం తుది ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్లు జాబితాను విడుదల చేశారు. 635 ప్రాంతాలలో 1458 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 261 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. కొత్తగా మండలాల ఏర్పాటుతో పాటు పాత మండలాలు మున్సిపాలిటీలుగా మారటంతో పరిషత్ స్థానాల సంఖ్య తగ్గింది. 2019 సంవత్సరంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలలో 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గతంలో కంటే ప్రస్తుతం స్థానాల సంఖ్య తగ్గింది. -
నూతన భవనం కోసం స్థల పరిశీలన
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ● కూలిన హాస్టల్ పైకప్పు శిథిలాల తొలగింపు ● పనులు పర్యవేక్షిస్తున్న తహసీల్దార్మునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల, హాస్టల్ నూతన భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని లింగంపల్లిలో మంగళవారం కూలిపోయిన గురుకుల పాఠశాల, హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. కూలిన శిథిలాల తొలగింపు పనులను తహసీల్దార్ గంగాభవానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ...కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు ఎంత త్వరగా పూర్తయితే అంతే వేగంగా హాస్టల్కు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిచే అవకాశముందన్నారు. అయితే కూలిన స్థలంలోనా లేక కొత్త స్థలంలో నిర్మించడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారిని మరో భవనంలోకి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్కుమార్, మైనార్టీ సీనియర్ నాయకులు మక్సూద్ పటేల్, ప్రిన్సిపాల్ చైతన్య, తహసీల్ధార్ గంగాభవాని, పంచాయతీ ఈఈ మనీష్, ఇన్చార్జి శ్రీనాథ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దుర్తి(తూప్రాన్) : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఫాం సత్యనారాయణ(40), సునీతలు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. సత్యనారాయణ వ్యవసాయంతో పాటు తాపీమేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన మూడు రోజుల క్రితం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. -
బాధితులకు న్యాయం జరగాలి
పటాన్చెరు టౌన్: సిగాచి పరిశ్రమ బాధితులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్లో టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు పలువురు మేధావులు, వక్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ బాధలను పంచుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ...సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. యాజ మాన్య తప్పిదం తోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు పెట్టి దొరికిన వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాలపై మరొకలా వ్యవహరించడం ఏం నీతని నిలదీశారు. కార్మికుల సజీవ దహనానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం ఈ ప్రమాదం నుంచి గుణ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక శైలిలో నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతోపాటు నిపుణులు, మేధావులు ఒకతాటిపై వచ్చి ప్రణాళిక సిద్ధం చేసి సీఎంను కలిసి వివరిద్దామని తెలిపారు. సంఘటన సమయంలో సీఎం రేవంత్రెడ్డి మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతోపాటు గాయపడిన క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ప్రకటించారని వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం: బాబూరావు సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యం, కాలం చెల్లిన మెషీనరీతో అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం, పరిశ్రమలో తయారుచేసే మిశ్రమం నుంచి వచ్చిన ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు తేల్చిచెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటితో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు రూ.పదిలక్షల నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకు కార్మికులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగిన వారం రోజుల్లోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తే తెలంగాణలో మాత్రం కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వసుదా నాగరాజు సహకారంతోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో కార్మిక భద్రత గురించి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిగాచిపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్ కోదండరామ్ బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు చెబితే సీఎం దృష్టికి తీసుకువెళ్తా ప్రకటించిన పరిహారం త్వరగా చెల్లించండి -
బైకును ఢీకొట్టిన కంటైనర్
● యువకుడు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు పటాన్చెరు టౌన్: స్నేహితుడితో కలిసి వెళ్తుండగా బైకును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడికి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిమాన్ సింగ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చిన్న శంకర్పల్లికి చెందిన భాను ప్రకాష్ (25)ఎలక్ట్రిషియన్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతని స్నేహితుడు బల్వంత్ రెడ్డితో కలిసి భోజనం చేసేందుకు బైక్పై ముత్తంగి బయలుదేరారు. ఈ క్రమంలో శివారులోకి రాగానే అర్ధరాత్రి కంటైనర్ వీరి బైక్ని ఢీ కొట్టింది. బైక్పై ఉన్న భాను ప్రకాశ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బల్వంత్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి విజయ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును ఢీకొన్న కారు: ఇద్దరికీ గాయాలు అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని 161 జాతీయ రహదారి రాంపూర్ గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిట్లం వైపు వెళుతుంది. రాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులను దింపేందుకు బస్సు ఆపారు. వెనుక నుంచి పిట్లం వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పిట్లంకు చెందిన సాయి, స్నేహిత్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అంబులెన్న్స్లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సును కారు ఢీకొట్టడంతో పూర్తిగా నుజ్జునుజ్జైంది. -
రైతుల ఇబ్బందులు తొలగించాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: రైతులకు యూరియా అందించి వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదిక వద్దకు వెళ్లిన సునీతారెడ్డికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా దొరకలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. యూరియా దొరకనందున పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నారని, మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా రాష్ట్రానికి యూరియా తీసుకురాగలిగారని, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదని ఆమె చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి యూరియా తేవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు యూరియా కోసం ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్తోపాటు వ్యవసాయాధికారులతో మాట్లాడి నర్సాపూర్కు అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని కోరారు. రైతులకు ప్రాధాన్యత పద్ధతిలో యూరియా అందజేయాలని మండల వ్యవసాయాధికారి దీపికకు సునీతారెడ్డి సూచించారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
మీరెందుకు నివాసం ఉండటం లేదు
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని డబుల్బెడ్ రూంలను అద్దెలకు ఇచ్చారని, కొంతమంది విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు 120 మందికి నోటీసులు జారీ చేశారు. తమకు కేటాయించిన డబుల్బెడ్ రూం ఇళ్లల్లో ఎందుకు నివాసం ఉండటం లేదు అన్న విషయమై మూడు రోజుల్లో లబ్ధిదారులు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులను తాళం వేసి ఉన్న గదులకు అతికించారు. ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము డబుల్బెడ్ రూం ఇళ్లల్లోనే ఉంటున్నామంటూ లిఖిత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు అందజేశారు. తహసీల్దారు, ఆర్డీఓ కార్యలయం ఎదుట ఆందోళన డబుల్బెడ్ రూం ఇళ్ల వద్ద ఉద్దేశపూర్వకంగానే అధికారులు నోటీసులు అతికించారని సీఐటీయూ నాయకులు విద్యాసాగర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పి.నారాయణ, రఫీక్ ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. తాము లేని సమయంలోనే నోటీసులు అతికించారని పలువురు లబ్ధిదారులు సూచించారు. 120 మంది డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు నోటీసులు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన తిరిగి విచారణ జరిపిస్తాం: ఆర్డీఓ మళ్లీ విచారణకు ఆర్డీఓ ఆదేశం డబుల్బెడ్ రూం ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై తిరిగి విచారణ జరిపిస్తామని ఆర్డీఓ పాండు సూచించారు. వాస్తవంగా డబుల్బెడ్ రూం ఇళ్లల్లో నివాసం ఉంటే ఇబ్బంది లేదని, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చె ప్పారు. డబుల్బెడ్ రూం ఇళ్లను అమ్ముకున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఒక్క క్షణంలో.. అంతా శూన్యం!
సంగారెడ్డి క్రైమ్: చిన్న సమస్యను అధిగమించలేక కొంత మంది యువత ఒక క్షణం ఆలోచించకుండా ఉరి తాడును వెతుక్కతున్నారు. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక పురుగుల మందు తాగి అసువులు బాసుతున్నారు. అప్పులు, కుటుంబ సమస్యలు, మోయలేని చదువు భారం, ఉద్యోగం రాలేదని నిరుద్యోగి, ప్రేమ విఫలమైందని, టీచర్, తల్లిదండ్రులు మందలించారని ఇలా అనేక మంది చిన్నచిన్న కారణాలతో జిల్లాలో ఎక్కడో చోట నెలకొక్కరూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. యువతీ యువకులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. కుటుంబం, సన్నిహితుల బాధ్యత ఇది తమ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్థంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడిన పిల్లలు తల్లిదండ్రులు భార్య రోడ్డున పడుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు లోకం వీడితే రెండో వ్యక్తి కుంగుబాటుకు గురవుతారు. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యా అని చెబితే తేలికగా తీసుకోవద్దు. నువ్వులేని ఇంటిని జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలామంది మానసిక వేదనను వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయాత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే.. వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో గడిచిన ఎనిమిది నెలల్లో దాదాపు 140 మంది వివిధ కారణాలతో తమ ప్రాణాలు తీసుకున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మహిళ మే నెల 29న ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి మందలించిందని క్షణికావేశంలో బలవన్మరణానికి పాడింది. దీంతో ఆమె ఐదేళ్ల పాప అనాథ అయ్యింది. అలాగే.. పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా జిల్లాలో రోజుకొకి బలవన్మరణం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటోంది. చిన్న కారణాలతో యువత బలవన్మరణం జిల్లాలో నెలకొకరు చొప్పున ఆత్మహత్య మానసిక స్థితిని గమనించి, ధైర్యం చెప్పాలి మానసిక నిపుణుల సూచన ఇలా అరికట్టవచ్చు.. వైద్యనిపుణుల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖీ కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి. -
గండ్లు పూడ్చరేం..?
సింగూరు ఆయకట్టు రైతుల సాగు ఇక్కట్లు నీరు లేని కాలువలుపుల్కల్(అందోల్): ఇటీవల భారీ వర్షాల కారణంగా తెగిపడ్డ పంటకాలువలు, యూరియా కొరతతో రైతులు కష్టాలనెదుర్కొంటున్నారు. ఈ కష్టాలకు తోడు ఈ ఏడు వానాకాలం నుంచి సింగూరు సాగునీరు వస్తాయా లేదోనని ఎదురుచూసిన రైతులకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సింగూరు కాలువకు పడ్డ గండ్లు రైతుల్ని మరింత కుంగదీస్తున్నాయి. రైతులకు ఊహించని షాక్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బస్వాపూర్ చెరువు అలుగు పారి నీరు కాలువలోకి రావడం, మిన్పూర్ వద్ద కాలువకు బుంగపడి ఆ నీరంతా చెరువులోకి వెళ్లి అలుగు పారడంతో దిగువన వరిచేలు మునిగిపోయాయి. ఇసోజిపేట వద్ద ఫారెస్టు నీళ్లు కాలువలోకి చేరి ప్రవాహ ఒత్తిడి పెరగడంతో అక్కడ మరో గండి పడి నీరంతా ఫారెస్టు నుంచి మంజీరా నదికి చేరాయి. దీంతో సాగునీటిని నిలిపివేయడంతో రైతులకు ఊహించని షాక్ తగిలింది. ఆది నుంచి అంతే వానాకాలం ప్రారంభం నుంచి సింగూరు కాలువలకు సిమెంట్ లైనింగ్ పేరుతో కాలయాపన చేశారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలైనా సిమెంట్ లైనింగ్ ప్రారంభం కాలేదు. అలాగే సాగునీరు విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుందని భావించి కాంగ్రెస్ నాయకులు మంత్రి దామోదరను సంప్రదించి సిమెంట్ లైనింగ్ పనులు ఆపించి వరినాట్లకు నీటిని వదిలారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడే మంత్రి దామోదర రాజనర్సింహ రహదారులు బాగోలేకపోయినా ట్రాక్టర్పై జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ పరితోశ్, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి వెళ్లి మరీ తెగిపడ్డ గండ్లను పరిశీలించారు. అక్కడే గండ్లను పూడ్చాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగి 25 రోజులు కావొస్తున్నా గండ్లను పూడ్చలేకపోయారు. స్వయంగా మంత్రే ఆదే శించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు గండ్లను పూడ్చి సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరారు.ట్రాక్టర్పై వెళ్లి గండ్లనుపరిశీలించినా.. -
సమాజ మార్గదర్శకులు గురువులే
డీఈఓ రాధాకిషన్పాపన్నపేట(మెదక్): ఉపాధ్యాయులు నవ సమాజ మార్గదర్శకులని జిల్లా విద్యాశాఖ అఽధికారి రాధాకిషన్ పేర్కొన్నారు. పాపన్నపేటలో మంగళవారం జరిగిన మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదర్శవంతమైన సమాజాన్ని తయారు చేసే శక్తి ఉపాధ్యాయునికే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, క్రీడాకారులు, సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పాపన్నపేట మండల స్థాయిలో విశిష్ట సేవలు అందించిన 28 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించారు. వీరితోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికై న సాయిసిరికి, జిల్లా స్థాయికి ఎంపికై న సాయిలు, చంద్రశేఖర్, మల్లేశం, దుర్గా ప్రసాద్లకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, డీఎస్ఓ రాజిరెడ్డి, హెచ్ఎంలు మహేశ్వర్, శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
కాళోజీ ఆలోచనలు యువతకు ఆదర్శం
సంగారెడ్డి జోన్: తెలంగాణ ప్రజా కవి కాళోజి నారాయణరావు ఆలోచనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని డీఆర్ఓ పద్మజారాణి పేర్కొన్నారు. మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాళోజీ చిత్రపటానికి ఏఆర్ డీఎస్పీ నరేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన కాళోజీ
మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్రావుమెదక్ మున్సిపాలిటీ/మెదక్ కలెక్టరేట్: తన కవిత్వంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కాళోజీ రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందిచేలా ఉంటాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో డీఆర్ఓ భుజంగరావు పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. 13న జాతీయ లోక్ అదాలత్ ఈనెల 13న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్నారు. -
జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలు
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని, క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా ఆ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ...ప్రజలకు క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలోనూ జరిగే జాప్యం కారణంగానే చాలామంది ప్రాణాలు కో ల్పోతున్నారన్నారు. ఇకమీదట అలా జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి అడ్వైజర్గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయను నియమించిందని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో ఆయన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో రోగులకు సమయానుకూల స్క్రీనింగ్ పరీక్షలు, రేడియేషన్, పాలియేటివ్ కేర్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాలలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలను సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిమ్స్, ఎన్ఎంజే ఆస్పత్రులలో 80 పడకల క్యాన్సర్ ప్రత్యేక విభాగాలు కొనసాగుతున్నాయని, త్వరలో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణకు ఒప్పందం రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇంగ్లిష్లతోపాటు పలు విదేశీ భాషల్లో శిక్షణనివ్వడం కోసం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై ప ట్టు సాధించేలా ఇఫ్లూ అధ్యాపకులు శిక్షణనిస్తారని వెల్లడించారు. ఈ శిక్షణతో నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్ చోగ్తూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రకుమా ర్, అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ సూప రింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవంలోమంత్రి దామోదర త్వరలో అందుబాటులోకి క్యాన్సర్స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు డాక్టర్ నోరి దత్తాత్రేయ అడ్వైజర్గా క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చిట్టోజిపల్లిలో రైతు.. చేగుంట(తూప్రాన్): ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్టోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి గోవర్ధన్(32) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ పోయిందని గుర్తించి వైరు సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. చిట్కుల్లో యువకుడు.. చిలప్చెడ్(నర్సాపూర్): విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్కుల్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కామగోల్ల శివకుమార్(28) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా గ్రామానికి చెందిన కొండారెడ్డి పొలం గట్లపై గడ్డి పెరగడంతో యంత్రంతో గడ్డి కోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్టుపై బోరుమోటార్కు కనెక్షన్ ఉన్న సర్వీస్ వైరును గమనించని అతడు వైరును కూడా కట్ చేయగా విద్యుత్ షాక్కు గురై పొలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నర్సింహులు, ఇన్చార్జ్ విద్యుత్శాఖ ఏఈ సల్మాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. -
భూములు బలవంతంగా తీసుకోవద్దు
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని శ్రామీక్ భవనంలో సోమవారం నిమ్జ్ భూబాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రూ.కోటి వరకు ధర పలికే భూములను ప్రభుత్వం ఎకరాకు రూ.15 లక్షలే చెల్లిస్తుందన్నారు. నిమ్జ్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ వేసిందని, బలవంతపు భూసేకరణకు నిరసనగా ఈ నెల 12న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకలు ఎస్.కుమార్, బి.నర్సింలు, తుల్జరాం, సంగన్న రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా అధ్యక్షుడు రాంచందర్ -
రెడ్కో చైర్మన్ను కలిసిన రమేశ్ చౌహాన్
నారాయణఖేడ్: తెలంగాణ రెడ్కో నూతన ఛైర్మన్గా నియమితులైన డా.శరత్ నాయక్ను మంగళవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనవెంట సంఘం నాయకులు చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలి: డీఈఓపటాన్చెరు టౌన్: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అమీన్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, గండిగూడ ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన తీరును తరగతి గదిలోకి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోశ్సంగారెడ్డి జోన్: ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కక్షిదారులకు ఈ లోక్అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ కేసులు లోక్అదాలత్లో రాజీ పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్జీఎఫ్ క్రీడల్లో అల్గోల్ గురుకుల విద్యార్థులుజహీరాబాద్ టౌన్: 69వ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడల్లో అల్గోల్ మైనార్టీ గురుకుల విద్యార్థులు సత్తాచాటి ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్ –14, అండర్–17 విభాగాల్లో పోటీలు నిర్వహించగా మూడు విభాగాల్లోనూ అల్గోల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారని ప్రిన్సిపాల్ జె.రాములు తెలిపారు. గురుకులం నుంచి 26 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఖలీల్, పీఈటీ అనిల్కుమార్, పీడీ.ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానికం’లో యువతకు ప్రాధాన్యం: నరేశ్గౌడ్ జహీరాబాద్: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో 20% కోట యువతకు కేటాయించాలన్నారు. అన్ని ఎన్నికల్లో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గం అధ్యక్షుడు నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు నరేశ్ యాదవ్, వసీం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ రవీందర్ ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ ఇప్పుడు రెవెన్యూశాఖతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆందోల్ ఆర్డీఓగా పనిచేస్తున్న పాండుకు సంగారెడ్డి ఆర్డీఓగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రవీందర్రెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రవీందర్రెడ్డి చాలా కాలంగా సంగారెడ్డి జిల్లాలో పాతుకుపోయారు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనను జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్గా లూప్లైన్ పోస్టుకు బదిలీ చేశారు. అక్కడ కొద్దిరోజులే పనిచేసిన రవీందర్రెడ్డి తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగానే పోస్టింగ్ తెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు పది నెలలుగా ఆర్డీఓగా పనిచేస్తున్న రవీందర్రెడ్డిని ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేయ డం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన బదిలీని నిలిపివేసుకునేందుకు రవీందర్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచా రం రెవెన్యూశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకోసం జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులను, నేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నేతలు, ప్రజాప్రతినిధుల బినామీలు ఈ భూములను చెరబట్టారు. మరోవైపు వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు చేతులు మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలు..పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట వంటి మండల్లాలో విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా చాలాకాలం పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనకు బదిలీ జరిగినా తిరిగి సంగారెడ్డి ఆర్డీఓ పోస్టుకే చేరుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని కీలక పోస్టింగ్లను దక్కించుకుంటారనే విమర్శలు రవీందర్రెడ్డిపై ఉన్నాయి. ఇన్చార్జిగా ఆందోల్ ఆర్డీఓపాండుకు బాధ్యతలు పలు భూ వివాదాలే కారణమా?పైరవీకారులకు నిలయం!సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. సాధారణ ప్రజలు, నిరుపేద రైతులు తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తే కనీసం పట్టించుకోని ఈ కార్యాలయం అధికారులు, పైరవీకారులకు మాత్రం పెద్ద పీట వేస్తారనేది సాధారణ విషయమేననే అభిప్రాయం ఉంది. బడాబాబులు, రియల్ ఎస్టేట్ కంపెనీల పనులను వెంట వెంటనే చేసి పెట్టే ఈ అధికారులు, సాధారణ రైతులను, నిరుపేదలను మాత్రం చెప్పులరిగేలా తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. -
యాసంగికి ఇప్పుడే కొంటున్నారు
● ఫలితంగానే యూరియా కొరత ● ఆర్డీఓ జయచంద్రారెడ్డి వెల్లడితూప్రాన్/చేగుంట: మార్కెట్లో యూరియా కొరతను గుర్తించిన కొందరు రైతులు యాసంగి పంట కోసం ఇప్పుటి నుంచే యూరియా కొనుగోలు చేస్తున్నారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. సోమ వారం తన కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధి కారి దేవకుమార్, పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో యూరియా కొరతను దృష్టిలో పెట్టుకొని కొందరు యాసంగి పంట కోసం యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నా రు. ఈ విధంగా కొనుగోలు చేస్తే బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రైతులు తమ భూమి విస్తీర్ణానికి సరిపడా యూ రియా బస్తాలు మాత్రమే కొనుగోలు చేయాలని, దానికి అనుగుణంగానే టోకెన్లు జారీ చేసి యూరి యా బస్తాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. సమావేశంలో సీఐ రంగ కృష్ణ, ఎస్ఐ శివానందం, మండల వ్యవసాయాధికారి గంగుమల్లు పాల్గొన్నారు. అనంతరం చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
పేలిన వంట గ్యాస్ సిలిండర్
అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదంకౌడిపల్లి(నర్సాపూర్): సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసం అయింది. కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని పసిగట్టి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈసంఘటన మండలంలోని ముట్రాజ్పల్లిలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ తల్లి ఇటీవల చనిపోవడంతో సోమవారం ఏడో నెల మాసికం నిర్వహిస్తున్నారు. దీనికి బంధువులు సైతం వచ్చారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు. పక్క గదిలో మరో గ్యాస్ సిలిండర్ ఉంది. ఇంతలో గ్యాస్ లీకై వాసన రావడంతో శ్రీనివాస్ అప్రమత్తమై ఇంట్లో ఉన్న వారందరిని బయటకు తీసుకొచ్చాడు. ఆసమయంలో ఇంట్లో సుమారు 20 మంది వరకు ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో సిలిండర్ పేలింది. ఇంటిలో స్లాబ్ పెచ్చులు ఉడిపడి, గోడలు బీటలు వారాయి. ఈసంఘటనతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ శ్రీహరి ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
పత్తికి టెం‘డర్’ కత్తి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈసారి పత్తిని విక్రయించడంలో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల లీజుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో జిల్లాలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఐ కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనల కారణంగా ఒక్క జిన్నింగ్ మిల్లు యజమాని కూడా ఈ టెండరు ప్రక్రియలో పాల్గొనలేదు. ఈ కొత్త నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ ప్రక్రియ నిర్వహించడం తమతో సాధ్యం కాదని ఆయా మిల్లుల యాజమాన్యాలు టెండరు ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. దీంతో ఈసారి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఏటా అక్టోబర్ తొలి వారం నుంచి రైతులు పత్తి తీయడం షురూ చేస్తారు. అదే నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఈ విషయంపై నేడో రేపో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో సమావేశం కావాలని నిర్ణయించారు. దళారులను ఆశ్రయించక తప్పదా..? సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను లీజుకు తీసుకుంటుంది. అందులో పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసి బెయిళ్లుగా మార్చుకుంటుంది. అయితే సీసీఐ కొత్తగా తెరపైకికి తెచ్చిన నిబంధనల కారణంగా సీసీఐకు మిల్లు ఇచ్చేందుకు ఒక్క యజమాని కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో సీజను ప్రారంభమయ్యాక కొన్న పత్తిని ఎక్కడికి తరలించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే రైతులు తమ పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడి..కనీస మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారనుంది. లింట్, సీడ్ నిబంధనల విషయంలో.. ముడి పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేశాక సీసీఐకి ఇవ్వాల్సిన పత్తి, గింజల శాతం విషయంలో ఈసారి నిబంధనలు మారాయి. తరుగు శాతం విషయంలో పెట్టిన నిబంధన మేరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం తమకు ఇబ్బందిగా ఉందని జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులు పేర్కొటున్నారు. ఈ నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం సాధ్యం కాదని, అందుకే టెండరు ప్రక్రియకు దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. 19 చోట్ల కొనుగోలు కేంద్రాలు.. ● సీసీఐ ఏటా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి మొత్తం 19 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. సదాశివపేట, జోగిపేట, రాయికోడ్, వట్పల్లి, నారాయణఖేడ్, పాపన్నపేట (మెదక్ జిల్లా)లో ఈ కేంద్రాలు ఉంటాయి. ● సంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో మొత్తం 7.28 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరానికి సుమారు 7.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినా..సుమారు 26 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అనధికారిక అంచనా. ● మెదక్ జిల్లాలో 3.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 34,720 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఈ జిల్లాలో సుమారు 2.60 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి ఉంటుందని అంచనా. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం! విక్రయాలకు పొంచి ఉన్న ముప్పు సీసీఐకి జిన్నింగ్ మిల్లులు ఇచ్చేందుకు విముఖత టెండరు ప్రక్రియకు దూరంగా యాజమాన్యాలు -
ట్యాబ్ ఒక ఉపాధ్యాయుడితో సమానం
● ఎంపికై న 60 ప్రభుత్వ పాఠశాలలకు ● 3 ట్యాబ్లు : డీఈఓమెదక్ కలెక్టరేట్: ఒక ట్యాబ్ ఒక ఉపాధ్యాయుడితో సమానమని, ఈ లర్నింగ్ ప్రోగ్రాంలో ఈ ట్యాబ్లు ఎంతగానో ఉపయోగ పడుతాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో మేఘశాల అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలోని 60 పాఠశాలలకు 180 ట్యాబ్లను డీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఈ లర్నింగ్ అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో ఈ ట్యాబ్ల ద్వారా బోధన ఎంతో సులభంగా ఉంటుందని, అలాంటి పాఠశాలలను ఎంపిక చేసి నట్లు తెలిపారు. అనంతరం మేఘశాల సంస్థ ప్రతినిధులు ప్రశాంత్రెడ్డి, జయలక్ష్మి మాట్లాడుతూ... ఈ ఏడాది మెదక్ (60), సిద్దిపేట(45), యాదాద్రి భువనగిరి (45)ల చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు 3 ట్యాబ్లను అందజేసినట్లు చెప్పారు. వీటికి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం ఉండదని, ఆఫ్లైన్లోనే విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చునని తెలిపారు. ’ఒక్కో పాఠశాలలో 6,7,8 తరగతులకు గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్లు నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ ఎంఈఓతోపాటు మేఘశాల ప్రతినిధులు సత్యప్రియ జిల్లాలో ఎంపికై న 60 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యకు తొలి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి ● జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పటాన్చెరు: ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయడమే తొలి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్లే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొ న్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలసి మహిపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారన్నారు. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరా రు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
కుంగిన కాళేశ్వరంతో మూసీకి నీళ్లెట్లొస్తాయి?
● సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ సిద్దిపేటజోన్: కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీ ప్రక్షాళనకు గోదారి నీళ్లు ఎలా వస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రశ్నించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కోట్లతో మూసీ ప్రక్షాళన కోసం పథకం రూపకల్పన చేసిందన్నారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ దండగ ప్రాజెక్టు వృథా అని ఆరోపణలు చేసిన సీఎం మల్లన్న సాగర్ నుంచి 250 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు పంపింగ్ చేసేలా ప్రణాళికలు తయారు చేసినట్టు ఆరోపించారు. శంకుస్థాపన కంటే ముందు కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో తప్పు ఒప్పుకుని కేసీఆర్, తెలంగాణ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై సీబీఐ విచారణకు సూచనలు చేసిందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహన్లాల్, నాయకులు శ్రీహరి, శ్రీనివాస్,ఎల్లారెడ్డి, ప్రభాకర్ వర్మ పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు చెల్లించాలి
పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్సంగారెడ్డి ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న రూ.200 కోట్లను తక్షణమే చెల్లించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు సంగారెడ్డిలోని ఐటిఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల కాకపోవడంతో ఫీజులు కట్టాలని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు ఫీజు బకాయిలను విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
‘సీజనల్’ పంజా
సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ ఏ దవాఖాన చూసినా రోగుల రద్దీ కనిపిస్తోంది. ఓ వైపు అవుట్ పేషంట్ విభాగంలో రోజుకు సుమారు 1,100కి పైగా కేసులు నమోదవుతుండగా మరోవైపు వైద్యులు, మందుల కొరత ఆస్పత్రులను వేధిస్తోంది. రోగులు గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తూ అసహనం వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమ రోగాలను నయం చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులను తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయిస్తున్నట్లు ‘సాక్షి’విజిట్ లో వెల్లడైంది. – సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/ జహీరాబాద్/జోగిపేట(అందోల్) రోజుకు 1,200 నుంచి 1,800 వరకు ఓపీ, ఐపీ సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి నిత్యం రోగులతో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,200 నుంచి 1,800 వరకు రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,475 మంది అవుట్ పేషంట్లు నమోదు కాగా ఇందులో 92 మంది ఇన్ పేషంట్లుగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక ఉన్నవారితోనే రోగులను చూసేందుకు సమయం పడుతుండటంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు చూసేంతవరకు వేచి ఉండలేక కొంతమంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎక్కువశాతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల్లేరు.. మందుల్లేవు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రికి నిత్యం అవుట్ పేషంట్లు 1,000 నుంచి 1,200 వరకు వస్తుండటంతో ఆస్పత్రి రోగులతో నిండిపోతోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం పొందాల్సి వస్తోంది. పేరు నమోదు కోసం, వైద్యుడిని కలిసేందుకు, మందులు పొందేందుకు గాను మూడు చోట్ల క్యూలో నిల్చోవాల్సి రావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో పలు రకాల మందుల కొరత కూడా రోగులను వేధిస్తోంది. వాంతుల నివారణ కోసం ఉపయోగించే ఆండిసిట్రాన్, గ్యాస్ట్రిక్ ఇబ్బందులతోపాటు కడుపులో వచ్చే మంట నివారణ కోసం అవసరమై ప్యాంటాప్, ర్యాంటడీన్ ఇంజక్షన్లను రోగులు బయటనుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కిట్ల కొరత కారణంగా సీబీపీ, వీడీఆర్ఎల్, హెచ్బీఎస్ఏజీ రక్త పరీక్షలను బయట చేయించుకోవాల్సివస్తోందని రోగులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి 1,100 అవుట్ పేషంట్లు వస్తున్నారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో ఉన్న 120 బెడ్లు రోగులతో నిండిపోయాయి. ఇక్కడ సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆర్ధోపెడిక్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ చెబుతున్నారు. వేధిస్తోన్న వైద్యుల కొరత ఆస్పత్రిలో ఎనిమిది వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చిన్న పిల్లలకు సంబంధించిన వైద్యుల పోస్టులు మూడు వరకు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్యులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పదికి పైగా నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలువురు డిప్యూటేషన్పై వెళ్లినా వారి స్థానాల్లో ఇతరులు చేరలేదు. 25 మంది నర్సులు, 35 మంది నర్స్ ట్రైనీ విద్యార్థులతో సేవలందిస్తున్నారు. రోగులు ఎక్కువ.. డాక్టర్లు తక్కువ జోగిపేట ఏరియా ఆస్పత్రిదీ దాదాపు ఇదే పరిస్థితి. సోమవారం ఒక్కరోజే సుమారు 700 మంది అవుట్ పేషంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. అయితే రోగులకు సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులందరినీ వైద్యులు చూసేందుకు సమయం పడుతుంది. ఈ ఆస్పత్రిలో 21 మంది డాక్టర్లుండగా కేవలం 9 మందే విధులకు హాజరయ్యారు. –డాక్టర్ అశోక్, ఆర్ఎంఓ మందులు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా జ్వరాలకు అవసరమయ్యే ఔషధాలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కొన్ని మందులు మాత్రం ఒక్కోసారి రవాణ కారణంగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సైకియాట్రిస్ట్, చర్మవ్యాధులకు సంబంధించిన మందులు మాత్రం ఇక్కడ లభించవు. –మురళీకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డిమందుల కొరత లేదు ఆస్పత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు. రక్తపరీక్షలు ఆస్పత్రిలోనే చేస్తున్నాం. ఎప్పుడైనా కిట్ల కొరత ఉంటే బయటకు పంపి ఉండవచ్చు. రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. –శ్రీధర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, జహీరాబాద్ -
ఇల్లు కట్టు.. ఫొటో పెట్టు
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకంగా మారింది. ఇకపై అధికారులు ఫొటోలు తీయకుండానే, లబ్ధిదారులే యాప్ ద్వారా ఇళ్ల ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ఫొటోలను పరిశీలించి, వాటి ఆధారంగా బిల్లు విడుదల చేయనున్నారు. సకాలంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఈ యాప్ వినియోగం ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చింది. అధికారుల అవసరం లేకుండానే.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరుగుతున్న క్రమంలో అధికారులే వివిధ స్థాయిలలో ఫొటోలు తీశారు. హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఫొటోలు తీసేవారు. దీంతో లబ్ధిదారులకు బిల్లులు రావడంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుత నూతన యాప్ ద్వారా సకాలంలోనే డబ్బులు అందనున్నాయి. లబ్ధిదారులే తమ ఇళ్ల నిర్మాణాల ఫొటోలు నేరుగా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసుకోనున్నారు. అధికారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. పథకం అమలు విధానం మొదటి దశలో ముగ్గులు పోసి.. బేస్మెంట్ నిర్మించిన తర్వాత డబ్బులు జమ చేస్తారు. గోడలు నిర్మించిన ఫొటోలు పంపిన తర్వాత రెండో సారి.. పైకప్పు పూర్తయిన తర్వాత మూడో విడత డబ్బులు వస్తాయి. చివరగా ప్రారంభం అనంతరం చివరి బిల్లు వస్తుంది. ఫొటోల అప్లోడ్ ఇలా.. పారదర్శకత కోసమే.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అందించేందుకు ఈ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇల్లు నిర్మించుకునే వారు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. యాప్పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. – జయదేవ్ఆర్యా, హౌసింగ్ పీడి, సిద్దిపేట ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకం -
సమస్యల పరిష్కారంపై దృష్టి
● కలెక్టర్ ప్రావీణ్య ● ప్రజావాణికి 61 అర్జీలు సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు ప్రజలనుంచి 61 అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు. భూ సమస్యలతో పాటు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర వాటిపై దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారుల్లేని తండాలను గుర్తించాలి జిల్లాలో రహదారులు లేని తండాలను గుర్తించి, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను వినియోగించి పీడబ్ల్యూడీ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల నిర్మాణాలకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించాలన్నారు. -
బాలికల హక్కులపై అవగాహన
వట్పల్లి(అందోల్): కిశోర వయస్సు బాలికలు తమ హక్కులు, చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పోతులబోగుడా మోడల్ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అత్యవసర సమయాల్లో 1098 బాలల, 181 మహిళా హెల్ప్లైన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఈఓ ఎన్.రంజిత్ కుమార్ మాట్లాడుతూ..యువతులు ఉన్నత విద్యనభ్యసించడం ద్వారా ఉద్యోగం సాధించి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం బండ్రాన్పల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గానికి మొదటివిడతగా 3,500 ఇళ్లు మంజూరుకాగా వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే అదనంగా మరో 1,000 ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, పేదలకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణం, దశలనుబట్టి విడతలవారీగా బిల్లులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్లు మంజూరయిన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట గృహనిర్మాణ శాఖ ఏఈ వంశీ, మాజీ ఎంపీటీసీ మాణిక్యం, నాయకులు పండరీరెడ్డి, సంగయ్య, సర్దార్నాయక్ ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యంకొండాపూర్(సంగారెడ్డి): ఇళ్ల స్థలాల పొజిషన్ కలిగి పట్టా సర్టిఫికెట్లు ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు అనుమతివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొండాపూర్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని గంగారంలో సర్వే నంబర్ 1,5,243లోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు సుమారు 100 మందికి రెండేళ్ల క్రితం ప్రభుత్వాధికారులు ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి పొజిషన్ చూపెట్టారన్నారు. గత రెండేళ్లుగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వాలని కోరగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. అధికారులిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ మంగళవారం గంగారంలో పర్యటించి అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు
ఒకరి మృతి.. నలుగురికి గాయాలు చేగుంట(తూప్రాన్): కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చేగుంట శివారులోని జీవిక పరిశ్రమ బోనాల్ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో బోనాల వైపునకు వెళుతున్నారు. ఈక్రమంలో కారు వేగంగా చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నరేశ్, సాయితేజ్, ప్రణయ్, స్వామిలకు తీవ్రగాయాలు కాగా సాయితేజ గౌడ్(23) మృతి చెందాడు. క్షతగాత్రులను తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. -
ఆత్మరక్షణకు కరాటే దోహదం
పటాన్చెరు టౌన్: క్రమశిక్షణ, ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం.. శంకర్పల్లి మున్సిపాలిటీ మోకిల పరిధిలోని పీ.ఆర్ఆర్ గార్డెన్న్స్లో నిర్వహించిన 11వ స్టేట్ లెవెల్ సక్సెస్ షోటోకాన్ కరాటే చాంపియన్ షిప్–2025 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. ఎంతోమంది కరాటే సాధకులకు పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు కుమార్, స్పాన్సర్ వెంకటేశ్లను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మొట్ట మొదటి నియోజకవర్గం
1982లో రాజగోపాల్పేట నియోజకవర్గంగా ఏర్పాటైంది. కాంగ్రెస్ అభ్యర్థి కేవి నారాయణరెడ్డి గెలుపొంది మొట్టమొదటి ఎమ్మెల్యేగా శాసనభలో అడుగుపెట్టాడు. 1985లో ప్రభుత్వం మండల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో జనాభా ప్రాతిపాదికన సిద్దిపేట నియోజకవర్గం ఏర్పాటైంది. రాజగోపాల్పేట నంగునూరు మండల పరిధిలోకి రావడంతో సాధారణ గ్రామ పంచాయతీగా మారింది.కూలుతున్న బురుజు రాతి కట్టడంక్రీ.శ.1309 వరకు కాకతీయుల పాలనలో దేశ్ముఖ్లు ఇక్కడ గుళ్లు, గోపురాలు, కోటలు కట్టించి రాజగోపాలపురంగా నామకరణం చేశారు. ఎత్తైన కోట, రాజు, రాణి గృహాలు, పరిచారికలకు గదులు, తాగునీటి కోసం చేదబావి, రాతి బురుజును నిర్మించి సమీపంలోనే పెద్ద చెరువును తవ్వించారు. ఈ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సిద్దిపేట, చేర్యాల, బెజ్జంకి, నంగునూరు, హుస్నాబాద్ మండలాల్లోని 70 గ్రామాల్లో కోటలు కట్టించి పరిపాలన సాగించారు. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు రాజు గది నుంచి ముండ్రాయిలోని లక్ష్మినర్సింహ స్వామి గుట్ట వరకు సొరంగ మార్గం తవ్వించారని గ్రామస్తులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా సామంత రాజులుగా ఉన్న దేశ్ముఖ్లు కాకతీయులకు కప్పం కడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని తెలుస్తోంది. -
ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం
తూప్రాన్: హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం లయనన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320–డీ ఆధ్వర్యంలో ‘దిల్ సే గురు వందనం’ పేరుతో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ధవళ ధనలక్ష్మిని సన్మానించారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఆమె ప్రతిభకు ఈ గుర్తింపు దక్కిందని, పురస్కారం అందుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త, సెక్రెటరీ లయన్ డాక్టర్ జానకిరామ్, మండల విద్యాధికారి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్ డాక్టర్ బాబురావు, విద్యాశాఖ మాజీ కమిషనర్ డాక్టర్ కే.లక్ష్మినారాయణ ఐఎఎస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పత్తి’కి పందుల బెడద
టేక్మాల్(మెదక్): అతివృష్టి, అనావృష్టితో రైతులు అతలాకుతలమవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటకు తీవ్రం నష్టం వాటిల్లింది. ఉన్న పత్తిని కాపాడుకునేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తుంటే అడవిపందులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా పంటలను కాపాడుకుంటున్నా ఏదో సమయంలో వచ్చి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పందుల నివారణలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఖరీఫ్ పంటలు పత్తి, కంది, జొన్న, మొక్కజొన్న, వరి తదితర వాటిని రైతులు సాగు చేశారు. అత్యధికంగా పత్తి, వరిని సాగు చేస్తున్న పంటలను కాపాడుకోవడానికి రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. పత్తి పంటలు సాగుకు మొదట్లో సరైన వర్షాలు కురవకపోవడం ఎదుగుదల లేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా పత్తి చేనులో నీరు చేరి పాడవడంతో గూడు రాలి తీవ్ర నష్టం జరిగింది. అంతేకాకుండా వర్షాల కారణంగా పత్తి మొక్కలు గిడసబారి ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు కలుపు తీయడం, మందులు చల్లడం, పిచికారీ వంటి పనులు చేస్తున్నారు.వర్షం నీరు పారడంతో ఎదుగుదల నిలిచిన పత్తి చేనురేయింబవళ్లు పంటల వద్దే.. పత్తి చేన్లలో అడవిపందులతోపాటు కోతులు సైతం గుంపులు గుంపులుగా తిరుగుతూ లేత పత్తికాయలను తింటూ తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయంగా పంటల చుట్టూ చీరలు, వైర్లు కట్టడం, సీసాలు కట్టి శబ్దం వచ్చేలా చేస్తున్నారు. పందులు, కోతుల బెడదతో రైతులు చేన్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పందులు కొరికి పడేసిన కాయలు కుప్పలు, కుప్పలుగా పడుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. కంది, వరి పంటలను సైతం నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. మరో నెల రోజుల్లోనే చేతికి వచ్చే పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి పందుల దాడితో పంటలు నష్టం జరిగి కనీసం పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని అన్నదాతలు బాధపడుతున్నారు.పత్తి కాయలను తింటున్న వైనం తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు రాత్రి, పగలు చేన్ల వద్దే కాపలా పట్టించుకోని అధికారులునివారణ చర్యలేవి? ప్రభుత్వం అడవి పందులను నివారించాలని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు అమలు చేయడం లేదు. ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. వన్యప్రాణుల బెడద, నివారణ యంత్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పంటలను కాపాడుకునేందుకు రైతులే నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పంటలను కాపాడుకునేందుకు పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు
● తండ్రి అక్కడికక్కడే మృతి ● కుమారుడికి తీవ్ర గాయాలువట్పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం అందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద 161 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు వివరాల ప్రకారం... పుల్కల్ మండలం సింగూరు గ్రామానికి చెందిన కుమ్మరి బాబు, అతని తండ్రి నర్సింలు(60)తో కలిసి ద్విచక్ర వాహనంపై అల్మాయిపేటకు వెళుతుండగా సంగుపేట గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తండ్రి నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడికి ఎడమ చేయి విరిగింది. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యహుస్నాబాద్రూరల్: ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని పోతారం(ఎస్)కు చెందిన నమిలికొండ సురేశ్(28) ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పించడంతో ఆటోలకు కిరాయిలు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కుటుంబ పోషణ, ఆరోగ్య సమస్యల కోసం రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. ఆటో కిరాయిలు రాక అప్పులు తీర్చే మార్గం కనిపించపోవడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
కొండాపూర్(సంగారెడ్డి): కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సీఐటీయూ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని గొల్లపల్లిలో గల సీసాల పరిశ్రమలో కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సీసాల కంపెనీలో కార్మికులు ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్నారని వాపోయారు. ఆరేళ్లుగా కార్మికులు అదే పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ ఇంకా తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా కార్మికులకు ఈఎస్ఐ ,పీఎఫ్, బోనస్ వంటి సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం ఆందోళన
పటాన్చెరు టౌన్: ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డును బాగు చేయాలని కాలనీవాసులు పిల్లలతో కలిసి ప్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన చేశారు. వివరాలు... ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిర్చి డెవలపర్స్ వెనిసిటీ, ఎం.పీ.ఆర్ అర్బన్ సిటీ కాలనీ వాసులు పాటీ చౌరస్తా నుంచి అర్బన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మూడు, నాలుగేళ్ల నుంచి రోడ్డును బాగు చేయాలని స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. నిత్యం వందల వాహనాలు ఈ మార్గంలో తిరుగుతాయని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత గుంతలమయంగా మారిందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాశి , యశ్వంత్, శ్రవణ్, వేణు, రాఘవ, శ్రీకాంత్, కాలనీ వాసులు పాల్గొన్నారు.ర్యాలీ చేపట్టిన కాలనీవాసులు -
కమ్యూనిస్టులతోనే వెట్టి చాకిరి విముక్తి
సిద్దిపేటఅర్బన్: దొరలు, భూస్వాములు, నైజాంల వెట్టి చాకిరీ నుంచి తెలంగాణను విముక్తి చేసింది కమ్యూనిస్టులేనని, దున్నే వాడికి భూమిని పంచింది ఎర్ర జెండా నేతలేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ పేర్కొన్నారు. సీపీఎం పార్టీ సిద్దిపేట ప్రాంత రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ విశిష్టత–నిర్మాణం అనే అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ బోధించారు. భూ స్వాములు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా నైజాం ప్రభువును గద్దె దించడానికి గ్రామ గ్రామాన ఎర్రజెండా చేత పట్టి నీ బాంచన్ దొర అన్న వారి చేత బందూక్ పట్టించి పోరాటాలకు సిద్ధం చేసింది ఎర్ర జెండా మాత్రమేనన్నారు. కార్యక్రమంలో రవికుమార్, గోపాలస్వామి, శశిధర్, బాలనర్సయ్య, శిరీషా, శ్రీనివాస్, ప్రశాంత్, కనకయ్య, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ -
రైతులకు శాపం
ప్రణాళిక లోపం..నిమ్జ్ రహదారి నిర్మాణం ప్రణాళికాబద్ధంగా చేపట్టకపోవడం శాపంగా మారింది. కొత్త రోడ్డు నిర్మాణంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రహదారి నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనంతో నిధులు వృథా అవుతున్నాయి. నాణ్యత సైతం పాటించలేదని పలువురు విమర్శిస్తున్నారు. – సంగారెడ్డి జోన్ జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో సుమారు 13 వేల ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి (నిమ్జ్) ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే సుమారు 7,000 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి అయింది. ప్రాజెక్టు కోసం మౌలిక వసతుల్లో భాగంగా జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ వరకు 100 అడుగుల వెడల్పుతో సుమారు 9.3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.100 కోట్లు వెచ్చి ంచారు. కాని అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదకరంగా మలుపులు రహదారిపై పలుచోట్ల ఉన్న మలుపులు ప్రమాదకరంగా మారాయి. హెగ్గెల్లి వద్ద జాతీయ రహదారిని నిమ్జ్ రహదారికి అనుసంధానం చేశారు. పరిశ్రమలకు భారీ వాహనాలతో పాటు కంటైనర్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పేలా లేవు. కృష్ణాపూర్ శివారులోని మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. దగ్గరకు వచ్చేంత వరకు రోడ్డు కనిపించటం లేదు. యూటర్న్ సైతం చిన్నగా ఏర్పాటు చేశారు. కొత్తగా నిర్మించిన రహదారిపై ఇలాంటి మలుపులు ఏంటని పలువులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రహదారి నిర్మాణం కోసం బర్దిపూర్, మాచ్నూర్, కృష్ణాపూర్, బిడేకన్నె, హుగ్గెల్లి శివారులోని పంట పొలాలను సేకరించారు. కృష్ణాపూర్ శివారులో రెవెన్యూ అధికారి బంధువుకు సంబంధించిన భూమి ఉండటంతో పక్క నుంచి భూ సేకరణ చేసి రహదారి నిర్మించడంతోనే మలుపు ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. కల్వర్టులు సైతం చిన్నగా నిర్మించడంతో పాటు రహదారి నిర్మాణంలో సైతం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నగా నిర్మించిన కల్వర్టులు చెరువులను తలపిస్తున్న పంట పొలాలు భూసేకరణపై అనుమానాలు! తీవ్రంగా నష్టపోతున్నాం వాగులపై కల్వర్టులు చిన్న గా ఉన్నాయి. నాకున్న 4 ఎకరాల్లో చెరుకు సాగు చేస్తున్నా. అలాగే 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తితో పాటు సోయా తదితర పంటలు సాగు చేస్తున్నా. వర్షాలు కురిసిన సమయంలో వరద నీటితో పొలాలు నిండిపోయి నష్టపోతున్నాం. – పాండు, రైతు, కృష్ణాపూర్ -
విలువలతో కూడిన విద్యనందించాలి
జహీరాబాద్: విద్యార్థులను సమాజ, దేశ ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్, కవి కసిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం ద్వారానే దేశం ప్రగతి పథంలో ముందడుగు వేస్తుందన్నారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి ఉత్తమ పౌరులను అందించగలిగేది ఒక్క ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో ఏటా ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం కొనసాగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మాణయ్య, ట్రస్మా నాయకులు రాఘవేందర్రెడ్డి, దశరథ్రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సాయితేజ, ప్రభాకర్రెడ్డి, ఏసురత్నం, సునీల్, స్వరాజ్, శేఖర్, జహంగీర్, వెంకట్రాంరెడ్డి, ముజాహిద్ పాల్గొన్నారు. -
న్యూస్రీల్
ఝరాసంగం(జహీరాబాద్): సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని మూసివేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలతో పాటు దర్శన సౌకర్యం కల్పించారు. అనంతరం ఆలయం మూసివేశారు. సోమ వారం ఉదయం సంప్రోక్షణ చేసి ప్రాతఃకాల పూజల అనంతరం దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప తెలిపారు. పాపన్నపేట(మెదక్): చంద్రగ్రహణం పురస్కరించుకొని ఆదివారం ఏడుపాయల దుర్గాభవాని మాత దర్శనం నిలిపివేశారు. ఆలయం ఎదుట నుంచి మంజీరా నీరు ప్రవహిస్తుండటంతో గత 25 రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో మధ్యాహ్నం నుంచి దర్శనం, పూజలు నిలిపివేశారు. తిరిగి సోమవారం ఉదయం శుద్ధి అనంతరం దర్శనం ప్రారంభిస్తామని అర్చకులు తెలిపారు. న్యాల్కల్(జహీరాబాద్): మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు కలుషితమైన నీరు సరఫరా అవుతోంది. ఇప్పటికే జ్వరాలతో సతమతం అవుతున్నామని, ఈ తరుణంలో రంగు మారిన నీటిని ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని 39 గ్రామాలతో పాటు తండాలు, ఝరాసంగం మండలంలోని సుమారు 36 గ్రామాలతో పాటు పలు తండాలకు తాగు నీరు అందించేందుకు రాఘవాపూర్ సమీపంలో మంజీరా వద్ద ఫిల్టర్ బెడ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీరు రోజూ ఆయా గ్రామాలకు సరఫరా అవుతోంది. అయితే ఇటీవల భారీ వర్షాలకు మంజీరాకి పెద్ద ఎత్తున కొత్త నీరు వచ్చి చేరింది. ఆ నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా గ్రామాలకు సరఫరా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ అధికారులను సంప్రదించగా, నీటిని ట్రయల్ చేయ డం వల్ల రంగు మారిన నీరు వచ్చి ఉండవచ్చని, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్: కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం మెదక్ డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్యశా లను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ వామనమూర్తి సమన్వయకర్తగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సృజనాత్మక రచనలు, పాట, కవితా రచన మొదలైన అంశాలలో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థులందరూ తప్పకుండా సదస్సుకు హాజరుకావాలని సూచించారు. నాచగిరి ఆలయ ద్వారబంధనంవర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాచగిరి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు తెలిపారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి
ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డిపెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయ, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేటలో మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్సీ అమలుతో పాటు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరా రు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు పీఆర్టీయూ వ్యతిరేకమన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించాలన్నారు. అన్ని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు దామోదర్రెడ్డి, వంగా మహేందర్రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్శర్మ, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, వేమారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆశయ్య, రామచంద్రాచారి, ఉపాధ్యాయులు గోపి, ప్రసన్న, సంతోష్, కిషోర్చారి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
అద్దె భవనంలో అవస్థలు
జహీరాబాద్ టౌన్: సీపీడీఓ కార్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయి. సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి అంగన్వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీలను నియమించింది. జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాలకు కలిపి ప్రాజెక్టు కార్యాలయాన్ని జహీరాబాద్లో ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ప్రాజెక్టు కింద 407 మంది అంగన్వాడీలు, 17 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. వీరికి సూచనలు, సలహాలిచ్చేందుకు ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తారు. ఇందుకు సరిపడా స్థలం లేక రైతు వేదిక, ఫంక్షన్హాల్, చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. సొంత భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం రూ. 30 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ భవన నిర్మాణానికి స్థలాన్ని సకాలంలో కేటా యించకపోవడంతో నిధులు రద్దయ్యాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు పస్తాపూర్ వద్ద స్థలం కేటాయించారు. స్థలం ఎంపిక చేపట్టిన తర్వాత నిధులు లేవు. ప్రస్తుతం నిధుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై సీడీపీఓ అంజమ్మను వివరణ కోరగా, భవన నిర్మాణం గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి దామోదరకు కూడా వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.సీపీడీఓ కార్యాలయంలో వసతులు కరువు -
సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: విధి నిర్వహణలో చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ పదవీ విరమణ సభకు హాజరై మాట్లాడారు. లక్ష్మణ్ సాధారణ ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని కొనియాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతగానో సేవ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, మహేందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, మా జీ అధ్యక్షులు శేరి వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాణయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు, సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
మాజీ మంత్రి హరీశ్రావుగజ్వేల్రూరల్: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, మద్యం మహమ్మారి, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు అభినందనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. ఆదివారం గజ్వేల్ ప్రెస్క్లబ్ రజతోత్సవ వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్పాసులు అందించామన్నారు. రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ఈహెచ్ఎస్ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని కలిశామన్నారు. వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, బేవరేజస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ, జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్, లోక్సత్తా తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు పాల్గొన్నారు.మల్లన్న ఆలయం మూసివేతకొమురవెల్లి(సిద్దిపేట): సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆలయ అధికారులు, అర్చకులు మూసివేశారు. ఈసందర్భంగా ఈఓ టంకసాల వెంకటేశ్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం సంప్రోక్షణ శుద్ధి, ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పి స్తామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులు, అర్చకులకు సహకరించాలని కోరారు. -
పల్లెలకు పాలనాధికారులు
జిల్లాకు 239 మంది నియామకం జహీరాబాద్ టౌన్: జిల్లాకు కొత్తగా 239 మంది గ్రామ పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈనెల 5వ తేదీన హైదరాబాద్లో వారంతా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఈ నియామకాలు చేపట్టింది. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఏఓ వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖలకు బదిలీ చేసింది. జీపీఓలుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపిన వీఆర్ఓ, వీఆర్ఏలకు రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించి 239 మందిని ఎంపిక చేసింది. సంగారెడ్డి క్లస్టర్ నుంచి 123, జహీరాబాద్ నుంచి 54, నారాయణఖేడ్ నుంచి 41, ఆందోల్ క్లస్టర్ నుంచి 21 మంది ఎంపికయ్యారు. వీరికి త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. గ్రామ పాలనాధికారుల నియామకంతో ప్రజలకు సత్వర సేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ రద్దు అయిన తర్వాత రెవెన్యూకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు, భూమి హక్కులు తదితర సేవలు ఇక గ్రామాల్లో అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రేవంత్ ఇవ్వరు.. కేసీఆర్ అడగరు
● వీరికి నిరుపేదల కష్టాలు తెలియవు ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రామచంద్రాపురం(పటాన్చెరు): భూస్వాములైన సీఎం రేవంత్రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్కు నిరుపేదల కష్టాలు ఏం తెలుసని ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పెన్షన్ పెంపు కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెన్షన్ కుటుంబం నుంచి వచ్చిన తనకు నిరుపేదల కష్టాలు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వెంటనే పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయం ప్రతిపక్ష నేత కేసీఆర్ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లు వర్గీకరణపై పోరాటం చేసి విజయం సాధించామన్నారు. తమ పోరాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ రూ. 6 వేల పెన్షన్ ఇచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు రాజు, రామారావు, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర, నాయకులు ప్రమోద్, గీత, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే బ్రిడ్జికి మరమ్మతులు
బ్రిడ్జి నిర్మాణ పనులను చేపడుతున్న సిబ్బందిహవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులో కొట్టుకుపోయిన బ్రిడ్జికి రైల్వే శాఖ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు తెగిపోయి భారీగా వరద రావడంతో రైల్వేకట్టను తిరిగి పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు. రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో పెద్ద గొయ్యి ఏర్పడి ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. వరద శనివారం కూడా రావడంతో నీటికి అడ్డంగా ఇసుక నింపిన బస్తాలు వేసి పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
తూప్రాన్: పట్టణంలో వ్యక్తి అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన బుడ్డ శ్రీను(35) భార్య హేమలత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆర్థిక సమస్యలతో గత ఆరు నెలల క్రితం పిల్లలతో కలిసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే తల్లి సుశీల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఇంట్లో నుంచి బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గుండ్లపల్లిలో వ్యక్తి.. శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఉప్పునూతల నాగరాజు గత నెల 28న హైదరాబాద్లో పని చూసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ నెల 2న ఫోన్ లో మాట్లాడిన నాగరాజు అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. -
భర్త వేధింపులతోనే..
నారాయణఖేడ్: మద్యానికి బానిసై అదనపు కట్నం వేధింపులకు తోడు అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతంలా మారింది. భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లల గొంతు నులిమి, తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. నిజాంపేట్కు చెందిన బూషి సాయమ్మ, రాములు కుమార్తె ప్రేమల (22)ను నాలుగేళ్ల క్రితం దామర చెరువు గ్రామానికి చెందిన కొత్తపల్లి సంగమేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహమైన అనంతరం అదనపు కట్నం కోసం తరచూ ప్రేమలను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ధనుష్, 45 రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు. ఇటీవల బారసాల నిర్వహించి బాబుకు సూర్యవంశీ అని నామకరణం కూడా చేశారు. ఈనెల 1న ప్రేమలను అత్తవారింటికి పిల్లలతో సహా పంపించారు. గురువారం సంగమేశ్ తన భార్య ప్రేమల, ఇద్దరు పిల్లలను నిజాంపేట్లోని పుట్టింటికి తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు, సోదరుడు జైపాల్ పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమల కుమారులు ధునుష్ (3), సూర్యవంశీ (45 రోజులు) ఊపిరి ఆడకుండా గొంతు నులిమి చంపి, తాను కూడా ఉరివేసుకుంది. పనులు ముగించుకొని కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి రాగా ప్రేమల, ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం గమనించారు. భర్త, ఆయన సంబంధీకులే హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఘటన జరిగిన రాత్రి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి వివరాలు సేకరించారు. భర్త సంగమేష్ అదనపు కట్నం, అనుమానం వేధింపులే తన కూతురి మృతికి కారణమని తండ్రి బూసి రాములు పోలీసులు ఫిర్యాదు చేశాడు. మృతదేహాలకు ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అదనపు కట్నానికి తోడు అనుమాన భూతం చిన్నారుల గొంతు నులిమి తాను ఆత్మహత్య డాగ్స్క్వాడ్, క్లూస్ టీం విచారణ వివరాలు వెల్లడించిన డీఎస్పీ -
ఇచట చూడముచ్చట
కాకతీయులు ఏలిన సంగారెడ్డిఇస్మాయిల్ ఖాన్ పేటలో దుర్గా భవాని అమ్మవారునేటి ఇస్మాయిల్ఖాన్ పేటఈశ్వరపురం(ఇస్మాయిలా ఖాన్ పేట )లో కొలువైన భవానీ మాత ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. సప్త ప్రకారయుత ఆకారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు ఏకశిల రూపంలో అష్టభుజిగా, సింహావాహినిగా 13 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం రూపంలో భక్తులకు అమ్మవారు దర్శమిస్తుంది. ప్రతీ ఏటా శరన్నరాత్రులతో పాటు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వీటితోపాటు సంగారెడ్డిలో చూడదగిన ప్రదేశాలు ఫల పరిశోధన కేంద్రం, రాజంపేటలోని రాజేశ్వర ఆలయం, వాసవీ మాత దేవాలయం, పురాతన కోటలు, గడీలతో దర్శనమిస్తున్నాయి.విద్య, పర్యాటకం, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు మంజీరాలో వలస పక్షుల సందడి సెలయేళ్ల లాగ పారే పంట కాల్వలు రక్షణగా కనబడే ఎత్తైన హనుమాన్ విగ్రహం●కాకతీయులు ఏలిన గడ్డ సంగారెడ్డి. పట్టణం చుట్టూ మంజీరా పరవళ్లు, పచ్చని పంటపొలాలు గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఎత్తైన కోటలు. ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాతన ఆలయాలు ఇలా ఇంకా.. మరెన్నో చూడదగిన ప్రదేశాలతో రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న అద్భుతమైన పట్టణంపై ఈ వారం సండే సాక్షి కథనం. – సంగారెడ్డి టౌన్ -
గంజాయి అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): గంజాయి అమ్ముతున్న ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ఎల్.శ్రీను, ఎస్ఐ నవీన్తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని లక్ష్మినర్సింహ స్వామి ఆలయం సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, పోలీసులు కలిసి రైడ్ చేశారు. ఈ దాడిలో బొడ్డు చందు, పొన్నబోయిన పవన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 440 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లు,పేపర్ బండిల్స్, స్పిరిట్ బాటిల్స్ను స్వాఽధీనం చేసుకున్నారు. విచారించగా హైదరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 440 గ్రాముల గంజాయి స్వాధీనం -
కలబ్గూర్ శివాలయం
కలబ్ గూర్ 11వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి ప్రధాన సేనాపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబలయ్య ఒకే చేతితో రాతితో నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితం గలది. ఆలయంలో ప్రధానంగా అనంత పద్మనాభస్వామి విగ్రహం, శివలింగం దర్శనమివ్వడం... సూర్య కిరణాలు దేవతామూర్తులపై పడటం మరో విశేషం. ఇక్కడి ఆలయం త్రికూట ఆకారంలో ఉండి, ఆలయం ముందు కోనేరు, ఒకే చోట శివుడు, అనంత పద్మనాభస్వామి, వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. శివరాత్రితో పాటు పలు పర్వదినాల్లో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తారు. నందీశ్వరుడు, ధ్వజ స్తంభం స్వాగతం పలుకుతూ ఆలయ ఆవరణ అంతా వెయ్యి స్తంభాల గుడిని గుర్తుకుతెస్తాయి. -
హైహై వినాయక
పటాన్చెరు: పటాన్చెరులో గ్రామాలు లేవు. పంచాయతీ ఎన్నికలు లేవు. చాలా గ్రామాలు మున్సిపాలిటీలుగా మారాయి. కొత్తగా వచ్చిన జనాలతో కాలనీలు పెరిగాయి.. ఓటర్లు పెరిగారు. ఆ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వినాయక ఉత్సవాలను వేదికలుగా చేసుకుంటూ నయాతరం నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. మారుతున్న రాజకీయ పరిణామాలకు ఈ వినాయక ఉత్సవాలు వేదికలుగా మారుతున్నాయి. భక్తులకు, మండప నిర్వాహకులకు, కాలనీ సంఘాల వారికి దగ్గరయ్యేందుకు యువనేతలు చేస్తున్న ప్రయత్నాలు నయా ట్రెండ్గా మారాయి. వినాయక ఉత్స వాల నిర్వహణకు యువజన సంఘాలు, కాలనీ సంఘాలు రాజకీయవేత్తల సహకారాన్ని కోరడం సహజం. అయితే ఈ ఏడాది వినాయక ఉత్సవాల్లో మాత్రం కొందరు నాయకులు ప్రజల దృష్టిలో పడేందుకు చేస్తున్న ప్రయత్నాలు వైరెటీగా ఉన్నా యి. మండపాల సందర్శనను చిన్న వీడియోల రూపంలో పెట్టి వాటిని వైరల్ చేస్తున్నారు.ఓటర్కు దగ్గరయ్యేందుకు.. పటాన్చెరుకు చెందిన ఓ మాజీ సర్పంచ్ కుమారుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కార్పొరేటర్ కావాలనేది ఆయన కల. ఆయన ప్రత్యేకంగా మట్టి వినాయకులను ఇళ్ల వద్దకే పంపించారు. వైరెటీగా ఆయన ప్రచారానికి పర్యావరణ పరిరక్షణ ట్యాగ్ పెట్టి ప్రజల్లో మట్టి వినాయకులపై అవగాహన కల్పించేలా కలరింగ్ ఇచ్చారు. చేసేది మంచి పనే కావడంతో ప్రజలు బాగా స్పందించారు. అమీన్పూర్లో బీజేపీ నేత ఒకరు హిందూ బంధువులకు వినాయకులను అందిస్తానంటూ ప్రత్యేకంగా ఓ శిబిరాన్ని నిర్వహించి గణేశుడి ప్రతిమలు పంపిణీ చేశారు. అమీన్పూర్కు చెందిన ఓ బీజేపీ నేత తన నియోజకవర్గంలోని ప్రతి ప్రధాన కూడలిలో వినాయక పండుగ శభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలో మండల ఆఫీసు ముందు, బస్టాండ్ ఎదరుగా అన్ని ఫ్లెక్సీలే. దాదాపు అందరూ కొత్త ముఖాలే. ఇక అమీన్పూర్లో మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు మండపాలను సందర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. అన్నదానాలకు, మండప నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తూ ఆ నేతలు ఆయా కాలనీ సంఘాల వారిని మచ్చిక చేసుకుంటున్నారు. రామచంద్రాపురంలో ఓ మాజీ జడ్పీటీసీ కుమారుడు, అమీన్పూర్లో ఓ టీఆర్ఎస్ యువ నాయకుడు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉత్సవ కమిటీలకు సాయం చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా పటాన్చెరు బడా నేతలకు జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీలకు ఉదారంగా విరాళాలు ఇచ్చే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగింది.లీడర్గా ఎదిగేందుకు మండపాలే వేదికలు అనుకూలంగా మలుచుకుంటున్న యువ నేతలు కొత్త ఓటర్లకు దగరయ్యేందుకు వైరెటీ ప్రచారం -
ఎల్లయ్య మరణం తీరని లోటు
మాజీమంత్రి టి.హరీశ్రావు రామచంద్రాపురం(పటాన్చెరు): భెల్ సీనియర్ కార్మిక నేత జి.ఎల్లయ్య మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రామచంద్రాపురం శనివా రం జరిగిన ఎల్లయ్య అంతిమయాత్రలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. భెల్ కార్మికుల హక్కుల సాధనకోసం ఆయన చేసి కృషి విస్మరించరానిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఎల్లయ్య అంతిమయాత్రలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్ సింధురెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బెల్ ప్రధాన గేటు వద్ద .. జి.ఎల్లయ్య పార్ధివ దేహన్ని కార్మికుల కోసం బెల్ ప్రధాన గేట్ సమీపంలో కొంత సమయం ఉంచి ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
● విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ● అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహసంగారెడ్డి: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య, వైద్య సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పనే ప్రభుత్వం అధికప్రాధాన్యమిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలోని కేజీబీవీ మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై శనివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో ఉన్న కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బెడ్స్, కిచెన్ సామగ్రి, టేబుల్స్, ప్లేట్స్, పుస్తకాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్స్ వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావాల్సిన వసతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా పరిశ్రమలు చేపట్టిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జానాయక్, సీపీఓ బాలశౌరి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
స్వల్పంగా పెరిగిన ఆకు కూరలుజహీరాబాద్ టౌన్: పక్షం రోజులుగా కురిసిన వర్షాల ప్రభావం ఉద్యాన పంటలపై పండింది. తోటలు నీటితో నిండిపోయి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నేలలు బురదగా మారి తోటల వద్దకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాయలు కోయడం, మోసుకురావడం కూడా ఇబ్బందిగా మారింది. టమాటాలు రాలిపోవడంతోపాటు చాలావరకు కుళ్లిపోయాయి. ఆకుకూరలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో పాలకూర, మెంతికూర తదితర ఆకుకూరల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బొప్పాయి, అరటి తోటలకు కూడా నష్టం వాటిల్లింది. మండలంలోని శేఖాపూర్ గ్రామం పరిధిలో పదెకరాల బొప్పాయి తోట వర్షాలకు దెబ్బతింది. రైతు సుమారు రూ.10 లక్షల వరకు నష్టపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు దుర్గారావు కోరారు. పగిలిన పత్తి మునిపల్లి(అందోల్): ఇటివల పడిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ వల్ల పత్తి కాయలు ఎండిపోవడంతో పత్తి పగిలిపోయి వాటినుంచి పత్తి బయటకు వస్తోంది. దీంతో పత్తి పనికి రాకుండా పోతోంది. ఈ నేపథ్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో పత్తి రైతులు పెట్టుబడి వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. -
పారిశుద్ధ్యం లోపించొద్దు
కంది(సంగారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని డీపీఓ సాయిబాబా సూచించారు. శనివారం మండల పరిధిలోని చిమ్మాపూర్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. మురికి కాల్వలు, గుంతల్లో నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునీతతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాస్థాయిలోనూ రాణించాలిక్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు న్యాల్కల్(జహీరాబాద్): ఇటీవల హద్నూర్లో నిర్వహించిన ఎస్ఎఫ్జీ క్రీడా పోటీల్లో రాణించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా ప్రతిభ చూపాలని జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు ఆకాంక్షించా రు. న్యాల్కల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. కాగా, క్రీడాకారులను శనివారం ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ తదితరులు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సచ్చిదానందరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మల్లేశ్వరీ, ఉపాధ్యాయులు మొగులయ్య, పీడీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. సాకి చెరువును సందర్శించిన అదనపు కలెక్టర్పటాన్చెరు టౌన్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువును శనివారం రాత్రి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి.. నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలపై ఆరా తీశారు. జీపీల్లో ఓటరు జాబితాఎంపీడీఓ మహేందర్రెడ్డి జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాను శనివారం అందుబాటులో ఉంచినట్లు ఎంపీడీఓ మహేందర్రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్, పోలింగ్స్టేషన్ జాబితాను పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించామన్నారు. జాబితాను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8 తేదీలోపు పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిష్కరించి 10న తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. -
హైకోర్టు స్టే హర్షణీయం
మసీదు నిర్వహణపై ముతవల్లీ డాక్టర్ అబ్దుల్ మజీద్ నారాయణఖేడ్: ఖేడ్లోని హష్మీ మసీదు ప్రత్యక్ష నిర్వహణ బాధ్యతలను వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్కు కల్పిస్తూ వక్ఫ్బోర్డు ఉత్తర్వులివ్వడంపై హైకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని మసీదు ముతవల్లీ డా.అబ్దుల్ మజీద్ పేర్కొన్నారు. ఖేడ్లో శనివారం మసీదు సబ్ ముతవల్లీ మొహిదాఖాన్తోపాటు పట్టణ ముస్లిం పెద్దలు ముంతాజ్, తౌసిఫ్, జకిరియాఖురేషి, మీర్ సాజిదలీ, ఖదీర్, ఫయాజ్, ఖతీబ్, అజీమ్ తదితరులతో కలసి విలేకరులకు స్టే ఉత్తర్వులను చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మసీదుకు 90 ఎకరాల భూములున్నాయన్నారు. భూములను అన్యాక్రాంతం చేసేందుకు ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేనివారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మసీదు భూములు, ఆస్తుల పై కోర్టు ఇదివరకే ఇంజక్షన్ ఆర్డరిచ్చినా మసీదు నిర్వహణ, ఆస్తులపై ప్రత్యక్ష బాధ్యతలను వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్కు అప్పగించడాన్ని సవాల్ చేయగా కోర్టు స్టే ఇచ్చిందని వివరించారు. -
ప్రకృతి సంరక్షణ అందరి బాధ్యత
మెగా వన మహోత్సవంలో కలెక్టర్ ప్రావీణ్య కొండాపూర్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని తొగరపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన మెగా వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..వన మహోత్సవం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కలుగుతుందన్నారు. పరీక్షలకు ముందుగానే అన్ని అంశాలపై విద్యార్థులు పట్టు సాధించి శత శాతం ఫలితాలు సాధించేలా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పీఎంశ్రీ కింద స్పోర్ట్స్ మెటీరియల్ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకుని విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. పాఠశాలలో అమలవుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథక కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన సంగారెడ్డి జోన్: వినాయక నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. శనివారం పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువు ఆవరణలో జరుగుతున్న నిమజ్జన వేడుకల ఏర్పాట్లు తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. -
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా
● 8 వరకు అభ్యంతరాల స్వీకరణ ● 10న తుది జాబితా సంగారెడ్డి జోన్: త్వరలో నిర్వహించే పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులోభాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి శనివారం జిల్లా వ్యాప్తంగా పంచాయతీలతోపాటు మండల పరిషత్తు కార్యాలయాల్లో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో 1,457 పోలింగ్ స్టేషన్ల వివరాలను ప్రచురించారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై ఈ నెల 6 నుంచి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 9న పరిష్కరించి, 10న జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితాను ప్రకటిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, విద్యుత్తో పాటు దివ్యాంగులకు ర్యాంపు సౌకర్యం కల్పించనున్నారు. గత నెల 30న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులను పరిశీలిస్తూ జాబితా రూపొందించాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
ౖపైపెకి పొంగంగ
జిల్లాలో సగటున 2.94 మీటర్లకు పెరిగిన నీటిమట్టం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భూగర్భ జలమట్టం ౖపైపెకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నీటిమట్టాలు భారీగా పెరిగాయి. గతేడాది 2024 ఆగస్టుతో పోలిస్తే జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం ఏకంగా 2.94 మీటర్లు పైకి వచ్చినట్లు భూగర్భజలశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. ఏడాది ఆగస్టులో జిల్లా సగటు నీటి మట్టం 11.06 మీటర్లు ఉండగా ఇప్పుడు 8.12 మీటర్లకు చేరింది. అత్యధికంగా ఝరాసంగం మండలంలో ఏకంగా 9.3 మీటర్లు పైకి వచ్చింది. ఇక్కడ గతేడాది ఆగస్టులో 11.32 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 1.93 మీటర్లకు పెరిగింది. కొండాపూర్లో 5.94 మీటర్లు, నారాయణఖేడ్ 5.06 మీటర్లు, నిజాంపేట్లో 5.24 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. భారీ వర్షాలు నమోదైన పుల్కల్ మండలంలో మాత్రం భూగర్భ జలమట్టం స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఇక్కడ 7.04 మీటర్ల నుంచి 8.60 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. 33 శాతం వర్షం అధికంగా.. ఈ నీటిమట్టాలు పెరగడానికి ప్రధాన కారణం గత నెలలో కురిసిన భారీ వర్షాలేనని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పంటలు నీటమునిగే స్థాయిలో వర్షాలు కురవడంతో వర్షం నీళ్లు భూమిలోకి భారీగా ఇంకి ఈ నీటి మట్టాలు పెరిగాయి. జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం 536.6 మి.మీలు కాగా, ఇప్పటివరకు 711.6 మి.మీ.ల వర్షపాతం రికార్డయింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 33 శాతం అధిక వర్షం కురిసింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 43 రోజుల వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఆగస్టులోనే వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాలకు కొన్ని బోరు బావుల్లోంచి నీళ్లు ఉబికి వచ్చాయి. జహీరాబాద్ మండలం పస్తాపూర్లో ఓ రైతు వ్యవసాయబోరు నుంచి మోటార్ ఆన్ చేయకపోయినా నీళ్లు పైకి వచ్చాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలో అక్కడక్కడ వెలుగులోకి వచ్చాయి. మండలం నీటిమట్టం (మీటర్లలో) కంగ్టి 16.17 హత్నూర 16.16 కల్హేర్ 14.52 గుమ్మడిదల 13.26 సంగారెడ్డి 12.97 కొండాపూర్ 12.59 పటాన్చెరు 12.47 నిజాంపేట 10.86 సిర్గాపూర్ 8.92 పుల్కల్ 8.60 అందోల్ 8.22 చౌటకూర్ 8.11 కోహీర్ 7.68 జిన్నారం 7.34 మండలం నీటిమట్టం (మీటర్లలో) సదాశివపేట 6.87 కంది 6.63 ఆర్సీపూర్ 6.11 జహీరాబాద్ 4.98 న్యాల్కల్ 3.87 నారాయణఖేడ్ 3.39 మొగుడంపల్లి 3.14 ఝరాసంగం 1.93 మనూర్ 1.84 రాయికోడ్ 1.73 మునిపల్లి 1.47 నాగల్గిద్ద 1.43 వట్పల్లి 1.04 అమీన్పూర్ 0.68జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో ఆగస్టులో నమోదైన భూగర్భ జలమట్టాలు..భూగర్భ జలశాఖ ప్రతీనెల 15వ తేదీ నుంచి 25 వరకు భూగర్భ జలమట్టాలను సేకరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 74 చోట్ల ఉన్న ఫీజో మీటర్లలో ఈ నీటిమట్టాలను సేకరించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతారు. -
మా బార్.. మా ఇష్టం
● అర్ధరాత్రి దాటాక కూడా అమ్మకాలు ● మందుబాబులకు అడ్డాగా సంగారెడ్డి! ● పట్టించుకోని అధికారులు సంగారెడ్డి: మందుబాబులకు సంగారెడ్డి అడ్డాగా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. నిర్దేశిత సమయం తర్వాత మూసేయాల్సిన బార్లు అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇక టిఫిన్ సెంటర్లు, ధాబాలు కూడా అర్ధరాత్రి దాటంగానే అవి కూడా మద్యం దుకాణాలుగా మారిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా పెట్రోలింగ్ పోలీసులు కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా బార్ల నిర్వహణ ఒకవైపు పట్టణంలో పోలీసులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం శ్రమిస్తుంటే బార్ల నిర్వాహకులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బార్ ప్రధాన ద్వారం మూసేసి బ్యాక్ డోర్ ద్వారా బార్లు నడుపుతున్నారు. తనిఖీలకు వచ్చిన పోలీసులకు ఎంతోకొంత ముట్టజెప్పడమో లేదా వారు వెళ్లాక మళ్లీ తమ వ్యాపారాన్ని కొనసాగించడమో చేస్తున్నారు. దీంతో యువత తమ ఇళ్లకు వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారుల అండతోనే! జిల్లాలోని బార్లు, బెల్ట్ మద్యం దుకాణాలు అధికారుల అండతోనే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. వారి అండతోనే నిర్వాహకులు తమకిష్టం వచ్చిన ధరకు అన్ని సమయాల్లో విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అనుమతుల్లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం సంగారెడ్డి చుట్టూ జాతీయ రహదారులు ఉండటంతో అల్పాహారం కోసం వెలసిన టిఫిన్ సెంటర్లు, ధాబాల్లో అర్ధరాత్రి దాటాక మద్యాన్ని అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు గానీ, పోలీసులుగానీ వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చర్యలు తీసుకుంటాం నిర్దేశిత సమయం మించి మద్యం అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవు. ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దు. –బి.మణెమ్మ, జిల్లా ఎకై ్సజ్ సహాయ అధికారి -
12 మేకలు మృత్యువాత
యూరియా నీళ్లు తాగి..వర్గల్(గజ్వేల్): యూరియా నీళ్లు తాగి 12 మేకలు మృతిచెందగా, మరో 52 అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన మండలంలోని గుంటిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఒక్కో మేక రూ.20వేల విలువ ఉంటుందని, రూ. 2.40 లక్షల నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానిక పశువైద్యాధికారి సర్వోత్తంయాదవ్ వివరాల ప్రకారం... బొమ్మ సాయిలు, బొమ్మ పాపయ్య తదితరులకు చెందిన మేకలు మేతకు వెళ్లి తిరిగొస్తూ ఓ పొలం వద్ద చేను కోసం బకెట్లో ఉన్న యూరియా కలిపిన నీళ్లను తాగాయి. కొద్దిసేపట్లోనే ఒకటి తరువాత ఒకటి 12 మేకలు మృతిచెందగా, మరో 52 అస్వస్థతకు గురయ్యాయి. బాధితులు వెంటనే అప్రమత్తమై పశువైద్యులకు సమాచారం అందించారు. పశువైద్యాధికారి సర్వోత్తంయాదవ్, వెటర్నరీ అసిస్టెంట్ మహేందర్, గోపాలమిత్ర రాంబాబు, ఆంజనేయులు అక్కడికి చేరుకుని చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన మేకలు కోలుకున్నాయని తెలిపారు.మరో 52 అస్వస్థత -
శభాష్.. పోలీస్
మద్దూరు(హుస్నాబాద్): ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాలు ఇలా... మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన ఎర్రబ్చల రాజు (46) తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన కుమారుడు శ్రీకాంత్కు ఫోన్ చేసి చెప్పి పెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా కంగారు పడిన కుమారుడు తిరిగి తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో శ్రీకాంత్ మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు పోలీసు సిబ్బంది రాజు ఫోన్ నంబర్ తీసుకుని సిద్దిపేట ఐటీ కోర్ సహాయంతో అతడు ఉన్న లొకేషన్ను గుర్తించారు. కూటిగల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అతడ్ని గుర్తించి, తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడి.. కుటుంబసభ్యులకు అప్పగింత -
నిమజ్జనానికి వెళ్లి.. నీట మునిగి..
హవేళిఘణాపూర్(మెదక్): వినాయక నిమజ్జనానికి వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తొగిటలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మొండి సుజాత ప్రభాకర్ ఏకై క కుమారుడు సుధాకర్(19) యూత్ సభ్యులతో కలిసి నిమజ్జనానికి గ్రామ శివారులో ఉన్న రామస్వామి చెరువులోకి వెళ్లారు. గణేశ్ను నిమజ్జనం చేస్తుండగా సుధాకర్ నీటిలో మునిగిపోయాడు. దీంతో గమనించిన తోటి యువకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గ్రామస్తుల సహకారంతో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సంతోశ్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుడు మృతి -
ఉద్యాన వర్సిటీకి దక్కని ర్యాంకింగ్
సాక్షి, సిద్దిపేట: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో సిద్దిపేటకు చెందిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీకి చోటు దక్కలేదు. 2025 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్ఐఆర్ఎఫ్ ఇటీవల విడుదల చేసింది. బోధన, శిక్షణ , మౌలిక వసతులు, పరిశోధన, వృత్తి నైపుణ్యం, మెలకువలు, ఉపాధి అవకాశాలు ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఇతర కొలమానాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను కేటాయిస్తారు. ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా మూడు కళాశాలలు, 11 రిసెర్చ్ స్టేషన్లు ఉండగా వీటికి దాదాపు 150 టీచింగ్ స్టాఫ్ ఉండాలి. కానీ 61 మంది మాత్రమే ఉన్నారు. ర్యాంక్ కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ప్రకటించే ర్యాంకింగ్ వరకై నా టీచింగ్ స్టాఫ్ను నియమించి , ర్యాంక్ వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్ల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గంగన్నగారి నాగరాజు(37) గోమారంలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి పెద్దగొట్టిముక్ల నుండి గోమారానికి నడుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, చిన్నారులు గౌరమ్మ, గంగమ్మ ఉన్నారు. లారీని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం చిన్నశంకరంపేట(మెదక్): వల్లూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన నార్సింగి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... జాతీయ రహదారిపై పెట్రోల్పంప్ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారు నాగపూర్ నుంచి ఒంగోల్కు వెళుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని నార్సింగి ఎస్ఐ సృజన తెలిపారు. -
నేడే గణేశ్ నిమజ్జనం
ఏర్పాట్లు పూర్తి● జిల్లాలో 3వేలకు పైగా విగ్రహాల ప్రతిష్ఠాపన ● నేడు రెండువేలకు పైగా నిమజ్జనం ● 800 మంది పోలీసులతో బందోబస్తుసంగారెడ్డి జోన్: గణనాథుడి నిమజ్జనం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 11 రోజులపాటు వైభవంగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. జిల్లాలో ఈ సంవత్సరం సుమారు 3వేలకు పైగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పటికే పలు విగ్రహాలు నిమజ్జనం జరగగా శనివారం సుమారు రెండు వేల వరకు జరగనున్నట్లు తెలుస్తుంది. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి గుండా చెరువు కట్ట వరకు విద్యుత్ దీపాలు, బారి కేడ్లు, కట్టకు ఇరువైపులా గ్రిల్స్, క్రేన్లు ఏర్పాటు చేశారు. కట్టపై రహదారికి తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టారు.పోలీసులతో బందోబస్తునిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 800 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు డైవర్షన్లు చేశారు. చెరువు వద్ద అనుకోని ప్రమాదాలు జరిగితే సహాయం కోసం గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంలను అందుబాటులో ఉంచారు.ప్రశాంతంగా నిమజ్జనానికి చర్యలు గణపతి నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. 800 మంది పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. శోభాయాత్ర సమయంలో నిర్వాహకులు అవసరం మేరకు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలి. పోలీసు అధికారులకు సహకరించాలి. – పరితోష్ పంకజ్, జిల్లా ఎస్పీ -
ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు
నర్సాపూర్ రూరల్: ట్రానన్స్ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన మండలంలోని కాగజ్ మద్దూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామంలో పెద్ద శబ్దంతో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు రావడంతో చుట్టుపక్కల ఇండ్లతో పాటు గ్రామంలోని ప్రధాన దారి వెంట వెళ్లే పాదచారులు, వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు పెట్టారు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తోనే పేలి మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ ఏడీ రమణ రెడ్డి తెలిపారు. వెంటనే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించి సరఫరాను పునరుద్ధరించారు.భయంతో పరుగులు పెట్టిన స్థానికులు -
వామ్మో ఇదేం భోజనం?
సిద్దిపేటఅర్బన్: సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం చెప్పిన విధంగా కామన్ డైట్ అందించడంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించాలని నిత్యం కలెక్టర్ హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అయినా కొందరు ప్రిన్సిపాల్స్కు, వంట సిబ్బందికి అవేం పట్టడం లేదు. వివరాలు ఇలా... సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో శుక్రవారం కొందరు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ను విజిట్ చేయగా కుళ్లిపోయిన కూరగాయలు, పురుగులు పట్టిన బీరకాయలు దర్శనమిచ్చాయి. హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రతతో నిండిపోయాయి. దోమతెరలు లేకపోవడంతో నిద్రించే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని, చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థినులకు దుస్తులు, ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ప్రిన్సిపాల్ విద్యార్థినిల పట్ల దురుసుగా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం హాస్టళ్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్ ఈ హాస్టల్పై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. హాస్టల్లో కుళ్లిన కూరగాయలతో వంటలు నిత్యం తనిఖీలు చేస్తున్నా కానరాని మార్పు చర్యలు తీసుకోవాలి: విద్యార్థుల తల్లిదండ్రులు -
సెక్యూరిటీ నియామకం.. వివాదం
కొల్చారం(నర్సాపూర్): సెక్యూరిటీ గార్డుల నియామకంలో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని ఐఎంఎల్ డిపో ఎదుట నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. శుక్రవారం మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామ శివారులోని ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్)డిపోలో సెక్యూరిటీ నియామకంలో అవకతవకలు జరిగాయంటూ నిరుద్యోగులు ప్రభుత్వానికి, డిపో మేనేజర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో హమాలీల నియామకంలో కొందరు, డిపో మేనేజర్ కుమ్మకై ్క లక్షల రూపాయలు దండుకొని అమ్ముకున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎకై ్సజ్ కమిషనరేట్, ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అప్పట్లో ధర్నాకు దిగడంతో నియామకాలు రద్దు చేశారని, అయితే ప్రైవేటుగా ఏ నియామకం చేపట్టినా స్థానిక యువతకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్నారు. కొన్ని రోజుల క్రితం డిపోలో పనిచేస్తున్న 5 మంది సెక్యూరిటీ గార్డులు పదవీ విరమణ పొందగా, వారి స్థానంలో నియామకం కోసం ఎంకే సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించారు.ఐఎంఎల్ డిపో ఎదుట నిరుద్యోగుల నిరసన -
శిథిలమై.. మూతబడి
పాఠశాల భవనం శిథిలమై పెచ్చులూడుతున్నాయి. తరగతి గదులు ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందన్న భయంతో స్కూల్ను మూసేశారు. ఉర్దు మీడియం ప్రాథమిక పాఠశాల బిల్డింగ్లోకి స్కూల్ను మార్చారు. షిప్టు పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒంటిపూట బడి కారణంగా పాఠాలు అర్థంకాక విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. కాగా మల్చెల్మలో నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామంలో 1969లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం నిర్మించారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఉర్దు మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. సుమారు 200 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 16 గదులు ఉండగా దశాబ్దాల కాలం క్రితం నిర్మించిన కారణంగా వాటిలో 14 గదులు పూర్తిగా దెబ్బతిని శిథిలమయ్యాయి. భవనం గోడలు బీటలు వారి పైకప్పు పెచ్చులు ఊడి స్లాబ్ కూలుతుంది. వర్షం కురిస్తే చాలు తరగతి గదుల్లో నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణమైనా కూలుతుందన్న భయంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉన్నత పాఠశాలను ప్రైమరీ స్కూల్ బిల్డింగ్లోకి తరలించి, నాలుగేళ్ల నుంచి షిఫ్టుల పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 12.30 గంటల వరకు ప్రైమరీ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిఫూట బడి నడుస్తుంది.శిథిలావస్థకు చేరిన మల్చెల్మ పాఠశాల భవనంనష్టపోతున్న విద్యార్థులుమల్చెల్మలో షిఫ్టు పద్ధతిలో తరగతుల నిర్వహణ పడిపోతున్న విద్యాప్రమాణాలు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పట్టించుకోని అధికారులుషిఫ్టుల పద్ధతితో ఉన్నత పాఠశాల విద్యార్థులు నష్టపోతున్నారు. సమయం తక్కువగా ఉండటం వల్ల పాఠాలు అర్థం కావడం లేదని, దూర ప్రాంతాల నుంచి రాకపోకలకు కష్టమవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఒంటి ఫూట వల్ల పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని, ఆటలాడటం వల్ల చదవుపై శ్రద్ధ పెట్టడం లేదని తల్లిదండ్రులు టీసీలు తీసుకెళుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. విద్యార్థుల సంఖ్య 300 నుంచి ప్రస్తుతం 200 మందికి వచ్చింది. 2012 సంవత్సరంలో హైస్కూల్కు నూతన భవనం కోసం రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. నూతన భవన నిర్మాణం కోసం రెండెకరాల స్థలం కూడా ఎంపిక చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంత వరకు నిర్మాణ పనులకు ముందడుగు పడలేదు. నిధులు రద్దు కాగా ఆ తరువాత పాఠశాల గురించి పట్టించుకునే వారు కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కలెక్టర్ శ్రద్ధ తీసుకుని మల్చెల్మ పాఠశాలకు నూతన భవనాన్ని కట్టించాలని కోరుతున్నారు. -
తల్లీకూతుళ్లు అదృశ్యం
తూప్రాన్: ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన మండలంలోని మల్కాపూర్లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చింతల మహేందర్కు శిరీషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. హైదరాబాద్కు వెళ్లి అక్కడే పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్ ఆరోగ్యం క్షిణించడంతో రెండు నెలల క్రితం తిరిగి స్వగ్రామానికి వచ్చారు. కాగా ఈ నెల 4న గురువారం హైదరాబాద్లో పని ఉందని మహేందర్ భార్యతో చెప్పడంతో, తాను కూడా వస్తానని గొడవపడింది. శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి భార్య శిరీషా, కూతుళ్లు హారిక,ఆద్యతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆన్లైన్లో దుస్తులు కొనేందుకు యత్నం..
రూ.98 వేలు పోగొట్టుకున్న వ్యాపారి పటాన్చెరు టౌన్: ఆన్లైన్లో దుస్తులు కొనేందుకు యత్నించిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్కు చెందిన ఓ బట్టల వ్యాపారి జులై 23న ఆన్లైన్లో బట్టలు కొనేందుకు సెర్చ్ చేస్తూ, తన ఫోన్నంబర్ను కొన్ని సైట్లలో నమోదు చేశాడు. దీంతో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మీరు దుస్తుల కోసం సర్చ్ చేస్తున్నారు కదా.. అని బాధితుడి నుండి వివరాలు తీసుకున్నాడు. దుస్తులను పంపేందుకు రూ.98 వేలు చెల్లించాలని కోరగా.. బాధితుడు బ్యాంకు ద్వారా నగదును అపరిచిత వ్యక్తికి పంపించాడు. ఈ క్రమంలో అతడికి ఫోన్ చేయగా మెటీరియల్ ఫొటోలను పంపుతున్నానని చెబుతూ వచ్చాడు. చివరికి మోసపోయినట్టు గ్రహించి ముందుగా సైబర్ క్రైమ్, శుక్రవారం పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికపై అత్యాచార యత్నం : పోక్సో కేసు నమోదు నారాయణఖేడ్: బాలికపై ప్రేమ పేరుతో యువకుడు అత్యాచార యత్నం చేశాడు. ఈ ఘటన మండలంలోని అంత్వార్ గ్రామశివారులో చోటుచేసుకుంది. ఎస్సై విద్యాచరణ్రెడ్డి వివరాల ప్రకారం... న్యాల్కల్ మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక, సిర్గాపూర్ మండలానికి చెందిన 19 ఏళ్ల యువకుడు బంధువులు. వినాయక ఉత్సవాల్లో భాగంగా బాలిక ఖేడ్ మండలం అంత్వార్ గ్రామంలోని బంధువుల వద్దకు వచ్చింది. దీంతో ఆ యువకుడు సైతం అక్కడికి వచ్చాడు. కాగా బంధువులు రాత్రి సమయంలో వినాయక నిమజ్జనంలో ఉన్న సమయంలో యువకుడు బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక గాయాలపాలైంది. అక్కడి నుండి యువకుడు పారిపోయాడు. ఈ విషయం బాలిక బంధువులకు తెలువడంతో చికిత్స నిమిత్తం ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భెల్ కార్మిక నేత కన్నుమూత
రామచంద్రాపురం(పటాన్చెరు): బీహెచ్ఈఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు జి.ఎల్లయ్య (84) శుక్రవారం కృష్టారెడ్డిపేటలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఎల్లయ్య.. 1967లో బీహెచ్ఈఎల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగంలో చేరారు. ఐఎనన్టీయూసీ తరపున కార్మిక సంఘం ఎన్నికల్లో 9 సార్లు విజయం సాధించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ పిలుపు మేరకు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. 1999లో కాంగ్రెస్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా.. కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్ని, అలాగూజజ 2009లో సైతం బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని కేసీఆర్ సూచించినా సున్నితంగా తిరస్కరించారు. హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా కార్మికులకు సొంత ఇంటి కలను నిజం చేశారు. కార్మికులకు చేసిన సేవలకు గుర్తింపుగా రెండు సార్లు కార్మికరత్న అవార్డు అందుకున్నారు. కాగా, ఎల్లయ్య అంత్యక్రియలు శనివారం రామచంద్రాపురం శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. కేటీఆర్, హరీశ్ సంతాపం ఎల్లయ్య మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు అమోఘమని కొనియాడారు. సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. భెల్ కార్మికులందరికీ ఒక బలమైన గొంతుకగా మారిన ఎల్లయ్య జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన మృతి కార్మిక లోకానికే కాకుండా తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
కేతకీలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి
ఝరాసంగం(జహీరాబాద్): హైకోర్టు సిట్టింగ్ జడ్జి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ జ్యూడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం శ్రీకేతకీ సంగమేశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు, అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అమృతగుండంలో జల లింగానికి పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అర్చకులు అందించి, సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్రావు పాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో మేలునారాయణఖేడ్: జీఎస్టీ తగ్గింపు ద్వారా ధరలు తగ్గి పేదలకు మేలు జరిగేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కృషి చేశారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పత్తిరి రామకృష్ణ పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా ధరలను తగ్గించినందుకు గాను శుక్రవారం ఖేడ్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ పేదల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీదేనని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో ఖేడ్ మండలశాఖ అధ్యక్షుడు దశరథ్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, నాయకులు సుగుణాకర్, మానిక్, సాయేందర్, సిద్ధయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. సింగూరుకు కొనసాగుతున్న వరదపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి 25,010 క్యూసెక్కులు వస్తుండగా...అంతే నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. జలవిద్యుత్ కేంద్రానికి 2,250 క్యూసెక్కులు వదులుతుండగా రెండు టర్బయిన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్లో 16.500 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేమాజీ డీజీపీ మహేందర్రెడ్డి సంగారెడ్డి టౌన్ : ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి సంపన్నులని మాజీ డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ కళాశాలలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని దేశాభివృద్ధికి జాతి నిర్మాణానికి కీలకమన్నారు. టీచర్ల వల్లే ప్రతీ విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి రూ.25 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెన్నార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎం.ఎన్.రాజు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. -
అమీన్పూర్లోనే నవోదయ
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరైంది. రూ.15 వందల కోట్లతో అమీన్పూర్లో ఏర్పాటు చేయనున్నారు. నవోదయ పాఠశాల ఏర్పాటు అంశంపై ఏర్పడిన సస్పెన్స్కు తెర పడింది. ఎంపీ రఘునందన్రావు సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ నవోదయ పాఠశాల మంజూరు అంశంపై వివరాలను వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నవోదయ పాఠశాల డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెహ్రాను కలిసి నవోదయ పాఠశాలను సంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటు చేయాలని తాను విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. తన విజ్ఙప్తిని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. పాఠశాల నిర్మాణం, తాత్కాలిక వసతి సదుపాయాలపై సమగ్రంగా చర్చించామన్నారు. అమీన్పూర్లోనే పాఠశాల ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ కమిషనర్ను ఒప్పించినట్లు ఎంపీ తెలిపారు.రూ.1500 కోట్లతో నిర్మించే ఈ పాఠశాలకు ప్రతిఏటా రూ.500 కోట్ల చొప్పున మూడేళ్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక వసతి కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్లో కేటాయించనున్న స్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు వచ్చే వారం క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారని రఘునందన్ వివరించారు. నవోదయ పాఠశాలను జిల్లాకు కేటాయించినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. రూ.1,500కోట్లతో పాఠశాల ఏర్పాటు కేంద్రాన్ని ఒప్పించిన ఎంపీ రఘునందన్ వారం రోజుల్లో స్థల పరిశీలన -
త్వరలో 8వేల పోస్టుల భర్తీ
నారాయణఖేడ్: పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి రూ.1.15 కోట్లతో నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షహాలు విస్తరణ, సదుపాయాలు, రూ.3.9 కోట్లతో అర్బన్ పార్కు ఏర్పాటు, ఖేడ్ చుట్టూ సీసీతో రింగ్రోడ్డు, మనూరు మండలం డోవూరు నుంచి ఎల్గొయి, అతిమ్యాల్ మీదుగా ఎన్.జి. హుక్రానా వరకు రూ.6 కోట్లతో తారురోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైనా వైద్య అందేలా చర్యలు చేపట్టామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో 9 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 8 వేల పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పోస్టుల భర్తీతో కార్పొరేట్ అసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. అర్బన్ పార్కు అటవీ సంరక్షణతోపాటు జనాలకు ఆహ్లాదం, ఆరోగ్యం కోసం దోహదపడుతుందన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఖేడ్ను విద్య, వైద్యరంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎఫ్ శ్రీధర్రావు, డీఎంఅండ్హెచ్ఓ నాగనిర్మల, మున్సిపల్ కమిషనరు జగ్జీవన్ పాల్గొన్నారు. విద్యా, వైద్యరంగాలకు ప్రాధాన్యం ప్రభుత్వం విద్యా, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని దామోదర తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులైన ఐదుగురిని, డివిజన్ స్థాయిలో ఎంపికై న 70 మందిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ కల్హేర్(నారాయణఖేడ్): వైద్యరంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ భ్రష్టు పట్టించిందని మంత్రి విమర్శించారు. సిర్గాపూర్లో పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రుల్లో వసతులు కలిపించామనితెలిపారు. జగ్గన్నా.. వైద్యసేవలను పర్యవేక్షించండి సంగారెడ్డి: జిల్లా కేంద్ర ఆస్పత్రి, మెడికల్ కళాశాలను పది రోజులకోసారి సందర్శించి వైద్యసేవలను పర్యవేక్షించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి మంత్రి దామోదర సూచించారు. ఇంకా ఏమైనా అవసరాలుంటే నివేదిక ఇవ్వాలన్నారు. వైద్య కళాశాల, నూతన భవనాలు, హాస్టల్ భవనం, క్రిటికల్ కేర్ యూనిట్లు వంటి వాటిని పరిశీలించాలనిసూచించారు. -
శిథిలమై.. మూతబడి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ పాతభవనం పైనుంచి పెచ్చులూడుతుండటంతో మూతబడింది. వివరాలు 8లో u
హైదరాబాద్ శిల్పారామంలో యోగితా రాణా చేతుల మీదుగా అవార్డునందుకుంటున్న ఉపాధ్యాయులు డాక్టర్ సదయకుమార్, వాకిట శ్రీదేవి, విద్యాసాగర్ఉత్తములకు పురస్కారంసంగారెడ్డి ఎడ్యుకేషన్ /జిన్నారం: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు విద్యాసాగర్, డాక్టర్ సదయ్కుమార్, వాకిట శ్రీదేవిలను శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మాంచి అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని శిల్పారామంలో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్లు అవార్డులు అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి విభాగంలో ఎంపికై న విద్యాసాగర్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పలు పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక విభాగంలో ఎంపికై న డాక్టర్ సదయ్కుమార్ విద్యార్థులకు నూతన పద్ధతుల్లో బోధన చేయడంతోపాటు ఎన్సీసీ ద్వారా విద్యార్థులను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. గుమ్మడిదల పట్టణ పరిధిలోని అన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వాకిట శ్రీదేవి బోధనలో విద్యార్థులకు ఆసక్తికరంగా బోధన చేయడంతోపాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నందుకుగాను ఉత్తమ అవార్డుకు ఎంపికై న సంగతి తెలిసిందే. -
డీడీఎస్–కేవీకేకు 4 అవార్డులు
● అటారీ జోన్–10 వార్షిక వర్క్షాప్లో ఎంపిక ● అవార్డు అందుకున్న శాస్త్రవేత్త వరప్రసాద్మెరుగైన ఐఐటీహెచ్ ర్యాంకింగ్● ఇంజనీరింగ్లో 7వ స్థానం ● తొలితరం ఐఐటీలను దాటి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్)లో హైదరాబాద్ ఐఐటీ మెరుగైన ర్యాంకింగ్ను సాధించింది. మొట్ట మొదటిసారి తొలితరం ఐఐటీలను దాటివేసింది. ఇంజనీరింగ్ విభాగంలో గతేడాది (2024లో) దేశంలోనే 8వ ర్యాంకు ఉండగా, ఈసారి 7వ స్థానానికి చేరింది. నూతన ఆవిష్కరణలో 6వ ర్యాంకు సాధించింది. పరిశోధనల్లో 15వ ర్యాంకు, ఓవరాల్ ర్యాంకింగ్లో 12వ ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ..ఆత్మనిర్భర్భారత్, డిజిటల్ ఇండియా, వికసిత భారత్–2047 వంటి జాతీయ మిషన్లలో లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పాటునందించేందుకు సంస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సెమీ కండక్టర్లు, సస్టైనబుల్ ఎనర్జీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళతామన్నారు.విజయగాథలు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు జహీరాబాద్: తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో అటారి జోన్–10 పరిధిలోని 72 కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ వర్క్షాప్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డీడీఎస్–కేవీకేకు నాలుగు అవార్డులు లభించాయి. నాలుగు విభాగాల్లో లభించిన అవార్డులను డీడీఎస్–కేవీకే సీనియర్ శాస్త్రవేత్త సి.వరప్రసాద్ వెల్లూర్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను అందుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు వెల్లూర్లో కేవీకేల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు, చిక్కుడులో అధిక దిగుబడి సాధించడం, అడవి పందుల నివారణకు పరికరం అమర్చడం, పెరటి కోళ్లపెంపకంలో సాధించిన విజయాలకు గాను అవార్డులు దక్కాయి. మట్టి ఆరోగ్య కార్డులు, మట్టి శాస్త్రంపై ఆధారపడి సమగ్ర పోషక పదార్థాల నిర్వహణను ప్రోత్సహించడంలో విశిష్ట ప్రతిభ కనబర్చినందుకు గాను ప్రత్యేక అభినందన పత్రాన్ని డీడీఎస్–కేవీకే అందుకుంది. ఉత్తమ విజయ గాథల విభాగం, ఉత్తమ బాక్స్ ఐటెమ్స్ కంటెంట్ విభాగంలలో రెండో స్థానం దక్కించుకుంది. అత్యధిక భూమి ఆరోగ్య కార్డులు జారీ చేసిన విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరంలో డీడీఎస్–కేవీకేలో సుమారు 2వేల మట్టి శాంపిళ్లను విశ్లేషించి రైతులకు ఉచితంగా మట్టి ఆరోగ్య కార్డులను అందజేశారు. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నిరంతరం మట్టి ఆరోగ్య కార్డుల విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో గురువారం స్థానిక భరోసా కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ పద్ధతులను ప్రదర్శించారు. ఫిల్లిస్ క్రిస్టల్ మెథడ్ ద్వారా మానసిక శాంతి, అవగాహన పెరుగుతుందని వివరించారు. ఈ పద్ధతులను విద్యార్థులు ప్రతిరోజూ సాధన చేసేలా పీఈటీ టీచర్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. యువతకు చట్టపరమైన అవగాహన, భద్రతా చర్యలు, మానసిక ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత, కౌన్సిలర్ సౌమ్య, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీపీఓలు వస్తున్నారు!
● ఉమ్మడి జిల్లాకు 482 మంది ఎంపిక ● నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలుజిల్లా క్లస్టర్లు జీపీఓలు సిద్దిపేట 246 150 మెదక్ 185 113 సంగారెడ్డి 325 209 సాక్షి, సిద్దిపేట: గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారులను(జీపీఓ)లను నియమిస్తోంది. వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థలను 2022లో రద్దు చేసి అర్హత ఆధారంగా పలు శాఖలలో వివిధ పోస్టులలో భర్తీ చేశారు. అనంతరం ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓల నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హత పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 482 మంది ఎంపికవ్వగా.. వీరందరూ మాదాపూర్లోని హైటెక్స్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం నియామకపత్రాలు అందుకోనున్నారు. 756 క్లస్టర్లుగా విభజన దాదాపు 5వేల ఎకరాల భూ విస్తీర్ణం ప్రకారం క్లస్టర్లుగా విభజించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 756 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్కు ఒక్కో జీపీఓను నియమించనున్నారు. ఈ క్రమంలోనే జిల్లా నుంచి 482 జీపీఓలుగా ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 239 మంది జీపీఓలుగా ఎంపిక చేయగా.. 20 మంది మెదక్, మరో పది మందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. సిద్దిపేట జిల్లాలో 146 మంది ఎంపికవ్వగా.. మరో నలుగురిని ఇతర జిల్లాల నుంచి కేటాయించారు. ఇక, ఉమ్మడి మెదక్లో 274 క్లస్టర్లకు ఖాళీలుండనున్నాయి. సంతోషంగా ఉంది మా మాతృ శాఖకు తిరిగి వెళ్లడం సంతోషంగా ఉంది. మూడేళ్లు ఇతర శాఖలో పని చేసిన సర్వీ స్, రెవెన్యూలో చేసిన పాత సర్వీస్ను సైతం పరిగణలోకి తీసుకోవాలి. పాత సర్వీస్ను ఫారెన్ సర్వీస్గా పరిగణించి పదోన్నతులు, సర్వీస్ల్లో కలపాలి. – వేణు, మెదక్ అన్ని ఏర్పాట్లు చేశాం జీపీఓ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులను తరలించేందుకు మూడు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశాం. ఈ కార్యక్రమానికి తరలించేందుకు పది మంది అధికారులను నియమించాం. – అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్, సిద్దిపేట -
అవగాహన కల్పించాం
మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్హెచ్వీఆర్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను యాప్లో నమోదు చేయాలి. తప్పుడు సమాచారం నమోదు ఎట్టి పరిస్థితుల్లోను చేయరాదని వివరించాం. – మురళి, ఆర్పీ, న్యాల్కల్ 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయాలి ఎస్హెచ్వీర్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 30లోగా తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. దరఖాస్తులో వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలి. జిల్లాలో 8 పాఠశాలలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికచేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి -
రాష్ట్ర ఉత్తమ పంతులమ్మగా రేఖ
మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 13 ఏళ్లుగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న రేఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది. 2022లో ఈ పాఠశాలకు ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్రావు రూ.60లక్షలు అందించగా.. నూతన గదులు నిర్మించి విద్యార్థులకు విద్యను బోధించారు. దీంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు దాతల సహకారంతో ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున ప్రోత్సాహం అందించారు. అలాగే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని సిద్ర 578 మార్కులు సాధించి కలెక్టర్ చేతుల మీదుగా రూ.10 వేల నగుదు అందుకున్నారు. ప్రతి ఏడాది సైన్స్ ఫెయిర్లు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాయిలు పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలోని గాజులగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 27 ఏళ్లుగా విద్యాశాఖలో సేవలతోపాటు సినీ గేయ రచయితగా, విద్యాశాఖ మార్గ దర్శిగా నిరవధిక సేవలందిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను పరిపూర్ణ వికాస వంతులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషిని గుర్తించి విద్యాశాఖ ఆయనను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. -
ముందస్తుగా ‘మహమ్మారి’ గుర్తించొచ్చు!
డీప్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థను రూపొందించిన విద్యార్థిపటాన్చెరు: కోవిడ్–19 వంటి మహమ్మారిలను ముందుస్తుగా గుర్తించేలా డీప్ లెర్నింగ్ ఆధారిత ముందస్తు అంచనా వ్యవస్థను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని పరిశోధక విద్యార్థి రాజేందర్ అభివృద్ధి చేశారు. ‘టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్, డీప్ న్యూరల్ నెట్ వర్కులను ఉపయోగించి కోవిడ్–19 డేటా యొక్క విశ్లేషణాత్మక అధ్యయనాన్ని’ ఆయన విజయవంతంగా పూర్తి చేసినట్లు గణితం, గణాంక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరిశోధన ఆరోగ్య సంరక్షణ విశ్లేషణల్లో అధునాతన గణన పద్ధతుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తోందన్నారు.