సీమాంధ్రలో 3.67 కోట్ల ఓటర్లు | Over 3.67 crore voters set to vote in Seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో 3.67 కోట్ల ఓటర్లు

May 5 2014 8:42 PM | Updated on Sep 2 2017 6:58 AM

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం బంద్ చేశారు.

హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం బంద్ చేశారు. బుధవారం 11 జిల్లాల్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3.67 కోట్ల మందికిపైగా ఓటర్లున్నారు.

సీమాంధ్రలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు బరిలో ఉన్నా నామమాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల విస్తృతంగా పర్యటించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గతంలో పలు సర్వేలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement