కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో చికిత్స పొందుతున్న నిందితునిపై ఓ వర్గం దాడికి ప్రయత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీ చార్జీ చేశారు. ఈ నేపథ్యంలో జనాలు ప్రతిదాడికి దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. నిందితున్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
Published Tue, Jul 21 2015 9:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement