
● ఐఐటీ హ్యాపీనెస్
ఐఐటీ మద్రాసు రేఖీ ఫౌండేషన్ నేతృత్వంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ను ఏర్పాటు చేశారు. ఇది విద్యాపరంగా పాఠ్యాంశాలలో ఆనంద శాస్త్రం, అధ్యయనాలను సమగ్రపరచడం వంటి అనేక అంశాలపై దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు బుధవారం జరిగాయి. రేఖి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీందర్ సింగ్రేఖి, ఐఐటీ మద్రాసు డీన్ ప్రొఫెసర్ మను సంతానం, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రొఫెసర్ తేన్మొళి, ప్రొఫెసర్ రూపశ్రీ బరాల్, ప్రొఫెసర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. – సాక్షి, చైన్నె
సెయిలింగ్ పోటీలు
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లతో సెయిలింగ్ పడవ పోటీలు చైన్నె–నాగపట్టణం మధ్య పూంపుహార్ హార్బర్ వద్ద జరిగాయి. రాయల్ మద్రాస్ యాచ్ట్ క్లబ్ సౌజన్యంతో సాగిన ఈ పోటీల్లో ఎన్సీసీ మహిళా క్యాడెట్లు సైతం తమ ప్రతిభను చాటారు. –సాక్షి, చైన్నె
ఐజేయూ సమావేశాలు
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలు చైన్నెలో బుధవారం ప్రారంభమయ్యాయి. వేప్పేరిలోని వైఎంసీఏ మినీ ఆడిటోరియం వేదికగా ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన గురువారం కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాన్ని సినీ నటి గౌతమి, సీనియర్ జర్నలిస్టు శశికళ రవీంద్ర దాస్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, తమిళనాడు జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు డీఎస్ఆర్ సుభాష్తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఐజేయూ ప్రతినిధులు, నిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. – సాక్షి, చైన్నె
కాలువలో శిశువు మృతదేహం
అన్నానగర్: చైన్నె పట్టినంబాక్కం మసీదు వీధి సమీపంలోని కాలువలో ఓ శిశువు మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. ప్లాస్టిక్ పేపర్లో చుట్టి ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి ఆ ప్రాంత ప్రజలు షాక్కు గురయ్యారు. విషయం తెలుసుకున్న పట్టినంబాక్కం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● ఐఐటీ హ్యాపీనెస్

● ఐఐటీ హ్యాపీనెస్