kurnool
-
కర్నూల్ హాస్టల్ లో దారుణం.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా
కర్నూల్: జిల్లాలోని కోడుమూరు ఎస్సీ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. చిన్న పిల్లలు అని చూడకుండా ఏడో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి విచక్షణా రహితంగా విరుచుకుపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.తన బెల్టు తీసుకుని ఆ విద్యార్థులను చితకబాదాడు. తన మాట వినలేదని చెప్పి ఏడో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టాడు. దాడికి పాల్పడ్డ పదో తరగతి విద్యార్థి అనధికారంగా హాస్టల్ ఉంటున్నట్లు తెలుస్తోంది. -
World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు -
మా వాహనాన్నే ఆపుతావా..
సాక్షి టాస్్కఫోర్స్: ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్గేట్ వద్ద ఓ ఎస్ఐ హల్చల్ చేశారు. మా వాహనాన్నే ఆపుతావా అని అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో టోల్బూత్లో ఏర్పాటు చేసిన బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఈ ఘటన బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు ఎస్ఐ కర్నూలు ఉపకారాగారం నుంచి ఓ ముద్దాయిని స్టేషన్కు తీసుకొచ్చారు. స్వయంగా ఆయనే కారు నడుపుతున్నారు. వాహనం నన్నూరు టోల్గేట్కు చేరుకోగా ముందున్న మరో వాహనం ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడంతో సిబ్బంది మాన్యువల్గా టోల్ రుసుము వసూలు చేశారు. ఆ వెంటనే బూమ్ బ్యారియర్ యథాస్థితికి వస్తుండగా ఎస్ఐ నడుపుతున్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. ఆ సమయంలో బూమ్ బ్యారియర్ దెబ్బతినింది. ఇంతలో టోల్ సిబ్బంది వాహనం చుట్టూ గుమికూడటంతో ఎస్ఐ బూతు పురాణం మొదలుపెట్టారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ గద్దించారు. అంతటితో ఆగకుండా టోల్ కలెక్టర్ మహబూబ్బాషాను బలవంతంగా అదే వాహనంలో ఎక్కించుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. టోల్ సిబ్బంది బతిమాలినా ఫలితం లేకపోయింది. ఉద్యోగిని తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారు. అయితే విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో టోల్ ఉద్యోగిని విడిచిపెట్టడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలోనూ ఈ ఎస్ఐ టోల్గేట్ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన మఫ్టీలో కారు నడుపుతుండగా సిబ్బంది ఐడీ కార్డు అడిగినట్లు తెలిసింది. నన్నే కార్డు అడుగుతావా అని సిబ్బందిపై విరుచుకుపడినట్లు సమాచారం. -
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు
కర్నూలు: అదనపు కట్నం కోసం అత్త, మామ, బావ కలిసి వేధిస్తున్నారని పత్తికొండకు చెందిన వి.రమాదేవి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులొచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..⇒ కర్నూలు ఫుడ్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకుని మోసం చేసిన కేసులో కర్నూలుకు చెందిన జాకీర్ బాషా, అయేషా బాను, జహీర్ బాషా అరెస్టయి కండీషన్ బెయిల్పై విడుదలయ్యారని, ఈ కేసు దర్యాప్తును పకడ్బందీగా చేసి న్యాయం చేయాలని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.⇒ తన కుమారుడు పెద్ద మద్దిలేటి, మనవడు మధు కలిసి తన పొలాన్ని వారి పేరు మీద ఆన్లైన్లో అడంగల్లో ఎక్కించుకున్నారని, పొలం తప్ప తనకు వేరే జీవనాధారం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన వెంకన్న ఫిర్యాదు చేశాడు.⇒ డీఆర్డీఏ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వెంకటరత్నం ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందేలా చేస్తానని ఆశ పెట్టి డబ్బు తీసుకుని మోసం చేశాడని హాలహర్వికి చెందిన శీలం నాగమ్మ ఫిర్యాదు చేశారు.⇒ పిల్లల చదువుల కోసం చీటీలు వేసి దాచుకున్న డబ్బు ఇవ్వకుండా జొహరాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ తప్పించుకుని తిరుగుతున్నాడని ఇందిరమ్మ గృహాలకు చెందిన చాకలి రామచంద్రుడు ఫిర్యాదు చేశారు. -
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
కూటమి తెచ్చిన మార్పుకు ఉదాహరణగా నిలుస్తున్న చిన్నారి
-
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్లో కేసు.. బెయిల్కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
మరో కేసులో కోర్టుకు పోసాని
-
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
పోసాని మురళీకృష్ణపై కూటమి నేతల కుట్రలు
-
కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పీఎస్ లో పోసానిపై కేసు నమోదు
-
కర్నూలు ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడని మంత్రి టీజీ భరత్
-
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్కు వెళ్తున్నా’
కర్నూలు: మరో రెండు రోజుల్లో పాఠశాలలో వేడుక ఉంది. అందులో నిర్వహించే డ్యాన్స్ కార్యక్రమంలో అందరినీ అలరించాలని ఆ బాలుడు ఎంతో ఎదురు చూశాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్కు వెళ్తున్నా’ అని ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు విగత జీవిగా తిరిగొచ్చాడు. తండ్రి కళ్లేదుటే ఆ కుమారుడు లారీ చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని లంగర్బావి వీధికి చెందిన గురురాజ, ప్రతిభ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సత్యనారాయణ 9వ తరగతి, ద్వితీయ కుమారుడు ఆదిత్యనారాయణ (10) ఐదో తరగతి చదువుతున్నారు. గురురాజ.. మెడికల్ ఏజెన్సీ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్యనారాయణ విద్యనభ్యసిస్తున్నాడు. అకాడమీ పూర్తి కావడంతో మంగళవారం ఫెర్వెల్ పార్టీ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం కొందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదిత్యనారాయణ ఉదయం తన తండ్రి గురురాజతో బైక్పై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎమ్మిగనూరు రోడ్డులోని శ్రీ కృష్ణదేవాలయం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ లారీ ఆదోని వైపు వేగంగా దూసుకువస్తుండగా తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు. అయితే గురురాజ ఒకవైపు పడిపోయి సురక్షితంగా ఉన్నాడు. మరోవైపు ఆదిత్యనారాయణ లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు మృతిచెందినా లారీని నిలబెట్టకుండా డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి ప్రమాద స్థలానికి చేరుకుని.. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి గురురాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న లారీ డ్రైవర్, లారీని సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.అమ్మా.. నేనేం పాపం చేశా! -
కర్నూల్ లో జీబీఎస్ కలకలం.. మహిళకు వైరస్ నిర్ధారణ
-
Kurnool Bench: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ... బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయం అని తెలిపింది. ఆ లేఖ తమపై ప్రభావం చూపదని పేర్కొంది.‘‘బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటాం. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నాం. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నాం’’ అని న్యాయస్థానం తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?.. అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు అని.. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు ఉండక పోవచ్చు కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్కు కోర్టు చెప్పింది. మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్ను పెండింగ్లో పెట్టాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 3 నెలలకు కోర్టు వాయిదా వేసింది. -
ఏపీలో బర్డ్ఫ్లూ కేసుల కలకలం.. ఈ సారి ఎక్కడంటే
కర్నూల్,సాక్షి: కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ప్లూ సోకి బాతులు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు నగరంలోని ఎన్ ఆర్ పేటను రెడ్ అలర్ట్ జోన్గా ప్రకటించింది. ఎన్ఆర్ పేటలోని బెస్త రాజుకు చెందిన 15 బాతులు మృతి చెందడం, అందుకు బర్డ్ ఫ్లూ కారణమని ల్యాబ్ నుంచి నివేదిక రావడంతో చుట్టూ కిలోమీటర్ మేర రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో చికెన్, గుడ్లు అమ్మకాలు చేపట్టకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఆరుగురు పశు సంవర్థక శాఖ అధికారులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, ఇతర పక్షులు అకస్మాత్తుగా మరణిస్తుంటే వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్లు, బర్డ్స్ పెంపకందారులకు సూచించారు వేగంగా సోకుతున్న బర్డ్ఫ్లూరాష్ట్రంలో కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (హెచ్5ఎన్1–బర్డ్ ఫ్లూ) వేగంగా సోకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ఫ్లూ నమోదైన ఘటనలు చోటు చేసుకోలేదని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాధి బారినపడిన పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అరుదుగా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు లేవన్నారు. ఇక మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఔట్ బ్రేక్స్ ఇప్పటి వరకూ సంభవించలేదని తెలిపారు. మనుషులకు వ్యాధి సోకినట్లైతే జ్వరం, దగ్గు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయన్నారు.ఈ వ్యాధి నుంచి రక్షణ కోసం పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలని, వ్యాధి బారినపడిన కోళ్లు, జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఈ తరహా కేసులు వ్యక్తుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెలుగు చూడలేదు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు హెచ్5ఎన్1, రెండు హెచ్9ఎన్2 కేసులు వెలుగు చూశాయి. 2019లో మహారాష్ట్రలో ఒకటి, 2021 జూలైలో హర్యానాలో ఒకటి, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. -
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-
వైఎస్ జగన్తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే
సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. -
ఒక్కొగానొక్క కుమారుడు..ఆశల దీపం ఆరిపోయింది
చేబ్రోలు/వెల్దుర్తి : ఒక్కొగానొక్క కుమారుడు. బాగా చదివి ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. వారి కలలను మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని గుంటూరు – తెనాలి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కర్నూలుకు చెందిన లక్ష్మీరెడ్డి, ఊర్మిల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతూరు వెల్దుర్తి కాగా ఉపాధి నిమిత్తం కర్నూలుకు చేరుకుని అక్కడే స్థిర పడ్డారు. వీరి కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి(25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి యూనివర్సిటీ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో మణికంఠేశ్వరరెడ్డి దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మీరెడ్డి కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఏరియాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి బీఎస్సీ అగ్రికల్చర్ డెహ్రాడూన్లో పూర్తి చేశాడు. ఎంబీఏ కోసం చేబ్రోలు వచ్చాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, పలువురు నేతలు, కుటుంబసభ్యులు చేబ్రోలు చేరుకున్నారు. చేబ్రోలు ఎస్ఐ డి.వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. -
అమరావతికి ‘ఏపీఈఆర్సీ’ తరలింపు!
సాక్షిప్రతినిధి కర్నూలు : ‘‘నాలుగు సందర్భాలు.. నాలుగు రకాల ప్రకటనలు..! నోరు ఒకటి చెబుతుంది.. చేతలు మరొకటి.. దేనిదోవ దానిదే..!’’ అన్నట్లుంది సీఎం చంద్రబాబు సర్కారు తీరు. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పిన మూడు నెలలకే ఏపీఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి)ని అమరావతికి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అనుకూల భవనాలను అత్యవసరంగా పరిశీలించి నివేదిక పంపాలంటూ ఈ నెల 29న కలెక్టర్ రంజిత్బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) లేఖ రాశారు. ఈ క్రమంలో ఏపీఈఆర్సీ భవనాలతోపాటు జగన్నాథగట్టుపైన నిర్మించిన క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు, నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని ఓ ప్రైవేట్ భవనాలను పరిశీలించి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. ఈ మూడింటిలో ఏపీఈఆర్సీ భవనంపై హైకోర్టు బృందం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ నెల 6వతేదీన కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలించనుంది. కమిటీలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు. రూ.25 కోట్లతో అత్యాధునికంగా.. కర్నూలులో ఏపీఈఆర్సీకి సొంత భవనాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించింది. ఇందులో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించడంతో పాటు ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిథి గృహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మే 23న దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనం కావడం.. అన్ని వసతులు ఉండటం.. సిటీలోనే ఉన్నందున ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని దీన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం 2023 ఆగస్టు 18న ప్రారంభమైంది. నేషనల్ లా వర్సిటీ సంగతి ఏమిటి? వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టుబట్టి కర్నూలులో మరో లా వర్సిటీని మంజూరు చేయించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. కర్నూలులో 273 ఎకరాల్లో నిర్మించాలని భావించిన ‘జ్యుడీషియల్ సిటీ’లో 100 ఎకరాల్లో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావించింది. దీనికి రూ.వెయ్యి కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి దీనికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. కర్నూలుతో సంబంధం లేకుండా అమరావతిలో మరొకటి నిర్మిస్తున్నారా? లేక కర్నూలు లా యూనివర్సిటీకి మంగళం పాడనున్నారా? అనేది స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూనివర్సిటీ పనుల్లో ఎలాంటి ముందడుగు లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించడంతో పాటు లా వర్సిటీ నిర్మాణాన్ని పక్కనపెట్టనున్నట్లు స్పష్టమవుతోందని న్యాయవాదులు, అధికారవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సీమ నుంచి అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కాయి. ఇంత మెజార్టీ కూటమికి ఇచ్చినందుకు కర్నూలుకు హైకోర్టును ఎత్తివేసి బెంచ్కు పరిమితం చేయడం, న్యాయ సంస్థలను ఒక్కొక్కటిగా తరలించడం ‘సీమ’కు చంద్రబాబు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని మండిపడుతున్నారు. ఏపీఈఆర్సీ భవనంలోనే హైకోర్టు బెంచ్..! హైకోర్టు బెంచ్ను ఏపీఈఆర్సీ భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మూడు ప్రతిపాదనల్లో ఇదే ఉత్తమమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కర్నూలు సిటీ (కలెక్టరేట్) నుంచి జగన్నాథగట్టుపై ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ 17.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. నన్నూరు టోల్ప్లాజా సమీపంలోని ప్రైవేట్ భవనం 11 కి.మీ. దూరంలో ఉంది. ఏపీఈఆర్సీ 3.5 కి.మీ. దూరంలో నగరానికి చేరువలో ఉన్నందున దీనివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.సీఎంగారూ.. ఇప్పుడేమంటారు? కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి ‘న్యాయ రాజధాని’గా అభివృద్ధి చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంక్షించారు. అందులో భాగంగానే ఏపీఈఆర్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను కర్నూలులో ఏర్పాటు చేశారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ ఏర్పాటుపై మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ సందర్భంగా ఆ సంస్థలను అమరావతికి తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీనిపై విపక్ష పార్టీలు, రాయల సీమ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో కర్నూలులో నెలకొల్పిన సంస్థలను తరలించబోమని, అవి అక్కడే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గతేడాది నవంబర్లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు బెంచ్ను కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధపడటాన్ని బట్టి ఆ సంస్థను అమరావతికి తరలించడం లాంఛనమే అని స్పష్టమవుతోంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటైన తర్వాత మిగతా సంస్థలను కూడా అమరావతికి తరలించే అవకాశం ఉన్నట్లు కూటమి ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి. » లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం’ – నవంబర్ 13న హైకోర్టుకు స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం. » ‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలను తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్తో చర్చించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – నవంబర్ 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన » ‘కర్నూలులో ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించం. వాటిని అక్కడే ఉంచుతాం. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం’ – గత నవంబర్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన » ‘ఈ నెల 6న హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తోంది. దిన్నెదేవరపాడు వద్ద నిర్మించిన ఏపీఈఆర్సీ భవనాన్ని పరిశీలిస్తారు’ – తాజాగా న్యాయశాఖ మంత్రి ఫరూక్ వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిషోర్రెడ్డి సవాల్
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అన్ని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వైఎస్ జగన్పై అఖిల ప్రియ ఆరోపణలు చేయడం అవివేకం. విజయ పాల డైరీలో బకాయిలు, మేము ఎత్తిచూపించాము. అఖిల ప్రియా, ఆమె సోదరుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కొత్తూరు కోట కొండల్లో మైనింగ్ చేసి ఇటుక బట్టిలకు మట్టిని అమ్ముకుంటున్నారు.. ఆళ్లగడ్డలో బెదిరింపులు పాల్పడుతూ.. రాజకీయాలు చేస్తున్నారు. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డదారులో చైర్మన్ కావాలని చూస్తున్నారు’’ అని కిషోర్ రెడ్డి మండిపడ్డారు.జగత్ విఖ్యాతరెడ్డి విజయ డెయిరీ ఎన్నికలకు అర్హుడు కాదు. ప్రజల కోసం ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నాం. వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కార్యకర్తల, ప్రజలు వ్యతి రేకిస్తున్నారు’’ అని కిషోర్రెడ్డి అన్నారు. -
‘కూటమి సర్కార్ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం’
సాక్షి, కర్నూలు: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 46 శాతం ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు.‘‘అన్ని వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. త్వరలోనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారు. మీ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించింది. రెండు సంవత్సరాల పాటు తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్న చెప్పిన మాట ప్రకారం అమలు చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని పెద్దిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్లో ఏపీకి నిల్! -
హైకోర్టు పోయె.. బెంచ్ వచ్చె!
సాక్షి, అమరావతి / సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమవాసుల హైకోర్టు ఆశలకు శాశ్వతంగా గండికొట్టిన టీడీపీ ప్రభుత్వం.. కర్నూలులో బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan mohan Reddy) ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు, ఏపీఈఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఆర్సీకి శాశ్వత భవనాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, కర్నూల్లో బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా వసతి, నివాస సదుపాయాలు, కోర్టు రూములు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి ఇతర సౌకర్యాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలని కలెక్టర్ రంజిత్ బాషాను హైకోర్టు(High Court) ఆదేశించింది.కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచేందుకు వీలుగా ఈ వివరాలను అందచేయాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరామ్ ఈ నెల 29న కలెక్టర్కు లేఖ రాశారు. దీన్ని అత్యవసరంగా భావించాలని కోరడంతో కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్ అండ్ బీ ఎస్ఈ, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఈ బాధ్యతను అప్పగించగా.. కర్నూలులో మూడు భవనాలను ‘బెంచ్’ కోసం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా..కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు భవనం కోసం ప్రధానంగా ఏపీఈఆర్సీ భవనాన్ని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన మూడు భవనాల్లో ఇదే కొత్తది కావడం, ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇక్కడే హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తారనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. భవనాల గుర్తింపు కోసం ప్రభుత్వం కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మొత్తం మూడు భవనాలను సూచించినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీఈఆర్సీ భవనంతోపాటు జగన్నాథగట్టుపై నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ భవనం, హైదరాబాద్–చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ భవనం ఉన్నాయి. వీటి వివరాలను కలెక్టర్ గురువారం రిజిస్ట్రార్కు పంపినట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ను వివరణ కోరగా.. భవనాలను పరిశీలిస్తున్నామని, ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. కాగా, ఒకవేళ జగన్నాథ గట్టుపై ఉన్న భవనాలను హైకోర్టు బెంచ్(High Court Bench) కోసం ప్రతిపాదిస్తే అక్కడున్న క్లస్టర్ యూనివర్సిటీని సిల్వర్ జూబ్లీ కాలేజీ భవనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంతో ఏపీఈఆర్సీని అమరావతికి తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తీర్మానం కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటును ఆమోదిస్తూ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. అటు తరువాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియచేసే నిమిత్తం ఫుల్ కోర్టుకు నివేదించాలని కోరుతూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బెంచ్ ఏర్పాటుపై నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కమిటీని నియమించారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా సమావేశమైనట్లు తెలిసింది. కమిటీ నివేదికను ప్రధాన న్యాయమూర్తి ఫుల్కోర్టు ముందుంచి చర్చించే అవకాశం ఉంది. ఫుల్కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు ఓ కొలిక్కి వస్తుంది.15 మంది న్యాయమూర్తుల కేటాయింపు?కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తరువాత జిల్లాల వారీగా దాఖలైన కేసుల గణాంకాలను హైకోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. హైకోర్టులో మొత్తం కేసుల్లో 40 శాతం రాయలసీమ జిల్లాల నుంచే దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా కర్నూలులో ఏర్పాటయ్యే శాశ్వత బెంచ్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 40 శాతం కేసులు రాయలసీమ నుంచి దాఖలవుతున్నందున మొత్తం 37 మంది న్యాయమూర్తుల్లో అందుకు అనుగుణంగా 15 మందిని కర్నూలు(Kurnool) బెంచ్కు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 22 మంది న్యాయమూర్తులు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్లో న్యాయమూర్తులుగా కొనసాగే వీలుంది. ఈ క్రమంలోనే కర్నూలులో 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాల గురించి ఆరా తీస్తూ కర్నూలు కలెక్టర్కు హైకోర్టు లేఖ రాసినట్లు భావిస్తున్నారు.కర్నూలు బెంచ్ పరిధిలోకి ప్రకాశం, నెల్లూరు?ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి రాయలసీమ జిల్లాలతో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీన్ని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు, న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. కర్నూలు వెళ్లాలంటే తమకు నేరుగా రైలు సౌకర్యం లేదని, రోడ్డు ద్వారా వెళ్లాలంటే కనీసం 7 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఇరు జిల్లాల వారు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీరి అభ్యంతరాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు ఫైర్
-
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే!..
సాక్షి ప్రతినిధి కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లంచాలు తీసుకుంటూ, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉద్యోగులను మార్చడంలో భాగంగానే ఈరన్న హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆశించి నియోజకవర్గ టీడీపీ కీలక నేతకు డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను హత్య చేసినట్టు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్గా 2019 నుంచి ఈరన్న కొనసాగుతున్నాడు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్గా తప్పించాలని టీడీపీ నేతలు భావించారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరు ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ దుకాణాలతో పాటు ఇతర పోస్టుల్లో లంచాలు తీసుకుని నియమింపచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నియోజకవర్గ నేతకు రూ.3 లక్షలు లంచమిచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులో తనను నియమించాలని కోరాడు. దీంతో ఆ నేత ఈరన్నను తప్పుకోవాలని రెండు నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించేలా గ్రామస్తులు, పంచాయతీ తీర్మానం చేసినట్టు సర్పంచ్ లేఖ ఇవ్వాలి.కాగా.. గ్రామ సర్పంచ్ నాగరాజుకు, నియోజకవర్గ టీడీపీ నేత మధ్య విభేదాలున్నాయి. దీంతో సర్పంచ్ లేఖ ఇవ్వలేదు. టీడీపీ కీలక నేత ఈరన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులిచ్చిన వ్యక్తి ఈరన్నను మట్టుపెడితే తప్ప తనకు పోస్టు రాదని భావించి అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. మరోవైపు రాజీనామాకు సిద్ధపడిన ఈరన్నకు ఈ నెలాఖరు వరకూ విధులు నిర్వర్తిస్తేనే జనవరి వేతనం వస్తుందని అధికారులు చెప్పారు.దీంతో నెలాఖరు వరకూ పనిచేసి రాజీనామా చేయాలని ఈరన్న నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉపాధి హామీ పనుల నుంచి వస్తున్న ఈరన్నను కొందరు దారిలో ఆపి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా హత్య చేశారు. ఈరన్నను గ్రామానికి చెందిన గాదె లింగప్ప, గోవర్ధన్, గోపి, రామదాసు మరికొందరు కలిసి హతమార్చారని ఈరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.లంచాలు తీసుకుని పోస్టుల్లో నియామకంటీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఈ నెల 18న ఆరోపణలు చేశారు. ఇది జరిగిన వారానికే లంచాలతో పోస్టు మార్పునకు సిద్ధపడిన టీడీపీ నేత వల్ల హత్య జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పి.కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చి మరొకరిని నియమించేందుకు నియోజకవర్గ కీలక నేత రూ.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో 50 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేందుకు లేఖలు ఇవ్వగా.. ఇప్పటివరకు 11 మందిని మార్చినట్టు తెలుస్తోంది. -
ఏపీలో ఆగని రెడ్ బుక్ అరాచకాలు
-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్పూర్లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. CPI నేతలు సీరియస్ వార్నింగ్
-
పట్టు జారి పోతోంది!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గతంలో కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తుంటే నేడు కూడా అదే ధర పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ తోటల సాగుపై, పట్టు పురుగుల పెంపకంపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఆదోని ప్రాంతంలోని దొడ్డనగేరి, జాలిమంచి, కోసిగి, ఇస్వీ ప్రాంతాల్లో గతంలో ఎటు చూసినా మల్బరీ తోటలు ఉండేవి. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. అయితే క్రమంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగు తగ్గుతూ వచ్చి నేడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న పట్టుపరిశ్రమల శాఖ ఏడీ కార్యాలయాన్ని ప్యాపిలికి మార్చారు. అక్కడ కూడా మల్బరీ సాగు తగ్గడంతో కార్యాలయం కర్నూలుకు వచ్చింది. గతంలో వెల్దుర్తి మండలం బోయినపల్లి, సూదేపల్లి, కోడుమూరు మండలం లద్దగిరి గ్రామాలు మల్బరీ సాగుకు నెలవుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతాల్లో మల్బరీ సాగు కనిపించడం లేదు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో 2,000 ఎకరాల్లో మల్బరీ సాగు ఉండేది. ఆత్మకూరులో ప్రత్యేకంగా అసిస్టెంటు డైరెక్టర్కార్యాలయం కూడా ఉంది. అయితే నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆత్మకూరు ఏడీ పరిధిలో 50 ఎకరాల్లో కూడా మల్బరీ సాగు కనిపించడం లేదు. ఎందుకు ఇలా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు 80 శాతంపైగా పడిపోయినా సెరికల్చర్, సహాయ సెరికల్చర్ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు లేకపోవడం, పట్టుగూళ్ల ధరల్లో పురోగతి లేకపోవడంతో రైతులు పట్టుకు ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం పట్టు సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. పట్టు పురుగుల పెంపకానికి షెడ్ అత్యవసరం. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం గతంలో ఇస్తున్న సబ్సిడీ రూ.3 లక్షలే ప్రస్తుతం అందిస్తోంది. రెండుఎకరాల్లో మల్బరీ మొక్కలకు రూ.45 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.5000. సూట్కు రూ.40 వేలు, వరండాకు రూ.30 వేలు, నేత్రికలకు రూ.50 వేలు ప్రకారం సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలు పోను మొక్కలు నాటుకోవడానికి రైతులకు రూ.20 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.12 వేలు, సూట్కు రూ.1.50 లక్షలు, వరండాకు రూ.లక్ష, నేత్రికలకు రూ.10 వేలు, చాకి పురుగులకుఏడాదికి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.20 లక్షల వరకు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రూ.4.80 లక్షలు సరిపోవడం లేదు. పట్టుగూళ్లకు హిందూపురం, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో రైతులకు నికరాదాయం రావడం లేదు. పట్టుపురుగులపై పురుగుమందుల ప్రభావంఏడెనిమిదేళ్లుగా కంది, పత్తి, మినుము, మిర్చి, మొక్కజొన్న, వరి తదితర పంటల్లో పురుగు మందుల వాడకం భారీగా పెరిగింది. ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టు పురుగులపై పడుతోంది. పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి వాటంగా వస్తున్న పురుగుమందుల ప్రభావానికి లోనై మరణిస్తున్నాయి. డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామం పరిసరాల్లో రెండు, మూడేళ్ల క్రితం ఫెస్టిసైడ్ కంపెనీ ఏర్పాటు అయింది. దీని ప్రభావం వెల్దుర్తి మండలం సూదేపల్లిలో సాగు చేస్తున్న పట్టు పరిశ్రమపై పడుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోతుండటానికి పురుగు మందుల పిచికారీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగుకు స్వస్తి పలికాం పట్టు సాగులో విశేషంగా రాణిస్తున్నందుకు నాకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. బైవోల్టెన్ పట్టు గూళ్ల ఉత్పత్తికి గతంలో కిలోకు రూ.50 ఇంటెన్సివ్ లభించేది. ప్రస్తుతం రైతులకు ఇది లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం ఎక్కువవుతున్నా సబ్సిడీలు పెరగడం లేదు. పట్టు గూళ్ల ధరలు పెరగకపోవడంతో పట్టు సాగుకు స్వస్తి పలికి పొగాకు, మినుము తదితర వాటిపై ఆసక్తి చూపుతున్నాం. – భాస్కరరెడ్డి, ఆత్మకూరునష్టాలు మూట కట్టుకుంటున్నాం పట్టులో ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. మూడు, నాలుగు పంటలే గగనం అవుతున్నాయి. ఒక్కోపంటకు రూ.80 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పెట్టుబడి వ్యయం రూ.2.50 లక్షలు అయ్యింది. మూడు పంటలపై వచ్చిన పట్టుగూళ్లను అమ్మగా కేవలం రూ.1.90 లక్షలు మాత్రమే వచ్చింది. నష్టాలు మూట గట్టుకున్నాం. – మధుసూదన్, రామసముద్రం, జూపాడుబంగ్లా మండలంఫిర్యాదులు వస్తున్నాయి డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో ఉన్న కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రభావం సూదేపల్లి సాగు చేస్తున్న మల్బరీపై పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏడాదికేడాది పురుగు మందుల వినియోగం పెరుగుతోంది. దీంతో మల్బరీ సాగు నుంచి కొంతమంది రైతులు దూరం అవుతున్నారు. మల్బరీ సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – విజయకుమార్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, కర్నూలు -
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్కో ప్రాజెక్ట్లపై పవన్ ప్రశంసలు
-
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్పై పవన్ కల్యాణ్ ప్రశంసలు
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. విమర్శించడానికి వెళ్లిన పవన్కి ప్రాజెక్ట్ చూశాక షాక్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నాయంటూ తనిఖీకి వెళ్లిన పవన్.. అద్భుతమైన ప్రాజెక్టును చూసి ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్ట్ను వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చింది. 2022, మే 17న ప్రాజెక్ట్ను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టులో అటవీ భూముల ఆక్రమణ జరిగిందని పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. అటవీ, పర్యావరణ ఉల్లంఘనలు తనిఖీ చేయడానికి వచ్చిన పవన్.. తనిఖీ అనంతరం గ్రీన్ కో ప్రాజెక్ట్కు కితాబు నిచ్చారు. ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జగన్ తెచ్చిన పరిశ్రమనే అద్భుతమని పవన్ కల్యాణ్ అంగీకరించారు.ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్ బకరా! -
భార్యపై అనుమానం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని పూలబజార్లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్ కార్నర్లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్ కార్నర్లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు. దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ తెలిపారు. -
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
‘సాక్షి’పై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై ‘పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసుల ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ ‘సాక్షి’ కర్నూలు విలేకరి బోయ శ్రీనివాసులుపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో సెక్షన్ 196/2024,యూ, సెక్షన్ 32, 308(3), 353(1)బీ, 356 రెడ్విత్ 61(2), బీఎన్ఎస్గా నమోదు చేశారు. కర్నూలు త్రీటౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు జిల్లా అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 17న కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, ఆయన సోదరుడిని విచారించి పంపించామని తెలిపారు.ఇతర మీడియాలోనూ వచ్చినా ‘సాక్షి’పైనే కేసు..భూ వివాదానికి సంబంధించి మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారనే వ్యవహారంపై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, టీవీలు కూడా కథనాలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ‘బాస్.. సివిల్ పంచాయతీ’ పేరుతో ఈనాడు కూడా కథనాన్ని ప్రచురించింది. అందులో రాయలసీమ పోలీస్బాస్ అని పేర్కొంది. కిడ్నాప్నకు గురైన మునీర్ అహ్మద్ ‘సాక్షి’తో పాటు ఇతర మీడియా చానళ్లతోనూ మాట్లాడారు. అందులో పోలీసులు తనను తీసుకెళ్లిన విధానం, భూ వివాదానికి సంబంధించి గతంలో సీఐ, డీఐజీ కోయ ప్రవీణ్ తనను పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పిన విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఆయన భార్య కూడా భూ వివాదంపై మాట్లాడారు. మునీర్ అహ్మద్ ఆయన భార్య తెలిపిన వివరాల మేరకే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సాక్షిలో ప్రచురించిన ప్రతీ అక్షరం బాధితులైన మునీర్ అహ్మద్ దంపతులు చెప్పిన విషయాలే! వీటినే మిగిలిన వారూ ప్రచురించినా, ప్రసారం చేసినా.. ‘సాక్షి’పై మాత్రమే కేసు నమోదు చేయడం గమనార్హం. -
బాబును నమ్మినందుకు బాదుడు గిఫ్ట్
-
భూ వివాదంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
కర్నూల్ లో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
కర్నూల్ YSRCP నేతలతో వైఎస్ జగన్
-
YSRCP నేత తెర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురి వివాహ రిసెప్షన్లో YS జగన్
-
YS జగన్ కర్నూలు పర్యటన
-
YS జగన్ కర్నూలు పర్యటన
-
రేపు కర్నూలులో మాజీ సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు చేరుకుని అక్కడ జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి కుమార్తె వివాహరిసెప్షన్కు హాజరుకానున్నారు. -
వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..
పూర్వం వయస్సు మీద పడుతున్నా పెళ్లికాకపోతే ‘ఏమి ఇంకా పెళ్లి చేయలేదా’.. అనేవారు. పెళ్లయ్యాక ‘ఏమి ఇంకా పిల్లలు కాలేదా’ అని దెప్పిపొడిచేవారు. కానీ నేటి యువజంటల్లో కొందరు మాకు పిల్లలే వద్దని తెగేసి చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటాం.. గానీ ఇప్పుడే పిల్లలను కనేది లేదని అంటున్నారు. ‘చదువు, ఉద్యోగం పేరుతో ఇన్నాళ్లు కష్టపడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తాం. మాకు కావాలనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను కంటాం’అని భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు మాత్రమే ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరానికి కూడా పాకుతోంది. పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే కట్నకానుకలు మాట్లాడుకోవడం ఒకప్పుటి మాట. ఇప్పుడు కొన్ని షరతులు.. అంటూ కొత్త కొత్త అంశాలు పెద్దల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా అమ్మాయి తరఫు వాళ్లు తగ్గేదేల్యా.. అంటున్నారు. నిన్నటి వరకు ‘ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు ఉండకూడదని.. ఇంటికి మాటిమాటికి చుట్టపు చూపుతో బంధువులు రాకూడదని... మా పిల్ల వారికి చాకిరి చేయలేద’ని తెగేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు కొందరు ‘అమ్మాయిని ఇస్తాము గానీ మా పిల్ల ఇంకా ఇప్పుడే చిన్నది...ఇప్పుడిప్పుడే పిల్లలను కనాలని ఇష్టం తనకు లేదని, ఈ అంగీకారానికి అబ్బాయి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెబుతున్నారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ/బీటెక్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతూ ఎలాంటి ఎంజాయ్ చేయలేదని, ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత పిల్లలు అంటే.. సరదాలు, సంతోషాలు ఇంకెప్పుడు అంటూ చెబుతున్నారు. ఈ అంగీకారమేదో బాగుందని ఒప్పుకుంటున్న మగరాయుళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఇద్దరి అంగీకారంతో వివాహాలు హాయిగా జరిగిపోతున్నాయి. కానీ ఏ ఒక్కరూ పైకి ఈ విషయం బయటకు మాత్రం చెప్పడం లేదు. వివాహమయ్యాక వీకెండ్లో ఇద్దరూ హాయిగా విహారయాత్రల పేరిట ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినచోటకు వెళ్లడం, నచ్చినది తినడం, నచ్చిన ప్రదేశాలు చూడటం, ఇష్టమొచ్చిన హోటళ్లలో బస చేయడం వంటి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతిని ఆంగ్లంలో ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ (డింక్)గా పిలుస్తారు. ఈ లైఫ్స్టైల్లో భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి...కానీ పిల్లలు మాత్రం వద్దు. ఆ ఇద్దరు సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తారు. వారి జీవితానికి వారే రాజు...వారే రాణి అన్నమాట. ఈ డింక్ లైఫ్ స్టైల్ 1980 దశకంలో జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ప్రారంభమైందని చెబుతారు. గత దశాబ్ద కాలంగా మన దేశంలోని మెట్రో సిటిలైన న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్కత లాంటి నగరాల్లో ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిన మన ప్రాంత యువతీయువకులు డింక్ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా ఈ సంస్కృతి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పొచ్చు. డింక్ లైఫ్స్టైల్ గురించి సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరుగుతున్న తీరుతో కొందరు ఔత్సాహిక యువతీయువకులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరినా వారికి ఇష్టం లేకపోయినా, కంపెనీకి వారి పని నచ్చకపోయినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు ఒకే కంపెనీలో రెండు, మూడేళ్లు మించి పనిచేయడం లేదు. వారు మారడమో, కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడమో చేయడం వల్ల వారు కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కొంత కాలం వేచి చూసి ఉద్యోగం వల్ల కావాల్సినంత కూడబెట్టుకున్నామని భరోసా కలిగాక పిల్లలు, వారి పెంపకం గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు. పిల్లలను పెంచడమూ భారంగా...! కొందరు యువతీయువకులు పిల్లలను పెంచడాన్ని కూడా భారంగా భావిస్తున్నారు. మెట్రో సిటీల్లో వారిద్దరే ఉంటుండటంతో ఒకవేళ పిల్లలు కన్నా వారిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పిల్లలను కనేందుకు, వారిని పెంచేందుకు తరచూ సెలవులు పెట్టాల్సి రావడం, ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం నేటి కొందరు యువతీయువకులకు ఇష్టం ఉండటం లేదు. పిల్లలు పెద్దగైతే మెట్రో సిటీల్లో వారి చదువులు, వారిని పెంచేందుకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారు. కొంత కాలం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదించి, కూడబెట్టి, ఎంజాయ్ చేసిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ మేరకు కొందరు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని పిల్లలను ఇప్పుడే వద్దనుకుంటున్నారు.నచ్చిన జీవితాన్ని ఆనందించేందుకే...!ఒకప్పుడు ప్రొఫెషనల్ కోర్సులు కేవలం ఉన్నత వర్గాల పిల్లలు మాత్రమే చదివేవారు. కానీ దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే వారికి తగినట్లే మెట్రో సిటీల్లో ఉద్యోగం చేసేవారో, లేక ఉన్నత చదువులు చదివిన వారో ఎంచుకుంటున్నారు. ఇద్దరూ అక్కడే కలిసి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చదవాలంటే ఆషామాషీ కాదు. పాఠశాల, ఇంటర్, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా, విలాసాల జోలికి వెళ్లకుండా చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఈ క్రమంలో ఉద్యోగం వచ్చేంత వరకు వారి జీవితంలో ఎంజాయ్ అనే పదం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంసంపాదించాక కూడా ఎంజాయ్ లేకపోతే ఎలాగంటూ పిల్లల కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ‘డింక్’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు చైనా వంటి దేశాల్లో యువత కంటే వృద్ధులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. ఈ కారణంగా ఒకప్పుడు పిల్లలే వద్దని చెప్పిన ఆ దేశం ఇప్పుడు ఎంత మంది పిల్లలనైనా కనండని చెబుతోంది. ఎందుకంటే పిల్లలు కనకపోతే ఆ దేశాభివృద్ధి ఆగిపోతుంది. ఏ దేశానికైనా యువతీయువకులే ఆయువుపట్టు. అభివృద్ధికి వారే మూలాధారాలు. యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో డింక్ అనే లైఫ్స్టైల్ పేరుతో యువతీయువకులు పిల్లలు వద్దంటేæ ఈ దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. జననాల రేటు తగ్గిపోయి కొంతకాలానికి ఈ దేశంలో వృద్ధు్దల సంఖ్య ఎక్కువై పనిచేసే యువత సంఖ్య తక్కువ అవుతుంది. అప్పుడు మళ్లీ పేద దేశంగా మన దేశం మారిపోతుంది. సంతానోత్పత్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ మనజాలదు. ఇంట్లో, కుటుంబంలో పిల్లలు ఉండటాన్ని తల్లిదండ్రులకే కాదు అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. మార్కెట్లో ఒడిదుడుకులే కారణం సమాజంలో డింక్ లాంటి సంస్కృతులు రావడానికి మార్కెట్లోని ఒడిదుడుకులే కారణం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు కంపెనీలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేవు.ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే మెట్రోసిటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ పిల్లలు, వారి బాధ్యతలు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతామనే భయంతో నేటి యువత ఉన్నారు. ఈ క్రమంలో వారిలో డింక్ లాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీలేదు. – జీఆర్ శర్మ, ఎన్హెచ్ఎం ఉద్యోగి, కర్నూలువ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నారు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దనే జంటలు ఇటీవల ఎక్కువయ్యారు. దీనికి ఆర్థిక ప్రాధాన్యత కూడా ఒక కారణం. ఆర్థికంగా స్థిరపడటం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం ప్రధాన అంశాలు. ఇది ఒక కొత్త జీవనశైలి. దీనికి సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పిల్లలను పెద్దలే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలను కంటే వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు30 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే ఆరోగ్య సమస్యలు సాధారణంగా 25 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ప్రసవం అయితే వారికి జని్మంచే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 నుంచి 35 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండా బిడ్డ జని్మంచడం, బీపీ, థైరాయిడ్, షుగర్ వంటివి రావడం జరుగుతాయి. వివాహమైన వెంటనే పిల్లలను కనకూడదన్న ఆలోచన మంచిదే గానీ మరీ ఆలస్యమైతేనే ఇబ్బంది. కొంత మంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఎగ్ ఫ్రీజింగ్, సెమన్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల వారు అనుకున్న వయస్సులో పిల్లలను కనేందుకు వీలు చేసుకుంటున్నారు. – డాక్టర్ పి.శిరీషారెడ్డి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు (చదవండి: -
కర్నూలు జిల్లా ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతోన్న విద్యార్థుల డ్రాపౌట్స్
-
తండ్రిపై దాడి చేసిన కుమారులు
-
‘ఏయ్.. పవన్ చెప్పినా పనిచేయవా?’
