breaking news
Hanamkonda
-
ఘనంగా విశ్వకర్మ యజ్ఞం
హన్మకొండ కల్చరల్ : వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బుధవారం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి విశ్వకర్మ పూజారులు గూటోజు కేదారీశ్వరాచారి ఆధ్వర్యంలో అర్చకులు సుప్రభాత సేవ, బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, వివిధ పూజలు చేశారు. అనంతరం విశ్వకర్మ యజ్ఞంలో భాగంగా గణపతి, నవగ్రహ పూజలు, యజ్ఞం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటయాచారి, సభ్యులు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఎందుకు తొలగించారో జవాబు చెప్పాలని అన్నారు. కవిత వ్యాఖ్యలపై స్పందించి తాము ఏ అక్రమాలకు పాల్పడలేదని ముక్కునేలకు రాయాలని హరీశ్రావు, కేటీఆర్కు సవాల్ విసిరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటున్న హరీశ్రావు, కేటీఆర్.. దమ్ముంటే మీరందరూ రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, నాయకులు వీసం సురేందర్రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, పింగిళి వెంకట్రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, మార్క విజయ్ పాల్గొన్నారు. -
జాతీయ సైన్స్ సెమినార్లో రాణించాలి
విద్యారణ్యపురి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న జాతీయ సైన్స్ సెమినార్లో రాణించాలని జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాస్స్వామి కోరారు. బుధవారం లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లాస్థాయి జాతీయ సైన్స్సెమినార్ నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 18 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న అపూర్వశ్రీవాస్తవ రాష్ట్రస్థాయి జాతీయ సెమినార్కు ఎంపికయ్యారు. పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఎం.మన్వితారెడ్డి ద్వితీయ స్థానం, ఐనవోలులోని ఏకశిల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వై.రేష్మ తృతీయ స్థానం సాధించారు. కేడీసీ కంప్యూటర్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రవణకుమారి, వాగ్దేవి డిగ్రీ కాలేజీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు బి.స్వప్న న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈనెల 18న హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీలో నిర్వహించే రాష్ట్రస్థాయి జాతీయ సైన్స్సెమినార్లో అపూర్వశ్రీవాస్తవ పాల్గొననున్నారు. -
మహిళ ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం
హన్మకొండ: మహిళ ఆరోగ్యంతోనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్వస్త్ నారి.. సశక్తి పరివార్ అభియాన్లో భాగంగా బుధవారం హనుమకొండ సమ్మయ్యనగర్లోని లష్కర్సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన తర్వాత ఈ మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్యసేవలందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. టీబీ ముక్త్ అభియాన్లో భాగంగా దాతలు అందించిన పోషకాహార కిట్లను టీబీ వ్యాధిగ్రస్తులకు అందించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, డాక్టర్లు అజిత్ మహమ్మద్, సుదీప్, ప్రశాంత, హారిక, హిమబిందు, ఇత్తదార్ అహ్మద్, సనత్ చందర్, భానుచందర్, హైదర్, డెమో అశోక్ రెడ్డి, ఎన్హెచ్ఎం డీపీఎం రుక్ముద్దీన్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా వీసీ ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కాంట్రిబ్యూట్ అనే థీంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వామ్యానికి రావాలని కోరారు. అలుమ్ని గోల్డెన్జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటు పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. ఎంజీఎం : రాష్ట్రంలోని వైద్య విద్యార్థుల పెండింగ్ స్టైఫండ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (టీ–జుడా) బాధ్యులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలోని సంస్థల అధిపతులు స్టైఫండ్ బిల్లులను సమయానికి సమర్పించినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదానికి నిలిచిపోతున్నాయని తెలిపారు. స్టైఫండ్ విడుదల కాకపోవడంతో జూనియర్ డాక్ట ర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు, డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, హౌ స్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థులు ఆర్థికంగా సతమతవుతున్నారని పేర్కొన్నారు. సకాలంలో స్టైఫండ్ విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు అందించామని చెప్పారు. విద్యారణ్యపురి : వ్యవసాయం, ఫార్మా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలక పాత్ర పోషిస్తోందని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీ షేపింగ్ ది లాండ్స్కేప్ ఆఫ్ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఎంజెల్స్ సీఈఓ, ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అతిథులు సావనీర్ను ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ రాజిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ పి.అమరవేణి, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ సారంగపాణి, హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
మామునూరు: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఎంఈఓ ఎస్.వెంకటేశ్వర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, నిస్సా జాతీయ ఉపాధ్యక్షుడు జేఎస్ పరంజ్యోతి, ట్రస్మా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు సూచించారు. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్ ప్రాంగణంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యాం అధ్యక్షతన బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. టస్మా, వడుప్సా జిల్లా ప్రతినిధులు బిల్లా రవి, జ్ఞానేశ్వర్సింగ్, కోడెం శ్రీధర్, బుచ్చిబాబు, సంతోష్రెడ్డి, జనార్దన్, అడెపు వెంకటేశ్వర్లు, ముక్కెర రవీందర్, కూచన క్రాంతికుమార్, కూచన కవిత ఉన్నారు. -
వాల్పోస్టర్ల ఆవిష్కరణ
హన్మకొండ చౌరస్తా : టీజీఎస్ ఆర్టీసీ చేపట్టిన ‘యాత్రాదానం’ వాల్ పోస్టర్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. పుట్టిన రోజు, వార్షికోత్సవం, పండుగలు, ఇతర శుభకార్యాలు, ప్రత్యేకమైన రోజుల్లో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు యాత్రాదానం ఉపయోగపడుతుందన్నారు. టూర్ ప్రారంభానికి వారం ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. 80745 62195, 98663 73825, 9959226047 నంబర్లకు ఫోన్ చేసి టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ సంతోష్కుమార్, టూర్ ప్యాకేజీ ఆఫీసర్ రాతిపల్లి సాంబయ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్ది ప్రజాకంఠక పాలన
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: కాంగ్రెస్ది ప్రజాకంఠక పాలన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ దుయ్యబట్టారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందని ధ్వజమెత్తారు. హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టడం, మైనారిటీలను ఎమ్మెల్యేగా, మంత్రిని చేయకపోవడం ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. అన్నదాతలను ఆగం చేయడం, యూరియా అందించకపోవడం, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయేలా చేయడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం ప్రజాపాలన అని నిలదీశారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. అమాయకులను హతమారుస్తున్న బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, తండమల్ల వేణు, కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, బండి రజనీకుమార్, దూలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాప్రభుత్వం స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. 20 నెలల్లో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకుపోతోందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నగర పరిధిలో 7 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, 50 వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో 76,378 మందికి చేయూత పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్రెడ్డి, ప్రజాకవి కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, సుద్దాల హనుమంతు, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి వంటి సాహితీమూర్తులకు నివాళులర్పించారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలిబతుకమ్మ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలిరోజు వేయిస్తంభాల ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించే బతుకమ్మ వేడుకకు లైటింగ్, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. హనుమకొండ పరిధి 26 ప్రాంతాల్లో, వరంగల్ పరిధి 20 ప్రాంతాల్లో అవసరమైన మేరకు లైటింగ్, డస్ట్తో పాటు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. డీఈలు సారంగం, రవికిరణ్, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై మంత్రి సమీక్ష
హన్మకొండ అర్బన్: ప్రజా పాలన వేడుకల అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో సుమారు గంటసేపు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, మేయర్, గ్రేటర్ కమిషనర్, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ అంతర్గత విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అంతకుముందు ప్రజాపాలన వేడుకల కోసం నగరానికి వచ్చిన మంత్రి పొంగులేటికి నిట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమరవీరులకు నివాళి.. హనుమకొండ అదాలత్ కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఇందిరమ్మ రాజ్యంలోసామాజిక న్యాయం
వరంగల్ అర్బన్: తెలంగాణ సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఓ సిటీ ఎదుట ఉన్న ఐడీఓసీ మైదానంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజున ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహించడం శుభసూచకమన్నారు. స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశంలో రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మేధావుల దూరదృష్టి, ప్రభావవంతమైన చర్యలతో భారతదేశం ఒక శక్తివంతమైన గణతంత్రంగా అవతరించిందని చెప్పారు. ప్రజలకు సమాన అవకాశాలు.. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దకాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల మనస్సును గెలుచుకుందని తెలిపారు. ప్రజలందరికీ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు ప్రభుత్వం పయనిస్తోందని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఆరు గ్యారంటీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచడం తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యరాణి, డీఆర్వో విజయలక్ష్మి, సీఈఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు ప్రజల మనస్సును గెలిచిన కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ -
ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సంక్షేమం
హన్మకొండ అర్బన్: ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాల మాదిరిగానే హనుమకొండ–వరంగల్ నగరాలు కూడా కలిసి ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభం.. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను తీసుకువచ్చినట్లు వివరించారు. భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అలాగే, హనుమకొండ కలెక్టరేట్ బంగ్లాను ఆధునికీకరించినట్లు చెప్పారు. జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యసేవలు.. గత ప్రభుత్వం నగరంలో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదలు ఉచిత వైద్యసేవలు పొందుతున్నారని చెప్పారు. 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు.. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలో 435 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, వేలాది మందికి కొత్త రేషన్కార్డులు జారీ చేయడంతో పాటు వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా రేషన్ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు. ఐదు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు.. విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తన, ఎరువుల కొరత అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాదాబైనామాతో భూసమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు.. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామన్నారు. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించామని వివరించారు. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించామని ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. మేయర్ సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, స్నేహ శబరీష్, సత్యశారద, గ్రేటర్ కమిషనర్ చాహత్బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ముందు చూపుతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి ప్రజాపాలన దినోత్సవంలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడి మృతి
హసన్పర్తి: బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్నాయక్ (42) జవహర్కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్పై ఇంటి నుంచి కేయూ జంక్షన్ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. -
రైల్వే ఎన్ఐ వర్క్స్..
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట, బల్లార్షా మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రైల్వే ఎన్ఐ వర్క్స్తో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు పలు రైళ్లకు వివిధ స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. రద్దయిన రైళ్లు ఈ నెల 19వ తేదీన కాజీపేట–సిర్పూర్టౌన్ (170 03) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) రామగిరి ప్యాసింజర్, ఈ నెల 18వ తేదీన(నేడు) కాజీపేట–బల్లార్షా (17035) రామగిరి ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్, సిర్పూర్టౌన్–కరీంనగర్ (87771) పుష్పుల్, కరీంనగర్–సిర్పూర్టౌన్ (67772) పుష్పుల్ రద్దయ్యాయి. పాక్షికంగా రద్దయిన రైళ్లు ఈ నెల 19వ తేదీన భద్రాచలంరోడ్–బల్లార్షా (1 7033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి సిర్పూర్ టౌన్–కాజీపేట మధ్య, సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (17234) ఎక్స్ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్–కాజీపేట మధ్య, ఈ నెల 18న సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233) ఎక్స్ప్రెస్ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య రద్దు. తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత.. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఎక్స్ప్రెస్కు, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్ప్రెస్కు మందమర్రి రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఎత్తివేశారు. రెగ్యులేషన్ ట్రైన్.. ఈ నెల 19వ తేదీన డెహ్రాడూన్–చర్లపల్లి (07078) ఎక్స్ప్రెస్ 30 నిమిషాల పాటు రెగ్యులెటెడ్ చేశారు.● పలు రైళ్లు రద్దు..హాల్టింగ్ ఎత్తివేత ● ఈ నెల 18, 19 తేదీల్లో అమలు -
విద్యార్థులు ఉద్యమించాలి
హన్మకొండ: సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగం అభివృద్ధి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) జాతీయ సలహాదారుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. బుదవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో యూఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా మహాసభ జరిగింది. ముందుగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి హోటల్ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు జెండావిష్కరణ చేశారు. భగత్సింగ్ చిత్రపటానికి అరుణ్కుమార్, నాయకులు పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్ఎఫ్ఐ అలుపెరుగని పోరాటాలను చేస్తోందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మనోజ్, కార్యదర్శి మాలోత్ రాజేశ్నాయక్, నాయకులు బాలగోని రాకేష్, జయకృష్ణ, హరీశ్, కృష్ణమూర్తి, అభిరామ్, సురేశ్, ధనుశ్, మహేశ్ పాల్గొన్నారు. -
తల్లిపాలు అందించిన లిఖిత
నర్సంపేట: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన పల్నాటి కరుణాకర్ సతీమణి లిఖిత ఆదర్శంగా నిలిచింది. తన మూడు నెలల పాప వేదస్యకు తల్లిపాలు సరిపడా అందించిన అనంతరం మిగిలిన ఏడు లీటర్ల పాలను నిల్వ చేసి బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి అందించింది. ఇంతకు ముందు ఆగస్టు 29న నాలుగు లీటర్ల తల్లిపాలు అందించింది. ఇలా దానం చేయడం ద్వారా పలు కారణాల వల్ల తల్లిపాలు అందని శిశువులకు అవసరమైన పోషణ అందించగలుగుతారని లిఖిత తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతీ తల్లి, శిశువు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రేరణగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. బకెట్ నుంచి వాటర్ హీటర్ తీస్తుండగా.. ● విద్యుదాఘాతంతో మహిళ మృతి ● బొంతగట్టునాగారంలో ఘటన తరిగొప్పుల: స్నానానికి వేడి నీళ్ల కోసం బకెట్లో పెట్టిన వాటర్ హీటర్ తీస్తుండగా షాక్ తగిలి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన బుధవారం మండలంలోని బొంతగట్టునాగారంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీదేవి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి లింగమ్మ(48) బాత్రూంలో స్నానానికి వేడి నీళ్ల కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టింది. అనంతరం స్విచ్ ఆఫ్ చేసి బకెట్లోని వాటర్ హీటర్ తీస్తుండగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలి భర్త మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటర్ వర్సిటీ పోటీలకు ఆర్చరీ జట్ల ఎంపిక కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు ఆధ్వర్యంలో బుధవారం ఆర్చరీ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆర్చరీ క్రీడాకారులు తన్వీర్కౌసర్, త్రిశూల్,అశ్విత్, రమ్య, మనసుర హాసిభ, వెంకటేష్, ఆనంద్, గంగరాజు పాల్గొన్నారు. ఈ జట్లు ఈఏడాది అక్టోబర్లో పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీ, పఠాన్లోని హెచ్ఎన్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తెలిపారు. డాక్టర్ ఏటీబీటీ ప్రసాద్, డాక్టర్ కుమారస్వామి, రాజేశ్, ఆంజేయులు, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం ● జిల్లా కేంద్రం శివారులో ఘటన ములుగు: జిల్లా కేంద్రం శివారులోని వివేకవర్థిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుగులోత్ శ్రీను (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రేమ్నగర్కు చెందిన శ్రీను ద్విచక్రవాహనంపై గట్టమ్మ నుంచి తన ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో శ్రీను అక్కడికక్క డే దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అప్రమత్తతే ఆయుధం..
మహబూబాబాద్ రూరల్ : జెమిని వైరస్, బొబ్బ రోగం.. ప్రస్తుతం మిరప రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంటను నాటి నెలరోజులు గడవక ముందే చిన్న మొక్కలపై రైతులు పోటాపోటీగా పురుగుల మందులు, సిఫార్సు లేని బయో మందులను పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో పొడి వాతావరణం పరిస్థితులలో వేసిన మిరప పంటను ప్రస్తుతం వివిధ చీడ పీడలు ఆశిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్.. రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. పైముడత నివారణకు : ఫిప్రోనిల్ ఎస్.సి 2 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో లేదా డైఫెన్ ధయురాన్ 1.5గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కింది ముడత నివారణకు .. నీటిలో కరిగే గంధకం 3 గ్రాములను లీటర్ నీటిలో లేదా స్పైరోమెసిఫెన్ 0.8 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి లేదా ప్రాపర్ గైట్ 57శాతం 2 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లద్దె పురుగు నివారణకు .. నోవాల్యూర్న్ 0.75 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములను లీటర్ నీటిలో లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సిఫార్సు లేని బయో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. ● పొలం చుట్టూ 2 నుంచి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్న రక్షణ పంటలుగా వేసుకోవాలి. పసుపు, నీలం రంగు జిగురు అట్టలను 20 నుంచి 25 చొప్పున ఎకరానికి రైతులు సామూహికంగా వేసుకోవాలి. మొక్కల ఎత్తును బట్టి జిగురు అట్టలను కూడా పైకి అమర్చుకోవాలి. తెల్ల దోమల నివారణకు 5శాతం వేప గింజల కషాయం ( వేప నూనె 1500 పీపీఎం) 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఫైరిప్రాక్సిఫెన్ 102 ఇ.సి. 1.5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా ఫెరిప్రాక్సిఫెన్ 57. ఇ.సి. + ఫెన్ పోపాత్రిన్ 15 ఇ.సి. 1 మిల్లీ లీటర్ను లీటర్ నీటిలో లేదా ఫెనో పాత్రిన్ 30శాతం ఇ.సి 0.5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో లేదా థయామిథాక్సాం 0.4 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● ప్రతీ సారి రైతులు పురుగుమందును పిచికారీ చేసినప్పుడు కేవలం పురుగు మందును మాత్రమే కాకుండా పోషకాల మిశ్రమం (191919/13045) లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమం 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే మొక్కలకు బలాన్ని ఇస్తూ, వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొత్తరకాల చీడ, పీడలను తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. మిరప పంటను ఆశిస్తున్న చీడపీడలు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి జెమిని వైరస్, బొబ్బ రోగంపై జాగ్రత్తగా ఉండాలి రైతులకు మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్ సలహాలు ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు లేవు. అందుకే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి. తొలిదశలోనే వైరస్ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి కాల్చి వేయాలి. ప్రధాన పొలంలో, గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల కలుపు మొక్కలు వైరస్ తెగుళ్లకు ఆశ్రయం కల్పిస్తాయి. మిరప తోటలో వంగ (బెండ), టమాట మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దు. ఇవి తెల్ల దోమలకు ఆశ్రయం కల్పిస్తాయి. -
గ్రామీణ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం
మామునూరు: గ్రామీణ పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ కళాశాల డీన్ భూపాల్రాజు సూచించారు. ఈ మేరకు ఖిలా వ రంగల్ మండలం తిమ్మాపురం రాంగోపాలపురంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల వి ద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామీణ పరిస్థితుల అధ్యయన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వనరులు, పటం, గ్రామ భౌగోళిక పరి స్థితులు, వ్యవసాయ స్థితిగతులు, సామాజిక అంశాలు, పశు సంవర్థక రంగం, గ్రామ సమస్యలు వంటి అనేక అంశాలను విద్యార్థులు సమగ్రంగా సేకరించి చిత్రపటాల రూపంలో ప్రదర్శించాలన్నారు. ఇన్చా ర్జ్ డాక్టర్ శ్రీకర్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న, డాక్టర్ శ్రవణ్కుమార్, కేటీ విజయ్, ఇన్స్పెక్టర్లు కార్తీక్, వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారులు జలగం రమేశ్కుమార్, బి.సురేశ్, డాక్టర్ మధు, శ్రావ్య, రవితేజ, ఏఈఓ సత్యప్రకాశ్, జలగం రమేశ్, సొసై టీ డైరెక్టర్లు చెన్నారెడ్డి, సాయి నందన్రెడ్డి, రాజేశ్వర్రావు, ప్రసాద్రావు, రాములు, పాల్గొన్నారు. -
వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తాం
ఖిలా వరంగల్: సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సావాలను వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కరీమాబాద్లోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నగర మేయర్ గుండు సుధారాణి, నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ ఆట స్థలాలను శుభ్రం చేయాలని బల్దియా అధికారులను ఆదేశించారు. దసరా కమిటీ విజ్ఞప్తి మేరకు రంగలీల మైదానంలో మైసూరును తలపించేలా దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చివేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉర్సుతోపాటు కాశిబుగ్గ, రంగశాయిపేట, శివనగర్లో మహిళా సంఘాలతో ఫుడ్స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు, ఈనెల 21న వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న వేడుకలు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీపీ సలీమా, డీఆర్ఓ విజయలక్ష్మి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్రావు, ఏఎస్పీ శుభం ప్రకాశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్లార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఏసీపీలు జితేందర్రెడ్డి, సత్యనారాయణ, దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు నాగపూరి సంజయ్బాబు గౌడ్, మేడిది మధుసూదన్, మండ వెంకటన్న, గోనె రాంప్రసాద్, గోపాల నవీన్రాజు,ప్రకాశ్ పాల్గొన్నారు.చలించిన మంత్రి సురేఖ..న్యూశాయంపేట : వరంగల్ దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో అన్నాచెల్లి సుమారు ఏడాది నుంచి స్థానికులు పెట్టిన ఆహార పదార్థాలు తింటూ అనాథలుగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం స్వాస్థ్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్తున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. అపరిశుభ్రంగా ఉన్న వారిని చూసి చలించారు. వెంటనే వారి వాకబు చేయగా వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన రజినీకాంత్, అతడి చెల్లి రమాదేవి అని తెలిసింది. రజినీకాంత్ను సహృదయ ఆశ్రమానికి, చెల్లి రమాదేవిని వైద్య చికిత్సల నిమిత్తం ఎంజీఎం తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరికీ రేషన్కార్డు, డబుల్బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. బతుకమ్మ, విజయదశమికి ఏర్పాట్లు చేయండి రంగలీల మైదానం అభివృద్ధికి చర్యలు అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ -
ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్రం
హన్మకొండ: ఆర్థిక ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాల ఉంచి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిపిన పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న ప్రత్యేక సంస్థానంగా ఉన్న తెలంగాణ ప్రాంతం భారత్లో విలీనమైందన్నారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, రాజు చౌహాన్, అశోక్, కె.మాధవరావు, చీఫ్ జనరల్ మేనేజర్లు రవీంధ్రనాథ్, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వెంకట కృష్ణ, మల్లికార్జున్,నాగప్రసాద్, వేణుబాబు, అన్నపూర్ణ, శ్రీకాంత్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి ట్రాన్స్ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, వివిధ విభాగాల డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న సర్వీస్లను మ్యాపింగ్ చేయాలన్నారు. ఇంటి లోపల ఉన్న మీటర్లు బయట అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ పరిధిలో విధిగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, సి.జి.ఎంఆర్. చరణ్ దాస్, జీఎంలు వెంకటకృష్ణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, వేణుబాబు, కృష్ణ మోహన్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ప్రజాపాలన వేడుకలకు సన్నద్ధం
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజాపాలన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలోని కొత్త కలెక్టరేట్ పక్కన నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఉదయం పది గంటలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సీటింగ్ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ ఈఈ రాజేందర్రెడ్డి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్రెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో నేడు (బుధవారం) నిర్వహించే ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం, ప్ర సంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అన్నారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోలుపై అధికారులు, ట్రేడర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 1,81,547 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వివరించారు. 11,85,470 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న 27 జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ పాల్గొన్నారు. శంభునిపేట పాఠశాలలో కృత్యమేళా ఖిలా వరంగల్: వరంగల్ శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం కృత్యమేళా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద హాజరై 13 మండలాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. -
కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు
కేయూ క్యాంపస్: తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కేయూలోని ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈశిబిరంలో ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యులు బి.తిరుపతి మాదిగ, అరెగంటి నాగరాజు, డి.తిరుపతి, మర్ర మహేశ్ రీసెర్చ్ స్కాలర్స్ కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బొట్ల మనోహర్, ఎల్తూరి సాయికుమార్, ఉప్పుల శివ, కమ్మరి శ్రీనాఽథ్, ఎండెల రాకేశ్, బొక్క ప్రవర్ధన్, చింతం ఆంజనేయులు, శ్రీదేవి, స్రవంతి, శేఖర్, ఓర్సు చిరంజీవి విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీఅండ్ ఎండీ సోనీబాలాదేవి, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని సాట్ కార్యాలయంలో అశోక్ సాట్ వీసీఎండీ, చైర్మన్లను వారి ఆఫీసుల్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో సాట్ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యారణ్యపురి: డిజిటల్ లెర్నింగ్పై హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, కేజీబీవీల, మోడల్ స్కూల్స్, టీఎస్ఆర్ఐఈఎస్లలోని గణిత, ఫిజికల్ సైన్స్ టీచర్లకు ఈనెల 17 నుంచి 19 వరకు మూడు రోజులు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ‘ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే మోడ్యూల్పై ఈశిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండుచోట్ల ఆయా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. 6వతరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి డిజిటల్ లెర్నింగ్ పాఠ్యప్రణాళిక అంశాలపై రిసోర్స్పర్సన్లతో శిక్షణ ఇవ్వబోతున్నారు. నాగేంద్రస్వామికి పూజలుగీసుకొండ: మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు మంగళవారం పూజలు చేసి మొక్కులు సమర్పించారు. వారికి అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల దీక్షలు చేపట్టిన స్వాముల కోసం అర్చకులు జ్యోతి పూజ నిర్వహించారు. -
వేతన ఒప్పందం అమలు చేయాలి
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, ఎరియర్స్ చెల్లించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రచారి డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా డిపోల వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డిపో కమిటీల ఆధ్వర్యంలో యూనియన్ పతకాన్ని ఆవిష్కరించారు. బి.ఉపేంద్రచారి మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం వేతన సవరణ చేయకుండా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బాడీ బిల్డింగ్, వర్క్షాపుల తరలింపులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు తాళ్లపల్లి ఎల్ల య్య, నాయకులు నారగోని శ్రీనివాస్, పాషా, బి.సంపత్, వై.శ్రీనివాస్ తదితరులున్నారు. -
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్/హన్మకొండ కల్చరల్: బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధి హనుమకొండలో 26 ప్రాంతాల్లో వరంగల్ పరిధిలో 20 ప్రాంతాలను బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడానికి ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో శానిటేషన్లో భాగంగా బతుకమ్మ ఆడే ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ లైటింగ్ వెలుగులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాలన దినోత్సవం (తెలంగాణ విమోచన దినం) సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ జెండాను ఎగురవేస్తారని అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. వెయ్యి స్తంభాల ఆలయ పరిశీలన వెయ్యి స్తంభాల ఆలయంలో కమిషనర్ ‘కుడా’ బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఈనెల 21న ఆలయంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వేడుకల్లో భాగస్వామ్యమయ్యే మహిళలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, బల్దియా ఈఈ రవికుమార్, భీమ్రావు, డీఈలు సారంగం, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లులో రణనినాదం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. దొరలు, దేశ్ముఖ్లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాపపు పాలనకు చరమగీతం పాడారు. రాక్షస రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.పరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చెన్నమనేని విద్యాసాగర్రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలను తయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పోలీసు ఉద్యోగం వదిలి..మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. -
నగరం.. అంధకారం
వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో అంధకారం అలుముకుంది. విద్యుత్ దీపాలు లేని కాలనీలు చాలా ఉన్నాయి. చీకట్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి ఐదేళ్ల కిందట కన్జర్వేషన్ అవార్డు దక్కించుకున్న గ్రేటర్ వరంగల్ ప్రతిష్ట ఏడాదికేడాది మసకబారుతోంది. సంప్రదాయ ఇంధన తయారీ, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఎనర్జీ ఎఫీషిఝెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ద్వారా ఆధునిక విధానాలను అవలంబించిన ఘనత.. నేడు వరంగల్ నగరం అంధకారంలోకి చేరువైంది. విలీన గ్రామాల్లో, నగర శివారు ప్రాంతాల్లో కనీసం విద్యుత్ వీధిదీపాలు లేకపోగా.. ప్రధాన, అంతర్గత రహదారుల్లో చీమ్మచీకట్లు రాజ్యమేలుతున్నాయి. కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, దీపాల మరమ్మతులపై గ్రేటర్ వరంగల్ నీమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యుత్ బకాయిలు రూ.10 కోట్లు చెల్లించడం లేదని ఈఈఎస్ఎల్ ఏజెన్సీ ఆర్నెళ్లుగా మరమ్మతులపై చేతులెత్తేసింది. దీంతో నగరంలోని 15 శాతం కాలనీలో చీకట్లో మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈనెల 15న విద్యుత్ సంస్కరణలపై ప్రత్యేకంగా సమావేశమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంప్రదాయబద్ధమైన సోలార్ పవర్పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్థానిక సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి విద్యుత్ లైట్ను కూడా కమాండ్ కంట్రోల్ సిస్టంకు అనుసంధానం చేయాలని, వీధి దీపాల నిర్వహణను ప్రత్యేకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు సంబంధించిన అదనపు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వీధి దీపాల నిర్వహణ మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 శాతం కాలనీల్లో వెలుగులు కరువు దశాబ్దంన్నర క్రితం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 508 చదరపు కిలో మీటర్లతో విస్తరించిన మహా నగరంలో 15 శాతం కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ముఖ్యంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల్లేవు. ఒకవేళ ఉన్నా రాత్రి వేళ వెలుగులు కరువయ్యాయి. దీంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు, అదుపు తప్పిపోవడం, వీధి కుక్కల గుంపులతో ప్రమాదాల బారినపడి కొంతమంది మృత్యువాతపడ్డారు. మరికొందరు క్షత్రగాత్రులుగా మారి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా రాంపూర్ రోడ్డులో ఓ డెస్క్ జర్నలిస్టు చీకటిలో వాహనం అదుపు తప్పి గాయాలపాలయ్యాడు. వరంగల్ 18వ డివిజన్లోని బర్కత్పురలో వీధి కుక్కల కాటుతో ఒకరు ప్రాణాపాయ స్థితి లో కొట్టుమిట్టడుతున్నాడు. ఇలా రాత్రివేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవిగో ఫిర్యాదులు తమ కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదని, విద్యుత్ స్తంభాలు లేవని మూడు నెలల వ్యవధిలో ప్రజలు అధికారులకు 863 ఫిర్యాదులు అందించారు. అందులో కేవలం 160 లైట్లను మరమ్మతు చేశారు. కొద్ది నెలలుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో వీధి లైట్లు, సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు, ఇతర లైట్లు వెలగడం లేదని 4,500 ఫిర్యాదులు అందజేశారంటే విద్యుత్ లైట్ల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం తీసుకున్న నిర్ణయాలతో విద్యుత్ పొదుపు, వెలుగులు వెదజల్లుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రతిపాదనలు అందజేస్తున్నాం.. విద్యుత్ స్తంభాలు, లైట్లు వెలగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నది వాస్తవమే. కొత్తగా విద్యుత్ స్తంభాలు అవసరమైన మేర ప్రతిపాదనలు అందజేస్తున్నాం. ఇక బకాయిలు చెల్లించడం లేదని ఈఈఎస్ఎల్ నిర్వాహకులు మరమ్మత్తులను నిలిపివేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేస్తున్నాం. – కార్తీక్రెడ్డి, బల్దియా ఎలక్ట్రికల్ డీఈ వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు విలీన గ్రామాలు, నగర శివారు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు మరమ్మతులపై చేతులెత్తేసిన ఈఈఎస్ఎల్ సంస్థ పట్టించుకోని బల్దియా యంత్రాంగంవీధిలైట్లు, సిబ్బంది వివరాలు.. మొత్తం డివిజన్లు: 66 లైట్లు మొత్తం : 74,721 18వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 56,447 20వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 1,400 35వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు : 2,947 40వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 60 70వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 4,067 110వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 5,158 120 వాట్ల సీఎల్ లైట్లు 1,192 120వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 275 150వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 24 190వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు: 626 200 వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు 50 ఔట్ సోర్సింగ్ కార్మికులు : 60–80 మంది ఇద్దరు ఏఈలు, ఈఈ విద్యుత్ బిల్లు ఏడాదికి రూ.8 కోట్లు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కేయూ క్యాంపస్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో సైబర్నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. మనకు తెలిసిన ముఖాలు తగిలించుకుని నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం సన్ప్రీత్సింగ్ను రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో ఆకాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, సైబర్ క్రైమ్ ఏసీపీ కె.గిరికుమార్, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, నార్కొటిక్స్ ఇన్స్పెక్టర్ సతీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి వన్ నేషన్ –వన్ ఎలక్షన్
కాజీపేట అర్బన్: వన్ నేషన్ వన్ ఎలక్షన్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాం తెలిపారు. హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో మంగళవారం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్ కోసం తెలంగాణ విద్యార్థులు’ నినాదంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సయ్యద్ జాఫర్ ఇస్లాం హాజరై మాట్లాడారు. 1984లోనే నాటి ప్రధాని వాజ్పేయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన తీసుకురాగా అదే అంశాన్ని 2019లో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చు తగ్గించుకునేందుకు, సమయం, ప్రజాధనం వృథాకాకుండా ఈ విధానం తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులు దేశాభివృద్ధికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ అంటోనీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర కన్వీనర్ భర్తుర్ శ్రీరాం, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గౌతమి అహీర్రావు, మీజీ ఆర్మీ డాక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ భిక్షపతి మాచర్ల, క్లాసికల్ డ్యాన్సర్ బారాది విజయ్కుమార్, ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత నక్క స్నేహలత, వివిధ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్రెడ్డి, గంట రవికుమార్, వెంకటేశ్వర్లు, నిషిధర్రెడ్డి, రమేష్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, నాయకులు రావుపద్మరెడ్డి, కాళీప్రసాద్, రావు అమరేందర్రెడ్డి, కొత్త రవి, పాండేజీ, మల్లికారావు, అహన్యరాజ్, కార్తీక్ పాల్గొన్నారు. ‘కుడా’ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతనయీంనగర్: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే సామాజిక అవగాహన కార్యక్రమం కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించడానికి మౌఖిక అనుమతి ఇచ్చి ‘కుడా’ అధికారులు రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో శ్రేణులు మంగళవారం ‘కుడా’ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆఖరి నిమిషంలో కాళోజీ కళాక్షేత్రం అనుమతిని కూడా అధికారులు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటే అనుమతి ఎందుకు ఇవ్వరంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలకతీతంగా చేస్తున్న సామాజిక కార్యక్రమం అని చెప్పిన అధికారులు వినలేదన్నారు.‘కుడా’ వైస్ చైర్మన్తో అనుమతిని ఎందుకు రద్దు చేస్తున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్యక్రమాన్ని నగరంలోని సీఎస్ఆర్కు గార్డెన్కు మార్చినట్లు వారు తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం -
లిఫ్టు ఇరిగేషన్కు
విద్యుత్ సరఫరా సిద్ధం ● ట్రాన్స్కో సీఈ రాజుచౌహాన్ కాటారం: చిన్న కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్లో భాగంగా గారెపల్లి పంప్హౌస్ కోసం నిర్మించిన సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్కో సీఈ రాజుచౌహాన్ తెలిపారు. ఎస్ఈ మల్చూర్తో కలిసి సీఈ లిఫ్టు ఇరిగేషన్ గారెపల్లి నూతన సబ్స్టేషన్ను మంగళవారం పరిశీలించారు. సబ్స్టేషన్లో అమర్చిన యంత్రాల వివరా లు, పవర్ లోడ్ కెపాసిటీ, సరఫరా ప్రక్రియ తదితర అంశాలపై ట్రాన్స్కో అధికారులతో ఎస్ఈ చర్చించారు. ప్రొటెక్షన్ వింగ్, టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో టెస్ట్ చార్జ్ చేశారు. అనంతరం లో ఓల్టేజ్ సమస్య నివారణలో భాగంగా మండల కేంద్రంలోని ఎర్రగుంటపల్లిలో అమర్చిన నూతన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను సీఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యు త్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నా ణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు సీఈ తెలి పారు. లో ఓల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు సీఎండీ ఆదేశాల మేరకు అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఈలు పాపిరెడ్డి, సదానందం, ఏడీఈ నాగరాజు, ఏఈ ఉపేందర్, లైన్ ఇన్స్పెక్టర్ క్రాంతికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కేసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మానుకోట జిల్లా కేసముద్రం మండలంలోని చంద్రుతండా జీపీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటగిరి సమీపంలోని చంద్రుతండా జీపీకి చెందిన చెందిన లకావత్ దేవా(35) వెంకటగిరి గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించేక్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న భగీరథ ఎయిర్వాల్ దిమ్మెను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గామైంది. దీంతో మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గురుకులం ఆకస్మిక తనిఖీ హసన్పర్తి: హసన్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డార్మెంటరీ, డైనింగ్ హాల్, గ్రంథాలయంతోపాటు తరగతి గదులను పరిశీలించారు. డార్మెంటరీ గదులు దెబ్బ తినడం వల్ల విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని డీఈఓ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థినులతో ఇంట్రాక్ట్ అయ్యారు. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రాజకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అమాయకులను బలిగొన్న రజాకార్లు
పర్వతగిరి: ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు 1948 మార్చి 11 చౌటపల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు. 21 మందిని నిర్బంధించి తుపాకులతో కాల్చి చంపారు. కొంతమంది ఇళ్లను తగులబెట్టారు. అదేవిధంగా కొంకపాక గ్రామం దొరల పాలనలో సాగింది. మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు తండ్రి తక్కళ్లపల్లి వెంకట్రాం నర్సయ్య ఆధీనంలో గ్రామం ఉండేది. దీంతో రజాకార్లు దొరలను టార్గెట్ చేశారు. వారి సంపదను దోచుకున్నారు. అడ్డువచ్చిన వారిని కాల్చి చంపారు. కొందరి ఇళ్లను దహనం చేశారు. ఈ ఘటనలో 15 మంది బలైపోయారు. -
విలువలతో కూడిన విద్య అందించాలి
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్: రాజనీతి శాస్త్రంలో సమకాలీన అంశాలను, సామాజిక సమస్యలపై నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. మంగళవారం హనుమకొండలోని కేడీసీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తమ రాజకీయ నాయకత్వానికి మంచి పౌరుడిగా రాణించేందుకు రాజనీతి శాస్త్రం దోహదం చేస్తుందన్నారు. ఇందులో కేడీసీ రాజనీతిశాస్త్ర విభాగాధిపతి, వర్క్ షాప్ కన్వీనర్ కవిత, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్, కేయూ రాజనీతి శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కృష్ణయ్య, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సంతోశ్కుమార్, ప్రొఫెసర్ కె.శ్రీదేవి, స్టాఫ్ సెక్రటరీ ప్రొఫెసర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, వివిధ జిల్లాల్లోని కళాశాలల రాజనీతి శాస్త్ర అధ్యాపకులు పాల్గొన్నారు. -
రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు..
ఆరోజు రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. రజాకార్లంతా నాటుసారా తాగి గ్రామస్తులను ఒక్కచోట చేర్చి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి చంపారు. చనిపోయినవారిని, గాయపడ్డవారిని గడ్డిలో వేసి నూనె పోసి కాల్చారు. నన్ను తీవ్రంగా కొట్టడంతో పారిపోయాను. నా కుటుంబంతో సహా కాంపెల్లి సమీపంలో అడవుల్లో ఆరు నెలలు దాక్కున్నాం. – తేరాల గురవయ్య, పెరుమాళ్లసంకీస, డోర్నకల్ మండలం భయంతో వణికిపోయాం.. ఆ రోజు మా ఇంటి పక్కనే ఉన్న బందెలదొడ్డి వద్ద తుపాకుల కాల్పులు వినిపించడంతో భయంతో వణికిపోయాం. మానాన్న తుపాకీ గాయాలతో ఇంటికి వచ్చి కొంతసేపటికి చనిపోయాడు. తర్వాత అందరం ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలపాటు అడవుల్లో దాక్కున్నాం. – గుడిమెట్ల రామక్క, పెరుమాళ్ల సంకీస, డోర్నకల్ మండలం -
పోరాటాల కేంద్రం.. బయ్యారం
బయ్యారం: నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలకు బయ్యారం కేంద్రంగా బిందువుగా చెప్పవచ్చు. నిజాం పాలనను వ్యతిరేకించిన దామినేని వెంకటేశ్వరరావు, కంచర బుచ్చిమల్లుతోపాటు 30 మందిని మండలంలోని బండ్లకుంట సమీపంలో నిజాం పోలీసులు కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఎడ్లబండ్లపై గ్రామాల్లో ఊరేగించి అందరినీ ఒకే చితిపై పెట్టి కుటుంబ సభ్యులు సైతం కడసారి చూపునకు నోచుకోకుండా దహనం చేశారు. పోరాటాల పురిటిగడ్డగా పేరు తెచ్చుకున్న బయ్యారంలో 1969లో మొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మించారు. బయ్యారం గాంధీసెంటర్లో ఉన్న అమరవీరుల స్మారక స్తూపం నాటి పోరాట పటిమ, త్యాగాలకు సాక్షిగా నిలుస్తోంది. ఊరూరా ఉద్యమకారులు జనగామ: జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్, మరిగడి, ఎర్రగొల్లపహాడ్, సిద్ధెకి ఇలా అనేక గ్రామాలు రజాకార్ల అరాచకాలను ఎదురించాయి. వడ్లకొండకు చెందిన దండెబోయిన నరహరి, మేదరి గాల్రెడ్డి, దేవుసాని వెంకటయ్య, సిద్ధిరాల యాదగిరి, గజ్జెల సాయిలు, కొత్త పాపిరెడ్డి రజాకార్లతో పోరాడారు. గానుగుపహాడ్లో నారాయణరెడ్డి, పులిగిళ్ల కొమురయ్య, కారింగుల నారాయణరెడ్డి, వనమాల నాగమల్లయ్య ఇలా ఎందరో వీరులు ఉద్యమంలో నేలకొరిగారు. దండెబోయిన నరహరిపై నిజాం నవాబు 18 మర్డర్ కేసులను నమోదు చేసి రెండు ఉరిశిక్షలు విధించారు. ఓ సమయంలో రజాకార్లకు పట్టుబడిన నరహరిని సజీవంగా చితిపై పడుకోబెట్టి కాల్చేందుకు ప్రయత్నిస్తుండగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. నరహరిని ప్రాణాలతో పట్టుకోవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. గానుగుపహాడ్కు చెందిన నారాయణరెడ్డి ఉపాధ్యాయ వృత్తి వీడి రజాకార్లను తుదముట్టించేందుకు దళంలో చేరాడు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా కూటిగల్ గ్రామంలో రజాకార్లు నారాయణరెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. జనగామ: జనగామలో నిజాం పాలనలోనే తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. 1943లో పాఠశాలకు అంకుర్పారణ చేసి.. 1945లో విద్యాబోధన ప్రారంభించారు. ప్రెస్టన్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఉపద్రష్ట వెంకటరామశాస్త్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనగామ తాలూకాలో మొదటి తెలుగు పాఠశాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుకు ఓ గుర్తింపు తీసుకొచ్చేందుకు తాపత్రయపడ్డారు. ఆంధ్ర భాషాభివర్ధిని ఉన్నత పాఠశాల(ఏబీవీ)గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949లో నాటి ప్రభుత్వం ఏబీవీ స్కూల్ను ఎయిడెడ్గా మార్చింది. -
ఓరుగల్లులో రణనినాదం
1947 ఆగస్టు15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలో మగ్గుతూనే ఉంది. నిజాం నిరంకుశత్వంతో విసుగెత్తిన జనాలు తిరగబడ్డారు. రజాకార్లను తరిమి కొట్టారు. స్వేచ్ఛావాయువుకోసం పోరాడుతున్న నాటి హైదరాబాద్ స్టేట్ ప్రజలు.. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన పోలీస్ చర్యతో 1948 సెప్టెంబర్ 17న భారత్లో భాగస్వామ్యమయ్యారు. సాయుధ పోరులో డోర్నకల్డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస, ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, తోడేళ్లగూడెం, చిలుకోడు తదితర గ్రామాల నుంచి అనేకమంది పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన తుమ్మ శేషయ్య, ఏలూరి వీరయ్య, నున్న పుల్లయ్య దళకమాండర్లు ఉండడంతో రజాకార్లు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. దళాల ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబర్ 1న 200 మంది రజాకార్ల ముఠా పెరుమాళ్ల సంకీసపై దాడి చేసింది. బందెల దొడ్డి వద్ద కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే.. గాయపడ్డ ఆరుగురు తర్వాత చనిపోయారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మృతదేహాలతోపాటు గాయాలైనవారిని తగులబెట్టారు. ఉయ్యాలవాడలో 1947 ఫిబ్రవరి 14న రజాకార్లు జరిపిన దాడిలో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు.పోరాడినందుకు గర్వపడుతున్నా..గార్ల: గీత కార్మికుడైన తోడేటి రామస్వామి, శాంతమ్మకు 1928లో జన్మించిన నేను భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేశా.‘నిజాం తొత్తు జాగీర్దార్ సైతం గార్లలో అజమాయిషీ చెలాయిస్తూ దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. రజాకార్లకు హెడ్గా మిస్కిల్సాబ్ వ్యవహరించేవాడు. జీవంజిపల్లిలో రజాకార్లకు రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. రజాకార్లు పగలు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ ‘జిన్నీకా హుకుం సే నెహ్రూకు జుకాదేంగే’ అంటూ నినాదాలు చేసేవారు. నాడు అందరూ ఉర్దూ మీడియం చదవాల్సిందే అంటూ హుకుం జారీచేశారు. జాగీర్దార్ వ్యవస్థలో తహసీల్దార్లుగా ఉన్న నూరుద్దీన్, రషీద్మియా అమానుష ఆగడాలకు అంతులేకుండా పోయింది. అప్పట్లో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట శంఖాన్ని పూరించిన దాశరథి కృష్ణమాచారి, రంగాచారి స్ఫూర్తితో 18 సంవత్సరాల వయసులో నేను నాటి సామాజిక పరిస్థితులకు ప్రభావితుడనయ్యాను. రజాకార్లు, నైజాం పోలీసులు రాంపురంలో బాలింతను చెరచడంతోపాటు దుబ్బగూడెం, ముల్కనూరు గ్రామాల్లో విచక్షణారహితంగా దాడులు చేశారు. ప్రజలు చెట్టుకొకరు. పుట్టకొకరుగా ఇళ్లు వదిలి పెట్టాల్సిన పరిస్థితులు నన్ను కలిచివేసి ఉద్యమం వైపు నడిపించాయి. నాడు ఈ ప్రాంత ఉద్యమ కమాండర్గా పనిచేస్తున్న తుమ్మల శేషయ్య నాయకత్వంలో ముందుకు సాగాం. బండ్లకుంట వద్ద సేదతీర్చుకుంటున్న మా దళానికి రజాకార్లకు మధ్య 1948లో జరిగిన ఎదురు కాల్పుల్లో దామినేని వెంకటేశ్వరరావు, బుచ్చిమల్లు, మరికొంతమంది అమరులయ్యారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు
● పెరుమాండ్ల రామకృష్ణ పరకాల: అసాధ్యం అనుకున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుసాధ్యం చేసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ ప్రజానీకమే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ఖాయమని అన్నారు. పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావడంతోపాటు దండోరా పోరాటంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. పరకాల నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధిలో కుంటుపడేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాట్లాడుతూ.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ దండోరా కమిటీల పునానిర్మాణం చేసి జాతి ఐక్యతకు హక్కుల సాధనకు మాదిగలు కలిసి రావాలని పిలుపుచ్చారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కలిసి సన్మానించారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు పెండెల రాము, పెండెల సారన్న, పూరెల్ల సూర్యం, పెండెల తిరుపతి, బరిగెల అనిల్, వడ్ల నవీన్, పెండెల ప్రసాద్, మొండి సమ్మయ్య పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం
జనగామ: తెలంగాణ సాయుధ పోరాటం జనగామలోనే పురుడు పోసుకుంది. విస్నూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నల్లా నర్సింహులు, చకిలం ధర్మారెడ్డి, యాదగిరిరావు నేతృత్వంలో 1946 జూలై 14న కడవెండి పోరుకు అంకురార్పణ చేశారు. గబ్బెట తిరుమల్రెడ్డి, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, ఏసిరెడ్డి నర్సింహారెడ్డి, గానుగుపహాడ్ నారాయణరెడ్డి, దండబోయిన నర్సింహులు, బిట్ల ముత్తయ్య ప్రాణత్యాగం చేశారు. జనగామ మొట్టమొదటి ఎమ్మెల్యే గంసాని గోపాల్రెడ్డి రాజకీయ నాయకుడిగా సాయుధ పోరాటానికి తన సేవలందించారు. నిజాం నవాబ్ 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్పటేల్ ఎదుట లొంగిపోయారు. సైనిక ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్కౌంటర్ రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట దళం సెంట్రల్ కమాండ్గా పనిచేసిన గంగసాని తిరుమల్రెడ్డిని సైనిక బలగాలు పట్టుకుని చెట్టుకు కట్టేసి కంచనపల్లిలో మొదటి ఎన్కౌంటర్ చేశాయి. దొరల స్వాధీనంలో ఉన్న 1.40 కోట్ల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసేందుకు సాయుధ పోరాటం దోహదపడింది. -
పోష్ చట్టంపై మహిళలకు అవగాహన అవసరం
● ఎంపీ కడియం కావ్య హన్మకొండ చౌరస్తా: మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం(పోష్)పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మహిళా సాధికారతపై జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ పోష్ అమలు– 2014 అంశంపై ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కావ్య పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసిన కావ్య సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య హైదరాబాద్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట చేపట్టనున్న మల్టీ మోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు భూపాలపల్లికి దగ్గరగా ఉన్న ఉప్పల్, కమలాపూర్ స్టేషన్లకు అనుసంధానించేలా రైల్వే లైన్ నిర్మాణం అంశాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని రేవంత్రెడ్డిని కోరారు. ‘కుడా’ను సంప్రదించకుండానే 2014 మాస్టర్ప్లాన్కు విరుద్ధంగా చింతలపల్లి నుంచి నష్కల్, హసన్పర్తి రెండు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదించారని తెలిపారు. అంతేకాకుండా చారిత్రక భద్రకాళి, వేయిస్తంభాలగుడి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకానికి సహకరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..
● మర్రిపల్లిలో ఘటన● బావిలో దూకి వ్యక్తి బలవన్మరణందుగ్గొండి: మధ్య తరగతి కుటుంబం.. పనిచేస్తే గాని పూట గడవదు. అప్పు భారమైంది. వేధింపులు మొదలయ్యా యి. అప్పు తీర్చే మార్గం కనిపించక బావిలో దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కసివోజుల బ్రహ్మం(48) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసాయంతోపాటు ఇంటివద్ద వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా మిరప సాగు చేస్తుండగా పంట గిట్టుబాటు కాక అప్పులే మిగిలాయి. ఇదిలా ఉండగా ఏడాదిన్నర క్రితం ఇల్లు నిర్మించాడు. దీనికి ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్ల వద్ద అప్పు తెచ్చాడు. రూ. 20లక్షలు అప్పు అయ్యింది. ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే ప్రతీనెల వాయిదాలు చెల్లించలేకపోవడంతో బ్యాంకర్లు, ఫైనాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు. వీటికి తోడు గ్రా మంలో కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. దీంతో అప్పు ఎలా చెల్లించా లని వారం రోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 6 గంటలకు చేను వద్దకు వెళ్లి తిరిగా రాలేదు. దీంతో 10గంటలకు బావి వద్దకు వెళ్లిన భార్య శ్రీలత తన భర్త బావిలో పడినట్లు గుర్తించింది. దీంతో బా విలో వెతికి బ్రహ్మం మృతదేహాన్ని బయటకు తీశారు. బ్రహ్మం తన నడుముకు చున్నీతో రాయి కట్టుకుని బావిలో దూకాడు. దీంతో పైకి తేలలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్రెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్.. బచ్చన్నపేట : అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వంగా సుదర్శన్రెడ్డి నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల అర్జున్(38) తన ఆటో మరమ్మతుకు రావడంతో మరో ఆటో కొనుగోలు చేశాడు. దీనికితోడు తల్లిదండ్రులు కూడా కుటుంబ అవసరాలకు అప్పు చేశారు. మొత్తం సుమారు రూ. 8 లక్షల వరకు కావడంతో ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్న అర్జున్.. సోమవారం తన వ్యవసాయ బావివద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపారు. కడుపునొప్పితో వృద్ధురాలు.. వెంకటాపురం(కె): కడుపు నొప్పితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘట న మండలంలోని నేలారిపేటలో జరిగింది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న సంగం సమ్మక్క(60) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆ స్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. అ యినా తగ్గకపోవడంతో ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న బావిలో దూకి అత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాన్బోర్డర్లు ఖాళీ చేయాల్సిందే..
కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్లలోని నాన్బోర్డర్లు గదులను వేకెట్ చేయాల్సిందేనని రిజిస్ట్రార్ వి.రామచంద్రం స్పష్టం చేశారు. వర్సిటీలో శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులపై పలువురు దాడిచేసిన ఘటన అనంతరం అదేరోజు రాత్రి, ఆదివారం రాత్రి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. హాస్టళ్లల్లో నాన్బోర్డర్ల వల్ల తలెత్తుతున్న సమస్యలపై సోమవారం సాయంత్రం పరిపాలన భవనంలోని కమిటీ హాల్లో అన్ని విభాగాధిపతితులతోనూ, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో హాస్టళ్ల డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. నాన్బోర్డర్లు ఈనెల 17న సాయంత్రం వరకు వేకెట్ చేయాలని హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. అలుమనాక్ ప్రకారం ఈనెల 20 నుంచి మధ్యాహ్నం లంచ్ తర్వాత హాస్టళ్లను మూసివేస్తున్నట్లు సర్క్యూలర్లో పేర్కొన్నారు. (దసరా సెలవుల నేపథ్యంలో) హాస్టళ్లలోని విద్యార్థులు నిబంధనలు పాటించకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ సర్క్యూలర్లో పేర్కొన్నారు. విద్యార్థులతో సమావేశం కేయూలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హనుమకొండ, కాజీపేట ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్రెడ్డి, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో యూనివర్సిటీకి వచ్చారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్లాల్ సమక్షంలో హాస్టళ్ల విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. సర్క్యూలర్ జారీ చేసిన హాస్టళ్ల డైరెక్టర్ -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హసన్పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెల్ఫోన్ రిపేర్ (30రోజులు), బైక్ మెకానిక్ (30రోజులు), ఏసీ, రిఫ్రిజిరేటర్ (30రోజులు), ఎల్ఎండబ్ల్యూ డ్రైవింగ్ (30రోజుల) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తెల్లరేషన్, ఆధార్కార్డుతోపాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 25వ తేదీ లోపు సంస్కృతీ విహార్, హసన్పర్తిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9704056522కు నంబర్లో సంప్రదించాలని సూచించారు. వాజేడు: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పీఈటీ తెల్లం రాజ్యలక్ష్మి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ములుగు జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. దీంతో న్యాయనిర్ణేతలు రాజ్యలక్ష్మిని జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు పలువురు ఉద్యోగులు అభినందించారు. రెండు బైక్లు ఢీ.. ● జీపీ కార్యదర్శి దుర్మరణం ● రక్మీ తండా శివారులో ఘటన నెక్కొండ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం చెందాడు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొర్ర వెంకట్రాం (55) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రక్మీ తండా శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వందేభారత్కు సిర్పూర్కాగజ్నగర్లో హాల్టింగ్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి సికింద్రాబాద్–నాగ్పూర్ (20102) వందేభారత్, ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్–సికింద్రాబాద్ (201010 వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల నుంచి సిర్పూర్కాగజ్నగర్కు వెళ్లే ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. ఆర్సీఎఫ్ యూరియా వచ్చేసింది.. ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్కు 1,319.220 మెట్రిక్ టన్నుల ఆర్సీఎఫ్ యూరియా వచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు చేరిన వ్యాగన్ను వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని వరంగల్కు 209.22 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 280, ములుగు 160, జయశంకర్ భూపాలపల్లి 220, జనగామ 230, మహబూబాబాద్ జిల్లాకు 220 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. కేటాయింపుల ప్రకారం ఆయా జిల్లాలకు యూరి యా తరలింపు చేపట్టినట్లు వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. విశ్వేశ్వరయ్యకు రిజిస్ట్రార్ ఘన నివాళి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్డేను పురస్కరించుకుని సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, టీజీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ సంధ్యారాణి పూలమాలలువేసి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్గా విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. -
మాజీ డిప్యూటీ సీఎం ‘తాటికొండ’ గృహ నిర్బంధం
హన్మకొండ: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్లోని స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్య ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం రాజయ్యను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయడంతో 12 గంటలకు సద్దుమణిగింది. అనంతరం పాదయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ నీతి వ్యాఖ్యలు మాట్లాడే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం ఏ విలువలకు నిదర్శనమని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని దుయ్యబట్టారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ జెండాతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర చేస్తుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. హనుమకొండలో ఉద్రిక్తత రైతుల కోసం పాదయాత్ర కొనసాగిస్తా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య -
ఆదివాసీ సంస్కృతి
ప్రతిబింబించేలా గద్దెల విస్తరణ ఎస్ఎస్తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. సోమవారం మేడారంలో పూజారులు, ఆర్కిటెక్, దేవాదాయశాఖ అధికారులు, కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీశ్, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతరలో 20 ఏళ్ల తర్వాత మంత్రిగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గద్దెల ప్రాంగణాల్లో మార్పులు, చేర్పులు చేయడంలో భాగంగా కొద్ది రోజులుగా పూజారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, ఆదివాసీ ఆచారాలు, చరిత్ర, జీవన విధానాల ప్రకారం నిర్మాణ పనులు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించారన్నారు. చిన్న గద్దెల మార్పిడితో అపచారం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని, పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయన్నారు. గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పు, 80 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పూజారుల తుది నిర్ణయాల మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం ముందు ఉంచుతామని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూజారులతో కలిసి మేడారంలో నూతన మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు ముణిందర్, వెంకటేశ్వర్లు, రఘుపతి, రమేశ్, సారయ్య, స్వామి, గోవర్ధన్, భోజరావు, కృష్ణయ్య, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూజారుల నిర్ణయం మేరకే మాస్టర్ ప్లాన్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
కనీస వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్ : ‘మేడం.. ఇంటి, చెత్త, నల్లా పన్నులు చెల్లిస్తున్నాం.. కాలనీల్లో కనీస వసతులు కల్పించాలి’ అని పలువురు గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ కాలనీల ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్ విభాగానికి–35, అతిక్రమణలపై టౌన్ ప్లానింగ్కు–35, ప్రజారోగ్యానికి–13, పన్నుల విభాగానికి–12, తాగునీటి సరఫరా–3, ఉద్యాన వన విభాగానికి ఒకటి దరఖాస్తు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, టీఓ రామకృష్ణ, ఏసీపీలు, ఈఈలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ వెలవెల.. బల్దియాలోని గ్రీవెన్ సెల్ సోమవారం వెలవెలబోయిుంది. స్టడీ టూర్ నేపథ్యంలో పాలక వర్గంతోపాటు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించేందుకు గ్రేటర్ వరంగల్ అధికారులు, సిబ్బంది వెళ్లడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 42వ డివిజన్ తెలంగాణ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్లు నిర్మించాలని కె.రాజ్కుమార్ తదితరులు కోరారు. ● 16వ డివిజన్ గరీబ్ నగర్ కాలనీల్లో విద్యుత్ స్తంభాలు లేవని, ఉన్న చోట్ల లైట్లు వెలగడం లేదని రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు దరఖాస్తు ఇచ్చారు. ● 15వ డివిజన్ గొర్రెకుంటలో విద్యుత్ స్తంభం తొలగించకుండా సీసీ రోడ్డును నిర్మించారని ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఎంజెఎస్, డీఎస్పీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ● 29వ డివిజన్ అంబేడ్కర్ నగర్ కాలనీలో పెద్ద మోరీ వద్ద గ్రంథాలయం, కూల్చివేసిన స్థానంలో బాబు జగ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ● 65వ డివిజన్ దేవన్నపేటలో గ్రామపంచాయతీ పక్కన ఆర్టీసీ బస్స్టాండ్కు సమీపంలోని స్థలాన్ని విస్తరించి నూతనంగా నిర్మించాలని పలువురు కోరారు. ● వరంగల్ ప్రాంతంలోని ఆరెకటికలకు కమ్యూనిటీ హాల్ స్థలం లేనందున లక్ష్మీపురంలో స్థలాన్ని కేటాయించాలని జిల్లా కమిటీ నాయకులు విన్నవించారు. ● 40వ డివిజన్ కరీమాబాద్ చెట్ల వారీ గడ్డకు సెప్టిక్ ట్యాంక్లు లేకుండా డ్రెయినేజీల్లోకి వ్యర్థాలను వదులుతున్నారని దుర్వాసన, రోగాల బారిన పడుతున్నామని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● 42వ డివిజన్ రంగశాయిపేటలో ఖబరస్థాన్కు ప్రహరీ నిర్మించాలని, పెద్ద మోరీలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● 20వ డివిజన్ కాశిబుగ్గ, గుండ్ల సింగారంలో కోతులు, కుక్కల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని చర్యలు తీసుకోవాలని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మడిపల్లి నాగరాజ్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ● బల్దియా కార్మికులకు సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఈనెల 25లోగా వేతనాలని పంపిణీ చేయాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్, ఔట్ సోర్సింగ్ యూనియన్ నాయకులు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. ● వరంగల్ శివసాయి కూడా లే అవుట్ డీపీ 22/2004లో 40ఫీట్ల రోడ్డును ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. బల్దియా గ్రీవెన్స్కు 99 ఫిర్యాదులు వినతులు స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని
కురవి : చాక్లెట్లు కొనేందుకు కిరాణా షాపునకు వెళ్లిన విద్యార్థిని దుకాణ యజమాని, ఆమె కుమార్తె చితకబాదారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కంచర్లగూడెం తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం కంచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గుగులోత్ ఆకాశ్ ఐదో తరగతి చదువుతున్నాడు. కొంత మంది చిన్నారులు ఏడుస్తుండడంతో హెచ్ఎం వెంకటేష్ రూ.5 ఇచ్చి ఆకాశ్ను చాక్లెట్లు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో తండాలోని కిరాణా షాపునకు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కోతుల గుంపు బాలుడిపై దాడికి యత్నించాయి. దీంతో ఆకాశ్ భయంతో షాపులోకి వెళ్లాడు. ఆ సమయంలో షాపులో యజమాని లేడు. అనంతరం యజమాని గుగులోత్ కాళీ షాపులోకి వచ్చింది. షాపులోకి రాగానే భయపడుతున్న విద్యార్థి ఆకాశ్ను చూసి ఎందుకు లోపలికి వచ్చావని అడగడంతో కోతులు మీదకు రావడంతో వచ్చానని చెప్పాడు. విద్యార్థి మాటలు వినకుండా గల్లాపెట్టెలోని కొంత నగదును బాలుడి జేబులో పెట్టి దొంగతనం చేసేందుకు వచ్చావని విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. యజమాని కుమార్తె బానోత్ ప్రమీల సైతం బాలుడిని దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటలపాటు బాలుడిని షాపులో బంధించి కొట్టారు. ఆకాశ్ తమ షాపులో దొంగతనం చేసేందుకు వచ్చాడని బాలుడి తండ్రి శివలాల్కు యజమాని ఫోన్ చేసి చెప్పింది. తాను వచ్చి మాట్లాడుతా అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బాలుడిని విడిచిపెట్టారు. ఆకాశ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో తాత మంగ్యా తన మనుమడు ఆకాశ్ ఇంటికి రాకపోయే సరికి షాపు వద్దకు వెళ్లాడు. తన మనుమడు ఎక్కడ అని అడగడంతో షాపు యజమాని కాళీ ఇటుకతో తలపై కొట్టడంతో వృద్ధుడి తల పగిలింది. బాలుడి తండ్రి శివలాల్ తండాకు చేరుకుని కురవి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం చెప్పాడు. శివలాల్ ఫిర్యాదు మేరకు బాలుడిని కొట్టిన గుగులోత్ కాళీ, ఆమె కుమార్తె బానోత్ ప్రమీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. బాలుడికి తీవ్రగాయాలు అడిగేందుకు వెళ్లిన తాతపైనా దాడి.. -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజామాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరావు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో ఆదిలాబాద్, మెదక్ జట్లు -
కేయూలో ఉద్రిక్తత
● ఇద్దరు విద్యార్థులపై దాడి చేసిన వారిపై కేసు కేయూ క్యాంపస్: కేయూలో ఇద్దరు విద్యార్థులపై దాడి ఘటనతో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులు గజానంద్, పవన్ శనివారం రాత్రి 8: 20 గంటలకు బైక్పై కామన్ మెస్కు వెళ్తుండగా గెస్ట్హౌస్ ప్రాంతంలో పలువురు అడ్డుకుని దాడి చేశారు. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. దాడిచేసి కొట్టినవారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో తరలించే యత్నం చేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థులు వాహనాన్ని అడ్డుకొని రాత్రి 11:30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, కేయూ సీఐ రవికుమార్, ఎస్సై రవీందర్ తదితరులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని సర్దిచెప్పారు. చివరికి పోలీసులు ఇద్దరిని మాత్రం అదుపులోనికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వదిలివేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థులు గజానంద్, పవన్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గట్టు ప్రశాంత్, అఖిల్తోపాటు మరికొందరిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నాన్బోర్డర్లు రాకుండా చర్య తీసుకోవాలి హాస్టళ్లలోకి నాన్బోర్డర్లు రాకుండా చూడాలని ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్బోర్డర్లపై కేయూ అధికారులు చర్యలు తీసుకుంటే సహకరిస్తామని పేర్కొన్నారు. దీంతో రాత్రి 11 గంటలకు ఆందోళన విరమించారు. -
పోగొట్టుకున్న నగదు బ్యాగు అందజేత
ఖిలా వరంగల్: పోగొట్టుకున్న నగదు బ్యాగు బాధితుడికి అందజేశారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన మహమ్మద్ అఫ్సర్ సెకండ్ హ్యాండ్ బొలెరో వాహనం కొనుగోలు చేసేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నేరుగా మడికొండకు చేరుకున్నాడు. కన్సల్టెన్సీలో సెకండ్ సేల్స్ వాహనాలు నచ్చకపోవడంతో మడికొండ నుంచి నేరుగా ఆటో ఎక్కి వరంగల్ ఆర్టీఏ జంక్షన్లో దిగాడు. వాహనం కొనుగోలు కోసం వెంట తెచ్చిన రూ.3 లక్షల నగదు గల బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. కన్సల్టెన్సీకి వెళ్లి చూసుకుంటే ఆటోలో రూ.3 లక్షల బ్యాగు మర్చిపోయానని గ్రహించి వెంటనే శనివారం సాయంత్రం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ చాలెంజ్గా తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగు మరిచిపోయిన ఆటోను కనిపెట్టి కాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ యాసిన్ను అభినందించి, రూ.3లక్షల బ్యాగును బాధితుడు మహమ్మద్ అఫ్సర్కు ఆదివారం ఇన్స్పెక్టర్ బొల్ల రమేశ్ చేతుల మీదుగా అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాగును కనిపెట్టి బాధితుడికి అప్పగించేందుకు సహకరించిన ఎస్సై శ్రావణ్, క్రైం పార్టీ కానిస్టేబుల్ జంపాల నాగేశ్వరరావును ఏఎస్పీ శుభం, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ అభినందించారు. -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం
● టీఎస్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం మనోహర్ హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేశ్ అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ విద్యుత్ నగర్లోని డీఐపీఈఏ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల నుంచి అసోసియేషన్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ.ఆనందం, వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కుమారస్వామి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు కలకుంట్ల మాణిక్యం, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్.నాంపల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చంద్రయ్య పాల్గొన్నారు. -
కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్షిప్
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ సిటీ లీగ్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 20 జిల్లాల నుంచి 350 విద్యార్థినీవిద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిసారి సిటీ లీగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీవైఎస్ఓ సత్యవాణి, సెక్రటరీ కైలాశ్యాదవ్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రతినిధులు శ్రీలక్ష్మి, మహిపాల్, బండారి సంతోశ్, తిరుపతి, మణికంఠ, వెంకటేశ్, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
కేయూ క్యాంపస్: సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ యూజీసీ కో–ఆర్డినేటర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీలో జనవిజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఐదో వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సహజ వనరుల శాసీ్త్రయ వినియోగంతోనే సమగ్రాభివృద్ధి జరుగనుందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలోనైనా నీటికొరతను అధిగమించేందుకు ఇంకుడుగుంతలు, చెక్డ్యాంల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థను ఏర్పరిస్తే భూగర్భజలాల స్థాయిని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఆచార్యులు అందె సత్యం మాట్లాడుతూ.. పారిశ్రామిక విప్లవం ద్వారానే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రిటైర్డ్ డీఎఫ్ఓ కాజీపేట పురుషోత్తం, వక్తలు మర్రి యాదవరెడ్డి, డాక్టర్ సుదర్శన్రెడ్డి, కృష్ణానంద్, లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంగా చేపట్టిన కార్యకలాపాల నివేదికను జనవిజ్ఞాన వేదిక జిల్లాప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఆర్థిక నివేదికను బాధ్యులు పరికిపండ్ల వేణు ప్రవేశపెట్టారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు శ్రీనాఽథ్, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ రాములు, ఉమామహేశ్వర్రావు, శ్రవణ్కుమార్, ధర్మప్రకాశ్, ప్రభాకర్చారి, శ్రీనివాస్, సుమలత, వందన అశోక్ ఉన్నారు. కేయూ యూజీసీ కో–ఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రెండు రోజుల పా టు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–5 నుంచి 18 బాలబాలికలకు రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఆదివారం ముగిశా యి. మొదటి రోజు ఉనికిచర్లలోని ఎస్ఎస్హౌస్ వద్ద నిర్వహించగా, రెండో రోజు రాంపూర్లోని ఢిల్లీ పబ్లి క్ స్కూల్ ఆవరణలోని స్కేటింగ్ రింక్లో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కేటింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్దార్థ, ఓం ప్రకాశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. విజేతలకు డీపీఎస్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి బహుమతులు అందజేశారు. -
ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుపాక ఎల్లయ్య, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఏనుట్ల రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంఘం ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటలకు అన్ని గ్రామాల్లో, ఉదయం 9 గంటలకు మండల కేంద్రాల్లో సంఘం పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం హనుమకొండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు పురస్కారాలు అందించి సన్మానించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్కుమార్, ఆయా సంఘాల నాయకులు వనపాకల రాజయ్య, సత్తూరి చంద్రమౌళి, కామెర లక్ష్మణ్, కలకోట్ల ప్రతాప్, మేకల ప్రవీణ్, వల్లందాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి విద్యారణ్యపురి: విద్యారంగం, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన టీచర్ల పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టుల్లో అర్హులైన ఉపాధ్యాయులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, టీచర్ల శిక్షణ కార్యక్రమాలు వేసవి సెలవుల్లోనే ఇవ్వాలని, విద్యేతర ఆన్లైన్ కార్యక్రమాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్లుగా, ఎంఈఓలుగా, డిప్యూటీ డీఈఓ లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. సమావేశంలో డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీని వాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, డాక్టర్ కిషన్, ఎ.మల్లయ్య, డి.రమేశ్, టీచర్లు పాల్గొన్నారు. -
ఎవరేమనుకుంటే మాకేంటి?
వరంగల్ అర్బన్: ‘ఎవరేమనుకుంటే మాకేంటీ? ఎన్ని విమర్శలొస్తే ఏమవుతుంది. మా మాటే శాసనం, మేం చెప్పిందే వేదం. చేసిందే తీర్మానం. మేం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం’ అని నిరూపించుకున్నారు గ్రేటర్ వరంగల్ పాలకులు. మరో ఏడు నెలలు గడిస్తే పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో అధ్యయనం పేరిట విహారయాత్ర చేస్తున్నారంటూ జనాగ్రహం వెల్లువెత్తినా.. డోంట్ కేర్ అన్నట్లుగా ముందుకుసాగారు. ఆదివారం రెండు బృందాలుగా బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రైవేట్ బస్సుల్లో బయల్దేరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, రాజస్థాన్లోని జైపూర్ నగరంలో శాసీ్త్రయ పద్ధతులు, సుందీరకణ తదితర అవసరాల కోసం వెళ్లారు. ఈ యాత్ర ఈనెల 19 వరకు యాత్ర కొనసాగనుంది. మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్, 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. అందులో 55 మంది టూర్కు ఓకే చెప్పారు. 25 మంది అధికారులు, ఉద్యోగులు యాత్రకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరి క్షణంలో ఐదుగురు కార్పొరేటర్లు వెళ్లలేదు. కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, తనయులను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. వీరి సొమ్మును బల్దియా పాలక వర్గం పెద్దలు భరిస్తున్నట్లు లెక్క రాస్తున్నారు. బల్దియాకు చెందిన కొంత మంది ఇంజినీర్లు, సూపరింటెండెంట్లు, సిబ్బంది ఈ యాత్రకు ఎంపిక చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నగరం నుంచి నుంచి బస్సుల్లో బయల్దేరి వెళ్లగా.. హైదరాబాద్ శంషాబాద్లో విమానమెక్కి, ఇండోర్ నగరంలో దిగనున్నారు. మేయర్ తన హోదాకు తగ్గట్టుగానే బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. కార్పొరేటర్లు ఎకానమీ క్లాస్లో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మేయర్ గుండు సుధారాణి ఇండోర్ నుంచి ఈనెల 16న సాయంత్రం వరంగల్ నగరానికి తిరిగి రానున్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అదే రోజు మలివిడతగా రాజస్థాన్లోని జైపూర్ నగరానికి వెళ్లి అక్కడ స్టడీటూర్లో భాగస్వామ్యం కానున్నారు. పాలక వర్గం పెద్దల బిజినెస్ క్లాస్ విమానయానం ప్రయాణ ఖర్చులు బల్దియాకు అధికభారమనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ టూర్ కోసం రూ.50 లక్షల స్మార్ట్సిటీ నిధులను వెచ్చిస్తున్నారు. వరంగల్ చింతల్లో కుక్కల కాటుతో ఆదివారం ఉదయం 18 మందికి గాయాలైనప్పటికీ పాలక వర్గం, పెద్దలు, స్థానిక కార్పొరేటర్, ప్రజారోగ్యం అధికారులు ప్రజలు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సొమ్ముతో స్టడీ టూర్ వెళ్లడమా? సమస్యలు పరిష్కరించకుండా కట్టకట్టుకుని నిబంధనలను విస్మరిస్తూ ప్రయాణించడంపై పెదవి విరుస్తున్నారు. కాగా.. దేశంలోని ఇండోర్, జైపూర్ నగరాలు సమగ్ర శానిటేషన్, ఆధునిక పద్ధతులతో అత్యున్నత స్థానాలను దక్కించుకుంటున్నాయని, స్టడీ టూర్ కోసం బల్దియా పాలక వర్గం, అధికారుల బృందం వెళ్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో బృందాలు వెళ్తున్న బస్సులను ఎమ్మెల్యే నాయిని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పాలక వర్గం పెద్దలు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.స్టడీ టూర్కు 2 బృందాలు మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ప్రయాణం -
నూతన కమిటీ ఎన్నిక
హన్మకొండ: తెలంగాణ పవర్ డిప్లొ మా ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హనుమకొండ వి ద్యుత్ నగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి విద్యుత్ డిప్లొ మా ఇంజనీర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లికార్జున్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎం.అనిల్ కుమా ర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శిగా భవాని, సలహాదారులుగా మధుసూదన్, మనోహర్, కార్యవర్గ సభ్యులుగా త రుణ్, వరుణ్, జ్యోతిర్మయి, వి.రాములు, లక్ష్మణ్ నాయక్, వాలు నాయక్, జి.సత్యనారాయణ, టి.యగంధర్, ఖలీం, టి.శ్రీనివాస్, క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. -
పెంపకమే ప్రాధాన్యం..
కాజీపేట/చిల్పూరు : పాడి అభివృద్ధికి పెయ్యదూడల సంరక్షణనే కీలకం.. దూడల పెంపకంపై పాడి రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని పశు వైద్యాధికారులు తెలిపారు. దూడల పెంపకంపై శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పెయ్యదూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మడికొండ పశువైద్యాధికారి కరుణాకర్ రెడ్డి, మల్కాపూర్ పశువైద్యాధికారి మూడిక అనేష్ సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి.. పెయ్యదూడలు పుట్టినప్పటి నుంచి ఎదకు వచ్చే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దూడలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన దూడకు వెంటనే జున్ను పాలు తాగించాలి. దీంతో దూడలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్లో వాటికి వ్యాధులు సోకకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవగాహన లేక కొంతమంది రైతులు పాడి పశువుల నుంచి మొత్తం పాలను పితుకుతారు. దీంతో దూడలకు పాలు సరిపోక నీరసించి, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. అనంతరం వ్యాధుల బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉంది. అందుకే రైతులు దూడలకు సరిపడా పాలు అందేలా జాగ్రత్త వహించాలి. పాడి పరిశ్రమ వైపు మొగ్గు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తదితర పనుల నిర్వహణకు తగినంత సాగునీరు లేకపోవడంతో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో ఒకటి, రెండు ఆవులను కొనుగోలు చేసి పాడిని ప్రారంభిస్తున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉదయం, సాయంత్రం కొద్దిపాటి సమయం పాడి పశువుల కోసం సమయం కేటాయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఇప్పటికే ఆవులను కొనుగోలు చేసి, లాభాలు పొందుతున్న రైతులను గమనిస్తున్న ఇతరులు పాడి ఆవులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమపై ఆధారపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దూడలను కాపాడుకుంటూ అదనపు ఆదాయం పొందుతున్నారు.పాడి రైతులు పుట్టిన దూడల పెంపకంపై జా గ్రత్త వహించకుండా పాలిచ్చే ఆవులపై మా త్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. లేగదూడలు పుట్టి న వెంటనే వాటికి ముర్రుపాలు తాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డు కోసే సమయంలోనూ జాగ్రత్త అవసరం. లేగదూడల వ యస్సును బట్టి అవి బలిష్టంగా పెరిగేందుకు సరిపడా పాలు మిగల్చడం ఎంతో ముఖ్యం. దూడలు ఆరోగ్యంగా పెరిగితేనే భవిష్యత్లో అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. పెంపకంలో ఎటువంటి అనుమానం తలెత్తిన వెంటనే స మీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించా లి. వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాడిపశువుల విషయంలో పరిశుభ్రత ము ఖ్యమైందని పెంపకందారులు గుర్తించాలి. దూడల సంరక్షణతోనే పాడి వృద్ధి మడికొండ, మల్కాపూర్ పశువైద్యాధికారులు కరుణాకర్ రెడ్డి, అనేష్ దూడలకు సోకే వ్యాధులు..పెయ్యదూడల సంరక్షణలో వాటికి పలు వ్యాధులు సోకే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఇతరత్రా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూడలకు అతిసార, తెల్ల పారుడు, న్యూమోనియా, రక్తవిరోచనాలు, కీళ్ల నొప్పులు, బొడ్డువాపు వ్యాధులతో పాటు ఇతరత్రా వ్యాధులు, పరాన్న జీవులతో వ్యాప్తి చెందుతాయి. దూడలు ఎటువంటి రోగాల బారిన పడకుండా పెరిగితే రైతుకు ఆదాయమే. వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. -
పీఆర్సీ అమలు చేయాలి
టీఆర్టీఎఫ్ రాష్ట్ర చీఫ్ పాట్రన్ సంజీవరెడ్డి విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర చీఫ్పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఆర్టీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ స్టేట్ జాయింట్ కౌన్సిల్లో టీఆర్టీఎఫ్నకు తిరిగి ప్రాతినిథ్యం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోకన్వీనర్ దాక్షపు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్టీఎఫ్ బాధ్యులు పెండెం మధుసూదన్, రాజునాయక్ మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రెండు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నకున్నారు. హనుమకొండ జిల్లా కార్యవర్గం.. టీఆర్టీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాసిరి రాజిబాపురావు, ప్రధాన కార్యదర్శిగా గు గులోత్ శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులుగా గుండు సదానందం, బంగారు స్వామి ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా.. టీఆర్టీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వడ్డె కిషన్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రాజు, ఉపాధ్యక్షులుగా భక్తిని రాజేశ్, శ్రీపతి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శులుగా ల్యాద లింగమూర్తి, కలకోట ప్రభాకర్, బుర్ర మొగిలి, శివశంకర్ ఎన్నికయ్యారు. సమావేశంలో బాధ్యులు మాడిశెట్టి శ్రీనివాస్, సర్వర్నాయక్, సారంగం, మురళి పాల్గొన్నారు. -
జాతరకు ప్రత్యామ్నాయ దారులు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు ప్రత్యామ్నాయ దారుల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈసారి మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ శబరీశ్తో కలిసి పరిశీలించారు. గోవిందరావుపేట మండలం మొట్లగూడెం నుంచి ముత్తాపురం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, కొండపర్తి మీదుగా గోనెపల్లి వరకు, గోనెపల్లి నుంచి మేడారంలోని శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ వరకు, వీఐపీ పార్కింగ్ నుంచి చిలకలగుట్ట వరకు రోడ్ల ఏర్పాటును పరిశీలించారు. ఈసారి జాతరకు నూతన రోడ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ తలెత్తకుండా ఉంటుందని భావించారు. కాగా, కొండపర్తి నుంచి ఒకదారి, ముత్తాపురం నుంచి మరో దారి, ఈరెండు దారులు కూడా గోనెపల్లిలో కలిసి జంక్షన్ ఏర్పడనుంది. అక్కడ నుంచి ఈ దారులు ప్రత్యామ్నాయం కానున్నాయి. కాగా, మంత్రి జా తీయ రహదారి నుంచి కొండపర్తి మీదుగా అటవీ మార్గ గుండా గోనెపల్లి వరకు బైక్పై సుమారు 3 కిలోమీటర్లు అటవీ మార్గంలో పర్యటించి రోడ్డు ఏర్పాటును పరిశీలించారు. డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి మండలంలోని నార్లాపూర్ చెక్ పోస్టు సమీపంలోని కల్వర్టుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రి సీతక్కకు నార్లాపూర్ రైతులు ఆదివారం వినతి పత్రం అందజేశారు. కల్వర్టు కింద పైపులు చిన్నగా ఉండడంతో జంపన్నవాగు వరద తాకిడికి కల్వర్టుకు ఇరువైపులా ఉన్న వందలాది ఎకరాల వరి పంట నీటమునిపోతుందని విన్నవించారు. స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అటవీ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాట్ల పరిశీలన బైక్పై మూడు కిలోమీటర్ల ప్రయాణం.. -
శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
హన్మకొండ కల్చరల్: ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు వేయిస్తంభాల ఆలయంలో జరిగే రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పరిశీలించారు. ఆదివారం రాత్రి వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఘనంగా స్వాగతించారు. పూజల అనంతరం కేంద్ర పురావస్తుశాఖ సీఏ అజిత్తో కలిసి దేవాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఆలయంలో జరిగే నవరాత్రి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణ చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్, జీవీఎస్ శ్రీనివాస్చారి, తోట పవన్, ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ఆలయ సిబ్బంది మధుకర్, ఎల్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల దీవెనలతోనే గెలిచా.. వరంగల్ అర్బన్: ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పాలకవర్గం, అధికారుల స్టడీ టూర్ బృందాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఆయనను వివరణ కోరగా.. 40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చే శారు. అదృష్టంతోపాటు కష్టార్జితం, పార్టీకి చేసిన సేవలు, ప్రజల దీవెనలతోనే గెలిచానన్నారు. మంత్రి కొండా సురేఖకు తల్లి, అక్క హోదాను ఇచ్చానని పేర్కొన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఎవరి హద్దుల్లో వారు ఉండి పని చేస్తే ఇలాంటి పరిస్థితులు రావని, జిల్లాలోని అందరు నేతలతో విభేదాలకు పోతే అభివృద్ధి కుంటు పడుతుందని అభిప్రాయపడ్డారు. -
మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదిస్తూ ఈ ఏడాది మే 8న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీఓ 22ను సవాల్ చేస్తూ అప్పట్లో ఉద్యోగం రాని వినిత నాయిని హైకోర్టులో ఈనెల 9న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కాకతీయ యూనివర్సిటీ, కేయూలో 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈనెల 9న వాదనలు వింటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి, కాకతీయ యూనివర్సిటీకి కౌంటర్దాఖలు చేయాలని, 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీస్లు జారీచేయాలని ఆదేశాలు ఇస్తూ ఈ కేసును అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. మొదటి నుంచీ వివాదమే.. కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్న విషయం విధితమే. అప్పట్లో ఉద్యోగాలు రాని పలువురు అభ్యర్థులు ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా చివరికి పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో ఆమోదించుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. దీంతో 2019 నవంబర్లో కేయూ పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో చర్చించి అవకతవకలు చోటుచేసుకున్నాయని భావించి ఆమోదించలేదు. దీంతో అప్పటి రిజిస్ట్రార్ తుది నిర్ణయం కోసం ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో జువాలజీ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను యూనివర్సిటీ అధికారులు కొంత కాలం క్రితమే ఉద్యోగాలనుంచి తొలగించిన విషయం విధితమే.ఆ తర్వాత కూడా ఉద్యోగం రాని వినితనాయిని అప్పటి నుంచి న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. మిగతా పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం కూడా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం కోర్టు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని ఈఏడాది ఫిబ్రవరి 24న ఆదేశించిన విషయం విధితమే. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నత విద్యాశాఖ 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై(అప్రూవల్ చేస్తూ) సానుకూల నిర్ణయం తీసుకుని జీఓ 22ను ఈఏడాది మే 8న యూనివర్సిటీ అధికారులకు పంపింది. తదుపరి చర్యలను తీసుకోవాలని కూడా పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించబడిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీఓలో మాత్రం అవకాశం కల్పించ లేదు. ఈక్రమంలో జూన్ 17న హైదరాబాద్లో నిర్వహించిన కేయూ పాలకమండలి సమావేశంలో 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై చర్చించి ఆమోదించింది. దీంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కేయూపాలకమండలి ఆమోదించడంతో వారంతా సంతోషించారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై వినితనాయిని మళ్లీ రిట్ పిటిషన్ కౌంటర్దాఖలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కేయూకు హైకోర్టు ఆదేశంకేయూపాలకమండలి ఆమోదంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ కూడా ఇటీవలే ప్రారంభించినట్లు తెలిసింది. పదోన్నతుల కల్పనకు యూనివర్సిటీ అధికారులు కూడా కొద్దిరోజుల్లోనే ఉపక్రమించబోతుండగా మళ్లీ అప్పట్లో ఉద్యోగం రాని వినితనాయిని.. ఉన్నత విద్యాశాఖ ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను ఆమోదిస్తూ సానుకూలంగా జారీచేసిన జీఓను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో వీరి సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లైందని కాకతీయ యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది. వీరికి ఇక ఇప్పట్లో పదోన్నతుల కల్పన ఉండబోదని, ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలకు చేయూత
విద్యారణ్యపురి: కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద హనుమకొండలోని జోస్ అలుక్కాస్ నగల దుకాణం, వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సుమారు రూ.11.75 లక్షలకు పైగా విలువైన వివిధ వస్తువులు కంప్యూటర్ల కోసం చెక్కులు పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చేతుల మీదుగా.. ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఆ నగల షాప్నకు సంబంధించి మేనేజర్ ఇతర ప్రతినిధులు పంపిణీ చేయించారు. హనుమకొండ జూలైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం భాస్కర్రెడ్డికి రూ.2.15 లక్షల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ నగదుతో ఆరు కంప్యూటర్లు జోస్ అలుక్కాస్ యాజమాన్యం ఇవ్వనుందని హెచ్ఎం భాస్కర్రెడ్డి తెలిపారు. అలాగే లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు 2.9 లక్షలతో 150 లీటర్లకు సంబంధించిన వాటర్ కూలర్, 4 కంప్యూటర్లు అందించనున్నారు. కాజీపేట జాగీర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.2.1 లక్షతో ఒక ప్రొజెక్టర్, ఒక వాటర్ కూలర్, రెండు కంప్యూటర్లు అందించనున్నారు. వరంగల్లోని రైల్వేగేట్ పెరకవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.2.9 లక్షలు, కాజీపేటలోని బాలుర ప్రభుత్వ పాథమిక పాఠశాలకు రూ. 1.21 లక్షల చెక్కును, వేలేరులోని మండల ప్రజాపరిషత్ స్కూల్కు రూ.2.26 లక్షల చెక్కును ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. ఆయా డబ్బులతో జోస్ అలుక్కాస్ నగల షాపు యాజమాన్యమే ఆ యా స్కూల్స్కు అవసరమైన కంప్యూటర్లు, వివిధ వస్తువులను కొనుగోలు చేసి ఇవ్వనుంది. కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ హనుమకొండ మేనేజర్ టి.స్మితీష్, అసిస్టెంట్ మేనేజర్ గిరీష్, అకౌంట్స్ మేనేజర్ సుధీప్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ -
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్వరంగల్ లీగల్ : యువ న్యాయవాదులకు శిక్షణ త రగతులు అవసరమేనని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ భవన్లో తెలంగా ణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్జి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్ న్యాయవాది కె.వి. గుప్తా రాసిన ‘తెలంగాణ కోర్టు ఫీ యాక్ట్ పుస్తకం’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ మాట్లాడారు. యాంటీ కరప్షన్ లాస్, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అంశాల్లో యువ న్యా యవాదులు మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద పరిషత్ అ ధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ప్రభాకర్ రెడ్డి, శ్యాంశాని సునీల్, చొళ్లేటి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు అమ్మవారికి హైకోర్టు జడ్జి పూజలు.. హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు.. జస్టిస్ను ఘనంగా స్వాగతించారు. పూజలనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పట్టాభి రామారావు, వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తదితరులు పాల్గొన్నారు. -
నాడు శాంతిని నెలకొల్పడమే గాంధీ ధ్యేయం
విద్యారణ్యపురి: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం సిద్ధించాక నాడు శాంతిని నెలకొల్ప డమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ రెసిడెన్సీలో ప్రజాకవికాళోజీ నారాయణరావు రచించిన బాపూ..బాపూ రెండో ముద్రణకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు మహాత్మాగాంధీ గురించి అద్భుతంగా రచించారన్నారు. గిరిజా మనోహరాబాబు ఈ గ్రంథాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బాధ్యులు పొట్లపెల్లి శ్రీనివాస్రావు, పందిళ్ల అశోక్కుమార్, కాళోజీ ఫౌండేషన్ పేరుతో గ్రంఽథాన్ని ముద్రించిన చింతకుంట్ల సంపత్రెడ్డి, రచయితలు గంటారామిరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, బాసిరి సాంబశివరావు, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ -
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట
జఫర్గఢ్: గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తూ పె ద్దపీట వేస్తోందని ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్ షిప్ బాల్ బ్యాండ్మిటన్ క్రీడా పోటీలను శనివారం పాఠశాల పూర్వ వి ద్యార్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు మొండిచేయి చూపిందన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి స్ఫూర్తి చాటాలన్నారు. తల్లిదండ్రులు పి ల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించి వారి ఉజ్వల భవిష్యత్కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, బాధ్యులు బంగారు స్వామి, బి.వి. రమణ, దర్గయ్య, వెంకట్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కరుణాకర్రా వు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి -
పగిలిన ‘దేవాదుల’పైపులైన్
● ఎగిసిపడిన నీరు.. నిండిన జయగిరి పాత చెరువు హసన్పర్తి: హసన్పర్తి మండలం జయగిరి పాత చెరువు వద్ద దేవాదుల పైపులైన్ పగిలింది. ఇటీవల దేవాదుల నుంచి నీటిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం జయగిరి సమీపంలోని పాత చెరువు వద్ద పైపునకు చిన్న రంధ్రం పడింది. అది పెద్దది కావడంతో ఒత్తిడి పెరిగి పగిలింది. దీంతో ఒకేసారి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నీరంతా సమీప చెరువులోకి చేరడంతో నిండి మత్తడి పోసింది. చెరువుకింద ఉన్న పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం అందుకున్న నీటి పారుదలశాఖ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ మంగీలాల్, సునీత, డీఈఈ కిషన్ ప్రసాద్, తేజేశ్వర్రావు, ఏఈ శ్రీనివాస్లు ఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పులుకుర్తి వద్ద పంపింగ్ను నిలిపివేశారు,. రైలు నుంచి జారిపడి ప్రయాణికుడి దుర్మరణం ఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారి పడి ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్లోని తిల్న్ చౌదర్ గ్రామానికి చెందిన లాబాను కరుణాకర్ (41).. అబ్దుల్ సల్మాన్, రంజిత్ మరిడేతో కలిసి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి వరంగల్కు ప్రయాణిస్తున్నాడు. ఈక్రమంలో చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య కరుణాకర్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. మృతుడి బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
పక్కాగా పంటల లెక్క
హన్మకొండ: వానా కాలం పంటల సాగు లెక్కలు కచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టింది. వ్వవసాయ విస్తరణాధికారులు మొబైల్ ఫోన్లోని ప్రత్యేక యాప్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు. సాగు చేసిన పంటల ఫొటోలు కూడా యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసేవారు. అయితే, కచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జిల్లాలో 14 మండలాల్లోని 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)లు సర్వేలో మునిగిపోయారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. పురుష ఏఈఓలు 2 వేల ఎకరాల్లో, మహిళా ఏఈఓలు 1800 ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. ఈమేరకు సర్వే నంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటాయించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్ పూర్తి చేయడానికి వీలుగా ఈ యాప్ ఆఫ్లైన్ ఫీచర్తో రూపొందించారు. వరి సాగు ఏ పద్ధలో చేశారో కూడా నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. పంట విత్తిన వివరాలు నమోదు ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడం ద్వారా పంట కొనుగోలు/సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంటుంది. పంట బుకింగ్ 90 శాతం బుకింగ్ చేయగానే రైతు మొబైల్కు ఆరు సందేశాలు వెళ్తాయి. పంటల సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అక్టోబర్ 25 వరకు పూర్తిచేయాలి.. జిల్లాలో అక్టోబర్ 25 వరకు పంటల బుకింగ్ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజికల్ క్రాప్ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. 3న అభ్యర్థనలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. 5న తుది సర్వేను ప్రదర్శిస్తారు. వివరాలు నమోదు చేయకుంటే ఇబ్బందులు.. పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆన్లైన్లో ఉన్న సాగు విస్తీర్ణం మేరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల చెల్లింపులు ఆలస్యమవుతాయి. పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న ఏఈఓలు హనుమకొండ జిల్లాలో 125 గ్రామాలు, 55 క్లస్టర్లు 2,21,163 ఎకరాల్లో పంటల సాగుపంటలు నమోదు చేయించుకోవాలి.. రైతులు స్వచ్చందంగా పంటలు నమోదు చేయించుకోవాలి. అక్టోబర్ 25లోపు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయికి చేరుకుని డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. రైతులు సర్వే నంబర్, పంటల వారీగా వివరాలు నమోదు చేయించుకోవాలి. – రవీందర్సింగ్, జిల్లా వ్యవసాయాధికారి -
ఓటమిని గెలుపుగా మలుచుకోవాలి
కొత్తగూడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపు కోసం మరోసారి ప్రయత్నించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి క్రీడలు, చదువులో ప్రతిభచాటాలన్నారు. ప్రస్తుత క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన కామారెడ్డి జిల్లా గంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజ య్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్పీతో మంత్రిప్రత్యేక సమావేశం.. ఈఎంఆర్ఎస్లో క్రీడల ముగింపు కార్యక్రమానికి వచ్చిన మంత్రి సీతక్క.. ఎస్పీ సుధీర్రాంనాఽథ్ కేకన్తో పాఠశాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎవరిని లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. జిల్లాలో యూరియా పంపిణీ గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు సమాచా రం. కొత్తగూడ, గంగారం మండలాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీకి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు -
వెంటాడుతున్న వీధికుక్కలు
ఖిలా వరంగల్: వరంగల్ 39వ డివిజన్ విద్యానగర్ కాలనీలో వీధి కుక్కలు పెట్రేగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే కొందరు పిల్లలు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. వరంగల్ ఫోర్ట్ రోడ్డుకు ఇరువైపులా చికెన్, మటన్ విక్రయ షాపులు ఉన్నాయి. రహదారులపై మాంసం వ్యర్థాలు, చెత్త వేస్తుండడంతో వీధి శునకాలు ఎక్కువగా వాటి కోసం గుంపులుగా తిరుగుతున్నాయి. వీధి కుక్కలను సంరక్షణ కేంద్రానికి తరలించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా బేఖాతర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
వరంగల్ లీగల్ : మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులోని 10 కోర్టుల భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించాలని, వాటి పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ బిల్డింగ్ ముందు మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలు అనే బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్లు వీబీ నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు, కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్పాండే, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాదులు వివిధ బ్యాంకుల అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ ● డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సుజాతీయ లోక్ అదాలత్ ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ -
ఖాళీ స్థలం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం
కాజీపేట: కాజీపేటలోని డిజిల్ కాలనీ నుంచి ఫాతిమానగర్ మీదుగా నిట్ వరకు రోడ్లకు ఇరువైపులా రహదారుల వెంట ఖాళీగా ఉన్న స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తే హాకర్ల సమస్య తీరుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలాల్లో కొందరు వ్యాపారాలు కొనసాగిస్తుండగా.. ఇక్కడ బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. రోడ్లపైనే విచ్చలవిడిగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. మున్సిపల్ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులు పట్టించుకుంటే కార్పొరేషన్కు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఈస్థలాలు ఆక్రమణకు గురవకముందే అధికారులు స్పందించాలి. -
నగరాభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ
వరంగల్ అర్బన్: వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కేరళ ప్రభుత్వం తొలిసారిగా కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 మేయర్ల ఫోరం సదస్సు శనివారం ముగిసింది. స దస్సులో సుధారాణి మాట్లాడుతూ.. నూతన మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, విమానాశ్రయం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఎఫ్ ఎస్టీపీలు, ఎస్టీపీలు, బయోమైనింగ్, బయో, విండో కంపోస్ట్ల యూనిట్ల ఏర్పాటు, కూరగాయల వ్యర్థాలతో బయో గ్యాస్ ప్లాంట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల క్యూ ఆర్ కోడ్, బిల్డ్ నౌ ద్వారా భవనాల అనుమతులు తదితర విధానాలను అవలంబిస్తున్న తీరును వివరించారు.కేరళ అర్బన్ కాన్క్లేవ్–25 సదస్సులో మేయర్ గుండు సుధారాణి -
హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి..
కాజీపేట అర్బన్: హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి మా ప్రాణాలు కాపాడండి అంటూ కడిపికొండలోని రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీవాసులు వేడుకుంటున్నారు. కాజీపేట నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కడిపికొండ టు ఖమ్మం బైపాస్ రోడ్డుకు ప్రధాన ద్వారంగా రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రధాన రోడ్డు నిలుస్తోంది. వీధి దీపాలు, హైమాస్ట్ లైట్ లేక చీకట్లోనే నిత్యం ప్రయాణాలు కొనసాగుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వెహికిల్స్ నడిచే ఈ దారిలో చీకటి ఆవరించి ఉండడంతో వాహనదారులు, స్థానికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తే వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. -
అలంకారప్రాయంగా ఎఫ్సీఐ క్వార్టర్లు
కాజీపేట: కాజీపేట భారత ఆహారసంస్థ (ఎఫ్సీఐ) గిడ్డంగుల్లో పనిచేసే ఉద్యోగుల కోసం నిర్మించిన నివాస గృహలు (క్వార్టర్లు) నిరూపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 62వ డివిజన్ రహమత్ నగర్ కాలనీ శివారులో ఉన్న గృహలు ఉపయోగంలో లేక పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ గృహల్లో ఎవరూ ఉండకపోవడం వల్ల నిర్వహణ లేక పరిసర ప్రాంతాలు అస్థవ్యస్తంగా మారాయి. చెట్లు, చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నాయి. వీటివల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నామని విష్ణుపురి, రహమత్నగర్ కాలనీవాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 1995లో ఎఫ్సీఐలో పనిచేసే ఉద్యోగుల కోసం రూ.2 కోట్లకుపైగా వ్యయం చేసి 40 కుటుంబాలు నివాసం ఉండేలా 5 భవనాలు నిర్మించారు. ఒక్కో క్వార్టర్లో 8 కుటుంబాలు ఉండేలా అందమైన భవనాలు నిర్మించారు. పక్కనే ఎఫ్సీఐ ఉండడంతో నిత్యం లక్క పురుగులు రావడం, ఇంటి అద్దె హెచ్ఆర్ఎ కంటే ఎక్కువగా ఉండడంతో ఈ క్వార్టర్లలో ఉండడానికి సిబ్బంది ససేమిరా అంటున్నారు. -
అథ్లెటిక్స్ మీట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దాం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలపై వివిధ క్రీడా సంఘాలతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొననున్నట్లు క్రీడా సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డికి వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పోటీల వివరాల్ని సీఎం రేవంత్రెడ్డికి వివరించేందుకు ఈనెల 15 లేదా 16 తేదీల్లో స్వయంగా కలవనున్నట్లు తెలిపారు. డీవైఎస్ఓకు ఎమ్మెల్యే అభినందనలు ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అభినందించారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి శనివారం డీవైఎస్ఓ అశోక్కుమార్ను శాలువాతో సత్కరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన అశోక్కుమార్ క్రీడాకారులకు ఆదర్శమన్నారు. అంతకుముందు క్రీడా సంఘాలు, డీఎస్ఏ కోచ్ల ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అశోక్కుమార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్ఖాన్, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు వరదరాజేశ్వర్రావు, బాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులున్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ లేదా?
వరంగల్ చౌరస్తా: ‘రాష్ట్ర మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించే స్వేచ్ఛ నాకు లేదా? అధిష్టానం సూచించిన వారికే కేటాయించా’ అని దేవాదాయ ధర్మదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. శనివారం వరంగల్ ఓ సిటీలో విలేకరులతో మంత్రి సురేఖ మాట్లాడారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచాడని, ఆయనపై తాను కామెంట్ చేయాలనుకోవట్లేదని పేర్కొన్నారు. తనపై నాయిని చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. రూ.3కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన తూర్పు నియోజక వర్గంలో మూడు డివిజన్లలో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కాశిబుగ్గలో రూ.1.50 కోట్లతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులు, 26వ డివిజన్ గిర్మాజీపేటలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, 21వ డివిజన్ ఎల్ బీ నగర్లో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులు ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు స్వీకరించారు. ఈఅభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ గిర్మాజీపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్కుమార్కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ఈమేరకు శనివారం గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇంగ్లాండ్, ఇండియా ప్రతినిధి డాక్టర్ మనీష్కుమార్ స్వయంగా వరంగల్లోని అజయ్కుమార్ నివాసానికి వచ్చి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు, ట్రోఫీ, రికార్డు బుక్ను అందజేశారు. సూక్ష్మశిల్పకళలో అసాధారణ ప్రతిభకనబర్చినందుకు ఈఅవార్డు వచ్చిందని అజయ్కుమార్ తెలిపారు.● నాయిని అదృష్టం కొద్ది గెలిచాడు ● మంత్రి కొండా సురేఖ -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. దేవాదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు కె.కుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా నియమితులైన కటకం రాములు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, భద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలిలో ఎస్.శ్రీధర్, మూగ శ్రీనివాస్ను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్
హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కళాఉత్సవ్ దోహదం చేస్తుందని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ను హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఈకళా ఉత్సవ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా స్థాయిలో 12 అంశాల్లో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 93 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హైస్కూల్ హెచ్ఎం జగన్, పీఎస్ హెచ్ఎం ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్ హన్మకొండ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరవరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో హనుమకొండ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరువరంగం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీలో 200 సంఘాలుండగా.. కేవలం 15 సంఘాలకు మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్లో స్థానం కల్పించి మిగతా వాటిని విస్మరించడం.. విభజించి పాలించడం అన్నట్లుగా ఉందన్నారు. సర్వీస్ సంఘాలతో పాటు విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించాల్సి ఉండగా విస్మరించడం విచారకరమన్నారు. అనంతరం హనుమకొండ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సాంబయ్య వ్యవహరించగా.. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా ఖాజామోహినుద్దీన్ వ్యవహరించారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని వారు వివరించారు. అధ్యక్షుడిగా ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సదానందచారి, కార్యదర్శిగా కె.సంజీవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా పి.శ్రీరాములు, వి.సుజాత, జాయింట్ సెక్రటరీగా జగదీశ్చంద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.వెంకటయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా ఎం.నర్సింహాచారి, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా టి.ప్రభాకర్, కె.రాజశేఖర్, కళా రాజేశ్వర్రావు ఎన్నికయ్యారు. -
శంకర్దాదా ఎంబీబీఎస్లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ’సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు..● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● గతేడాది అక్టోబర్లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాయింట్ తనిఖీలతో ఫలితాలు నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
విజ్ఞాన శాస్త్రంలో మైక్రోబయోమ్ కీలకం
జాతీయ సదస్సులో కేయూ విశ్రాంత ఆచార్యులు రాంరెడ్డి విద్యారణ్యపురి: మానవాళి మనుగడను మైక్రోబయోమ్ నిర్దేశిస్తోందని, జీవుల జీవనాన్ని అర్థం చేసుకోవడంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేయూ మైక్రోబయాలజీ రిటైర్డ్ ఆచార్యులు ఎస్.రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మైక్రోబియల్ ఫ్రాంటియర్స్ హార్నెస్సింగ్ జీనోమి క్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో జీనోమిక్స్, మైక్రోబయోమ్ కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యాం మాట్లాడుతూ.. జీనోమిక్స్ విస్తృతమైన డేటా సెట్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ వైద్యకళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. మన జీవన విధానంలో సమతుల్య ఆహారం నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందగలమన్నారు. నాగ్పూర్లోని ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ రీజినల్ సెంటర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే మానవాళి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్, జాతీయ సదస్సు కన్వీనర్ పి.పల్లవి మాట్లాడారు. -
కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మొదటి గేట్ నుంచి పరిపాలనాభవనం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనాభవనం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు, కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్అదాలత్ను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధి నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. కేయూ క్యాంపస్: ఐఐటీ జామ్–2026 ప్రవేశ పరీక్షకు గణిత శాస్త్రంలో ఉచిత శిక్షణ (ఆన్లైన్) అందించనున్నట్లు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత శాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారని ఆయా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఐఐటీ ఆచార్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణకు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వబోతున్నట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులు 97012 75354లో సంప్రదించాలని సూచించారు. హసన్పర్తి: అపరిశుభ్రతతోనే వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. 55వ డివిజన్ సదానంద కాలనీలో డెంగీ నియంత్రణ చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదైన బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. స్థానికంగా చేపడుతున్న ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, స్థానిక వైద్యాఽధికారి భార్గవ్, మానస, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, సబ్ యూనిట్ అధికారి ఖాదర్ అబ్బాస్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, కమలాకర్, సంతోశ్, ఏఎన్ఎంలు స్వరూప, రాణి, ప్రశాంత, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కాజీపేట: యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేశ్ అన్నారు. కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి పర్యవరణ పరిరక్షణ ఉద్యమకారుడు కె.ప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, రిటైర్డ్ అటవీశాఖ అధికారి పురుషోత్తం, హెచ్ఎం ఎం.ఫ్రాన్సిస్, ఉద్యనవన శాఖ అధికారి రమేశ్, ఎంఈఓ మనోజ్కుమార్, సుంకరి జ్వాలా ప్రశాంత్, శ్రీను, అశ్విని, నాగరాజు, వెంకటరమణ, నర్సయ్య పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు న్యూశాయంపేట: తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ (టీజీఈ జాక్) ప్రభుత్వానికి సమర్పించిన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ టీజీఓ భవన్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై మాట్లాడిన మాటలు ఉద్యోగ లోకాన్ని బాధించినా టీజీఓ, టీఎన్జీఓతో పాటు వివిధ సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవుల్లో బి.రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీప్రియను తీసుకున్నారు. సమావేశంలో టీజీఓ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, కోశాధికారి రాజేశ్కుమార్, శ్రీనివాస్, యాకయ్య, రాజు, రాజేశ్, సదానందం, మైదం రాజు, సతీశ్కుమార్ రవీందర్రెడ్డి, సుధీర్కుమార్, హేమలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మండల్ లెవల్ స్టాక్(బియ్యం) పాయింట్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితర అధికారులు పాల్గొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ సమీక్ష మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ సత్యపాల్రెడ్డి, ఖిలావరంగల్ తహాశీల్దార్ శ్రీకాంత్, ఏఓ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. -
గొర్రెల మందపై పిడుగు..
కాళేశ్వరం : గొర్రెల మందపై పిడుగు పడి 94 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, గొర్రెల కాపరులు తెలిపిన కథనం ప్రకారం.. అంబటిపల్లికి చెందిన సుమారు ఆరు గొర్రెల మందలు పెద్దంపేట–లెంకలగడ్డ గ్రామ శివారులో మేతకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాపరులు మంద నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న గుడారంలోకి వెళ్లారు. మందపై ఒక్కసారి పిడుగు పడడంతో గొర్రెలన్నీ ఎక్కడిక్కడ చెల్లా చెదురయ్యాయి. రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృతిచెందడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల పశువైద్యాధికారి రాజబాపు, తహసీల్దార్ రామారావు చనిపోయిన గొర్రెలకు పంచనామా, పోస్టుమార్టం చేశారు. గోతితీసి పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. -
శభాష్.. ఎల్కతుర్తి పోలీస్
ఎల్కతుర్తి : వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఖాకీలు కాపాడారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గాజుల రాకేశ్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో రాకేశ్ కొట్టుకుపోయి బ్రిడ్జి వద్ద ఉన్న మూడో పిల్లర్ను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్–100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్ వెంటనే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాడుసాయంతో రాకేశ్ను రక్షించారు. దీంతో పోలీసులను ప్రజలు అభినందించారు. కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఒకే ఇంటిపై మూడు పిడుగులు
●ఎల్లంపేటలో గృహోపకరణాలు దగ్ధం.. మరిపెడ రూరల్ : ఒకే ఇంటిపై మూడుసార్లు పిడుగులు పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగూరి వెంకన్న, వెంకటమ్మ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వారి భవనం మెట్లపై ఒక చోట, డాబాపై రెండు చోట్ల పిడుగు పడింది. భయంతో వణికిపోయిన దంపతులు పక్కింట్లో తలదాచుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వెంకటమ్మను ఆస్పత్రికి తరలించారు. పిడుగులు పడి స్లాబుకు పెచ్చులూడి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫ్రిడ్జి, ఫ్యాన్లు, టీవీ, విద్యుత్ తీగలు కాలిపోయాయి. మొత్తం రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలాన్ని శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి గణేశ్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేశ్తో పాటు గ్రామస్తులు కోరారు. -
బొడ్డెమ్మ వేడుకలు షురూ
కాజీపేట/హన్మకొండ కల్చరల్: వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు పుట్టమట్టితో బొడ్డెమ్మలను తయారుచేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. సాయంత్రం సమయంలో ఉత్సాహంగా పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు. చెల్పూరులో చైన్ స్నాచింగ్ ● బంగారు పుస్తెలతాడు అపహరణ గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. వరుస చోరీలతో ఆందోళన.. గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరంగల్ అర్బన్: బల్దియా వార్డు ఆఫీసర్లుగా రెండేళ్ల క్రితం విధుల్లో చేరిన 27 మంది జీపీఏలు శుక్రవారం రిలీవ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరిని తమ సొంత శాఖకు కేటాయించారు. అంతేకాకుండా ప్రభుత్వం వీరికి నియామకపత్రాలు అందజేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు. ముగిసిన కబడ్డీ టోర్నమెంట్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంటర్ కాలేజీయేట్ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. కుమారస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్కుమార్, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పనులు చేపట్టనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఐటీడీఏ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆర్కిటెక్చర్, కోయల పడిగల గుడ్డల లిపి 3నుంచి 7 గొట్ల మూలాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలు గుడ్డలో ఉన్న పూర్వ చరిత్ర చిత్రలిపి, ఆదివాసీ జీవన విధానం గోడలపై ఆవిష్కరించాలని సూచించారు. వెయ్యేళ్లు సజీవంగా ఉండేలా, ఆదివాసీల చరిత్ర నిలిచేలా జాతర చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గద్దెల ప్రాంగణం, సాలాహారం నిర్మాణంపై ఆదివాసీల బొమ్మలు ఉండాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. కోయ ద్వారాల మాదిరిగానే ఆలయ ద్వారాల నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ద్వారాలపై సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు మూలాలు, ఆదివాసీల గొట్లు, గోత్రాలు, సిద్ధబోయిన వారి పూజావిధాన పద్ధతులు కూడా ఉంటాయని చెప్పారు. మిగిలిన 8 ద్వారాల్లో ఐదో గొట్టు సమ్మక్క, మూడో గొట్టు సారలమ్మ, నాలుగో గొట్టు పగిడిద్దరాజు, గోవిందరాజు, వడ్డె (పూజారి) గోత్రాలతో ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ వంశ మూల చరిత్ర ఉంటుందని అన్నారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రై వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమరకోట ఎస్సీ కాలనీకి చెందిన ఆకులపల్లి కమలాకర్ (40) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పు తీర్చాలని మైక్రో ఫైనాన్స్లో వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో కమలాక ర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి మమత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’
డోర్నకల్ : రైలులోని ఓ బోగీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో మూడు గంటలకు పైగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట దాటిన తర్వాత రైలులోని డీ–2 బోగీలో సాంకేతిక లోపం తలెత్తింది. వరంగల్ స్టేషన్లో బోగీలోకి ఎస్కార్ట్గా ఎక్కిన సిబ్బంది రైలు ఆగిన ప్రతీ స్టేషన్లో డీ–2 బోగీని పరిశీలించారు. రైలు మహబూబాబాద్ దాటిన తర్వాత డీ–2 బోగీలో హార్డ్ యాక్సిల్ బేరింగ్ దెబ్బతిందని సిబ్బంది డోర్నకల్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. డోర్నకల్ స్టేషన్లో సీఅండ్ డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు సాయంత్రం 5:04 గంటలకు డోర్నకల్ స్టేషన్లోని నాలుగో ప్లాట్ఫామ్ చేరుకున్న తర్వాత డీ–2 బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసి రైలు నుంచి తొలగించాలని నిర్ధారించారు. రైలు వెనుకవైపు ఇంజన్ అమర్చి బీ–2 వరకు చివరి ఐదు బోగీలను జంక్షన్లోని యార్డుకు తరలించారు. డీ–2 బోగీని యార్డులో వదిలి మిగతా నాలుగు బోగీలను తిరిగి రైలుకు అమర్చిన తర్వాత రైలు రాత్రి 8:13 గంటలకు డోర్నకల్ నుంచి కదిలింది. సుమారు మూడు గంటలకు పైగా స్టేషన్లో రైలు నిలవడంతో విజయవాడ, గుంటూరు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
ప్రభుత్వ బడిలో కార్పొరేట్ విద్య
హసన్పర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. దాతలు (అరబిందో ఫార్మా ఫౌండేషన్, బ్రెల్చివ్ టర్నాలజీ, స్వాన్ టర్బిన్ సర్వీస్) సహకారంతో హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో సుమారు రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ఆడిటోరియంలో ఫర్నిచర్ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. హసన్పర్తికి చెందిన ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేదరికాన్ని జయించి ఐపీఎస్గా ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీపరీక్షలకు సంబంధించిన సుమారు రూ.8లక్షల విలువైన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. దాతలు స్వాన్ టర్బిన్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ, బ్రెల్చివ్ టర్నాలజీ సీఈఓ డాక్టర్ ఉదయ్కుమార్, మహర్షి ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నూరి రవిని శాలువాలతో సత్కరించారు. డీఐఈఓ గోపాల్, ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ దాతల సాయంతో హసన్పర్తి కళాశాల, పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో ఆడిటోరియం, ల్యాబ్ ప్రారంభం -
డీసీసీబీ ‘ఏ’ కేటగిరీ సాధించాలి
హన్మకొండ : నాబార్డు ఇన్స్పెక్షన్లో వరంగల్ డీసీసీబీ ‘ఎ’ కేటగిరీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించి ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా సాధించాలని సూచించారు. వ్యక్తిగత పనితీరు మెరుగుపడని వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించారు. రుణాలు, మొండి బకాయిలను రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని పేర్కొరు. నిరర్థక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా, టర్నోవర్ రూ.2,500 కోట్లు చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి నెల ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయకుమారి, బ్యాంకు బ్రాంచ్ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
వర్షం, పిడుగుల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో రూ.95 వేల విలువైన ఎద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలంలో మానేరులో వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో ట్రాక్టర్లు మునిగిపోగా ఏడుగురిని పోలీసులు రక్షించారు. -
16న జాబ్మేళా
న్యూశాయంపేట: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీలో రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. వివరాలకు 80790 09659లో నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసంమహబూబాబాద్ రూరల్ : బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం జరగగా ఓ బాధితుడు రూ.32.53 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా షాదీడాట్ కామ్ అని మెసేజ్ చేసి వివరాలు అడిగారు. బాధితుడికి వివాహమైందని తెలియజేసి వారికి వివరాలు ఇవ్వలేదు. కొన్నిరోజుల తర్వాత అదే వాట్సాప్ నంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్పి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికి లింక్ పంపించారు. ఆ లింక్తో బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాళ్లు చెప్పిన విధంగా మొదటగా రూ.50వేలు, ఆ తర్వాత రూ.5లక్షలు పంపించాడు. అయితే బాధితుడి వాలెట్లో రూ.పది లక్షలు ఉన్నట్టు చూపించి నమ్మించారు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వాళ్లు చెప్పినట్లు వివిధ ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించాడు. తర్వాత ఎలాంటి నగదు బాధితుడి అకౌంట్లో జమకాలేదు. అయినా కూడా డబ్బులు జమ చేయకుండా మరింతా డబ్బులు అడుగుతుండటంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ● రూ.32.53లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్యన్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోని 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
హసన్పర్తి: ప్రభుత్వ భూమికే ఓ ప్రబుద్ధుడు ఎసరుపెట్టాడు. డాక్యుమెంట్లతో స్థలాన్ని కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నంబర్ 516లో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 400 ఎకరాల మేరకు అసైన్డ్ చేశారు. మిగిలిన భూమి పడావుగా ఉంది. అదే గ్రామానికి చెందిన రాజమౌళి కన్ను ప్రభుత్వ స్థలంపై పడింది. దీంతో మూడు డాక్యుమెంట్లు తయారుచేసి ఆ భూమి కబ్జా చేశాడు. ఆ ఇంటి నంబర్తో తన కుమారుడు, కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. కబ్జా చేసుకున్న భూమిని పట్టాగా నమ్మించాడు. అందులో కుమారులు, కూతుళ్ల పేర్లపై నిర్మాణాలు చేపట్టాడు. ఈ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు ఇంటి నంబర్లు కూడా జారీ చేశారు. కాగా, ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందని స్థానిక ఓ యువకుడు అధికారులను ఆశ్రయించాడు. ఫలితం లేకపోవడంతో కార్పొరేషన్, రెవెన్యూ అధికారులను కక్షిదారులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు సూచనల మేరకు అధికారులు సర్వే చేసి ఆ భూమి ప్రభుత్వానిదని నిర్ధారించి కమిషనర్కు నివేదిక అందించారు. ఈమేరకు వారం రోజుల క్రితం కబ్జాదారుడికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆర్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మూడు ఇళ్లు సీజ్ చేశారు. ఈక్రమంలో కబ్జాదారుడి బంధువులు, స్నేహితుల నుంచి కొంత అవాంతరం ఎదురైంది. అప్పటి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమి జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ఇక్కడ వీఆర్ఓగా పనిచేసిన వ్యక్తి కబ్జాదారుడికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టును ఆశ్రయించిన స్థానికుడు కోర్టు ఆదేశంతో మూడు ఇళ్లు సీజ్ -
అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ (ఎన్ఏపీఈఎస్ఎస్) ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ క్రీడా సదస్సులో పాల్గొనేందుకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు ఆహ్వానం అందింది. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా, షా ఆలంలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో అశోక్కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎపీఈఎస్ఎస్ చైర్మన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజామహ్మద్ ఫిర్హరాజాఅజిదిన్ ఆహ్వాన పత్రికను పంపించారు. కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్పై పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సెమినార్లో పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. -
ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి, మంచి నడవడిక, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే, మానసికంగా దృఢంగా ఉంటారని... తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు. ప్రమాదాలు చేయని, అనుభవజ్ఞులు, సత్ప్రవర్తన, ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు, కండక్టర్లను సేఫ్టీ వార్డెన్లుగా ఎంపిక చేశారు. వరంగల్ రీజియన్లో 9 డిపోలకు ఒకరి చొప్పున నియమించారు. సేఫ్టీ వార్డెన్ల విధులు.. సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతీరోజు నిశి త పరిశీలన చేస్తా రు. సెలవులో ఉ న్న వారిని వదిలి పెట్టరు. వారి ఆరోగ్యాన్ని, జీవనశైలిని దగ్గరగా గమనిస్తారు. వారాంతపు సెలవు రోజులు, స్పెషల్ ఆఫ్లో ఉన్న సమయంలో తగిన విశ్రాంతి తీసుకుంటున్నారా..? మద్యం సేవిస్తున్నారా..? ఇతర దురలవాట్లకు పాల్పడుతున్నారా.. అనారోగ్యంగా ఉంటే అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుతున్నారా.. తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని విశ్రాంతి రోజు వారి జీవన విధానాన్ని గమనిస్తున్నారు. వారి నడవడిక, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా డిపో, రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అలజడులకు తావు లేకుండా మానసికంగా ఉంటారని అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్లో సంస్థ డ్రైవర్లు 1100, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు 258 మంది ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు.. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించింది. వారి ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగులకను కేటగిరీలుగా విభజించింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించింది. హెల్త్ డేటా బేస్లో ఉద్యోగి వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచారు. వైద్య పరీక్షల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మందులు వాడుతున్నారా లేదా అని సేఫ్టీ వార్డెన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు వచ్చిన సందర్భంలోనూ వారి వ్యక్తిగత రికార్డులు పరిశీలించి వాడాల్సిన ఔషధాలు వెంట తెచ్చుకున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భోజనం, తాగునీరు కూడా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునేలా మార్గదర్శనం చేస్తున్నారు. నైట్ డ్యూటీకి వెళ్లే వారు, రెస్ట్లో ఉండే వారు దోమతెర, ఓడోమస్ వెంట తీసుకొచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా డ్రైవర్ల ఆరోగ్యం బాగుండడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. వ్యక్తిగత రికార్డుల పరిశీలన.. డ్రైవర్ల పనితీరుపై కూడా వ్యక్తిగత రికార్డులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రవర్తన తీరు.. ప్రమాదాలు జరిగాయా.. జరిగితే ప్ర మాదానికి కారణం ఎవరు.. మామూలు ప్రమాదా మా, మేజర్ ప్రమాదమా.. ప్రాణాలుపోయిన ప్ర మాదమా వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసే డ్రైవర్లను ‘ఏ’ కేట గిరీలో, మైనర్ ప్రమాదాలు చేసిన వారిని ‘బి’ కేట గిరీ, మేజర్ ప్రమాదాలకు పాల్పడిన వారిని ‘సి’ కే టగిరి, ప్రమాదంలో ప్రాణాలు పోతే ‘డి’ కేటగిరీలో చేర్చారు. డిపో డ్రైవర్లు హనుమకొండ 199 వరంగల్–1 286 వరంగల్–2 19 పరకాల 90 జనగామ 172 తొర్రూరు 120 మహబూబాబాద్ 83 నర్సంపేట 121 భూపాలపల్లి 119డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్స్ను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్లను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు. సేఫ్టీ వార్డెన్స్ ద్వారా నిత్య పరిశీలన మారుతున్న డ్రైవర్ల జీవన శైలి తగ్గుతున్న ప్రమాదాలు వరంగల్ రీజియన్లో 9 డిపోలు -
ఆన్లైన్ వేధింపులపై అవగాహన ఉండాలి
సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ హన్మకొండ: సైబర్ నేరాలు, ఆన్లైన్ లైంగిక వేధింపులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో వనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టర్ నిర్మల ఆధ్యక్షతన సైబర్ క్రైమ్, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో వారు మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యుగంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆర్థిక, ఇతర వేధింపులకు గురవుతున్నారని, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతీ మహిళ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా ఉంటారన్నారు. మహిళలను, పిల్లలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ 100, 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బత్తుల కరుణ ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక దాడులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో వనం మహిళా సంఘం రీజియన్ ప్రెసిడెంట్ రుమాల్డిన, ట్రెజరర్ రిజి అబ్రహం, కౌ న్సిలర్ అన్నామేరి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ తదితరులు పాల్గొన్నారు. -
కేయూలో తీజ్ ఉత్సవాలు
కేయూ క్యాంపస్: కేయూలో గురువారం ఉత్సాహంగా గిరిజన విద్యార్థులు తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, కేయూ పాలకమండలి సభ్యులు బి.సురేశ్లాల్, సైన్స్విభాగాల డీన్ జి.హనుమంతు, ప్రొఫెసర్ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకులు మాలోత్ తిరుపతినాయక్, రాజునాయక్, ఉషన్నాయక్, రమేశ్నాయక్, వెంకట్నాయక్, నవ్య, స్నేహ, అనిత, స్వరూప, ధరావత్ సూర్య, యాదగిరి, సురేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎంలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్స్లుఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు వరంగల్ కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తమదెన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యుల్లో, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్ను పది రోజులకోసారి తెరుస్తూ కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. వేటు.. మెమోలు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కిశోర్ను ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని బాక్స్లు ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్నీ సత్ఫలితాలు ఉంటాయని రోగులు వేడుకుంటున్నారు. నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ విభాగంతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వినతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నాలు -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
సేఫ్టీ వార్డెన్లతో సత్ఫలితాలు..
సేఫ్టీ వార్డెన్ల నియామకం సత్ఫలితాలనిస్తోంది. డ్రైవర్లు వ్యసనాలు, దురలవాట్లకు దూరమవుతున్నారు. మానసికంగా దృఢంగా తయారై సురక్షిత డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే గడిచిన నాలుగు నెలల కాలంలో 8 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు తగాయి. గతేడాది నాలుగు నెలల కాలంలో 19 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు జరుగగా ఈ ఏడాది 11 ప్యాటల్ ఆక్సిడెంట్లు జరిగాయి. 11 ప్రమాదాల్లో మూడు మాత్రమే సంస్థ, సంస్థ అద్దెకు తీసుకున్న డ్రైవర్ల పొరపాటుతో జరిగాయి. మిగతా ప్రమాదాలు ఇతరుల తప్పిదాలతో జరిగాయి. డి.విజయభాను, రీజినల్ మేనేజర్ , వరంగల్ -
ఎఫ్ఓబీ నిర్మాణం ఎప్పుడో?
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్ఎస్) వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు నిర్మిస్తారని రైల్వే కార్మికులు అంటున్నారు. కాజీపేట జంక్షన్లో 2004లో రైల్వే శాఖ ఎలక్ట్రిక్లోకో మెయిన్ షెడ్ నిర్మించింది. అప్పటి నుంచి రైల్వే అధికారులు, కార్మికులు రైలుపట్టాలు దాటి షెడ్కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం షెడ్లో 250 లోకోల నిర్వహణతో సుమారు 410 మంది రైల్వే కార్మికులు వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. షెడ్లోకి వెళ్లి రావాలంటే రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రన్నింగ్ ట్రైన్స్, షట్టింగ్ ట్రైన్స్, డీజిల్షెడ్, ఫిట్లైన్ నుంచి వచ్చి వెళ్లే రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైల్వే కార్మికులు అంటున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు, లంచ్ టైం, డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో రైళ్లు వెళ్లే వరకు గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలతో విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు షెడ్లో 8 గంటల పని వేళలో ఆలస్యం కావడం వల్ల పని భారం పడుతోందని రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో షెడ్ వద్ద ఆర్యూబీ మంజూరైందని, ఏమైందో ఏమో గాని రద్దు కూడా అయిందని అంటున్నారు. షెడ్ కార్మికుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే జీఎం, డీఆర్ఎం, పీఎన్ఎం మీటింగ్తోపాటు రైల్వే బోర్డు స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ బ్రిడ్జిని నిర్మించాలని షెడ్ రైల్వే నాయకులు, కార్మికులు కోరుతున్నారు. ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ లోకోషెడ్ రైల్వే కార్మికులు -
రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ అందజేత
న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గురువారం కలెక్టర్ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసిన కలిసిన నవీన్.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, రుద్రాణి, వి.పూర్ణచందర్ పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన జీపీఓలు న్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్(జీపీఓ)లు గురువారం కలెక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సెలింగ్లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్, విజయజ్యోతి, జ్యోతి, రమేష్, శ్రావణ్, క్రాంతి, విశ్వేశ్వర్, సుభాష్ తదితరులు ఉన్నారు. -
‘కేరళ అర్బన్ కాన్ క్లేవ్’కు నగర మేయర్
వరంగల్ అర్బన్: కేరళ అర్బన్ కాన్ క్లేవ్–2025 సదస్సుకు గురువారం నగర మేయర్ గుండు సుధారాణి వెళ్లారు. కేరళ అర్బన్ పాలసీ 2025–50లో భాగంగా ‘ఆకాంక్షించే నగరాలు, అభివృద్ధి చెందుతున్న సమాజాలు‘ అనే అంశంపై ఈనెల 12,13 తేదీల్లో కేరళలోని కొచ్చిన్ బోగ్గట్టిలో గ్రాండ్ హాయ్ సదస్సు జరుగనుందని అధికారులు తెలిపారు. స్థిరమైన పట్టణ అభివద్ధిలో వినూత్న అంతర్జాతీయ పద్ధతులు పాటించడం, నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని సదస్సులో మేయర్ వివరించనున్నారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ జె.సోమన్న, డాక్టర్ బి.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన
హన్మకొండ అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నినాదాలతో హోరెత్తిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్ గేట్ను తోసుకుని, గేట్లు ఎక్కి లోపలికి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగింది. ఈసందర్భంగా ఏబీవీపీ వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి విద్యార్థులు గుర్తుకొస్తారని ఆరోపించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ దూళిపూడి హరిచరణ్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్, రోహిత్, రాహుల్, నవీన్, త్రినేష్, అభిలాష్, శ్రీశాంత్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం సీఎంను విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా -
విద్యుదాఘాతంతో కార్మికుడికి గాయాలు
● సీపీఆర్ చేసి కాపాడిన రౖడైవర్ హన్మకొండ అర్బన్: విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు గాయపడిన సంఘటన గ్రేటర్ 49వ డివిజన్ పరిధిలోని దర్గా వంద ఫీట్ల రోడ్డులో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దర్గా వందఫీట్ల రోడ్డులో ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఎదుట నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తులో మాలోత్ సారయ్య సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్ లైన్కు ఇనుపరాడు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండో అంతస్తుపై నుంచి కింద పడిపోయాడు. కుప్పకూలిన సారయ్య మరణించాడని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన స్థానిక ఎకై ్సజ్ ఆఫీస్లో డ్రైవర్గా పనిచేస్తున్న సాంబరాజు ధైర్యంగా ముందుకు వచ్చి సారయ్యకు సీపీఆర్ చేశాడు. దీంతో కొద్దిసేపటికి సారయ్యకు స్పృహ వచ్చింది. ఆర్ఈసీ ఎన్పీడీసీఎల్ ఏ ఈ, లైన్ఇన్స్పెక్టర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భవన నిర్మాణ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోని ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని యజమానిని అదేశించారు. బాధితుడికి ఒక కాలు విరిగిపోవడంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. 108 పైలట్ బాలాజీ, ఈఎంటీ సురేందర్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేసిన డ్రైవర్ సాంబరాజును స్థానికులు అభినందించారు. -
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 13 నుంచి రోలర్ స్కేటింగ్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్ఎస్హౌస్ వద్ద, 14న రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు. 13,14వ తేదీల్లో వాగ్దేవిలో క్రీడాపోటీలు మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ సు నీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీ డా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్రెడ్డి, సి.హెచ్.వాణిదే వి, డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ‘ఆల్ ఇండియా’ చెస్ పోటీల విజేతగా రామకృష్ణ వరంగల్ చౌరస్తా: హైదరాబాద్లో జరిగిన ఏడో ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–25 చెస్ పోటీల్లో వరంగల్ జిల్లా సబ్ జైళ్ల జైలర్ గొట్టె రామకృష్ణ విజేతగా నిలిచారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నుంచి మెడల్, ట్రోఫీ అందుకున్నారు. ఈసందర్భంగా ఆ శాఖ అధికారులు, సిబ్బంది, మిత్రులు ఆయనను అభినందించారు. సకాలంలో టీకాలు వేయాలి గీసుకొండ: చిన్న పిల్లలకు వేసే టీకాలను సకాలంలో క్రమం తప్పకుండా వేయాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం వాక్సినేషన్పై వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆచార్య, డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్,వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మహాజాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం మహాజాతర అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకరటీఎస్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టనున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ పీఆర్, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారంలో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. మహాజాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర పనులు భక్తులకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్ఓ శ్రీనివాస్రావు, మేడారం ఈఓ వీరస్వామి, తహసీల్దార్ సురేశ్బాబు, అధికారులు పాల్గొన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి కలెక్టర్ దివాకరటీఎస్ -
తల్లిదండ్రులకు భారమైన శిశువు మృతదేహం
● ఎంజీఎం మార్చురీలో వదిలేసిన కన్నవారు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనఎంజీఎం: ఎంజీఎం మార్చురీలో ఓ పసికందు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన హైమవతి–అనిల్ దంపతులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైమావతి 7 నెలల గర్భిణి. కాగా, ఇటీవల తొర్రూరు ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఎంజీఎంలోని నవజాత శిశు కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా ఈనెల 8వ తేదీన మృతి చెందింది. కాగా, పసికందు మృతదేహాన్ని తల్లిదండ్రులు మార్చురీలో వదిలివెళ్లారా, డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు అని వదిలివెళ్లారో తెలియదు. కానీ, గురువారం సాయంత్రం ఆస్పత్రిలో ఈ విషయం చర్చకు దారితీసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు మార్చురీలో ఉన్న పసికందు మృతదేహం గురించి సదరు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు మరోసారి ఎంజీఎం మార్చురీకి రానున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
విషాదం.. స్కూల్లో ఆడుతూ కుప్పకూలిన టెన్త్ విద్యార్థి
సాక్షి, హనుమకొండ జిల్లా: హనుమకొండ నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఆడుకుంటూ అకస్మాత్తుగా కిందపడి టెన్త్ విద్యార్థి జయంత్వర్ధన్(15) మృతి చెందాడు. రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మధ్యాహ్నం స్పోర్ట్స్ ఆడుతుండగా అకస్మాత్తుగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. బాలుడి ముక్కు నుంచి రక్తం ఆనవాళ్లు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.కొట్టి చంపేశారని అనుమానం ఉందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బిల్లింగ్లో మానవ రహిత సేవలు
హన్మకొండ: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ టీజీ ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతీవిభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ సేవల్లో కచ్చితత్వాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్టీ మీటర్ రీడింగ్ నమోదులో ఆధునిక సాంకేతికతను చొప్పిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా మీటర్ రీడింగ్ నమోదు చేసే పరికరాన్ని అమరుస్తున్నారు. ఇప్పటివరకు హెచ్టీ సర్వీస్ల స్థాయిలను బట్టి ఏడీఈ, ఏఈలు వెళ్లి మీటర్ రీడింగ్ నమోదు చేసేవారు. విద్యుత్ వాడుకునే కేటగిరీ వారీగా 55 హెచ్పీకి మించిన సామర్థ్యం ఉన్న మీటర్ల రీడింగ్ను ఏడీఈలు, 55 హెచ్పీలోపు ఉన్న సర్వీస్ల మీటర్ రీడింగ్లను ఏఈలు, నాన్ స్లాబ్ రీడింగ్ను లైన్ ఇన్స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్ను జేఎల్ఎంలు తీస్తున్నారు. వీరు హెచ్టీ మీటర్లను సందర్శించి వాటి రీడింగ్ తీసుకువచ్చి కార్యాలయాల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి విద్యుత్ వినియోగదారులకు బిల్లులు పంపేవారు. దీంతో సమయం వృథా అయ్యేది. లోపాలు తలెత్తేవి. వీటిని అధిగమించి కచ్చితత్వంతో బిల్లులు అందించేందుకు అటోమేటిక్ మీటర్ రీడింగ్ సిస్టంను అమలు చేస్తున్నారు. ఆటోమేటిక్ మీటర్ రీడింగ్కు మోడెంల ఏర్పాటు.. హెచ్టీ సర్వీస్ మీటర్లతోపాటు, ఎల్టీలోనూ హెచ్టీ మీటర్లు వినియోగిస్తున్న సర్వీస్ల్లో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడమ్ను బిగిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి సర్కిల్లో పనులు జరుగుతున్నాయి. హెచ్టీ మీటర్లకు అమర్చుతున్న మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వస్తుందని అధికారులు తెలిపారు. మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుంది. దీంతో పొరపాట్లకు తావుండదు. జీఎస్ఎం/జీపీఆర్ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోడెంను హెచ్టీ మీటర్కు అనుసంధానం చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వినియోగమైన యూనిట్ల వివరాలను కచ్చితత్వంతో కార్పొరేట్ కార్యాలయానికి చేరవేస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్లో మొత్తం హెచ్టీ మీటర్లు 4,013, ఎల్టీ సర్వీస్ల్లో హెచ్టీ మీటర్లు 2,254 ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1,650 మీటర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడెంలను అమర్చారు. హెచ్టీ మీటర్లో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సులువుగా హెచ్టీ సర్సీస్ల బిల్లింగ్ మోడెంలు బిగిస్తున్న ఎన్పీడీసీఎల్ మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం వెంట వెంటనే చేరవేత -
సాహితీవేత్త రంగారావు మృతి
విద్యారణ్యపురి: అనారోగ్య సమస్యలతో కవి, కథకుడు, వ్యాసకర్త సంధ్య రంగారావు (82) బుధవారం హైదరాబాద్లో మరణించారని కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్విద్యార్థి తెలిపారు. కాళోజీ సోదరులు స్థాపించిన మిత్రమండలికి సుమారు 12 ఏళ్లపాటు రంగారావు కన్వీనర్గా సేవలందించారని గుర్తుచేశారు. ఆయన మృతిపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, గంట రామిరెడ్డి, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, పందిళ్ల అశోక్కుమార్, డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ సంతాపం తెలిపారు. -
మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఆమ్మవారిని దర్శించి పూ జలు చేసిన అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మ హదాశీర్వచనం అందజేశారు. అనంతరం మాడవీధుల పురోగతిని ‘కుడా’ అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల నుంచి మాడవీధి గుండా ప్రవేశం మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి నవరాత్రులకు రెండు రోజుల ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం ముందు ఉన్న, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీంరావు, ఆర్డీఓ రమేశ్, వరంగల్ ఏసీపీ సత్యనారాయణ, మట్వాడ సీఐ కరుణాకర్, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు. -
బైక్.. భద్రం!
ఖిలా వరంగల్: వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను భద్రంగా చూసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దు. అప్పుడే బైక్లు కొద్దికాలంపాటు మన్నికగా ఉంటాయి. ఇలా కాకుండా నిర్లక్ష్యంగా నడిపితే వాహనాలు మరమ్మతులకు గురవుతాయి. అప్పుడు కనీసం రూ.2వేలు చేతిలో ఉండాల్సిందే. ఇంజన్ పాడైతే రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అదనపు భారం పడే అవకాశముంది. ఒక్కసారిగా ఇంత ఖర్చు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. కనీస జాగ్రత్తలు పాటిస్తే వాహనాలు మన్నికగా ఉంటాయని సీనియర్ మెకానిక్ అంకాల సతీశ్ చెబుతున్నారు. బైక్ల నిర్వహణ గాలికి.. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.20వేలకు పైగా కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన చాలా మంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మరమ్మతులకు గురవడంతో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడే పార్క్.. వర్షం కురుస్తున్న సమయంలో పలువురు తమ వాహనాలను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఆపుతారు. దీంతోపాటు వాహనాన్ని రహదారులపై మె కాలి లోతులో నిలిచిన నీటి నుంచి నడుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల పలు భాగాల్లోకి నీరు చేరి బైక్ మొరాయిస్తుంది. లాక్ సిస్టమ్, ప్లగ్, కేబుళ్లు, బ్రేకులు, ఇంజన్, ఫైరింగ్ సిస్టమ్.. ఇలా వాహనంలో ప్రతీ వస్తువు పాడయ్యే అవకాశముంది. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం.. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. మరో వైపు ప్రతీ వాహనదారుడు తమ వాహనానికి సంబంఽధించి టైర్లు, బ్రేకులు బాగున్నాయా..? లేవా..? అని తనిఖీ చేయాలి. దీంతోపాటే చైన్ను కూడా లూబ్రికేషన్ చేయించాలి. తడిస్తే తుప్పు పడుతుంది. ఈనేపథ్యంలో చైన్ లూబ్రికేంట్ను వాడడం మంచిది. వర్షాకాలంలో తడి, నీళ్ల రోడ్లపై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మొదట వాహన టైర్లును తనిఖీ చేయాలి. అరిగిపోయి ఉంటే వాటిని మార్చుకోవాలి. బ్యాటరీ పూర్తిగా చార్జీంగ్ చేసి మంచి స్థితిలోఉందో.. లేదో చూసుకోవాలి. వర్షానికి వాహనం తడిస్తే ఆ ప్రఽభావం పలు భాగాలపై పడుతుంది. విజిబిలిటీ బాగుండాలంటే బ్యాటరీ ఫుల్గా ఉండాలి. బల్బుపోతే వెంటనే మార్చుకోవాలి.బైక్ను భద్రంగా కాపాడుకోవాలి..వర్షం కురుస్తున్న సమయంలో బైక్పై ప్రయాణం ప్రమాదకరం. బ్రేక్లు, క్లచ్లు పనిచేయక బైక్ అదుపు తప్పి ప్రమాదం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తే సైలెన్సర్ ద్వారా ఇంజిన్లోకి వరదనీరు చేరి బైక్ పాడవుతుంది. తద్వారా మరమ్మతుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వర్షాకాంలో బైక్ను భద్రంగా కాపాడుకోవాలి. అంకాల సతీశ్, సీనియర్ బైక్ మెకానిక్వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మెకానిక్ షెడ్కు వెళ్లాల్సిందే మరమ్మతుకు చేతిలో వేలాది రూపాయలు ఉండాల్సిందే.. వర్షపు నీటిలో ప్రయాణించొద్దని మెకానిక్ల సూచన -
ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలి
హన్మకొండ: చాకలి ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలని ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. నక్కలగుట్టలోని హోటల్ హరితకాకతీయలో చాకలి ఐలమ్మ వర్ధంతి, మహిళా చైతన్య సదస్సు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి సుందర్రాజ్ యాదవ్, అతిథులు, మహిళలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. భూమి.. భుక్తి.. వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మందిలో 80 శాతం మంది బీసీలేనన్నారు. అయినా ప్రభుత్వ పాలసీల్లో బీసీల ఊసేలేదని లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు. 51 మందిలో 26 సీట్లు బీసీ మహిళలు సాధించేలా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, మహిళా ప్రతినిధులు దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి, ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి, ఎంఎన్ మూర్తి, వేణుమాధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, పద్మజ, ప్రవళ్లిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ -
బెల్ట్షాపులపై దాడులు
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ ఏఎస్పీ శుభం ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ బుధవారం బెల్ట్షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మేరకు రూ.12 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బెల్ట్షాపు నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తెల్లవార్లు బెల్ట్షాపులు కొనసాగించడం వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, పద్ధతి మార్చుకోకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ శుభం హెచ్చరించారు. హసన్పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాల్వకట్టతో పాటు పెగడపల్లి డబ్బాల ప్రాంతాల్లోని బెల్ట్షాపులపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.25 వేల మద్యంతోపాటు రూ.5 వేల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హనుమకొండ ఏసీపీ నర్సింహరాములు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, కల్యాణ్, నవీన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమార్తె
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం భర్తతో కలిసి కుమార్తె.. తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జనగామ జి ల్లా పాలకుర్తి మండలం పెద్దతండా (కే) గ్రామంలో జరిగింది. సీ ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకా రం.. పెద్దతండా(కే)కు చెందిన బాదావత్ లక్ష్మి (42) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతి 15 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు సంగీత ఏకై క సంతానం. ఈమెకు ఐదేళ్ల క్రితం ఇదే మండలంలోని దుబ్బతండా(ఎస్పీ) గ్రామానికి చెందిన బానోత్ వీరన్నతో వివాహం చేశారు. తల్లి పేరిట ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమి తన పేరుతో పట్టా చేయాలని సంగీత పలుమార్లు అడిగింది. ఇందుకు తల్లి నిరాకరించింది. దీంతో ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు తల్లిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని భర్తతో చర్చించింది. ఇరువురు హత్య చేయాలని నిర్ణయం తీసుకొని మంగళవారం రాత్రి పెద్దతండాకు చేరుకున్నారు. కూతురు సంగీత, అల్లుడు వీరన్న కలిసి నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుపెట్టి హత్య చేశారు. కూలి పని కోసం పిలవడానికి వెళ్లిన స్థానిక మహిళ చూసి తండావాసులకు బుధవారం తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకీరాంరెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం పెద్దతండా (కే)లో దారుణం -
డెంగీతో చిన్నారి మృతి
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రా మానికి చెందిన కౌడె ఉపేందర్, అనిత దంపతుల కూతురు సంహిత(07) బుధవారం హైదరాబాద్లోని నిమ్స్లో చికి త్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలి పారు. ఉపేందర్, అనిత దంపతులు జనగామలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల గ్రామంలో బోనాలు, ఇతర పండుగలు రావడంతో అనిత స్వగ్రామం కోడూరుకు, అత్తగారిల్లు వనపర్తికి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సంహితకు పదిహేను రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు, అనంతరం చంపక్హిల్స్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నిలోఫర్కు తరలించగా డెంగీ అని నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి సంహిత మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై స్థానిక వైద్యురాలు స్వర్ణలతను వివరణ కోరగా ఆ కుటుంబం జనగామలో నివాసం ఉంటోందని తెలిపారు. -
ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి
హన్మకొండ: మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధి శిక్షణ దోహదపడుతుందని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో మహిళా సాధికారత మేళా కార్యక్రమం జరిగింది. మగ్గం శిక్షణ, టైలరింగ్, బ్యూటిషన్ ట్రైనింగ్ పొందిన 350 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి శిక్షణతో కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. అడిషనల్ డీసీపీ రవి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, సంస్థ రీజినల్ అధ్యక్షులు రుమాల్డిన, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఆయా సంస్థల ప్రతినిధులు అనితారెడ్డి, కె.నాగవాణి, ఆల్బటా అమృత, ఎం,అజయ్కుమార్, ఈసంపల్లి సుదర్శన్, పరికి సుధాకర్, సుదర్శన్ గౌడ్, ప్రభాకర్, శివప్రసాద్, కొమ్ముల నవీన్ పాల్గొన్నారు. -
దానాపూర్ రైలుకు చర్లపల్లిలో హాల్టింగ్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి, దసరా, చాత్పూజా పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే సికింద్రాబాద్–దానాపూర్ డైలీ ఎక్స్ప్రెస్కు చర్లపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 10 రోజులపాటు పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. హాల్టింగ్ వివరాలు.. సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో 9: 25 గంటలకు బయలుదేరి చర్లపల్లికి 9:40 గంటలకు, కాజీపేటకు 11:08 గంటలకు చేరుతుంది. అదేవిధంగా దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్ప్రెస్ దానాపూర్లో బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 18:23 గంటలకు, చర్లపల్లికి 20:42 గంటలకు, సికింద్రాబాద్కు 21:30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. నేడు నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు.. కాజీపేట రూరల్ : కాజీపేట–విజయవాడ మార్గంలో నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ మ ధ్య చేపడుతున్న థర్డ్ లైన్ కమిషనింగ్ ఎన్ఐ వర్క్స్ కారణంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. నేడు రద్దయ్యే రైళ్ల వివరాలు.. కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాక్షికంగా రద్దు.. భద్రాచలం రోడ్–బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్ను భద్రాచలంరోడ్–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. పండుగల రద్దీ దృష్ట్యా 10 రోజులపాటు అమలు.. -
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
తొర్రూరు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో బుధవారం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణతో కలిసి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. రాష్ట్రపతి భవన్, రాజ్భవన్ను కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ బిల్లు వరకు బీజేపీ బీసీలను మోసగిస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని, కేంద్రం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తుందా లేదా చెప్పడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై త్వరలో సింహగర్జన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్ మల్లేశ్వర్, నాయకులు గుండగాని వేణు, గట్టు ప్రభాకర్, పెదగాని సోమయ్య, మురళి యాదవ్, భిక్షంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి
హన్మకొండ కల్చరల్ : గ్రామాల్లోని ధూపదీపనైవేద్య అర్చకులకు సక్రమంగా ప్రతీనెలా వేతనాలు అందేలా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగజాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర చేనేత భవన్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ను గంగు ఉపేంద్రశర్మ, పరాశరం రవీంద్రాచారి, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, ఇతర అర్చకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనేక దేవాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రమోషన్ల విషయంలో సంబంధిత అధికారులతో జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటానని కమిషనర్ పేర్కొన్నారు. 11,12 తేదీల్లో ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్ తెలిపారు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్, సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు సెలక్షన్స్ కూడా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేయూ పరిధి లోని డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి కబడ్డీ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కేయూ రిజి స్ట్రార్ వి రామచంద్రం, స్పౌర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య పాల్గొంటారని చెప్పారు. ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలి హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ గెస్ట్హౌస్లో జేఏసీ ఎన్పీడీసీఎల్ శాఖ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు అందకపోవడంపై చర్చించారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సీఎండీ పేషీలో అధికారికి వినతి పత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీతాలు ఆలస్యమైతే వైద్య ఖర్చులు, అప్పుల వాయిదాలు, కుటుంబ అవసరాలకు అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎ.విజేందర్ రెడ్డి, కేవీ.జాన్సన్, ఎస్.మల్లికార్జున్, బండారి ప్రభాకర్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
డే కేర్ సెంటర్లో ఉచిత న్యాయ సలహాలు
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయ సలహాదారుగా పారాలీగల్ వలంటీర్ ఎం. ఉపేందర్ను నియమించింది. ప్రతీ బుధ, శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యాయ సలహాలు అందిస్తారని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగేంధర్ తెలిపారు. వివరాలకు 8074979359 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, సుమతి, డాక్టర్ ఉష, తదితరులు పాల్గొన్నారు. -
నిషేధం నిర్వీర్యం
వరంగల్ అర్బన్: మహా నగరంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల నిషేధం వ్యాపారులకు మాత్రమే కాదు.. బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. నిషేధిత ప్లాస్టిక్ను ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు ఎక్కడికక్కడ మామూళ్ల ఒప్పందంతో కాలం వెళ్లదీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగించిన ప్రజలు అనారోగ్యం పాలవుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు.కాసుల పంట..ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దశాబ్ద కాలంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి విపత్తుగా మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగం తగ్గి పేపర్, నార సంచుల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, ఇది క్షేత్రస్థాయిలో అమలుకు సాధ్యం కాకపోవడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.రూ.50 వేల వరకు జరిమానా..చిరువ్యాపారుల నుంచి హోల్సేల్ ప్లాస్టిక్ అమ్మకందారుల వరకు బల్దియా అధికారులు తనిఖీ చేసి రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే స్థాయి ఉంది. అధికారుల తనిఖీల్లేవు, సిబ్బంది పర్యవేక్షణ లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లను హోల్సేల్ వ్యాపారులు బహిరంగంగా అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చిన్న దుకాణం నుంచి భారీ హోల్సేల్ దుకాణం నుంచి నెలవారీ మామూళ్లు అందిస్తున్నామంటూ బహిరంగంగా వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ను నియంత్రించాల్సిన అధికారులు, సిబ్బంది కన్నెత్తి చూడకపోగా.. శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్రం గుట్టుచప్పడు కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం పేరిట స్పెషల్ డ్రైవ్ అంటూ పారిశుద్ధ్య కార్మికులతో బృందాలు ఏర్పాటు చేసి టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, కూరగాయల, మాంసం దుకాణాల్లో మొక్కుబడిగా దాడులు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్పై పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లు ఉంది బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు అమ్ముతున్న బడా వ్యాపార సంస్థలను వదిలేసి, చిరువ్యాపారులపై దాడులు చేస్తూ నానాయాగీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ అమ్మకం నిషేధమే కానీ, హోల్సేల్ దుకాణాల్లో ఎందుకు అరికట్టడం లేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.రూ.కోట్లలో దోపిడీ..ప్లాస్టిక్ నిషేధం పేరుతో కవర్లు, గ్లాసుల ధరలను వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు. గతంలో నామామాత్రపు సొమ్ముతో కవర్లు లభించేవి. కానీ, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి కవర్, గ్లాసుకు రూ.2 నుంచి రూ.5వరకు వసూలు చేస్తుండడాన్ని బట్టి చూస్తే గ్రేటర్ వరంగల్లో దోపిడీ రూ.కోట్లల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రోజుకు స్థానికంగా 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా నిషేధం పేరిట వ్యాపారులు ధరలు పెంచి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్ పిన్నావారి వీధి, బీట్బజార్, హనుమకొండ కుమార్పల్లిలోని హోల్సేల్ వ్యాపారులు రోజుకు భారీగా ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.హోల్సేల్ షాపులపై దాడులు చేస్తాంనిషేధిత ప్లాస్టిక్ను విక్రయిస్తున్న హోల్సేల్ షాపుల్లో తనిఖీలు చేస్తాం. చిరువ్యాపారుల కంటే ముందుగా హోల్సేల్ వ్యాపారులను కట్టడి చేస్తే అమ్మకం, వాడకం తగ్గుముఖం పడుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ -
ఆర్మీ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి. గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాల్ సింగ్, సుభాష్, వి.వి.నాయుడు, వినోద్కుమార్ శర్మ, మనీశ్కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీపీఓలకు కౌన్సెలింగ్ జిల్లాలోని 123 క్లస్టర్లకు 125 మంది జీపీఓల కేటాయింపు ప్రక్రియ బుధవారం కలెక్టరేట్లో పారదర్శకంగా జరిగినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ వీడియోగ్రఫీతో డీఆర్ఓ వైవీ గణేశ్ ఆధ్వర్యంలో సాగినట్లు పేర్కొన్నారు. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జీపీఓలు కౌన్సెలింగ్కు హాజరైనట్లు వివరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఈసారి వేదికవ్వనున్న జేఎన్ఎస్ నవంబర్ 10 నుంచి నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం -
కొలిక్కిరాని టెండర్లు
హన్మకొండ చౌరస్తా: ఉచిత చేప పిల్లల పంపిణీపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల్లో జూన్, జూలై నెలల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంతవరకూ అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి చేప పిల్లలను అందిస్తే ఇప్పటి వరకు చేప ఎదిగి కనీసం పావుకిలో ఉండేదని, ఇప్పుడు చెరువుల్లో వదిలితే అవి ఎప్పుడు ఎదగుతాయని మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నాయి. గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేసినట్లు, సుమారు రూ.3.67 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సొంతంగా కొని.. మత్స్యశాఖ అధికారులపై నమ్మకం లేని పలు మత్స్య సొసైటీలు ఇప్పటికే వారి పరిధిలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే జిల్లాలోని పలువురు సొసైటీ సభ్యులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో 200 గ్రాముల మేర చేప ఎదిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో నాణ్యతపై మత్స్యకారులు ఏటా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చేప పిల్లల కనీస సైజు 35 నుంచి 40 ఎంఎం ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ అమలులో ఎక్కడా కనిపించడం లేదని మత్స్యకారులు బహిరంగంగానే వాపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించాం.. జిల్లాలోని 813 చెరువుల్లో 220.55 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించాం. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు, హనుమకొండ జిల్లా నుంచి ఒక్కరు టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. – నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండ ఉచిత చేప పిల్లల పంపిణీలో అలసత్వం చెరువుల్లో ఇప్పుడు వదిలితే ఎదుగుదల అంతంతే.. అధికారుల తీరుపై మత్స్యకారుల అసహనం -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి వరంగల్లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలుజిల్లా పేరు వైన్స్ సంఖ్య హనుమకొండ 65 వరంగల్ 63 జనగామ 47 మహబూబాబాద్ 59 జేఎస్ భూపాలపల్లి, ములుగు 60 -
మైసూరును తలపించేలా ఉత్సవాలు నిర్వహిద్దాం
● మంత్రి కొండా సురేఖకు రంగలీల మైదానం దసరా ఉత్సవ కమిటీ వినతి ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను మైసూరు ఉత్సవాలను తలపించేలా నిర్వహించుకుందామని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి కొండా సురేఖకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రంగలీల మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంత్రికి కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. వచ్చే నెల 2న రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్రాజు, కమిటీ అధ్యక్షుడు ఎన్.సంజయ్బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గోనే రాంప్రసాద్, కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వేణు, అఖిల్గౌడ్, అజయ్, మహేశ్, శ్రీను, గోవర్ధన్, సంతోశ్, మధు, రంజిత్, వంశీ, రమేశ్, మనోహర్, కృష్ణ, చరణ్, శ్రీధర్, నరేందర్, అరుణ్, సాయి, రాజశేఖర్, క్రాంతి, అక్తర్, కిషోర్ పాల్గొన్నారు. -
‘అబాస్’ హాజరు విధానాన్ని రద్దు చేయాలి
ఎంజీఎం: క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బందికి అబాస్ (బయో మెట్రిక్ హాజరు) విధానాన్ని రద్దు చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది జిల్లా జేఏసీ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో పీహెచ్సీ పరిధిలో 4 నుంచి 13 ఉపకేంద్రాలు ఉన్నాయని, వాటిలో పీహెచ్సీకి వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని ఫీల్డ్కు వెళ్లాలంటే కనీసం 10 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. 24 గంటలు అత్యవసర సేవల్లో ఉండే క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని పీహెచ్సీ కార్యాలయంలోని సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బందితో జతకట్టి చూడొద్దని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరాయంగా సమయపాలన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి సిబ్బందికి అబాస్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నెహ్రూ చంద్నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరం మధుసూదన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తోకల మాధవరెడ్డి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నాయకులు కత్తి రవీందర్, కె.రమేష్, జ్యోతి, సులోచన, ప్రసన్నకుమారి, శ్రీకాంత్, రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
క్యూలో పాస్బుక్కులు!
మండలంలోని సిద్ధాపురం సొసైటీకి మంగళవారం రైతులు క్యూకట్టారు. రాత్రి యూరియా లారీ సొసైటీకి చేరుకోవడంతో బుధవారం ఉదయం యూరియా విక్రయిస్తారని భావించిన రైతులు అక్కడకు భారీగా చేరుకుని పట్టాదార్ పాస్పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలైన్లో పెట్టారు. ఇప్పటివరకు చెప్పులు లైన్లో పెట్టిన రైతులు ఈసారి పట్టాదార్ పాస్పుస్తకాలు పెట్టడం గమనార్హం. అయితే కొంతమంది రైతులు అర్ధరాత్రి వరకు అక్కడ నిరీక్షించి ఇంటి దారిపట్టగా, మరికొంత మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కునుకు తీసినట్లు స్థానికులు చెప్పారు. –హసన్పర్తి -
ఎక్కడి చెత్త అక్కడే..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మూడువేలకు పైగా ఔట్సోర్సింగ్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. చెత్త సేకరణకు బల్దియాకు చెందిన 250 స్వచ్ఛఆటోలు, 152 ఓనర్ కమ్ డ్రైవర్ ఆటోలు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. వాటికి రోజు డీజిల్ కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే 150 ఆటోలు కూడా తిరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకఎక్కడ చూసినా చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణలో చిత్తశుద్ధి కరువు రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం మరమ్మతు కొస్తే వారం, పది రోజుల వరకు చెత్త సేకరించే నాథుడే కనిపించరు. ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ అనారోగ్యానికి గురైతే ప్రత్యామ్నయంగా మరో ఆటో లేదా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వరుసగా పండుగలు, వర్షాలు ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అపరిశుభ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్యం అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు నామమాత్రంగా పనిచేస్తున్నారు. కమిషనర్ రోజు డివిజన్లలో పర్యవేక్షిస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అపరిశుభ్రంగా పలు కాలనీలు.. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ, ఇందిరానగర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ–1,2, నక్కలగుట్ట, కేఎల్రెడ్డి కాలనీ, హౌసింగ్బోర్డు కాలనీ, బాలసముద్రం తదితర ప్రాంతాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. వరంగల్లోని రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం, ఓఎస్ఆర్నగర్, రఘునాథ్ కాలనీ, పాత బీటుబజారు, రైల్వేగేట్, హంటర్ రోడ్డు, సంతోషిమాత కాలనీ, కొత్తవాడ, రంగంపేట, కాశీబుగ్గ, లేబర్కాలనీ, శివనగర్, విద్యానగర్, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేటలో చెత్తసేకరణ చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. విలీన గ్రామాల్లో ఇంటింటా చెత్తసేకరణ నామమాత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు స్పందించి కాలనీల్లో రోజూ చెత్త సేకరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ చెత్త సేకరించాల్సిందే.. నగరంలోని అన్ని డివిజన్లకు సరిపడా స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. రోజూ చెత్తను సేకరించాల్సిందే. ఏమైనా రిపేర్లు వస్తే అప్పుడప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించాం. కానీ, కొంత మంది డ్రైవర్లు తెలియజేయడం లేదు. ప్రత్యామ్నాయంగా కొన్ని కాలనీల్లో తోపుడు బండ్లు, ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ స్వచ్ఛ ఆటోల కోసం ప్రజల ఎదురుచూపులు మరమ్మతులు, సెలవుల పేరుతో విధులకు డ్రైవర్ల డుమ్మా కొరవడిన పర్యవేక్షణ.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు ఆదివారం, ఇతర సెలవులు, పండుగలు, స్వచ్ఛ ఆటో రిపేర్ ఉందని, చెత్త సేకరణకు కార్మికుడు తోడు లేడని డ్రైవర్ కారణాలు చెబుతున్నాడు. రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.. ఇలా ఏదో ఒకరి చెత్త బాధలు కావు ఇవి. నగర వ్యాప్తంగా 60 శాతం కాలనీల్లో ఇదే పరిస్థితి దాపురించింది. చెత్త సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు. చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో రాక పది రోజులవుతోంది. ఇళ్లల్లో చెత్త నిల్వ చేయలేకపోతున్నాం. కంపు వాసన భరించ లేకపోతున్నాం. స్వచ్ఛ ఆటో డ్రైవర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీ–1కు చెందిన రజిత ఆవేదన ఇది. -
నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తిపై పీడీ యాక్ట్
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తూ పట్టుబడిన హైదరాబాద్లోని మెహిదీపట్నానికి చెందిన ముద్దంగుల ఆదిత్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పరకాల జైలులో ఉన్న నిందితుడు ఆదిత్యకు పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురితో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేశాడు. కాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ గత జూన్ 6వ తేదీన పరకాల పోలీసులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలోనూ మట్టెవాడ, పరకాల పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు వివరించారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. -
అగ్నికణం ఐలమ్మ
పాలకుర్తి టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ పాత్ర వీరోచితమైనది. ఆమె జీవితం ఇప్పటికీ అనేక పోరాటలకు ప్రేరణగా నిలుస్తోంది. భూమి, భుక్తి, పేదల బతుకుల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ. అనేక మందికి విప్లవభావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ. విస్నూర్ దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆగడాలపై అగ్నికణంలా మారి ముందుకు దూంకిన తొలి వీరనారి చాకలి ఐలమ్మ. తన పంటపొలాల్లో పండించిన ధాన్యం విషయంలో ప్రారంభించిన ఉద్యమం యావత్ తెలంగాణ జిల్లాలకు వ్యాపించింది. రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎర్రజెండాను చేతపట్టి ప్రజలను సమీకరించి సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ తన చాకలి వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కు కోలేకపోయింది. దీంతో కుటుంబీకులు మల్లంపల్లి జమీందార్ ఉత్తంరాజు కొండల్రావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దేశ్ముఖ్ ఏజెంట్ అయిన పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ వెట్టి చేయించుకునే వాడు. ఓ రోజు పోలీస్ పటేల్ ఐలమ్మను, ఆమె భర్త నర్సయ్యను పశువులతో సహా వచ్చి తన వ్యవసాయ పొలంలో పనిచేయాలని ఆదేశించారు. అప్పటికే ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ కుటుంబంపై కక్షగట్టి ఆంధ్ర మహాసభల్లో చేరిందని, నాయకులకు ఆశ్రయం కల్పించి అన్నం పెడుతోందని ఆరోపిస్తూ దాడులు చేయించారు. ఐలమ్మ భర్త నర్సయ్య, సంఘం నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, నల్లా నర్సింహులు, నల్లు ప్రతాప్రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్రావును తీసుకు వచ్చారు. పాలకుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, కుమారుడు సోమయ్య, లచ్చయ్యపై రాంచంద్రారెడ్డి కుట్ర కేసు పెట్టి జైలుకు పంపాడు. మల్లంపల్లి జమీందార్ కొండల్రావును దేశ్ముఖ్ పిలిపించి ఐలమ్మకు కౌలుకు ఇచ్చిన భూమిని తనకు కౌలుకు ఇచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ రాయించుకుని దానిని ఆధారంగా చేసుకుని ఐలమ్మ పంటను ధ్వంసం చేసేందుకు గుండాలను పంపించాడు. ఐలమ్మ పొలంలోని పంటను కాపాడుకునేందుకు బీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, గుండాలను అడుగుపెట్టనియ్యకుండా ప్రతిఘటించారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచింది. ఐలమ్మ పోరాటం గురించి తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య ఆమె ఇంటికివచ్చి ఇల్లునే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ఇంటి ఆవరణలో అరుణపతాకాన్ని ఎగురవేశారు. ‘ఐలమ్మ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుకు చిహ్నంగా నిలిచిందని’ పుచ్చలపల్లి సుందరయ్య కొనియాడారు. చాకలి ఐలమ్మ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సచివాలయం ఎదుట, ఢిల్లీ పార్లమెంట్లో ఐలమ్మ విగ్రహం పెట్టాలని, ఏదైనా జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐదెకరాల్లో ఐలమ్మ పేరుతో పార్కు, స్కృతివనం ఏర్పాటు చేయాలని ఐలమ్మ అభిమానులు కోరుతున్నారు. భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టిన వీరనారి దేశ్ముఖ్లకు ముచ్చెమటలు పట్టించిన ధీశాలి నేడు చాకలి ఐలమ్మ వర్ధంతిఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో 1908లో తన 13వ యేటా వివాహం జరిగింది. వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయస్సులో 1985, సెప్టెంబర్ 10న ఐలమ్మ కన్నుమూసింది. ఆమె పోరాటానికి చిహ్నంగా మండల కేంద్రంలో ఐలమ్మ స్మారక స్థూపం, భవనం, కాంస్య విగ్రహం నిర్మించారు. -
‘ఉద్యాన’ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్హన్మకొండ అర్బన్: జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పండ్లు, కూరగాయల సాగు, వాటి అమ్మకాలు, పట్టుపరిశ్రమ, తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నారన్నారు. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా జిల్లాలోనే పండ్లు, కూరగాయలు సాగయ్యే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత భూమి లీజుకు తీసుకొని పట్టు సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపైనే కాకుండా పండ్లు, కూరగాయల మార్కెటింగ్ చేయడంపై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మహిళా సమాఖ్యలు లాభాల బాటలో సాగాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి అనసూయ, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం..
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ దు కాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేద ని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపునకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి తెలి పారు.‘దొడ్డు బియ్యం ఎలుకల పాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 6 న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీ నాయకుడు, తహసీల్దార్పై కేసు● ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసుల విచారణనల్లబెల్లి : ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనలో అధికార పార్టీ నాయకుడు మాలోత్ చరణ్సింగ్, తహసీల్దార్ ముప్పు కృష్ణపై మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ శివారు బజ్జుతండాకు చెందిన వాంకుడోత్ కల్పన తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. అధికారి అండదండలతో బిల్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్ చరణ్సింగ్ లైంగికంగా వేధిస్తూ, కార్యాలయానికి వస్తూ చంపుతానని ఆమెను బెదిరించేవాడు. ఈనెల 5న పలు తప్పుడు ఆరోపణలతో కల్పనపై చరణ్సింగ్ కలెక్టర్కు ఫిర్యా దు చేసినట్లు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ ఆమెకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. చరణ్సింగ్ వేధింపులు, త ప్పుడు ఆరోపణలపై కల్పన సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం అందించింది. దీంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికై నా చరణ్సింగ్తో బయట వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని తహసీల్దార్ దురుసుగా సమాధానం చెప్పి బయటకు వెళ్లగొట్టా డని ఎస్సై తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త ధూప్సింగ్ ఫిరా ్యదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
ఆలస్యం.. ఆందోళన!
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎంపికై న గ్రామ పాలనాధికారుల (జీపీఓలు)కు కలెక్టర్ స్నేహ శబరీశ్ బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఒక్క హనుమకొండ జిల్లాలోని అధికారులు నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు ఆప్షన్లు తీసుకున్న అధికారులు అసలు జాబితా, అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సీనియారిటీ జాబితాలో నాన్ లోకల్ లోకల్ క్యాడర్లో వేరే విధంగా చూపెట్టినప్పటికీ.. లోకల్ క్యాడర్లో చూపెట్టిన కొందరు అభ్యర్థుల్లో నాన్లోకల్ వారు ఉన్నారని, వేరే జిల్లాల్లో పరీక్షలు రాసిన వారిని ఇక్కడి జిల్లా అభ్యర్థుల జాబితాలో చూపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ, హనుమకొండ జిల్లాలో మాత్రం అధికారులు ఈ ప్రక్రియ సాగదీయడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో 128 మంది.. హనుమకొండ జిల్లాకు మొత్తం 128 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, వీరిని జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాలకు కేటాయించాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా కాకుండా జిల్లాలో 123 రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్కు ఒకరు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన 128 మందిలో ఒకరు మెడికల్ గ్రౌండ్లో తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన వారిలో 121 మంది లోకల్ కేటగిరీలో చూపారు. ఆరుగురిని నాన్ లోకల్ కేటగిరీలో అంటే కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చినట్లు చూపెట్టారు. పోస్టులు మొదట లోకల్ వారికి తర్వాత నాన్ లోకల్ వారికి ఇవ్వనున్నారు. అదేవిధంగా రెండోసారి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో మొదట లోకల్ వారికి తర్వాత నాన్లోకల్ వారికి పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసే పరిస్థితి లేనందున కేవలం వారి వివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. స్థానిక నియోజకవర్గం కాకుండా.. ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన 128 మందిని మొదట వారి నుంచి ఆప్షన్స్ స్వీకరించారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో 14 మండలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న మండలాల్లో ఏ గ్రామానికి కేటాయించాలన్నది మాత్రం అధికారుల ఇష్టంగా చూపెట్టారు. మండలం మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో మండలంలో ఉన్న ఖాళీల ఆధారంగా వారికి ఇష్టం ఉన్న గ్రామాలు అధికారులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గం కాకుండా ఇతను నియోజకవర్గానికి కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వారి సొంత నియోజకవర్గానికి కేటాయించాల్సి వస్తే.. ఆ నియోజకవర్గంలో వారి సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అర్బన్ మండలాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతోపాటు ఒక మండలంలో నాలుగు గ్రామాలు ఉంటే.. వాటిలో రెండు గ్రామాలు హెచ్ఆర్ఏ కింద ఉన్నాయి ఇలాంటి మండలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు సైతం ఈ విషయంలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 128 మందిలో కొందరు స్థానికులు కారని, వేరే మండలాల్లో పరీక్షలు రాసి అక్కడ స్థానికత చూపెట్టుకున్నారని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే పూర్తయిందని, జాబితాలో మాత్రం ఇక్కడి వారీగా చూపెడుతుండడంతో తాము సీనియార్టీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు సీనియారిటీ జాబితాలో కూడా పేర్లు, నంబర్లు మూడు రోజుల్లో మూడుసార్లు మారినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్లో అధికారుల జాప్యం హనుమకొండ జిల్లాలో ప్రహసనంగా నియామక ప్రక్రియ సీనియారిటీ జాబితాలో పేర్లు, నంబర్లు మారాయని అభ్యర్థుల ఆరోపణ నేడు కలెక్టరేట్లో జీపీఓలకు కౌన్సెలింగ్ -
కుటీర పరిశ్రమలకు తగ్గిన విద్యుత్ బిల్లులు
హన్మకొండ: కుటీర పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్టీ కేటగిరీ–3 నుంచి ఎల్టీ కేటగిరీ–4కు కుటీర పరిశ్రమలను తీసుకొచ్చారు. దీంతో కుటీర పరిశ్రమ వినియోగదారులపై భారం తగ్గింది. 25 హెచ్పీ లోపు లోడ్ కలిగిన కుటీర పరిశ్రమలు ఈ కేటగిరీ–4లోకి వస్తాయి. 25 హెచ్పీ లోడ్కు పైన ఉన్న పరిశ్రమలు కేటగిరీ–3 కిందికి వస్తాయి. కేటగిరీ మారడంతో యూనిట్ చార్జీలు మారాయి. కేటగిరీ–3లో యూనిట్ చార్జీ రూ.7.70 ఉండగా కేటగిరీ–4లో యూనిట్ చార్జీ రూ.4గా ఉంది. అదే విధంగా ఫిక్స్డ్ చార్జీలు కిలో వాట్కు రూ.100 ఉండగా కేటగిరీ మార్పుతో రూ.20 తగ్గింది. యూనిట్ పరంగా చూస్తే రూ.3.70, కిలోవాట్ పరంగా రూ.80 భారం వినియోగదారులపై తగ్గింది. పవర్లూమ్స్, వడ్రంగి, కమ్మరి, కంచరి, గోల్డ్స్మిత్, శిల్పి, కొవ్వొత్తుల తయారీ, పాపడ్ లెదర్ వస్తువులు, చెప్పుల తయారీ, లాక్ టాయ్ మేకింగ్, పాప్ టాయ్స్, ప్లాస్టర్ ఆప్ పారిస్ ఉత్పత్తులు, బొమ్మల తయారీ పరిశ్రమలు, ఊరగాయల తయారీ, మామిడి జెల్లి యూనిట్లకు 25 కిలోవాట్లకు మించకుండా లోడ్ ఉన్న కుటీర పరిశ్రమలు మాత్రమే ఎల్టీ కేటగిరీ–3లోకి వస్తాయి. కేటగిరీ మార్పు చేయించామని దళారుల వసూళ్లు.. ఇదిలా ఉండగా తామే కేటగిరీ మార్పు చేయించి బిల్లులు తగ్గించామని చెబుతూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రధానంగా మడికొండ టెక్స్టైల్స్ పార్కు కేంద్రంగా కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కుటీర పరిశ్రమలపై భారం పడుకుండా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేటగిరీ మార్పు ద్వారా భారం తగ్గిస్తే కొందరు ఇదే అదనుగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, విద్యుత్ అధికారులు, సిబ్బంది పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సూచించారు. విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతరులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటగిరీ మార్పు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. హనుమకొండ టౌన్ డివిజన్లోని 25 హెచ్పీకి తక్కువ లోడ్ ఉన్న కుటీర పరిశ్రమల వినియోగదారులు కేటగిరీ మార్పు, వివరాల కోసం డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎల్టీ కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4కు మార్పు యూనిట్ ధర రూ.7.70 నుంచి రూ.4కు తగ్గింపు -
కదంతొక్కిన లంబాడీలు
హన్మకొండ : లంబాడీలు ఆత్మగౌరవ శాంతి ర్యాలీతో కదం తొక్కారు. ఎస్టీ హోదా పరిరక్షణకు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో మంగళవారం హనుమకొండ బాలసముద్రం ఏకశిలా పార్కు ఠాణూ నాయక్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. ర్యాలీ ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. బారికేడ్లు అడ్డుపెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, మహిళలతో పాటు లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఠాణూనాయక్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే పోలీసులు వారిని వారించారు. అనుమతి లేదని ఇక్కడి నుంచి కదలవద్దని సూచించారు. అయినా ఆందోళనకారులు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు పరిస్థితులు వివరించి సర్దిచెప్పడంతో శాంతించారు. ఠాణూనాయక్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కోయ, గోండులకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి.. ఈ ర్యాలీ సందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..లంబాడీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కోయ, గోండు వర్గాలకు చెందిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని లంబాడీలను రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉందని, లంబాడీల ఎస్టీ రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేని వారు పేర్కొన్నారు. లంబాడీలను నిర్లక్ష్యం చేసిన, సుప్రీంకోర్టులో లంబాడీల పక్షాన కేంద్ర.,రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీల వ్యతిరేకమైన పార్టీలను బొందపెడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీల శాంతి ర్యాలీకి జిల్లా యంత్రాంగం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎల్–జేఏసీ) కన్వీనర్లు జాటోత్ కిషన్నాయక్, జైసింగ్ రాథోడ్, సమన్వయకర్త వి.ఎన్.నాయక్, నాయకులు రాజు నాయక్, అంగోత్ వినోద్, వాంకుడోత్ వీరన్న, పోరిక గోవింద నాయక్, వీరమ్మ, గోపిసింగ్, బానోత్ వసంత్ నాయక్, బానోత్ వెంకన్న నాయక్, డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్, నునావత్ జవహర్, బానోత్ మంగీలాల్, సమ్మయ్య రాథోడ్, లకావత్ కరుణాకర్, పాడియా గాంగు నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలో లంబాడీల ఆత్మగౌరవ శాంతిర్యాలీ అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఇరువర్గాల తోపులాట, స్పల్ప ఉద్రిక్తత ఠాణూ నాయక్ విగ్రహం వద్ద ధర్నా తమ ఎస్టీ హోదాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: లంబాడీ జేఏసీ -
క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం
ఎంజీఎం : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రజల కోసం పది పడకల సామర్థ్యంతో క్యాన్సర్ కేర్ సెంటర్ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీ ణ, పట్టణవాసులకు క్యాన్సర్ చికిత్సను సమీప ప్రాంతంలో అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. వివిధ జిల్లాలకు చెందిన రోగులు ప్రాథమిక క్యాన్సర్ నిర్ధారణ అనంతరం కిమోథెరఫి సేవలను హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగా పొందుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీకి పార్థివదేహం అప్పగింత
ఎంజీఎం: నగరంలోని అడ్వకేట్స్ కాలనీ సంతోష్నగర్కు చెందిన సముద్రాల ప్రమీల (84) మంగళవారం మృతి చెందింది. ప్రమీల పార్థివదేహాన్ని ఆమె కుమార్తెలు అనిత, కవిత, కుమారుడు విజయగోపాల్ కాకతీయ వైద్య కళాశాల సిబ్బందికి అప్పగించారు. అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత, అనాటమీ విద్యార్థులు, సిబ్బంది ప్రేమ్కుమార్, యాదగిరి, ప్రణయ్ తదితరులు పార్థివ దేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు. ఈ సందర్భంగా అనాటమీ విభాగం డాక్టర్ శశికాంత మాట్లాడుతూ శరీర దానం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శరీరదానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లి ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ మరణానంతరం నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87905 48706, 94901 33650 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. అడ్వకేట్ తిరుమల, సునీత, రమాదేవి, లింగారెడ్డి, సుదర్శన్రెడ్డి, అ సోసియేషన్ ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, కా ర్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు మొహీనుద్దీన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కవులు, కళాకారులు, పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీశ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పొట్లపల్లి శ్రీనివాస్రావు, నాగిళ్ల రామశాస్త్రి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్కుమార్, బన్న అయిలయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధి లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు. రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష రాసిన మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లను భర్తీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి పి.అపర్ణ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12న వరంగల్ జిల్లా పరిధి రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హాజరు కావాలన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎస్సీ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
నల్లా పన్ను బకాయిలు వసూలు చేయాలి
బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వరంగల్ అర్బన్: నల్లా పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలతో నల్లా పన్ను బకాయిల వసూళ్లపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్లా బకాయిల వసూళ్ల లక్ష్యం రూ.45 కోట్లు ఉందని తెలిపారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి వసూలు చేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సుమారు 12 శాతం అధిక లక్ష్యాన్ని సాధించాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 150 మంది జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓ లు షెహజాది బేగం, శ్రీనివాస్, ఆర్ఐలు పాల్గొన్నారు. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధం.. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధమని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున బల్దియా పరిధిలో రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాలు అమ్మడం నిషేధమని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి ఉర్సు రంగలీల మైదానం, హనుమకొండ పరిధిలో హయగ్రీవాచారి గ్రౌండ్ (కాళోజీ కళాక్షేత్రం పక్క మైదానం) ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పక్కన విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని అదనపు కమిషనర్ హెచ్చరించారు. అధికారుల సమీక్షలో నగర మేయర్ గుండు సుధారాణి