కర్నూలు (సెంట్రల్): ‘ఏయ్.. మా పవన్ కల్యాణ్ చెప్పినా పనిచేయవా?’ అంటూ.. ఊగిపోతూ.. డీఎంహెచ్వో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులుపై దాడికి దిగాడో జనసేన నేత. కర్నూలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ హర్షద్ గురువారం డీఎంహెచ్వోలో వీరంగం సృష్టించాడు . వివరాల్లోకి వెళితే.. 2012 నుంచి డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రీతిబాయి తల్లి పార్వతి ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులో పనిచేస్తోంది. ఆమెకు జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కోసం అధికారులను ఆశ్రయించింది. అందుకు సర్వీసు రూల్స్ లేవని చెప్పడంతో ఇటీవల ఆమె డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఆశ్రయించింది. ఆయన స్పందించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషాకు ఫోన్చేసి పార్వతికి పదోన్నతి కల్పించే అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని కలెక్టర్ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం పార్వతితోపాటు డీఎంహెచ్వో కార్యాలయ ఏఓ అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ సంపత్లను డీఆర్వో తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల సర్వీసు మ్యాటర్. అయితే పార్వతితోపాటు జనసేన నాయకుడు హర్షద్ కూడా వారి వెంట వెళారు. డీఎంహెచ్ఓ కార్యాలయానికి సంబంధించి కేవలం సూపరింటెండెంట్ శ్రీనివాసులు మాత్రమే రావడం, ఎలాంటి రికార్డులు లేకుండా ఉండటంపై జనసేన నాయకుడు ఆయనపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం చెప్పినా ఎందుకు పదోన్నతి ఇవ్వరని శ్రీనివాసులుపై దాడికి యత్నించాడు. అయితే అతను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.వెంకటనారాయణమ్మ ఎదుటే చోటుచేసుకుంది. అయితే పదోన్నతి ఇవ్వాలంటే డీఎంహెచ్వో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు లంచం అడిగారని పార్వతి ఆరోపిస్తుండగా.. మరోవైపు సర్వీసు రూల్స్ అందుకు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూల్ లాయర్ల ఆందోళన
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన
-
ఏపీలో మంత్రుల ఆండదండలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
కర్నూలులో రోడ్డెక్కిన వాలంటీర్లు..
-
కర్నూలు జిల్లా కలెక్టర్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత
సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇదే సందర్భంలో ఈ–నామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం 20 వేల టన్నులు రాక రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్కే తీసుకొస్తారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది. ఎటూ చూసినా ఉల్లి వాహనాలే మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే గతంలో ఈ–నామ్లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొలిసారి ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు రైతులకు నరకమే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం -
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ..
-
కర్నూలులో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ
-
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
దేవరగట్టు కర్రల సమరంలో విషాదం
-
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పగిలిన తలలు
-
కర్నూల్లో నకిలీ డీఎస్పీ కలకలం
-
కర్నూలులో హైకోర్టు పెట్టాలి లేదంటే ప్రత్యేక రాష్ట్రం
-
టీడీపీ శ్రేణుల బరితెగింపు.. కర్రలు, కారంతో అటాక్
-
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
కర్నూలులో గణేష నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం
-
వినాయక నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
ఉల్లి రైతుకు ‘సిండికేట్’ దెబ్బ
కర్నూలు (అగ్రికల్చర్) : ఉల్లి ధరలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లికి డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డలకు డిమాండ్ పెరిగి ధర కూడా జోరు మీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రం ధరలు తగ్గుతున్నాయి.మొన్నటి వరకు వర్షాల వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని ధర లభించడం లేదు. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో గడ్డల నాణ్యత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కర్నూలు మార్కెట్కు పోతే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో వస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. సిండికేట్గా మారుతున్న వ్యాపారులువ్యాపారులు పథకం ప్రకారం ఉల్లి ధర పెరుగకుండా జట్టు కడుతున్నారు. సిండికేట్గా మారి ధరలపై ప్రభావం చూపుతున్నారు. గతంలో వేలంపాట ద్వారా కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు సైగలతో సిండికేట్ అయ్యేవారు. ప్రస్తుతం ఈ–నామ్లో టెండర్ ప్రాతిపదికన ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 40 మంది వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 30 మంది వ్యాపారులు భారీగానే ఉల్లి క్రయ, విక్రయాలు చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లి అత్యధికంగా పశ్చిమ బెంగాల్కు తరలుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో కోల్కతా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయమే వ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్డర్లు, ధరల ఆధారంగా సిండికేట్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ధర వరకు టెండరు వేయవచ్చనే విషయమై వ్యాపారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ–నామ్లో కూడా సిండికేట్గా మారి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్ను పరిశీలిస్తే కర్నూలు మార్కెట్లో కనీసం రూ.5వేల వరకు ధర పలకాలి. కానీ రూ.3,600 మించడంలేదు. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకే లభిస్తోంది. 40 శాతం లాట్లకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి 2,500 వరకు మాత్రమే ఉంటోంది. మిగిలిన అన్ని లాట్లకు రూ.1000 నుంచి రూ.2వేల మధ్యనే ధర లభిస్తోంది. ధర తీవ్ర నిరాశకు గురి చేసింది ఒక ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అంతంత మాత్రంగానే వచి్చంది. మార్కెట్లో దిగుబడిని విక్రయానికి తీసుకెళ్తే క్వింటాకు రూ.2,000 లోపు ధర లభించింది. ఈ ధర చాలా నిరాశకు గురిచేసింది. వ్యాపారులు పథకం ప్రకారం సిండికేట్గా మారి ధర పెరగకుండా చేస్తున్నారు. – మద్దిలేటి, పర్ల, కల్లూరు మండలం -
టీడీపీ నేతలే చంపేశారు..
-
కర్నూలు: TDP నేత శ్రీనివాసులు హత్య కేసులో వెలుగులోకి నిజాలు
-
జననేత కోసం జనం
-
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..
-
వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్.. కర్నూల్ లో టీడీపీకి బిగ్ షాక్
-
రాయలసీమ రైతుల ఆనందం.. కానీ చివరికి
-
ఒంటరితనం ఊపిరి తీసింది!
కర్నూలు సిటీ: కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీడీఎం)లో చదువుతున్న నల్ల సాయి కార్తీక్ నాయుడు(20) ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామానికి చెందిన నల్ల వెంకట నాయుడు కుమారుడైన సాయికార్తీక్ ట్రిపుల్ఐటీడీఎంలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.శనివారం క్యాంపస్లోని కలాం హాస్టల్ భవనం 9వ అంతస్తు నుంచి దూకడంతో కుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్యాంపస్కు వేసవి సెలవులు ముగిసి ఈ నెల 22 నుంచి క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సాయి కార్తీక్ క్యాంపస్కి వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటూ మానసికంగా ఇబ్బంది పడే వాడని, సమస్య ఏంటో ఎవరికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు.చదువులో ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఒంటరితనం, తాను చెప్పినా ఎవరు వినిపించుకోలేదని సూసైడ్ నోటులో రాసినట్లు సమాచారం. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పరిపాలన చెయ్యమంటే పాపాలు చేస్తున్నారు ప్రజలకిచ్చిన హామీల సంగతి చూడండి
-
మధ్యాహ్నం భోజనం కాంట్రాక్టు కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ
-
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
-
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం దాకా...
కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించని ఉత్తర, దక్షిణ భారత ప్రసిద్ధ రాజవంశాలు లేవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుపూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర రాజుల పాలన ఈ ప్రాంతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓటమి తరువాత ముస్లిం పాలకులు: బీజాపుర్ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, కర్నూలు నవాబులు దాదాపు 275 ఏళ్లు పాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై మొదట 1801లో ముత్తుకూరు గౌడప్ప నాయకత్వంలో తెర్నేకల్ గ్రామం పన్నులు కట్టడానికి నిరాకరించింది. బ్రిటీష్ సైనికుల ముట్టడిలో అనేకమంది గ్రామస్థులు మరణించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటు చేసిన మొదటి గ్రామంగా తెర్నేకల్ను చెప్పవచ్చు.ప్రసిద్ధి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అతి త్వరగా 66 గ్రామాలకు వ్యాపించింది. 1846–1847 మధ్య కాలంలో ఈయన సాహసోపేతమైన ప్రతిఘటన జనరల్ ఆండర్సన్ ఆధ్వర్యంలోని ఆంగ్లేయ దళాలను గడగడ లాడించింది. అయితే అపారమైన బ్రిటిష్ సైన్యం ముందు ఓటమి తప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి ఉరితీసింది కంపెనీ ప్రభుత్వం. 1800వ సంవత్సరంలో నిజాం నవాబు ఈస్టిండియా కంపెనీ వారికి సైనిక ఖర్చుల కోసం ఇవ్వవలసిన సొమ్ముకు బదులుగా బళ్ళారి, కడప జిల్లాలను పూర్తిగానూ; కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ తాలూకాలను ఇచ్చాడు. ఇలా వారికి ధారాదత్తం చేయడంతో ఈ ప్రాంతాలకు ‘దత్త మండలాలు’ అనే పేరు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో కర్నూలు ప్రాంతం 1800వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు కొనసాగింది.దత్తమండలాలకు ప్రధాన కలెక్టరుగా థామస్ మన్రో 1800–1807 వరకు సేవలను అందిచాడు. కర్నూలు ప్రాంతాన్ని పాలించిన మొదటి కలెక్టరు ఆయనే. రైత్వారీ భూవిధానం వంటి వ్యవస్థాగతమైన మార్పులతో ఉత్తమ పాలన సాగింది. మన్రో నివేదికను అమలుచేస్తూ రెవిన్యూ పరిపాలన సౌలభ్యం కోసం 1808వ సంవత్సరంలో రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. అవి కడప, బళ్ళారి జిల్లాలు. అనంతపురం ప్రాంతం బళ్ళారి జిల్లాలో, కర్నూలు ప్రాంతం కడప జిల్లాలో భాగంగా ఉండేవి. కర్నూలు పరిధిలోని రామళ్లకోట, నంద్యాల, సిరివెల్, నందికొట్కూరు తాలూకాలతో పాటు కడప జిల్లా నుంచి దూపాడు (మార్కాపురం), కంభం, కోయిలకుంట్ల; బళ్లారి జిల్లా నుంచి పత్తికొండ తాలూకాను కలిపి మొత్తం 8 తాలూకాలతో 1858 జూలై 1న కర్నూలు జిల్లా అవతరించినది. స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఈ జిల్లాలో ఎలాంటి మార్పులూ సంభవించలేదు. అయితే 2022 ఏప్రిల్ 4న జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కర్నూలు జిల్లా రెండుగా... అంటే కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజితమయ్యింది.ప్రస్తుతం జనాభా విషయంలో నంద్యాల జిల్లా కంటే ఎక్కువగా, వైశాల్యం, రెవిన్యూ విషయంలో నంద్యాల జిల్లా కంటే తక్కువ స్థాయితో కర్నూలు మారిన పరిస్థితిని గమనించగలం.– ఆచార్య మన్సూర్ రహ్మాన్ సామాజిక – ఆర్థిక విశ్లేషకులు ‘ 9441067984(కర్నూలు జిల్లా 166వ అవతరణ దినోత్సవం నేడు) -
విమానయానంపై పెరిగిన ఆసక్తి
కర్నూలు(సెంట్రల్): విమాన ప్రయాణంపై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి వైజాగ్, చైన్నె నగరాలకు తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి విమానాశ్రయం అనువుగా ఉంటోంది. సమయం, డబ్బును ఆదా అవుతోంది. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మూడేళ్లలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి 57,327 మంది కర్నూలుకు రాగా, కర్నూలు నుంచి 63,405 మంది విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహా నగరాలకు వెళ్లారు.ఎయిర్పోర్టు ప్రస్థానమిదీ..ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సంకల్పించారు. ఈ కోవలోనే కర్నూలు విమానాశ్రయానికి బీజం పడింది. ఇందుకోసం ఓర్వకల్లు సమీపంలో 1,010 ఎకరాలు కేటాయించారు. కేంద్ర విమానయాన శాఖ అనుమతులు రావడంతో 2017లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వసతులు సమకూరిన అనంతరం 2021 మార్చి 28న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. అప్పటి నుంచి విమానాల రాకపోకలు జోరందుకున్నాయి.ఇవీ సౌకర్యాలు● కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్టు చేరుకోవడానికి వీలుగా అప్రోచ్ రోడ్డు నిర్మించారు.● ప్రయాణికులు, వివిధ వాహనాల రాకపోకలకు వీలుగా నాలుగు ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయి.● 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ (పీటీబీ) ఉంది.● టెర్మినల్కు ఎదురుగా నాలుగు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసేందుకు ఆప్రాన్ నిర్మించారు.● టర్మినల్ బిల్డిండ్ బయట వైపు కనువిందు చేసేలా ఉద్యానవనం అభివృద్ధి చేశారు.విశాఖకు అధికంకర్నూలు నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చైన్నె మహానగరాలకు వారంలో నాలుగు రోజులు విమానాలు వచ్చి వెళ్తున్నాయి. వివిధ కారణాలతో నెలరోజుల నుంచి బెంగళూరు నుంచి వచ్చే విమానాలు రద్దయ్యాయి. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణించగా.. ఇందులో 60 వేల మంది విశాఖ నుంచి వచ్చి వెళ్లిన వారే ఉన్నారు. బెంగళూరుకు 38 వేల మంది, చైన్నెకు 22 వేల మంది ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.విమానయాన శాఖమంత్రి దృష్టి సారించాలి..ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకు విమానాలు తిప్పాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ఈ మేరకు ఇండిగోతో ఒప్పందం కూడా చేసుకుంది. అయినా ఆ సంస్థ విమానాలను నడిపేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రిగా ఉన్నారు. కర్నూలు నుంచి తిరుపతి, విజయవాడలకు విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా బెంగళూరుకు విమాన సర్వీసులను పునరుద్ధరించాల్సి ఉంది. గతంలో ఫ్లైబిగ్ అనే విమాన సంస్థ కర్నూలు నుంచి హైదరాబాద్కు విమానం నడిపేందుకు ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్కు విమానాలు తిరిగితే అరగంటలో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
-
దారులన్నీ కర్నూలు వైపే!
కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, వారి అనుచరగణం కర్నూలుకు చేరుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ విధులు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాయలసీమ విశ్వ విద్యాలయానికి వెళ్లేందుకు వీలుగా 4వ తేదిన ఉదయం 5 గంటలకే బస్సులను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. వీరంతా కచ్చితంగా ఉదయమే రావాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకు కర్నూలుకు చేరుకునే పరిస్థితులు లేని కారణంగా ఒక రోజు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు. వీరంతా రాత్రి బస చేసేందుకు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లు, లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. సారీ ... రూముల్లేవు! కర్నూలులోని పలు ప్రధాన లాడ్జీలతో పాటు చిన్న చితకా లాడ్జీల్లో కూడా రూములు లేవనే సమాధానం వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పారీ్టలకు చెందిన నేతలు పలు లాడ్జీల్లో 15 రోజుల ముందుగానే ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 4వ తేదీ వరకు గదులను అడ్వాన్స్గా అద్దెకు తీసుకున్నారు. దీంతో మెజారిటీ లాడ్జీలన్నీ రాజకీయ నేతలతో సందడి చేస్తున్నాయి. ఏసీ రూములు లేకపోయినా ఫరవాలేదు. కనీసం టీవీ ఉంటే చాలు అంటూ నేతలు లాడ్జీలల్లో దిగిపోతున్నారు. ఆయా లాడ్జీలకు అనుసంధానంగా ఉన్న హోటళ్లలో రాత్రి డిన్నర్, ఉదయం టిఫెన్, మధ్యాహ్నం లంచ్కు సరపడా మెనూను కూడా అడ్వాన్స్గా ఆర్డర్ చేసుకుంటున్నారు. నగరంలోని ప్రధాన లాడ్జీలతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టే స్థాయికి వచ్చాయి. నేతల ఇళ్ల వద్ద జన సందోహం ... జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పారీ్టలకు చెందిన మెజారిటీ అభ్యర్థుల నివాసాలు కర్నూలులోనే ఉన్నాయి. వారి ఇళ్ల వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఓట్ల లెక్కింపులో అనుభవం ఉన్న పలువురు నేతలు ఓట్ల లెక్కింపు సమయంలో ఉండాల్సిన చురుకుదనం, ప్రశ్నించే తత్వం, తెలివితేటలు, సమయస్ఫూర్తిపై తమ ఏజెంట్లకు తెలియజేస్తూ కౌంటింగ్ కేంద్రాలకు పంపుతున్నారు. -
కర్నూలు నుంచి ‘ఏపీఈఆర్సీ’ కార్యకలాపాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు శనివారం నుంచి కర్నూలులో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉంటుందనే గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో ఒకరోజు ముందుగానే ఏపీఈ ఆర్సీ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్కు తరలించింది. ఈఆర్సీ భవనంతోపాటు ఓ అతిథి గృహాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.23 కోట్ల నిధులు అందించింది. ఈ నిధులతో 15 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మరో 5 వేల చదరపు అడుగుల్లో గెస్ట్హౌస్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఈనెల 23న ప్రారంభించారు. శనివారం నుంచి అందులో అధికారికంగా కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతికేళ్ల క్రితం పుట్టిన ‘మండలి’1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, మండలి మాత్రం ఇన్నాళ్లూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం.. అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఏపీఈఆర్సీకి ఒక చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు.వీరి తరువాత ఒక డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, ఆ తరువాత జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. వీరంతా తమ ఆ«దీనంలోని ఫైళ్లను తరలించేందుకు సిద్ధంచేసి భద్రపరచాలని ఈ ఏడాది ఏప్రిల్లో కమిషన్ ఆదేశించింది. అలాగే, ఉద్యోగులు తమ నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లుచేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయ సహకారాలను తీసుకోవాల్సిందిగా సూచించింది. అన్ని పనులు పూర్తవడంతో సిబ్బందితో పాటు ఫైళ్లు, సామగ్రి కర్నూలుకు తరలివెళ్లాయి.ఏపీఈఆర్సీ ఏం చేస్తుందంటే..విద్యుత్ చట్టంలోని సెక్షన్–86 ద్వారా కమిషన్కు పలు విధులను నిర్దేశించారు. అవి ఏమిటంటే.. ⇒ విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం మండలి లక్ష్యం. ⇒ ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్లో ఓపెన్ యాక్సెస్ను సులభతరం చేయడం, ఇంట్రా–స్టేట్ ట్రేడింగ్, పవర్ మార్కెట్ అభివృద్ధిని ప్రోత్సహించడం, విద్యుత్ అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తీసుకురావడం వంటివి చేయాలి. ⇒ రాష్ట్రంలో పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ⇒ రాష్ట్రంలో కార్యకలాపాలకు సంబంధించి ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డి్రస్టిబ్యూషన్ లైసెన్సులు, విద్యుత్ వ్యాపారులుగా వ్యవహరించాలనుకునే వారికి లైసెన్స్లను జారీచేస్తుంది. ⇒ పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో దాని శాతాన్ని నిర్ణయిస్తుంది. ⇒ డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్యనున్న వివాదాలపై విచారణ జరిపి తీర్పుల ద్వారా పరిష్కరిస్తుంది. ⇒ వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించడంపై ప్రభుత్వానికి సలహాలివ్వడం వంటివి కమిషన్ చేస్తుంది. ⇒ అలాగే, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైంది. -
వజ్రాల వేట.. 9 వజ్రాలు లభ్యం..
-
వజ్ర సంకల్పం
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరికాయి కూడా. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలువజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆ్రస్టేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ‘సీమ’లో ఏజెంట్ల తిష్ట వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత(క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వా«దీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ. వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాన్ని గుర్తు పడతాం మాది కలికిరి. హైదరాబాద్లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం. – రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా ఐదోసారి వచ్చా వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నాను. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం. – ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా -
కర్నూల్ లో వజ్రాల వేట
-
కిక్కిరిసిన కర్నూల్
-
సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
-
చంద్రబాబు పై గాడిద సామెత
-
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
-
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
-
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
-
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
-
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
-
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
-
Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ
-
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
-
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
-
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణలో ఉంది. ఇంతియాజ్కు సొంత వాహనం లేదు సెర్ప్ సీఈఓ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్డేను వేదికగా చేసుకున్నారు. బర్త్డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
ముస్లింలకు అండగా సీఎం జగన్...మళ్లీ అధికారం వైఎస్సార్సీ పీదే
-
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు: ఇంతియాజ్
-
కర్నూలు: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇపుడు టాపర్గా
బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. అవకాశం కల్పిస్తే ఆడబిడ్డల సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పింది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని భావిస్తుండటం విశేషం. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఎస్.నిర్మల. బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్ఎస్సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh… pic.twitter.com/OVqEX0frQL — Ministry of Education (@EduMinOfIndia) April 13, 2024 -
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చీరలతో ఈసీ కి దొరికిపోయిన టీడీపీ నేత టీజీ భరత్
-
జూన్ నుంచి కర్నూలులోనే ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీఈఆర్సీని అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఆ తర్వాత విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఈ భవనం జూన్ నెలకల్లా అందుబాటులోకి వస్తుండటంతో ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు ఫైళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించింది. వారి ఫోన్ నంబర్లను కూడా సిబ్బందికి ఇచి్చంది. మూడు ప్రాంతాల్లోనూ మండలి పని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం ఉంది. అంతకు ముందు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల, బహిరంగ విచారణ వంటివి నిర్వహించేవారు. ఇటీవల 2024–25 ఏడాదికి టారిఫ్ ఆర్డర్ను విజయవాడలో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మండలి విస్తరిస్తోంది. -
మీరంతా రావడం పూర్వజన్మ సుకృతం..
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటి షెడ్యూల్
సాక్షి, కర్నూలు జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. దారిపొడవునా జై జగన్ నినాదాలతో యాత్ర మార్మోగింది. పెంచికలపాడులోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి సాగింది. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్కి దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. నంద్యాల, ప్రొద్దుటూరు సభకు మించి ఎమ్మిగనూరు సభకు ప్రజా ప్రవాహం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో బహిరంగ సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 4వ రోజు శనివారం (మార్చి 30) షెడ్యూల్: ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
అడుగడుగునా బ్రహ్మరథం..
-
Watch Live: కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర
-
సీఎం జగన్ బస్సు యాత్ర...డే-3 రూట్ మ్యాప్..
-
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
కర్నూల్ లో సీఎం జగన్ సభ...ఏర్పాట్లను పరిశీలించిన బుట్టా రేణుక
-
సీఎం జగన్ చేసిన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుంది
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే
-
న్యాయ రాజధానికి మంచి జరగాలి
-
కర్నూలులో ఓరియంట్ ఫ్లైట్స్ పైలెట్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తొలి పైలెట్ శిక్షణ కేంద్రం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్టులో ఏర్పాటవుతోంది. ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఓరియంట్ ఫ్లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ఉత్తర్వులిచ్చింది. పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఏడీసీఎల్) టెండర్లు పిలవగా మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో రిత్విక్ ఏవియేషన్, ధిల్లాన్ ఏవియేషన్ లిమిటెడ్లు నిర్దేశిత నిబంధనల అర్హతలను అందుకోలేకపోయాయి. ఏపీఏడీసీఎల్ ప్రతీ విమానానికి గంటకు కనీస ఆదాయంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన విధిస్తే.. ఓరియంట్ ఏవియేషన్ దానికి అదనంగా రూ.750 చెల్లించడానికి ముందుకొచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఓరియంట్ ఏవియేషన్ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. సంవత్సరానికి 100 మంది వరకు శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.155 కోట్లతో ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో సుమారు రూ.30 కోట్లతో పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. దీర్ఘకాలిక లీజు విధానంలో తొలుత 20 ఏళ్లకు ఆ తర్వాత పరస్పర అంగీకారంతో మరో పదేళ్లు పొడిగించుకునేలా ఈ ఎఫ్టీవోని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి కనీసం 80 నుంచి 100 మందికి పైలెట్ శిక్షణ ఇచ్చేలా ఈ ఎఫ్టీవోని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం విమాన సర్వీసులే కాకుండా కర్నూలు ఎయిర్పోర్టును ఆధారం చేసుకుని పైలెట్ శిక్షణ, పారాగ్లైడింగ్, ఎంఆర్వో యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా విమానాశ్రయ ఆదాయం పెంచే మార్గాలను ఏపీఏడీసీఎల్ పరిశీలిస్తోంది. -
న్యాయ రాజధానికి మంచి జరగాలి: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
Watch Live: కర్నూలు నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన
-
నేడు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
-
సీఎం జగన్ కర్నూలు పర్యటనకు భారీ సెక్యూరిటీ..
-
రేపు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. -
కర్నూల్లో టాప్ స్పీడ్లో ఫ్యాన్
కర్నూలు సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కేడర్ సిద్ధం అవుతున్నారు. రెండోసారి కూడా ఇక్కడి సీటును మైనారిటీలకే కేటాయించడంతో సిటీలోని మొత్తం మైనారిటీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి సొంత మేనిఫెస్టో ప్రకటించుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మైనారిటీలను చిన్నచూపు చూసే చంద్రబాబుకు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి కర్నూల్ ప్రజానీకం రెడీ అవుతున్నారు. కర్నూల్ పాలిటిక్స్పై ఓ లుక్కేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించినప్పటినుంచీ కర్నూల్లో ఫ్యాన్ టాప్ స్పీడ్లో తిరుగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా మైనారిటీకే కర్నూల్ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంతో సిటీలోని పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ను సమన్వయకర్తగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియామకంతో టీజీ కుటుంబంలో నిర్వేదం మొదలైంది. ఇంతియాజ్ మామ, డాక్టర్ ఇస్మాయిల్ మైనార్టీ వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. నగరంలో టీజీ కుటుంబం విజయంలో ఇస్మాయిల్ కీలకంగా పని చేశారు. మైనార్టీ ఓట్లు అత్యధికభాగం టీజీ కుటుంబానికి పొలయ్యేలా చూడటంలో గతంలో ఆయన కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఇంతియాజ్కు టిక్కెట్ దక్కడంతో మైనార్టీ వర్గం మొత్తం ఆయనకు అనుకూలంగా ఏకమైంది. ఇంతియాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే చర్చ మైనార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామంతో టీజీ కుటుంబానికి మైనార్టీ ఓట్లు పూర్తిగా దూరమైనట్లే. ఇంతియాజ్ కు మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో మంచి పేరు ఉంది. పైగా రిటైర్డ్ ఐఏఎస్ కావడం వల్ల ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగుంటుందనే అభిప్రాయం అన్నివర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మేయర్ రామయ్యతో సహా అందరూ సమష్టిగా ఇంతియాజ్ విజయం కోసం కలిసి పనిచేస్తున్నారు. ఫ్యాన్ స్పీడ్కు తట్టుకోలేకపోతున్న టీడీపీ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన సొంత మేనిఫెస్టోని రూపొందించి మాయ మాటలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. -
కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా బీవై రామయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. -
Kurnool District: ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు
సార్వత్రిక పోరులో అధికార పార్టీ ప్రచారపర్వంలో దూసుకెళ్తుంటే.. తెలుగుదేశంపార్టీ టిక్కెట్ల తగువులాటలో కొట్టుమిట్టాడుతోంది. డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీపై తిరుగుబాటు చేస్తే, ఎమ్మిగనూరులో టిక్కెట్ కోసం జయనాగేశ్వరరెడ్డి వర్గం నిరసన ప్రదర్శనలకు దిగుతోంది. ఆలూరులో పార్టీ కోసం శ్రమించిన వారికి కాకుండా డీఎస్పీని బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే పార్టీకి రాజీనామా చేస్తామని జెండా మోసిన నేతలు చ్చరిస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తిజ్వాల రగులుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక పోరు సమీపిస్తోంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీలో టిక్కెట్ల కేటాయింపు పూర్తి కాని పరిస్థితి. మరోవైపు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో నిరసనల వెల్లువ ఆగడం లేదు. డోన్లో తనను కాదని కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో ధర్మవరం సుబ్బారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన వర్గంతో బలప్రదర్శనకు దిగి మీసం మెలేశారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతుకోశారని, ముందుగా ప్రకటించినా తనకు టిక్కెట్ లేకుండా చేసిన కోట్ల, కేఈ కుటుంబాలకు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలప్రదర్శనలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు ఫ్లెక్సీల్లో కని్పంచకపోవడం గమనార్హం. ఇంటిపెండెంట్గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సుబ్బారెడ్డి అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే టీడీపీకి కోలుకోలేని దెబ్బే! టీజీ కుటుంబంలో నిర్వేదం కర్నూలు వైఎస్సార్సీపీలో కొత్త జోష్ వచ్చింది. కర్నూలు సమన్వయకర్తగా ఇంతియాజ్ను నియమించారు. ఈ నియామకం టీజీ కుటుంబంలో నిర్వేదాన్ని నింపింది. ఇంతియాజ్ మామ, డాక్టర్ ఇస్మాయిల్ మైనార్టీ వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. టీజీ కుటుంబం గెలుపులో ఇస్మాయిల్ కీలకంగా పని చేశారు. మెజార్టీ మైనార్టీ ఓట్లు టీజీ కుటుంబానికి పోలయ్యేలా చూడటంలో గతంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఇంతియాజ్కు టిక్కెట్ దక్కడంతో మైనార్టీ వర్గం మొత్తం ఏకమైంది. ఇంతియాజ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనే చర్చ మైనార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో మైనార్టీ ఓట్లు పూర్తిగా టీజీ కుటుంబానికి దూరమైనట్లే. ఇంతియాజ్కు మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో మంచిపేరు ఉంది. పైగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగుంటుందనే చర్చ విద్యావంతుల్లో కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్రెడ్డి, మేయర్ రామయ్య అంతా సమష్టిగా ఇంతియాజ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ పరిణామాలతో వైఎస్సార్సీపీలో జోష్ ఉంటే, టీజీ కుటుంబం నిర్వేదంలో కనిపిస్తోంది. ఆలూరులో తలనొప్పిగా పోలీస్ పంచాయితీ! ఆలూరు టిక్కెట్ కోసం కోట్లసుజాతమ్మ తీవ్రంగా యత్నిస్తున్నారు. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమెకు దాదాపుగా టిక్కెట్ లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ కూడా బోయ వర్గానికి టిక్కెట్ ఇవ్వాలనే యోచన చేస్తోంది. ఈ క్రమంలో ఓ డీఎస్పీని సంప్రదించినట్లు తెలుస్తోంది. డీఎస్పీ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాకీ చొక్కా తీసేసి, ఖద్దరు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. డీఎస్పీ చేరికను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుజాతమ్మ, వైకుంఠం, వీరభద్రగౌడ్లో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని ముగ్గురూ గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీకి సంబంధం లేని వారికి ఇస్తే తాము కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు నిర్ణయం 14 నియోజకవర్గాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ తక్కిన 5 స్థానాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి స్థానంలో రాఘవేంద్రకు, ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి స్థానంలో మాచాని సోమనాథ్, నందికొట్కూరులో ప్రస్తుతం ఉన్న జయసూర్య, కాకరవాడ వెంకటస్వామి, బండి జయరాజు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వీరి ముగ్గురూ కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. పైగా నందికొట్కూరుకు మరో సమస్య తలెత్తింది. పాణ్యం, నంద్యాల ఎంపీ స్థానాలు ఆశించి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే పాణ్యం టిక్కెట్ ఖరారు చేయడంతో బైరెడ్డి డైలమాలో పడ్డారు. చివరకు నంద్యాల ఎంపీతో పాటు నందికొట్కూరు టిక్కెట్ తాము చెప్పిన అభ్యరి్థకి ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నందికొట్కూరు టిక్కెట్ ఆశిస్తోన్న ముగ్గురు కాదని మరో వ్యక్తి తెరపైకి వచ్చే అవకాశమూ ఉంది. ఇంకోవైపు ఏవీ సుబ్బారెడ్డి, రియల్టర్ నరసింహారావు కూడా ఎంపీ టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయతి్నస్తున్నారు. డబ్బు మూటలే అర్హతగా టీడీపీ చూస్తుండటంతో మాండ్ర శివానందరెడ్డి, ఏవీ కంటే నరసిహంహారావు ఎక్కువగా డబ్బులు పెట్టుకునే శక్తి ఉండటం, బలిజ సామాజికవర్గం కావడంతో ఇతని పేరు కూడా కీలకంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి డబ్బు మూటలు సర్దే కోవెలకుంట్లకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఇతని పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇక ఆదోనిలో మీనాక్షినాయుడు కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక సీటైనా కావాలని జనసేన పట్టుబట్టడంతో ఆదోని ఇచ్చే యోచన చేస్తోంది. ఇక్కడ టీజీ విశ్వప్రసాద్ లేదా అతను మద్దతు ఇచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. -
ప్రఖ్యాత విద్యాసంస్థల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
కర్నూలు: వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, కర్నూలు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. గురువారం ఉదయం కోడుమూరురోడ్డులోని కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, వధువు కీర్తన రెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఉదయం తొలుత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారాయన. అక్కడి నుంచి కోడుమూరురోడ్డులోని వివాహ వేదికకు వెళ్లారు. అక్కడ వివాహ వేడుకకు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు. -
రేపు సీఎం జగన్ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు, అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. -
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్లో పంట కోసుకున్నారు. నవంబర్లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం
కర్నూలు విమానాశ్రయంలో పైలట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వి.ఎన్.భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిరి్మస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ నిరి్మస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఎయిర్పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు. -
కర్నూలుకు కొత్తశోభ
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన తెలుగు రాష్ట్రాల తొలి రాజధాని కర్నూలు.. సీమ ముఖ ద్వారం. విశాఖ, విజయవాడ, గుంటూరు తర్వాత నాలుగో అతి పెద్ద నగరం. కానీ అభివృద్ధిలో వెనుకడుగు. అది నిన్నటి మాట. నేడు కర్నూలు స్వరూపం మారిపోయింది. పాలకుల చిత్తశుద్ధి లేక వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నాలుగున్నరేళ్లుగా కర్నూలు నూతన శోభను సంతరించుకుంది. థీమ్ పార్క్లు, ఫ్లైఓవర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, రోడ్లు, బ్యూటిఫికేషన్, శానిటేషన్, వీధిదీపాలు.... ఒక్కటి కాదు అన్ని రంగాల్లోనూ, అన్ని రకాలుగా మెట్రోనగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది. క్లీన్సిటీగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెంది స్వచ్ఛతలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వీధి వ్యాపారులకు కూడా ‘హాకర్స్ జోన్’ ఏర్పాటైంది. –మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి కర్నూలు నాలుగున్నరేళ్లలో మారిన నగర రూపురేఖలు న్యాయ రాజధాని దిశగా అడుగులు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఆర్సీ సంస్థల ఏర్పాటుతో కళకళ సైన్స్, మ్యూజిక్, కార్టూన్ వంటి 9 థీమ్ పార్క్లు ఏర్పాటు షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీలు కార్పొరేషన్లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు.. రూ.500 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పెద్దాస్పత్రిలో అధునాతన పరికరాలతో పేదలకు మెరుగైన వైద్యం నూతన రహదారులతో రయ్.. రయ్ మంటూ వేగంగా నగరాభివృద్ధి ట్రాఫిక్ కష్టాలు తొలిగేలా ఫ్లై ఓవర్ల నిర్మాణం – తుంగభద్ర పుష్కరాల కోసం శాశ్వతంగా ఘాట్లు క్లస్టర్ యూనివర్శిటీగా రూపుమారిన సిల్వర్జూబ్లీ కళాశాల కర్నూలులో అభివృద్ధి పనులు ఇలా.. నాడు–నేడు కింద రూ.34.99కోట్లతో మున్సిపల్ స్కూళ్ల అభివృద్ధి కర్నూలు నగరంలో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు: రూ.8 కోట్లు 15 వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి ఖర్చు: రూ.45.60 కోట్లు రూ.13.22కోట్లతో డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించారు. రూ.82 కోట్లతో సుంకేసుల నుంచి సమ్మర్స్టోరేజ్ ట్యాంకు పైపులైన్ నిర్మించారు. దీంతో నగరవాసులకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. కార్పొరేషన్ పరిధిలోని మునగాలపాడులో రూ. 15కోట్లతో సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు. దీంతో కల్లూరు, కార్పొరేషన్ పరిధిలోని కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. రూ.26కోట్లతో నగరపాలక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. 6.70 కోట్లతో తుంగభద్ర నది వద్ద 7 శాశ్వత పుష్కరఘాట్లు నిర్మించారు. రూ. 8 కోట్లతో వెంకటరమణ కాలనీలో మోడరన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. రూ. 2 కోట్లతో బిర్లాగేట్ వద్ద ‘ఖానా–ఖజానా’ పేరుతో ఈట్స్ట్రీట్ నిర్మించారు. నగరశివారులోని రుద్రవరంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు రూ. 252కోట్లతో అమృత్ కింద తాగునీటి పథకాలు, 16 ఉపరితల రక్షిత నీటి ట్యాంకులు నిర్మించారు. కర్నూలు మార్కెట్యార్డులో రూ.6.50కోట్లతో జంబోషెడ్డు నిర్మిస్తున్నారు. పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.16కోట్లతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలు పురోగతి ఇలా.. ► గడపగడపకు మొదటి దశలో మంజూరైన నిధులు (రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయాలకు) రూ.17. 99 కోట్లు ► గడపగడపకు రెండో దశలో మంజూరైన నిధులు రూ.22.53 కోట్లు ► పట్టణ ఆరోగ్య కేంద్రాలు, భవనాలు, యూపీహెచ్సీ మరమ్మతులకు రూ. 14.82.కోట్లు ► నీటి శుద్ధి కేంద్రాలకు రూ. 13.18 కోట్లు ► రెండో దశ నీటి శుద్ధి కేంద్రాలకు రూ.47.93 కోట్లు ► నీటి శుద్ధి కేంద్రానికి (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.15.00 కోట్లు ► థీమ్ పార్కులు (స్పెషల్ ప్రాజెక్ట్) రూ.7. 09.కోట్లు ► మంచినీటి సరఫరా , పైప్లైన్ పనులు రూ. 82.00కోట్లు జ్యుడీషియల్ సిటీ.. ► లోకాయుక్త ► మానవహక్కుల కమిషన్ ► ఏపీ ఈఆర్సీ ► వక్ఫ్ట్రిబ్యునల్ ► సీబీఐ కోర్టులు ► నేషనల్ లా యూనివర్శిటీ ► స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ► హైకోర్టు, ట్రిబ్యునల్స్ ► మరో 43 అనుబంధ కోర్టులు ► వీటన్నిటి కోసం 150 ఎకరాలు కేటాయింపు ► మొత్తంగా జ్యుడీషియల్ సిటీ నిర్మాణానికి శ్రీకారం ► టీడీపీ అడ్డుపడటంతో ఒక్క హైకోర్టు వ్యవహారం మాత్రం కొలిక్కి రావల్సి ఉంది మార్పు కోసం నిధుల వరద మొత్తం పనులు: 552 తొలిదశ: 219 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 11.64 కోట్లు రెండో దశ: 144 పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు: 10.16 కోట్లు పురోగతిలో ఉన్నవి: 188 పనులు రోడ్లు, మురుగుకాలవల కోసం చేసిన ఖర్చు గుర్తించిన అభివృద్ధి పనులు: 426 ప్రతిపాదిత ఖర్చు: 54.72 కోట్లు పూర్తి చేసినవి: 272 పనులు చేసిన ఖర్చు: 26.16 కోట్లు వీధిదీపాల కోసం చేసిన ఖర్చు కాలనీల్లో ఏర్పాటు చేసిన వీధిలైట్లు: 220 సెంట్రల్ మీడియన్ లైట్లు: 96 వీటి కోసం చేసిన ఖర్చు: 66 లక్షలు పట్టణంలోని మొత్తం పార్కులు: 156 వీటిలో అభివృద్ధి చేసిన పార్కులు: 35 థీమ్ పార్క్ పేరుతో అభివృద్ధి చేస్తున్నవి: 8 పూర్తయినవి: 6 వీటి కోసం చేసిన ఖర్చు: రూ.7.70 కోట్లు శానిటేషన్ డివిజన్ కార్యాలయాల కోసం చేసిన ఖర్చు శానిటేషన్ డివిజన్ కార్యాలయాలు: 16 కొత్తగా నిర్మించినవి: 11 వీటి కోసం చేసిన ఖర్చు: 8.80 కోట్లు కొండారెడ్డి బురుజును ఆధునికీకరించడంతో పాటు పార్క్, లైటింగ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేశారు. అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కృష్ణానగర్, సంతోషనగర్ వద్ద నేషనల్ హైవేపై ఫ్లైఓవర్లు నిర్మించారు. బిర్లాగేట్ నుంచి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మించారు. నగరంలో ప్రధాన రోడ్లను రూ.65.30కోట్లతో అభివృద్ధి చేశారు. రూ.9.58 కోట్లతో కలెక్టరేట్ ఆధునికీకరణ ► టీడీపీ హయాంలో కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకపోగా 2010 ఆగస్టులో పాలకవర్గం గడువు ముగిసింది. ఆ తర్వాత 11 ఏళ్లు పాలకవర్గం లేదు. వైఎస్. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించి 2021 మార్చిలో కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కర్నూలు అభివృద్ధి కోసం రూ.720కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో 1,736 పనులు పూర్తయ్యాయి. ► కలెక్టరేట్,జాయింట్ కలెక్టర్, సీపీఓ కార్యాలయాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాలు, కాన్ఫరెన్స్ హాలు, వ్యవసాయ, సమాచార, పౌరసంబంధాల కార్యాలయాల పనులు పూర్తి. మరో 15శాఖల కార్యాలయాలు త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు. ► స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, థీమ్ పార్క్లు ► షటిల్ బ్యాట్మింటన్ ఇండోర్ స్టేడియాలు ► సింథటిక్ టెన్నిస్కోర్టులు,క్రికెట్ అకాడమీలు ► మ్యూజిక్పార్క్, సైన్స్పార్క్, ► కల్చరల్ పార్క్, ఫ్రూట్ పార్క్, ► గ్లోగార్డెన్, చిల్ర్డన్స్పార్క్లు ► ఒక్కో పార్కు కోసం రూ.1.20 కోట్లు ► చిల్ర్డన్స్ పార్క్ కోసం రూ.1.70 కోట్లు రూ. 65.30కోట్లతో రహదార్లు పురోభివృద్ధి ఆనంద్ టాకీస్ నుంచి కేసీ కెనాల్ అక్విడిక్ట్ వరకూ బ్రిడ్జి!: రూ.3.50కోట్లు బళ్లారి చౌరస్తా నుంచి పెద్దపాడు రోడ్డు వరకూ రోడ్డు నిర్మాణం: 4కోట్లు కర్నూలు పట్టణంలో 9రోడ్లు ఆధునికీకరణకు రూ.9కోట్లు బిర్లా గేట్ నుండి గుత్తి పెట్రోల్ బంకు వరకూ ఆర్వోబీ నిర్మాణం: 18కోట్లు కర్నూలు–సుంకేసుల రోడ్డు: 1.30కోట్లు పీపుల్స్ పార్క్ నుంచి రాజ్ విహార్, కలెక్టరేట్ వరకూ రోడ్డు నిర్మాణం: 9.80కోట్లు (టెండర్ దశలో ఉంది) కర్నూలు–బళ్లారి రోడ్డు విస్తరణ నిర్మాణం: 13.20కోట్లు( పనులు జరుగుతున్నాయి) సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్పోస్టు వరకూ రోడ్డు నిర్మాణం: రూ.3.50కోట్లు( పెండింగ్లో ఉంది. పూర్తి కావల్సి ఉంది) ఆసుపత్రిలో ఆధునాతన పరికరాలు ► స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం రూ.120 కోట్లు ► కేతలాబ్ మిషన్ కొనుగోలు కోసం రూ.6కోట్లు మంజూరు ► అకస్మాత్తుగా గుండెనొప్పి బారిన పడినవారి కోసం ‘స్టెమీ ప్రాజెక్టు’ రూపొందించారు. ► కర్నూలు మెడికల్ కాలేజీలో రూ.3.2కోట్లతో ఎగ్జామ్ హాల్ నిర్మిస్తున్నారు. ► రూ. 2.17కోట్లతో కాలిన రోగుల వార్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. ► రూ.12.9కోట్లతో డయాగ్నొస్టిక్ బ్లాక్ నిర్మాణం ► ఈ భవనంపై రూ.3 కోట్లతో మరో రెండు అంతస్తులతో ఐసీయూ నిర్మాణం ► రూ.4.5కోట్లతో బాలికల యూజి, పీజీ హాస్టల్ నిర్మాణ దశలో ఉంది. ► రూ.25 లక్షలతో పుల్లీ ఆటోమేటెడ్ మిషన్ కొనుగోలు ► రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి ► ఎస్ఎన్సియూ, ఎన్ఐసీయూను రూ.70 లక్షలతో ఆధునికీకరిస్తున్నారు. ► రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లేబరేటరీని రూ.1.79 కోట్లతో నిర్మిస్తున్న పనులు చివరి దశలో ఉన్నాయి. ► రూ.3.5 కోట్లతో ఆధునిక సిటీ స్కాన్ మిషన్ కొనుగోలు ► 3.5కోట్లతో రెండు న్యూరో మైక్రోస్కోప్స్ కొనుగోలు -
కర్నూలు పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్ హెచ్వోడీ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి ఆదివారం వివరించారు. ♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి. వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్ హార్ట్ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం. ♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్ ఫెయిల్యూర్తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్ కవాటం చెడిపోయింది. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్లు గుర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్ ఆపరేషన్ చేయాలి. మైట్రల్ కవాటాన్ని ప్లాస్టిక్ కవాటంగా మార్చడమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్ చేయడం వంటి ప్రక్రియను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్ టెన్షన్ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది. ♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్ బాల్ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామోజీ 'షో'
-
సిగ్గు.. సిగ్గు.. నవ్విపోతారు!
రామోజీకి ‘పచ్చ’ పైత్యం ముదిరిపోయింది. తన బాబు.. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా చూడలేక దిగులు పెరిగిపోయింది. ఇప్పటికిప్పుడే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే ఆత్రం మితిమీరింది. ఏదో విధంగా జనాన్ని ఏమార్చాలనే కుట్ర, కుతంత్రం ప్రతి కథనంలోనూ కనిపిస్తోంది. జనానికి సీఎం వైఎస్ జగన్ దగ్గరవ్వడం జీర్ణించుకోలేక నిత్యం అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. గురువారం ‘ఈనాడు’ పత్రిక బ్యానర్ కథనంలో ఇచ్చిన ఫొటోను కాసేపు పరిశీలిస్తే రామోజీ డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది. ఆ ఫొటోలో పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా దుప్పట్లు కప్పుకోవడం కనిపిస్తోంది. కొందరైతే అదనంగా తల కింద మరో దుప్పటి పెట్టుకోవడం కూడా కనిపించింది. కేవలం ముగ్గురు విద్యార్థులు దుప్పటి కప్పుకోలేదు. ఆ ముగ్గురికి కూడా దుప్పట్లు ఉన్నాయి. వారు కప్పుకోక పోవడం ప్రభుత్వం తప్పా రామోజీ? ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రగతి మీకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు ఇచ్చిన దుప్పట్లో దూరుకున్న మీకెలా కనిపిస్తుందిలే..! కర్నూలు (అర్బన్): ప్రజలు ఏమైనా అనుకుంటారన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా లేకుండా నిత్యం తప్పుడు కథనాలతో ‘ఈనాడు’ అబద్ధాలు వండి వారుస్తోంది. కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పచ్చ పత్రిక పరువు పోగొట్టుకుంటోంది. ఈ నెల 30న ఈనాడు మొదటి పేజీలో ‘మనసు లేని మామ’ శీర్షికతో ప్రచురించిన కథనంలో కర్నూలు డాక్టర్స్ కాలనీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని, చలికి విద్యార్థులు గజగజ వణికిపోతున్నారని రాశారు. వాస్తవానికి ఈ పాఠశాలలో అలాంటి పరిస్థితే లేదు. డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 5న ప్రభుత్వం ఈ పాఠశాలకు వంద దుప్పట్లు సరఫరా చేసింది. వీటిని ఈ నెల 6నే విద్యార్థులకు అందించి, వారికి దుప్పట్లు అందినట్లు సంతకాలను కూడా (అక్విటెన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు. కనీసం ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే ‘ఈనాడు’ దుర్మార్గంగా ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజల మనుసుల్లో విషం జొప్పించే యత్నం చేసింది. ఈనాడు తీరు పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే వాస్తవం కనిపిస్తుంటే ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా రాస్తారని ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి పూట హాస్టల్ ఫొటోలు తెప్పించుకుని.. ఇలా తప్పుడు రాతలు రాయడం ఏం జర్నలిజం అని హాస్టల్ పరిసర ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు. నాడు–నేడు కనిపించలేదా రామోజీ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించడం తెలిసిందే. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో సకల వసతులు కల్పిస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు చేపట్టి, పూర్తి చేసింది. రెండవ దశలో 22,217 పాఠశాలల్లో పనులు ప్రారంభించింది. చాలా వాటిలో పనులు పూర్తయ్యాయి. మరికొన్నింటిలో చివరి దశలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లను మూడో దశలో అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లి చూసినా కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుంది.. ఒక్క రామోజీకి తప్ప. నాడు–నేడు కింద పనులు జరగని పాఠశాలలను వ్యూహాత్మకంగా ఎంచుకుని ప్రభుత్వంపై ఈనాడు బండలేస్తోంది. ఇప్పుడు చలి కాలం వచ్చిందనే నెపంతో దుప్పట్లు లేవంటూ అవాస్తవాలు వల్లె వేసింది. మాకు 6వ తేదీనే దుప్పట్లు ఇచ్చారు ఈ నెల 6వ తేదీనే మాకు కొత్త దుప్పట్లు అందించారు. పాతవి కొందరు పడేశారు. మరికొందరు వాటిని అలాగే ఉంచుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో మాకు ఇచ్చిన దుప్పట్లను తల కింద పెట్టుకొని పడుకున్నాం. చలి పెట్టినప్పుడు కప్పుకుందాం అనుకున్నాం. మా ఫొటోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో మాకు తెలియదు. చలి వేస్తే.. దుప్పట్లు పెట్టుకుని కూడా కప్పుకోకుండా ఎందుకుంటాం? – మనోజ్నాయక్, అఖిల్నాయక్, హర్షవర్దన్ నాయక్, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, డాక్టర్స్ కాలనీ, కర్నూలు అందరికీ దుప్పట్లు పంపిణీ ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు ఈనెల 5న మాకు వచ్చాయి. ఆ మరుసటి రోజు.. అంటే 6వ తేదీన విద్యార్థులకు అందించాం. ఇంకా పది దుప్పట్లు మిగిలాయి. ఇది అద్దె భవనం. ‘నాడు–నేడు’ ఫేజ్–2 కింద ఈ పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా చూశాం. – ఎస్.శ్రీనివాసకుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి -
తనయుణ్ని ఎమ్మెల్యేగా చూసుకోవాలని టి.జి.వెంకటేష్ ముచ్చట
-
కర్నూలులో ప్రతిధ్వనించిన సాధికార నినాదం
కర్నూలు (రాజ్విహార్): రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు సామాజిక సాధికార నినాదంతో పులకించింది. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వేలాది ప్రజలు వెంట నడుస్తుండగా, యువత బైక్ ర్యాలీతో పాతబస్తీలో సాధికార వైభవాన్ని చాటింది. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ర్యాలీగా వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న సభా స్థలికి చేరుకున్నారు. దారి పొడవునా కేరింతలు, జై జగన్ నినాదాల హోరుతో యాత్ర సాగింది. ‘మళ్లీ జగనే కావాలి’ అంటూ అశేష జనవాహిని చేస్తున్న నినాదాల మధ్య సభ విజయవంతంగా జరిగింది. సీఎం వైఎస్ జగన్ అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలును నేతలు చెబుతుంటే ప్రజలు నిజమే అంటూ సమాధానం ఇచ్చారు. సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో అణగారిన వర్గాల బతుకుల్లో ఎంతో మార్పు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐక్య రాజ్య సమితిలో ఇంగ్లిష్లో మాట్లాడుతున్నారన్నారు. పెత్తందారులకే పరిమితమైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోందన్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులను అణగారిన వర్గాలు పొందుతున్నారని తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో సామాజిక న్యాయం నెలకొల్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు తోడేళ్లు, దొంగల ముఠాల్లా వస్తున్నారని, వారి వలలో పడవద్దని ప్రజలను కోరారు. బడుగుల అభివృద్ధి జగన్తోనే సాధ్యం: కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి ఒక్క సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమైందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికే వెచ్చించారని తెలిపారు. ఇది 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడికి మళ్లించారో చంద్రబాబు సమాధానం ఇవ్వాలన్నారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అండగా నిలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు వేస్తేనే రెండున్నర లక్షలు ఖర్చుచేసిన సీఎం జగన్ మరోసారి ఓటు వేస్తే ఎంత మేలు చేస్తారో అలోచించాలని ప్రజలను కోరారు. దేశంలో ఇంత మేలు ఎన్నడూ జరగలేదు : మాజీ మంత్రి అనిల్కుమార్ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టడుగు వర్గాలకు సీఎం జగన్ చేసినంత మేలు ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనార్టీకీ సీఎం జగన్ సంక్షేమాన్ని అందించారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు ఎప్పటికీ మేలు చేయరని చెప్పారు. సామాజిక కుట్రకు టీడీపీ శ్రీకారం: ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ అన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులిచ్చి సమాజంలో గుర్తింపు తెచ్చారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బలహీనులు ఎదగకూడదన్న దురుద్దేశంతో టీడీపీ సామాజిక కుట్రకు తెర లేపిందని, అందరూ దానిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కర్నూలుకు రూ.2 వేల కోట్లు ఇచ్చిన సీఎం జగన్: ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సీఎం జగన్కు కర్నూలుపై ప్రత్యేక అభిమానం ఉందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి ఈ నాలుగున్నరేళ్లలో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, అందుకు అందరం ఆయనకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. -
కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర
-
లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలు(టౌన్)/నందికొట్కూరు: వివాహేతర సంబంధం ఇరువురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలోని వుడ్ల్యాండ్స్ లాడ్జిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న విజయకుమార్(35) వృత్తిరీత్యా అకౌంటెంట్. బీటెక్ పూర్తి చేసిన ఇతను పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ముస్లిం అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మిడుతూరు మండలం నాగలూటికి చెందిన రుక్సానా(45)కు పట్టణానికి చెందిన కార్పెంటర్తో 2001లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఒకే కాలనీలో ఉంటున్న విజయకుమార్, రుక్సానా మధ్య ఏర్పడిన పరిచయం మూడేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ప్రియుడు రుక్సానాకు ఫోన్ చేసి కర్నూలులోని వుడ్ల్యాండ్స్ లాడ్జిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాబుకి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని భర్తకు చెప్పి రూ.5 వేలు తీసుకుని బయలుదేరింది. అయితే కుమారుడిని ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలి ఆమె కనిపించకుండా పోయింది. రాత్రి అయినా రాకపోవడంతో కుమారుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇదే సమయంలో ప్రియుడు విజయ్కుమార్ ఆమె కుమారుడికి ఫోన్ చేసి ఇద్దరం లాడ్జిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఫోన్ పే ద్వారా రూ.300 అకౌంట్లో వేశాడు. అయితే ఏ లాడ్జి అనే సమాచారం లేకపోవడంతో కుమారుడు అన్ని చోట్ల వెతికాడు. చివరకు వుడ్ల్యాండ్స్ వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు పట్టి లాడ్జిలో విచారించారు. విజయ్కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుసుకుని రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరువ లేదు. రూమ్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఎంత ప్రయత్నించినా రూం తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టారు. ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఈ ఘటన వివాహేతర సంబంధం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇరువురి మధ్య గొడవ జరిగి రుక్సానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత క్రిమి సంహారక మందు తాగి తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. హత్య, ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై విచారణ చేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, మూడవ పట్టణ సీఐ -
నేడు 32వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్స్టేషన్కు బ్లాక్మెయిలర్స్ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్లో దారుణం.. కేర్ టేకర్పై ఎలుగుబంటి దాడి -
సింహం ఒంటరిగానే వస్తుంది: అంజాత్ బాషా
-
చంద్రబాబుపై హఫీజ్ ఖాన్ కామెంట్స్..
-
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ వరించింది. అందుకే ఎన్టీఆర్ అంటే అంతలా అభిమానిస్తారు. తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్రాజ్, జిస్సు సేన్గుప్తా, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్-2లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. Kurnool City & Dt@tarak9999 ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt — MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023 -
కొత్త బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని..
కర్నూలు : కల్లూరు ఎస్టేట్లోని జీఎస్ఎస్ కాలనీలో నివాసముంటున్న రహంతుల్లా భార్య షేక్ రేష్మా (22) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణం శ్రీనివాసనగర్కు చెందిన నూర్ అహ్మద్, మున్ని దంపతులకు ముగ్గురు కూతుర్లు సంతానం. పెద్ద కూతురు షేక్ రేష్మాను కల్లూరు ఎస్టేట్లో నివాసముంటున్న రహంతుల్లాకు ఇచ్చి గత ఏడాది అక్టోబర్లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా రూ.4 లక్షలు కట్నం, 20 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకలుగా ఇచ్చారు. భర్త రహంతుల్లా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్యను తల్లి దగ్గర ఉంచి వారానికి ఒకసారి కల్లూరుకు వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది. చిన్నచిన్న కారణాలు చూపి అత్త ఫాతిమా, ఆడపడుచు ముస్కాన్, ఆమె భర్త జావెద్ వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పుకుని రేష్మ బాధ పడేది. ఇటీవల బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని భర్త వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారు పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పారు. అయినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్తతో పాటు అత్త, ఆడపడుచు, ఆమె భర్త జావిద్ల వేధింపులు తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి నూర్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మీ వల్లే ఇదంతా జగనన్నా.. లబ్ధిదారుడి భావోద్వేగం
సాక్షి, కర్నూలు జిల్లా: వరసగా నాలుగో ఏడాది ‘జగనన్న చేదోడు’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు స్వామి చంద్రుడు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే’’ అంటూ సీఎం జగన్ను కొనియాడారు. లబ్ధిదారుడి మాటల్లోనే.. అన్నా, నేను నాయీ బ్రాహ్మణ కులంలో పుట్టాను, మా కుమారుడు పుట్టుకతో చెవిటి, మూగవాడు, నేను ఈ పథకం ద్వారా మూడు సార్లు లబ్ధిపొందాను, మా కుమారుడితో కూడా షాప్ పెట్టించాను, మా అబ్బాయి కూడా ఈ పథకం పొందాడు. తనకు మాటలు రావు కాబట్టి తన ఆనందం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో నాకు పాతకాలం కుర్చీలు, సామాన్లు ఉండేవి కానీ ఈ పథకం ద్వారా వచ్చిన లబ్ధితో మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరూ చేయని విధంగా మాకు కరోనా సమయంలో సాయం చేశారు, మేం ఈ రోజు తింటున్నాం అంటే మీ పుణ్యమే.. మమ్మల్ని గుళ్ళలో పాలకమండలి సభ్యులుగా నియమిస్తున్నారు. గతంలో మమ్మల్ని కులంతో దూషించేవారు కానీ ఇప్పుడు నాయీ బ్రాహ్మణులని పిలుస్తున్నారు. గతంలో మా తోకలు కత్తిరించాలని చంద్రబాబు అన్నారు. కానీ మీరు ప్రేమతో ఆదరించారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మాకు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరిని బాగా చదివించి డాక్టర్ను చేయగలిగాను. మీ వల్లే ఇదంతా నా చిన్నకుమారుడికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ రూ. 8 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా చేయించారు. నాకు టిడ్కో ఇల్లు వచ్చింది, మేమే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు గౌరవం కల్పించారు, మీరు మా వెన్నంటి ఉండి మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మేమంతా మీ వెంటే ఉంటాం. ధన్యవాదాలు. మనమంతా జగనన్న కుటుంబం: మంత్రి వేణు అందరికీ నమస్కారం, అన్నా రక్తాన్ని స్వేదంగా మార్చి, శ్రమ తప్ప సేద తీరాలన్న ఆలోచన లేని, కష్టం తప్ప కల్మషం లేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్ళని చెప్పుకున్న నాయకుడు గతంలో లేరు, వీరంతా జగనన్న బంధువులు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా జగనన్న బంధువులే, వీరంతా గతంలో మోసపోయారు, మన జీవితాలు మారాలంటే కులవృత్తులకే పరిమితం కాదని.. విద్య మాత్రమే మార్గమని నాడు వైఎస్ఆర్ గారు ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ కోతలు పెట్టారు. నేడు సీఎంగారు ప్రతి బీసీ గర్వపడేలా, మిగిలినవారంతా బాగుపడేలా కులగణన చేయబోతున్నారు. ఇది మన జీవితాలను మార్చబోతుంది, మనమంతా జగనన్న కుటుంబం, కులవివక్షకు గురైన రజకలు, నాయీ బ్రహ్మణులుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. జగనన్నా... చేదోడు పథకం బీసీ కుటుంబాలలో దివ్వెను వెలిగిస్తుంది, ఇది అందరికీ భరోసా, భాగ్యం, భద్రత కల్పిస్తుంది. ధ్యాంక్యూ. చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు