Non-gazetted Officers' Association
-
అక్కడికెళితే అవమానాలే : ట్రాన్స్జెండర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ట్రాన్స్జెండర్లు అడుగులేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకుని సెలూన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు అవసరమైన సేవలు ‘మామూలు’ బ్యూటీపార్లర్లు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా స్పా, బ్యూటీ సెంటర్లు ఏర్పాటుచేసుకుని దూసుకుపోతున్నారు. సగం ధరలకే సేవలు.. ‘నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్కు వెళ్లిన ప్రతీసారి అవమానాలు ఎదురయ్యేవి. అందుకే స్వయంగా నొయిడాలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నాన’ని కాజల్ అనే ట్రాన్స్జెండర్, సెక్స్వర్కర్ తెలిపారు. తనలాగే ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్జెండర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతోందనీ, బయటితో పోల్చుకుంటే సగం ధరలకే ఇక్కడ సేవలందిస్తామమని ఆమె వెల్లడించారు. ఇక్కడే బ్యూటీకేర్ చేయించుకుంటున్న ఓ ట్రాన్స్జెండర్ మాట్లాడుతూ.. పొద్దంతా కష్టపడినా పూట గడవదు. అందుకే ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్నా. తలెత్తుకుని జీవించేందుకు బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నానని కనికా తెలిపారు. కాజల్ బ్యూటీపార్లర్ మా అందరికీ రిక్రియేషన్ సెంటర్గా కూడా ఉపయోగపడుతోందని తెలిపారు. రోజూ సాయంత్రం ఎంతో మంది ట్రాన్స్జెండర్లం ఇక్కడ కలులుసుకొని కష్టసుఖాలను పంచుకుంటామనీ, త్వరలోనే జీనత్ ప్రాతంలో బ్యూటీకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆ పని చేయలేం.. బ్యూటీకేర్ అయితే ఓకే.. ట్రాన్స్జెండర్లకు ఒక ఎన్జీవో చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. నొయిడాలోని ‘బసీరా సామాజిక్ సంస్థాన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ రాంకాళీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటే.. వారు వెనకడుగేశారు. కానీ, బ్యూటీ సెలూన్ల ఏర్పాటుచేసుకోవడానికి మొగ్గు చూపారని ఆయన తెలిపారు. బ్యూటీకేర్ సెంటర్ల నిర్వహణలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తున్న ట్రాన్స్జెండర్లు.. వారి అలంకరణ అవసరాలను తీర్చుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో మహిళలకు కూడా తమ సేవల్ని అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వీధి కుక్కలు విదేశాలకు చెక్కేస్తున్నాయి..
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ కుక్కలు ఇప్పుడు ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే స్వచ్ఛంద సంస్థ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీధి కుక్కలను చేరదీస్తోంది. వాటి ఆరోగ్యం మెరుగు పరిచి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపే విదేశీయులకు వాటిని దత్తత ఇస్తున్నారు. వీరు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 90కుక్కలను విదేశాలకు పంపారు. వీధి కుక్కలను పెంచుకుంటున్న విదేశీయులు సైతం వాటి ప్రవర్తన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్డీఓ కోసం ఆరు గంటలు పడిగాపులు
శ్రీకాళహస్తి : పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్డీఓ నరసింహులు కోసం అన్నదాతలు గురువారం ఆరు గంటల పాటు పడిగాపులు కాశారు. చివరకు ఆయన రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోయారు. పూతలపట్టు–నాయుడుపేట ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వారానికి ఓ సారి రెండు, మూడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించి..వారి భూములకు «ఎంత మేరకు ధర చెల్లిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లె, కాపుగున్నేరి, ఇసుకగుంట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్జీఓ కార్యాలయంలో ఆర్డీఓ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తహసీల్దార్ సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. రైతులు టెన్షన్తో గురువారం ఉదయం 9 గంటలకే ఎన్జీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అయినా ఆయన రాలేదు. అప్పుడు ‘భోజనం చేసి రండి..ఆర్డీఓ మూడు గంటలకు వస్తారు...’ అంటూ తహసీల్దార్ సుబ్రమణ్యం అదేశాలు జారీచేశారు. అయినా రైతులు అక్కడే వేచి ఉన్నారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ‘ఆర్డీఓ రావడం లేదు...మరోసారి సమావేశం నిర్వహిస్తాం....సమావేశం ఎప్పుడు నిర్వహించే విషయం వీఆర్ఏలతో చెప్పి పంపుతాం’ అంటూ తహసీల్దార్ చల్లగా కబురు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలసేపు వేచివున్న రైతులకు కోపమొచ్చింది. తహసీల్దార్ అలా చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు. అడ్డదిడ్డంగా రోడ్డు అలైన్మెంట్ అధికార పక్షానికి చెందిన నేతల భూములు ఉంటే వాటిని తప్పించి పేదోడి భూములపైకి రోడ్డును తిప్పడం దారుణమంటూ రైతులు తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాలను వదిలిపెట్టి.. ఒక్క ఇల్లు పోకుండా పొలాల్లో అలైన్మెంట్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకగుంటలో మాత్రం ఇళ్లపై, గిడ్డంగులపై రోడ్డు అలైన్మెంట్ ఇవ్వడం దారుణమంటూ రైతు సిద్దాగుంట శంకర్రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును తిప్పుకోవడం న్యాయమేనా ?’ అంటూ నిలదీశారు. రోడ్డులో మలుపులు ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు తప్పించడానికి కొన్ని చోట్ల అలైన్మెంట్ మార్పు చేశారని...అంతేతప్ప నేతల ఒత్తిళ్లతో పక్కకు తిప్పాపని చెప్పడం సరికాదంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు. జీవితమంతా ఈ ప్రభుత్వానికి భూములను నామమాత్రపు «ధరలకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోయారు. తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని...ఒకవేళ బలవంతంగా లాక్కుంటే గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. -
దారుణాతి దారుణం.. గ్యాంగ్ రేప్
రాంచీ : జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. -
ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న అశోక్ బాబు
సాక్షి, అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్ నాయకులే పదవీకాంక్షతో వందలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అదే జరుగుతోంది. ఉద్యోగులకు గెజిటెడ్ హోదా వస్తే ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష పదవి పోతుందన్న భయంతో పి.అశోక్బాబు దానికి అడ్డుపడుతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిళ్లు జీఎస్టీ అమల్లోకి వచ్చాక కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలోని ఉద్యోగులతో సమానంగా వాణిజ్య శాఖ ఉద్యోగుల హోదాలను మార్చాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గ్రేడ్ టు నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పదవిని గెజిటెడ్ హోదాతో కూడిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (జీఎస్టీవో)గా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీస్ నిబంధనలు జారీ అయ్యాయి. అయితే తమకు గెజిట్డ్ హోదా రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని ఏసీటీవోలు వాపోతున్నారు. కారుణ్య నియామకం కింద వాణిజ్య శాఖలో ఏసీటీవోగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్బాబు గెజిటెడ్ హోదాతో కూడిన జీఎస్టీవోగా మారితే.. తక్షణం నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నేత పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి జీవో రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన పదవి కోసం మిగిలిన 768 ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గెజిటెడ్ హోదాకు సంబంధించిన ఫైలు కదలకుండా పైనుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్యామలరావుతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు కూడా ఆమోదం తెలిపినా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అశోక్బాబు అడ్డుకుంటున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం అమలు చేయాలి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వంటి వారికి ఇప్పటికే గెజిటెడ్ హోదా కల్పించారు. అదే గ్రేడు పరిధిలోకి వచ్చే జీఎస్టీవోలకూ గెజిటెడ్ హోదా కల్పించాలి. ఇప్పటికే ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీసు నిబంధనల్లో సవరణ చేశారు. వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న గెజిటెడ్ హోదాను తక్షణం నోటిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – కె.ఆర్.సూర్యనారాయణ, వాణిజ్య శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు -
మహేష్ సాయం.. ఆలస్యంగా...
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ఓ మంచి పని ఆలస్యంగా బయటకు వచ్చింది. పేద క్రీడాకారుల కోసం మహేష్ గత కొద్ది నెలలుగా సాయం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ అనే ఎన్జీవో మురికివాడల్లో ఉచిత వైద్య సేవలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులను ప్రొత్సహించేందుకు ఉచిత క్రీడా కేంద్రాన్ని నెలకొల్పింది. దీనికి మహేష్ బాబు-నమ్రతలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఆ కేంద్రానికి వాళ్లిద్దరూ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. భరత్ అనే నేను చిత్ర విడుదలకు ముందే ఇది జరిగింది. అయితే ఆ సమయంలో ప్రకటన చేస్తే చిత్ర ప్రమోషన్లా ఉంటుందన్న ఆలోచనతో ఫౌండేషన్ నిర్వాహకులు ఆగిపోయారు. కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గత కొద్ది నెలలుగా మహేష్ నమ్రతలు మా ఫౌండేషన్కు సాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న ఆ దంపతుల ఆలోచనకు హ్యాట్సాఫ్. వారి ప్రొత్సహం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హరీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘ఏపీ ఎన్జీవో భవన్’ వివాదం పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీ హాల్ను వాటి లభ్యతను బట్టి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సభ్యులు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎన్జీవో భవన్లో గదులను, సమావేశ మందిరాన్ని ఉపయోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్జీవో సంఘం ఉల్లంఘించిందని, అందుకుగాను సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ ఎం.సత్యనారాయణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీహాల్ను ఉపయోగించుకునేందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘ సభ్యులకు అవకాశం ఇస్తామన్నారు. గదులను, మినీ హాల్ను వాటి లభ్యతను వాడుకోవచ్చునని చెప్పారు. ఇందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం తరఫు న్యాయవాది జెల్లి కనకయ్య అంగీకరించారు. -
యాసిడ్ దాడి బాధితురాలి పోరాటం
కోల్కతా: ఆమె నాలుగేళ్ల పోరాటం ఫలించింది. తనపై యాసిడ్తో దాడిని దుర్మార్గుడిని కటకటాల వెనక్కునెట్టింది. పశ్చిమ బెంగాల్లో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న యాసిడ్ దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సంచయిత యాదవ్(25) బెంగాల్లోని డుండుంలోని సెత్బగాన్ ప్రాంతంలో 2014లో సోమెన్ సాహా అనే యువకుడి చేతిలో యాసిడ్ దాడికి గురైంది. తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెపై యాసిడ్ పోశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో తన తల్లిముందే సంచయితపై సాహా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పోరాటం తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయించగలిగింది. పూర్తిగా కాలిపోయిన ముఖంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, తన తల్లి సహాయంతో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేశానని సంచయిత తెలిపింది. నాలుగేళ్లనుంచి పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరు తమను పట్టించుకోలేదని, తనకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదన్న ఉద్దేశంతో పోరాటం చేశానన్నారు. యాసిడ్ దాడి బాధితుల తరుఫున పోరాడే ఎన్జీవోల సహాయంతో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను కలిసి 2017లో బెంగాల్ హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు డండం పోలీసులు ఆదివారం సోనార్పూర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లో నిందితుడిని చూసిన సంచయిత పట్టరాని కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించింది. నాలుగేళ్లుగా ఎంతో క్షోభ అనుభవించానని, తన జీవితాన్ని నాశనం చేసిన సాహా మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కోపాన్ని ఆపులేకపోయినట్టు ఆమె వివరించింది. తన పోరాటం ఆగిపోలేదని, నిందితుడికి శిక్ష పడేవరకు తన పోరాటం ఆపనని స్పష్టం చేసింది. -
పొగాకు పెట్టుబడులు పెరిగాయి
పర్చూరు : గతంలో ఎకరం పొగాకుకు రూ. 30 నుంచి రూ. 35 వేల వరకు పెట్టుబడి అయ్యేదని ప్రస్తుతం లక్ష వరకు పెరిగిందని దీంతో రైతులు నష్టపోతున్నారని వెంకటాపురం గ్రామానికి చెందిన కె.బ్రహ్మారెడ్డి, ఎ.వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ఒక తడికి రూ. 10 వేలు ఖర్చవుతుందని.. ప్రస్తుతం క్వింటా రూ. 20 వేలు అమ్మితే నష్టాల్లేకుండా పెట్టుబడులు మాత్రమే వస్తాయని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలకు సాయం అందడంలేదు పర్చూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్వచ్ఛంద సేవా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విరివిగా తగినన్నీ నిధులు కేటాయించి నిరుపేద హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఐఈఈఆర్డీ ప్రెసిడెంట్ బి.కిరణ్చంద్ తెలిపారు. అయితే ప్రస్తుతం తాగునీటి సమస్య, నిరుపేద మహిళలకు జీవన భృతి కోసం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించకలేక పోతున్నామన్నారు. వృద్ధులకు పింఛన్లు అందకపోవడం, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, జీవనాధారం కల్పించటం లేదని జగన్కు తెలిపారు. -
ఎన్జీఓ ఎన్నికల జాబితాలో.. బోగస్ ఓటర్లు..!
కడప రూరల్: పులివెందుల తాలూకా యూనిట్ ఎన్జీఓ అసోషియేషన్కు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం సిద్ధం చేసిన ఓటర్ల జాబితా సమస్తం తప్పుల తడకగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బోగస్ వ్యవహారం బయటికి రావడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరించారన్నది అర్థం కావడం లేదు. ఎలాగోలా గెలుపే లక్ష్యంగా అడుగులు వేయడంలో భాగంగా బోగస్ల ద్వారా లబ్ధి పొందాలని ప్రణాళిక రచించినట్లు లిస్టు ద్వారా వెల్లడవుతోంది. ఈ ఎన్నికలు మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఆ మేరకు అర్హులైన ఉద్యోగులను(ఎన్జీఓ)లను మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఆ ప్రకారం గత ఎన్నికల జాబితాలో 350 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం జరిగే ఎన్నికల జాబితాలో 503 మంది నమోదై ఉండడం గమనార్హం. అందులో పులివెందులకు సంబంధంలేని ఉద్యోగులతో పాటు అటెండర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పేర్లు కూడా నమోదు కావడం విచిత్రం. జాబితాలో అర్హులైన దాదాపు 100 మంది ఎన్జీఓల పేర్లు లేకపోవడం గమనార్హం. కేవలం గెలుపే లక్ష్యంగా బోగస్ను చేర్చించారని ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోటీ లేకుండా కుట్ర..? వాస్తవానికి ఎన్నికల జాబితాను ఎన్నికల అధికారి ముందుగానే అందరికీ అందుబాటులో ఉంచాలి. అయితే నామినేషన్కు ముందు రోజు మాత్రమే జాబితాను అందుబాటులో ఉంచారు. దీనిని పరిశీలించిన ఉద్యోగ వర్గాలు నివ్వెరపోయాయి. . ఈ ఎన్నికల్లో కొంతమంది పోటీ చేయాలని సిద్ధమయ్యారు. అలాంటి వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో ఆందోళనకు లోనయ్యారు. అంటే ప్రత్యర్ధులు పోటీలో లేకుండా చేయడానికి ఒక వర్గం ఇలా కుట్ర పన్నింది అని మరొక వర్గం ఆరోపిస్తోంది, ఈ నేపథ్యంలో ఎన్నికలను రద్దు చేయడంతో పాటు ఎన్నికల జాబితాపై విచారణ చేపట్టాలని ఉద్యోగ వర్గాలు పట్టుపడుతున్నాయి. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వేలు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. సీనియర్ అధికారులు మినహా గ్యాంగ్మెన్లు, ట్రక్మెన్ సహా ఇతర ఎన్జీవో ఉద్యోగులకు విదేశాలను చుట్టివచ్చే ప్లెజర్ ట్రిప్ను ఆఫర్ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది. 100 మంది సిబ్బందితో ఈనెల28న సింగపూర్, మలేషియాలకు తొలి బ్యాచ్ విమానంలో తరలివెళ్లింది. విదేశీ పర్యటనకు ప్రయాణ ఖర్చులో 25 శాతం ఖర్చును ఉద్యోగులు భరించాల్సి ఉండగా, 75 శాతం సిబ్బంది ప్రయోజనాల నిధి (ఎస్బీఎఫ్)నుంచి వాడుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. దిగువశ్రేణి క్యాడర్లు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సిబ్బందికే విదేశీ పర్యటనల అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. సంస్థలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ ఓవర్సీస్ క్యాంప్ను నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. రైల్వే సిబ్బంది తమ విదేశీ ప్రయాణంలో భాగంగా యూనివర్సల్ స్టూడియోస్, సింగపూర్లో సెంటోస, నైట్సఫారి, కౌలాలంపూర్ నగర టూర్, మలేషియాలో పెట్రోనాస్ టవర్స్, బటూ కేవ్స్, జెంటింగ్ హైల్యాండ్స్ను సందర్శిస్తుంది. -
సమస్యల పరిష్కారంలో ఏన్జీవో నేతలు విఫలం
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన్షన్ సాధన కోసం పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
కనికరం చూపని ముఖ్యమంత్రి
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/గుంటూరు రూరల్: ‘‘ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను గతంలోలాగా కాదు. ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా పనిచేస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే 30 జీవోలు జారీ చేశాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో శనివారం సీఎం మాట్లాడారు. ఈ–ఆఫీస్ అమలులోకొచ్చాక పాలనలో జవాబుదారీతనం పెరిగిందని.. ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసే సౌలభ్యముందని చెప్పారు. అయినప్పటికీ ఉద్యోగులు కార్యాలయాలకొచ్చి పనిచేయాలని కోరారు. అప్పుడప్పుడూ ఆలస్యంగా వచ్చినా పట్టించుకోనన్నారు. ఉద్యోగులకు 10వ పీఆర్సీకి సంబంధించి రావాల్సిన అరియర్స్, 11వ పీఆర్సీ అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. వృద్దురాలు అని కూడా చూడకుండా వృద్ధురాలు అనగానే ఓపికగా కాసేపు సమయం కేటాయించి ఆమె సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వృద్ధురాలిని నిర్దయగా పక్కకు నెట్టేశారు. తిరుపతి సమీపంలోని తనపల్లె వద్ద శనివారం గృహనిర్మాణ సముదాయాలను ప్రారంభించేందుకు వచ్చిన బాబుకు తన కష్టం చెప్పుకునేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. సీఎంను చూసి నమస్కరించింది. తన సమస్య చెప్పేలోపే బాబు ఆమె వైపు కోపంగా చూస్తూ ఓ చేత్తో ఆమెను నెట్టేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు కంటతడితో వెనుదిరిగింది. -
అందరూ సెక్స్ వర్కర్ల కూతుళ్లే..
సాక్షి, లండన్: సెక్స్ వర్కర్ల పిల్లలు ఏమవుతారు?. వెకిలిగా ఆలోచిస్తే వాళ్లూ సెక్స్ వర్కర్లే అవుతారు అనే మాటలు వినిపిస్తాయి. కానీ వాళ్లకు ఆశలు, ఆశయాలు ఉంటాయనే విషయాన్ని ఎంత మంది గ్రహిస్తారు. వారికి దిశానిర్దేశం చేసి ఎవరు ప్రోత్సహిస్తారు?. అందుకు మేం ఉన్నాం అంటోంది.. లాల్ బత్తి ఎక్స్ప్రెస్(రెడ్ లైట్ ఎక్స్ప్రెస్). బ్రిటన్లోని ఎడిన్ బర్గ్ ఫ్రింజ్లో గల ఓ చర్చిలో ముంబై రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లుగా పని చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలతో ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించింది రెడ్ లైట్ ఎక్స్ప్రెస్. వారి ఆశయాలను, కోరికలను, కలలను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ఆర్ట్ ఫెస్టివల్ను వేదికగా మార్చింది. స్టేజ్ మీద కూర్చున్న 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరూ తమ ఊహలను, వాస్తవాలను కళ్లకు కట్టేలా ఇచ్చే ఈ ప్రదర్శనలకు 'రైలు ప్రయాణం' అనే పేరు కూడా పెట్టింది. రెడ్ లైట్ ఎక్స్ప్రెస్కు ఎన్జీవో క్రాంతి అండగా నిలుస్తోంది. లండన్లోని పలు ప్రాంతాల్లో పిల్లలు తాము అనుభవించిన కష్టాలను అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బీబీసీ చానెల్ పిల్లల నుంచి ప్రత్యేకంగా ఇంటర్వూ తీసుకుంది. -
హరికిరణ్కు ఘన సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్ను జిల్లా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు టిఎండీ హుసేన్, ఇతర జిల్లా నాయకులు రాజశేఖర్రెడ్డి, లక్ష్మీనారాయణ, కేసీహెచ్ కృష్ణుడు, బలరామిరెడ్డి, ప్రభాకర్రెడ్డి రఘుబాబు, అరుణమ్మ, దొరస్వామిసాయిరామ్ తదితరులు జేసీకి బొకేలు, శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలు సమర్పించి సత్కరించారు. హరికిరణ్ స్పందిస్తూ.. జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు, -
స్వచ్ఛంద సంస్థలకు గూగుల్ఆర్గ్
నుంచి 8 మిలియన్ డాలర్ల గ్రాంటు న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్లో భాగమైన గూగుల్డాట్ఆర్గ్ తాజాగా భారత్లో నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలకు (ఎన్జీవో) 8.4 మిలియన్ డాలర్ల మేర గ్రాంట్స్ ఇచ్చింది. ఇవి టెక్నాలజీ ఆధారిత బోధన సేవలు అందిస్తున్నాయి. గ్రాంట్స్ అందుకున్న వాటిలో లెర్నింగ్ ఈక్వాలిటీ (5,00,000 డాలర్లు), మిలియన్ స్పార్క్స్ ఫౌండేషన్ (1.2 మిలియన్ డాలర్లు), ప్రథమ్ బుక్స్ స్టోరీవీవర్ (3.6 మిలియన్ డాలర్లు), ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (3.1 మిలియన్ డాలర్లు) సంస్థలు ఉన్నాయి. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడేలా రెండేళ్ల పాటు ఈ గ్రాంట్ అందించనున్నట్లు గూగుల్ ఆగ్నేయాసియా విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. -
రైతు ఆత్మహత్యలకు పరిష్కారాలేవీ?
4 వారాల్లో కార్యాచరణ నివేదిక సమర్పించండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నిరోధానికి రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక అందచేయాలని స్పష్టం చేసింది. రైతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల మూలకారణాల్ని అధ్యయనం చేసి, వాటి నిరోధానికి ఒక విధానాన్ని తీసుకురావాలని కోర్టు సూచించింది. ‘ఇది చాలా తీవ్రమైన అంశం. రైతుల ఆత్మహత్యలకు సంబం ధించి రాష్ట్రాలు చేపట్టాల్సిన ప్రతిపాదిత చర్యలు వెల్లడిస్తూ కోర్టు రిజిస్ట్రీకి నివేదిక సమర్పించండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ల∙ధర్మాసనం పేర్కొంది. గుజరాత్లో రైతుల దీనస్థితిపై ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. గుజరాత్లో దాదాపు 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు గల అసలైన కారణాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన విధానాన్ని తీసుకొచ్చి అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది. నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం: కేంద్రం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ వాదనలు వినిపిస్తూ... రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని, రుణాల మంజూరు, పంట నష్ట పరిహారం, బీమా పరిధిని పెంచినట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఒక నూతన పాలసీని తీసుకొస్తోందని కోర్టుకు వెల్లడించారు. -
ఎన్జీఓ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడిపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే రామచంద్రరావు.. వెంగళరెడ్డిపై వివిధ ఆరోపణలతో గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్.. ప్రత్యేక కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా ఫిర్యాదు దారుడయిన రామచంద్రరావును సోమవారం విచారించారు. ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి సమర్పించారు. అనంతరం ఆరోపణలపై వెంగళరెడ్డిని విచారించారు. ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. -
అశోక్బాబు ప్యానల్ ఏకగ్రీవ ఎన్నిక!
గాంధీనగర్ (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో పి.అశోక్బాబు ప్యానల్ విజయం ఖాయమైంది. అధ్యక్ష స్థానానికి అశోక్బాబు ఆదివారం ఎన్నికల అధికారి డి.దాలినాయుడుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఇప్పటి వరకు అశోక్బాబు ప్యానల్ మాత్రమే నామినేషన్ వేసింది. దీంతో ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు ఎ.విద్యాసాగర్, ఇక్బాల్, కోనేరు రవి తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి రామకృష్ణారెడ్డికి ఉపాధ్యక్ష పదవి
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ అసిస్టెంట్గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డి ప్యానల్ తరుఫున విజయవాడలో ఆదివారం నామినేషన్ ధాఖలు చేశారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్లాల్ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ ధాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని అసోసియేషన్ నాయకులు అభినందించారు. -
రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డి ప్యానల్ తరఫున ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి ఆయన పేరును ప్రతిపాదించనున్నారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు ¯సంబంధించి నేడు జరిగే నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం పూర్తిగా రామకృష్ణారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. -
'అమ్మ' మరణం సుప్రీంకు
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య మరణంపై చెన్నైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఊహించనిరీతిలో అకస్మాత్తుగా ఆమె కన్నుమూయడం, ఆమెను పరామర్శించడానికి బంధువులు సహా ఎవరినీ అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ వేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంను కోరింది. అలాగే ఆమె చికిత్సకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులను (మెడికల్ డాక్యుమెంట్స్) స్వాధీనం చేసుకోవాలని కోరింది. కాగా తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ కోలుకుంటున్నారన్న ఆనందం ఎంతో సేపు నిలవకుండానే కార్డియాక్ అరెస్ట్ తో ఈ లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది. రేపో మాపో డిశ్చార్చ్ కానున్న అమ్మ ఆకస్మిక మృతితో అన్నాడీఎంకే కార్యకర్తలు,ఇతరులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. -
సెకనుకో చిన్నారిపై కీచకం
మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఎంపీల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు న్యూఢిల్లీ: భయంకర వాతావరణంలో బాల్యం బిక్కుబిక్కుమంటోంది. చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోంది. ప్లాన్ ఇండియా అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు’పేరిట ఎన్జీవో ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్, నికోబార్ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అదృశ్యమైన చిన్నారుల్లో 48 శాతం మంది ఆచూకీ లభించడంలేదు. రాజస్థాన్లో బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నాయి. 20–24 ఏళ్ల మహిళలను సర్వే చేయగా వారిలో 57.6 శాతం మంది వివాహాలు 18 ఏళ్ల కంటే ముందే జరిగాయి. ఉత్తరప్రదేశ్లో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 43 లక్షల మంది బాలకార్మికుల్లో 18 లక్షల మంది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. -
ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
రెండోసారి పగ్గాలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులు నెల్లూరు(పొగతోట): నాన్గజిటెడ్ ఆఫీసర్స్(ఎన్జీఓ) అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్వీర్సీ. శేఖర్రావు, వై.రమణారెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోమ్లో నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అ«ధికారి శివరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 14న ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. 15 పోస్టులకు 16 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన శ్రీకాంత్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండోసారి ఎన్నికయ్యేటట్లు చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఏసీఆర్ఎస్ఏ నాయకులు నరసింహులు, కృష్ణారావు, ఏ.పెంచలరెడ్డి, భాను, మనోహర్బాబు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అ«ధ్యక్షుడిగా సీహెచ్వీఆర్సీ. శేఖర్రావు(ఇరిగేషన్), కార్యదర్శిగా వై. రమణారెడ్డి(మెడికల్ అండ్ హెల్త్) ఎన్నిక కాగా అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్.ఆంజనేయవర్మ(మెడికల్ అండ్ హెల్త్), ఉపాధ్యక్షులుగా ఎంవీ సువర్ణకుమారి(వ్యవసాయ శాఖ), జి.రమేష్బాబు (ఇరిగేషన్), ఎన్.గిరిధర్(ఐసీడీఎస్), ఎస్కే.సిరాజ్ (రెవెన్యూ), ఎల్.పెంచలయ్య(జిల్లా పరిషత్) ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.పెంచలరావు (మెడికల్ అండ్ హెల్త్), జాయింట్ సెక్రటరీలుగా ఎన్.శ్రీనివాసులు(అకౌంట్స్ ఆఫీస్), పి.సతీష్బాబు(మెడికల్ అండ్ హెల్త్), కె.రాజేంద్రప్రసా«ద్(విద్య శాఖ), ఇ.విజయకుమార్ (సాంఘిక సంక్షేమ శాఖ), మహిళా జాయింట్ సెక్రటరీగా ఇ.కరుణమ్మ(మెడికల్ అండ్ హెల్త్), కోశాధికారిగా బి.వెంకటేశ్వర్లు(మెడికల్ అండ్ హెల్త్) ప్రమాణ స్వీకారం చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
విజయవాడ : కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలకు మద్దతు పలకాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు తెలిపారు. అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శనివారం స్థానిక ఎన్జీవో హోమ్లో సభ జరిగింది. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి జీతాలు కొంచెం పెంచామని, అయితే, పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ అసోసియేషన్లో మూడు దశాబ్దాలుగా పనిచేసే అవకాశం కల్పించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత బందరురోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్జీవో హోమ్కు వెళ్లి నామినేషన్లు వేశారు. నూతన కార్యవర్గం ఇదే.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఏ.విద్యాసాగర్, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.ఏసురత్నం, ఎన్.శివకుమార్, ఎస్.అలెగ్జాండర్, ఎం.రాజబాబు, వి.నాగార్జున, కార్యదర్శిగా ఎండీ ఇక్బాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ దిలీప్కుమార్, డి.ప్రసాదరాజు, ఎస్కే దాదాసాహెబ్, ఆర్హెచ్ ప్రకాష్, మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎం.సుజాత, కోశాధికారిగా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బి.ఆశీర్వాదం, సహాయ ఎన్నికల అధికారి బాసిత్ ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖరరెడ్డి, తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్లికృష్ణ, దారపు శ్రీనివాస్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు రవి, ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఈశ్వర్, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు దాళినాయుడు, భోగరాజు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్ ఘన విజయం
ప్రొద్దుటూరు క్రైం: ఎంతో ప్రతిష్టాత్మకంగా బుధవారం జరిగిన ప్రొద్దుటూరు తాటూకా ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో రఘురామిరెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి బరిలో దిగిన కెజె.రఘురామిరెడ్డికి 310 ఓట్లు రాగా చంద్రమౌళికి 196 ఓట్లు మాత్రమే వచ్చాయి. కార్యదర్శిగా పోటీ చేసిన అజయ్బాబు, మహిళా సహాయ కార్యదర్శిగా జయంతికుమారిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మిగిలిన 9 స్థానాలను రఘురామిరెడ్డి ప్యానెల్ అభ్యర్థులు గెల్చుకున్నారు. అధ్యక్షుడుగా కె.జె రఘురామిరెడ్డి(114), అసోసియేట్ ప్రెసిడెంట్(104), ఉపా«ధ్యక్షులు ఎల్.బాబు(117), చంద్రుడుయాదవ్(114), టి.దేవమణి(117), ఎం.రాఘవయ్య(103), జాయింట్ సెక్రటరీలుగా పిసి.బాలఆంథోని(107), బి.లక్ష్మిమునెయ్య(77), జి.లక్షుమయ్య(104), కె.రాజశేఖర్రెడ్డి(100), కోశాధికారిగా ఎన్.ఈశ్వరెడ్డి(100) ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షుడు రఘురామిరెడ్డితోపాటు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. -
ఫిదాహుసేన్ మృతికి సంతాపం
అనంతపురం న్యూటౌన్ : ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నాయకులు ఫిదా హుసేన్ మరణం ఉద్యోగ రంగానికి తీరని లోటని ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు తమ సంతాపం ప్రకటించారు. ఎన్జీవో సంఘంలో, పదవీ విరమణ అనంతరం పెన్షనర్స్ సంఘంలో వివిధ హోదాలలో పనిచేసిన ఫిదాహుస్సేన్ మంగళవారం ఆకస్మికంగా మరణించారు. ఉదయం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మైనార్టీ సంఘాల నాయకులు ఆయన ఆత్మశాంతి కోసం కాసేపు మౌనం పాటించారు. ఫిదాహుసేన్ కుటుంబానికి ఆత్మసై్థర్యం కల్గించాలని తమ సంతాపంలో తెలియజేశారు. -
సర్వీస్ రిజిస్టర్లో జబ్బుల చిట్టా
-ముందుగా ఉద్యోగులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ -ఒక్కొక్కరికి 20 టెస్టులతో కూడిన చెకప్...రూ.2200 అంచనా -అనంతరం బీపీ, షుగర్ వంటివి ఉంటే ఎస్ఆర్లో చేర్చాలని యోచన -పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు చేయద్దన్న వైద్య ఆరోగ్యశాఖ -ఫిట్నెస్ బావున్న ఉద్యోగులకు పారితోషికాలివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న జబ్బులను ఇకపై సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో చేరిస్తే బావుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. నాన్ గెజిటెడ్ అఫీసర్స్ అసోసియేషన్ (ఎన్జీవో)ల సంఘం దీనిపై విజ్ఞప్తి చేసిందని, దీనిపై ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 4.83 లక్షల మంది ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఎస్ఆర్లో జబ్బుల జాబితాను రూపొందిస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం 20 రకాల టెస్టులు (మాస్టర్ హెల్త్చెకప్) పేరుతో ఒక్కొక్కరికి రూ.2200 వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మధుమేహం, సీబీపీ, మూత్రపరీక్షలు, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలు ఉన్నాయి. ఇలా పురుష, మహిళా ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి డయాబెటిక్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులుంటే వాటిని ఎస్ఆర్లో పొందుపరిస్తే జాగ్రత్తలు తీసుకుంటారని, ఎన్జీవో సంఘం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను కోరినట్టు అధికారులు చెప్పారు. అయితే ఈ ఆలోచనకు కొంతమంది అధికారులు విభేదించారు. క్యాన్సర్, హెచ్ఐవీ వ్యాధులుంటే ఎస్ఆర్లో పొందుపరిస్తే చూడ్డానికి, చెప్పుకోవడానికి కూడా బావుండదని, ప్రతి ఉద్యోగికి కావాలంటే ప్రత్యేకంగా మెడికల్ రికార్డు నిర్వహిస్తే బావుంటుందని సూచించారు. తిరిగి దీనిపై సెప్టెంబర్లో ఒకసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులతో పాటు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయించింది. పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టు అక్కర్లేదు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు స్క్రీనింగ్ టెస్టులు అక్కర్లేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సర్వీసులో ఉన్నవారికి మాత్రమే మాస్టర్ హెల్త్ చెకప్ చేద్దామని, ఇందులో పెన్షనర్లను చేరిస్తే తమ కుటుంబ సభ్యులకు కూడా చేయాలని అడుగుతారని, అందుకే ఉద్యోగులకు మాత్రమే ఇది వరిస్తుందని ఆరోగ్యశాఖ తమ నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆరోగ్య పరీక్షలు వర్తించవని తేల్చిచెప్పింది. బాక్స్ ఫిట్గా ఉంటే పారితోషికాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.83 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసి ఫిట్నెస్ బాగా ఉన్న ఉద్యోగులకు పారితోషికం ఇద్దామన్న ప్రతిపాదన వచ్చింది. మొత్తం జరిగే 20 పరీక్షల్లోనూ సాధారణ రిపోర్టులు (నార్మల్) వస్తే అలాంటి వారికి మాత్రమే ఇన్సెంటివ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇవి క్యాష్ రూపంలోనా లేదా ఇంక్రిమెంట్ల రూపంలోనా అలాంటివేమీ తేల్చలేదు. సెప్టెంబర్ మాసంలో జరిగే సమావేశాలో ఎన్జీవోలు, సెక్రటేరియల్ ఉద్యోగుల సంఘం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ అందరితో సమావేశమై నిర్ణయిద్దామని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. -
లోక్పాల్ చట్టంలో సవరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోల నిర్వాహకులు ఆస్తులు వెల్లడించే విషయంలో కేంద్రం లోక్పాల్ చట్టాన్ని సవరించింది. ఆస్తుల వివరాల దాఖలులో ఉద్యోగి జీవిత భాగస్వామిని, ఆధారపడి ఉన్న పిల్లలను మినహాయించింది. అయితే 2013 లోక్పాల్, లోకాయుక్త చట్టాల ప్రకారం ప్రతియేటా ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆస్తులతో పాటు జీవిత భాగస్వామి, పిల్లల ఆస్తులు కూడా వెల్లడించాలి. సవరణ బిల్లు గురువారం పార్లమెంట్ ఆమోదించిందని, కొత్త చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని సిబ్బంది,శిక్షణ విభాగం తెలిపింది. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానందరాజు నగరంపాలెం: ఉద్యోగుల సమస్యలు పరిష్కారించటానికి ఆం ధ్రప్రదేశ్ నాన్గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగరశాఖ కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిఉందని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దయానంద రాజు సూచించారు. శనివారం ఎన్జీవో కల్యాణమండపంలో నగరశాఖ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గతం సంఘంపై ఉద్యోగుల స్పందించిన తీరుకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలున్నారు. ఎన్జీవో జిల్లా కార్యదర్శి నాగవర్దన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. అత్యధిక మేజారిటీతో గెలిపించినందుకు నగరశాఖ నూతన అధ్యక్షుడు సుకుమార్, కార్యదర్శి మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం .. శుక్రవారం ఉదయం జరిగిన ఏపీఎన్జీవో నగరశాఖ ఎన్నికల కౌంటింగ్ శనివారం తెల్లవారుఝామున ముగిసింది. నగరశాఖలో మొత్తం 1,536 ఓటర్లు ఉండగా 1,356 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుకుమార్ ప్యానల్కు 1,004 ఓట్లు లభించగా శివశంకర్ ప్యానెల్కు 274 ఓట్లు లభించాయి. దీనితో సుకుమార్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.భూషణం ప్రకటించారు. అధ్యక్షుడిగా సుకుమార్, కార్యదర్శిగా యం.యస్.మూర్తి, ట్రెజరర్ పి.హరికిషన్, అసోసియేట్ ప్రెసిడెంట్ యస్డి.జానీబాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైవి.సత్యనారాయణరావు, ఉపాధ్యక్షులుగా కె.సాంబయ్య, డి.శ్రీనివాసరావు, ఎల్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా బి.కొండారెడ్డి, పి.కోటేశ్వరరావు, వై.పద్మజ, పి.రవిబాబు, కె.శివజ్యోతి, డీఈసీ మెంబర్లుగా యం.కోటేశ్వరరావు, బి.సునీల్కుమార్, సిహెచ్.వీరబ్రహ్మేశ్వరరావులతో ప్రమాణం చేయించారు. -
ఎన్జీవోలపై దర్యాప్తు చేపట్టండి
ప్రధాని మోదీకి బీడీ కార్మిక సంఘం వినతి న్యూఢిల్లీ: భారత్లో పొగాకు చట్టాలను విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేలా లాబీయింగ్ చేస్తాంటూ 39 ఎన్జీవోలు కోట్ల రూపాయల నిధులు తీసుకున్నారని, దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలంటూ బీడీ కార్మిక సంఘం ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహా సంఘ్(ఏబీబీఎంఎంఎస్) అధ్యక్షుడు కలల్ శ్రీనివాస్ ప్రధానికి లేఖ రాశారు. మీడియా, ప్రజాప్రతినిధులు, చట్టాలు రూపొందించే వారిని ప్రభావితం చేసే విదేశీ మల్టీనేషనల్ సిగరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మార్పు చేసేలా ఈ ఎన్జీవోలు ఒత్తిడి తెచ్చాయన్నారు. ఇందుకుగాను విదేశాల నుంచి సుమారు రూ.173 కోట్లను ఫండ్ రూపంలో పొందాయని ఆరోపించారు. అలాగే ఆరోగ్యం కోసం స్థానిక సిగరెట్ డబ్బాపై 85 శాతం ‘హెచ్చరిక బొమ్మ’ ఏర్పాటు చేయడం కూడా అక్రమ దిగుమతికి కారణం అవుతోందని శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్జీవోలపై వెంటనే దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. కాగా ఎఫ్ఐసీసీఐ తాజా అంచనా మేరకు దేశంలోని మొత్తం సిగరెట్ వ్యాపారంలో 20.2 శాతం అక్రమంగా సాగుతుండగా, దీని వల్ల రూ.9 వేల కోట్లు ప్రభుత్వం నష్టపోతోంది. -
స్వీపర్లు కావలెను
బ్రాహ్మణ, క్షత్రియులకు ప్రాధాన్యం అహ్మదాబాద్: స్వీపర్లు కావాలంటూ స్థానిక సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. సెయింట్ జేవియర్స్కు చెందిన ఎన్జీఓ ‘హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ (హెడీఆర్సీ) డెరైక్టర్ ప్రసాద్ చాకో స్వీపర్లు తదితర పారిశద్ధ్య సిబ్బంది పోస్టుల కోసం ఏప్రిల్లో ప్రకటన ఇచ్చారు. అందులోని ఓ క్లాజ్లో... బ్రాహ్మణ, క్షత్రియ, వనియా, పటేల్, జైన్, సయ్యద్, పఠాన్, సిరియన్ క్రిస్టియన్, పార్సి కులస్తులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై గత రెండు రోజులుగా ఎన్జీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్పుత్ శౌర్య ఫౌండేషన్, యువ శక్తి సంఘటన్, సున్ని అవమి ఫోరమ్కు చెందిన కొందరు ఎన్జీఓ ప్రకటనను తప్పు పట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కలెక్టర్కు విన్నవించారు. అయితే ఎన్జీఓతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థల బృందం కలెక్టర్ను కలిసింది. తామే కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇవ్వలేదని తెలిపింది. -
ముఫ్పై ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కారు!
రాంచీ: కలిసి జీవిస్తూ దాదాపు ముఫ్పై ఏళ్ల తర్వాత 21 జంటలు పెళ్లి పీటలెక్కిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతిలో చోటుచేసుకుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నీలకంఠ సింగ్ ముండా తన నియోజకవర్గంలోని గిరిజన జాతుల్లో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలను గుర్తించి.. నిమిత్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో వారికి జీవిన విధానాల మీద అవగాహన కల్పించి పెళ్లిళ్లు చేసుకునేలా అంగీకరింపజేశారు. ‘ముండా’ గిరిజన తెగలకు చెందిన వీరు ఆర్థికంగా బాగా వెనుకబడిన వారు కావడంతో వారికి ఆర్థిక సాయం కూడా స్వచ్ఛంద సంస్థే చేసింది. నిమిత్ ఫౌండర్-డైరెక్టర్ నిఖిత సిన్హా మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత కోసం ముఖియా ఇండక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా నాగ్ అనే వ్యక్తి పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా సాయం కోరారని తెలిపారు. ప్రపంచబ్యాంకు సహకారంతోనే గ్రామంలో పరిశుభ్రతకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
సరైన వసతులు కల్పిస్తేనే..
ఉద్యోగుల తరలింపుపై అశోక్బాబు స్పష్టీకరణ నందిగామ రూరల్: రాజధానికి ఉద్యోగులు తరలిరావాలంటే ప్రభుత్వం అందుకు అవసరమైన వసతులు కల్పించాల్సిందేనని, సరైన వసతులు లేకుండా తరలివచ్చేందుకు ఉద్యోగులు ఏమాత్రం సుముఖంగా లేరని రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో కొత్తగా నిర్మించిన ఎన్జీవో కాంప్లెక్స్ను ప్రారంభించేందుకు ఆదివారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానికతపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ లేదని, వసతుల కల్పన విషయంలో సైతం సరైన స్పష్టత లభించలేదన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంతోపాటు తగిన సమయం కూడా ఇస్తేనే తరలింపు సాధ్యమవుతుందని చెప్పారు. ఏర్పాట్లు పూర్తి చేసిన తరువాత తగిన సమయంతో కూడిన తేదీని ప్రకటించాలని, ఇలా చేస్తే తరలి వచ్చేందుకు ఉద్యోగులుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. -
దాతృత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు
ముంబై: 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. మంచి నటుడిగానే కాక ఎన్నో సందర్భాల్లో ఒబెరాయ్ సమాజం కోసం తన వంతుగా సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని 10 మంది బాలికల చదువుకయ్యే ఖర్చు కోసం స్కాలర్ షిప్ అందించడానికి ఒబెరాయి స్థాపించిన ఎన్జీఓ 'దేవీ' ముందుకు వచ్చింది. జమ్ము కశ్మీర్లోని సెయింట్ లారెన్స్ పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు ఈ స్కాలర్షిప్ ఫలాలు అందనున్నాయి. విద్యార్థినుల ఉన్నత చదువులకు, హాస్టల్, వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు. స్కాలర్షిప్ విషయమై వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ..చదువు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలిగితే, వారి లక్ష్యాలను చేరకోవడానికి కావల్సిన రెక్కలను అందించడానికి తాను సిద్ధమని తెలిపారు. -
ఈ సినిమా జనం కోసం..
న్యూఢిల్లీ: ఈరోజుల్లో సినిమా కనిపించని ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యం. దీని కోసం తాపత్రయపడేవారంతా స్వలాభం ఆశించి పనిచేసేవారే. కానీ, కర్ణాటకలో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు, మరో స్వచ్ఛంద సంస్థ కలిసి గొప్ప సామాజిక సేవకు దిగారు. దాదాపు తొమ్మిదిమంది క్యాన్సర్ రోగులకు ఊరట కలిగించారు. తాము నిర్మించిన 'ది ప్లాన్' ను సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన డబ్బులను వారి జబ్బులను నయం చేసేందుకు ఖర్చు చేశారు. ఈ కేన్సర్ సోకిన వారంతా కూటికి గుడ్డకు నోచుకోని వారే. శ్రీరక్ష, ప్రజ్నా, అమిషా, నఫిసాధులా ఇఫ్రాంత్, దేవప్రియ, నిధి కామత్, మరియం సహీరా, అపేక్ష, ఫాతిమఠ్ మిస్బా అనే తొమ్మిదిమంది కేన్సర్ పేషెంట్లు ప్రస్తుతం మంగళూరులోని కస్తుర్బా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో కాన్ కిడ్స్ కిడ్ స్కాన్ అనే ఓ ఎన్జీవో సంస్థ కన్నడ చిత్రం ది ప్లాన్ నిర్మాతలు మాల్గుడి టాకీస్, డే డ్రీమ్ క్రియేషన్స్ తో చేతులు కలిపింది. ఆ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ది ప్లాన్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించి వచ్చిన డబ్బంతా వారి వైద్యానికి ఉపయోగించింది.అంతేకాదు వారి విద్యకోసం అయ్యే వ్యయం కూడా తామే చూసుకుంటామని చెబుతోంది. -
జూలై 31కి ఉద్యోగులంతా అమరావతికి
ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు అనంతపురం న్యూసిటీ: ఏపీ ఉద్యోగులంతా జూలై 31నాటికి రాజధాని అమరావతికితరలివెళ్తారని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ఎన్జీవో హోంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 15 నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులు, జూలై 31కల్లా వివిధ విభాగాల హెచ్వోడీలు రాజధానికి వెళ్తారని చెప్పారు. అయితే 30 శాతం హెచ్ఆర్ఏ, వారంలో 5 రోజులే పనిదినాలుండాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై జాతీయస్థాయిలో ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. 30న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. -
చెన్నై కోసం జాక్వెలిన్తో...
తమిళనాడు ప్రజలకు 2015 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల చెన్నై, ఆ నగర పరిసర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా వరదల కారణంగా నిత్యావసర వస్తువుల కోసం చెన్నై ప్రజలు నానాపాట్లు పడ్డారు. వీరిని ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలూ ముందుకు వచ్చి, తమ వంతు సాయం చేశాయి. తెలుగు సినీ తారలు ‘మన మద్రాస్ కోసం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విరాళాలు అందించడంతో పాటు కొంత కాలం పాటు హైదరాబాద్ నుంచి నిత్యావసరాల వస్తువులను చెన్నైకు పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి షారుఖ్ఖాన్, అక్షయ్కుమార్ లాంటి వాళ్లు కూడా కోటి రూపాయలు చొప్పున విరాళాలు అందజేశారు. లేటెస్ట్గా బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ‘ఎన్జీవో హ్యాబిటెట్ ఫర్ హ్యూమానిటీ’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి వరద బాధితులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. కనీసం పదివేల కుటుంబా లకు ఇళ్లు కట్టివ్వాలన్నది ఆమె సంకల్పం. జాక్వెలిన్ చేస్తున్న సహాయం గురించి తెలుసుకున్న హృతిక్ రోషన్ కూడా ఈ కార్యక్ర మంలో భాగస్వామ్యం కావాలనుకున్నారు. అందుకే తన వంతుగా కొంత మొత్తాన్ని జాక్వెలిన్కు పంపించారు. ఈ విషయాన్ని జాక్వెలిన్ ట్విటర్లో తెలిపారు. ‘‘బాలీవుడ్ నుంచి నా స్నేహితులు, నా సహనటులు చెన్నై కోసం సహకారం అందించారు. ఇప్పుడు హృతిక్ మా ప్రయత్నానికి స్పందించడం నాకు దక్కిన పెద్ద బహుమతిగా భావిస్తున్నాను’’ అని ఆనందం వ్యక్తం చేశారు జాక్వెలిన్. -
‘సీమాంధ్రులకు తెలంగాణ బాధ్యతలు ఇవ్వొద్దు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీమాంధ్రులకు కాకుండా తెలంగాణ అధికారులకు అవకాశం కల్పిం చాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వేణుగోపాల రావు శుక్రవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీని వాసయాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించారు. తెలంగాణ ఏర్పడి 20 నెలలు దాటినా ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం లేదన్నారు. హైదరాబాద్లో సంయుక్త కమిషనర్ హోదాలో ఉన్న ఓ సీమాంధ్ర అధికారి ప్రభుత్వ ఓఎస్డీగా పదోన్నతి కోసం పైరవీలు చేసుకుంటుండగా, ఆయనకు అనుకూలంగా వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. ప్రాముఖ్యత గల పోస్టులను సీమాంధ్ర అధికారులకు కేటాయించి అప్రధానమైన స్థానాల్లో తెలంగాణ వారిని నియమిస్తున్నారని పేర్కొన్నారు. -
మహిళా రోగిపై అమానుషం
బెంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. మహిళా రోగిని జాగ్రత్తగా కాపాడాల్సిన ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో మంచానికే పరిమితిమైన (బెడ్ రిడెన్) ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని(36) పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... గణేష్ నాయక్ ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన మధ్య వయస్కురాలైన మహిళకు నర్సింగ్ కేర్ తీసుకునేందుకు గణేష్ ను నియమించింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పనిని కేటాయించింది. ఈ క్రమంలో గణేష్ రోజూ రోగి యింటికి వెళ్లి నర్సింగ్ సేవలు అందించేవాడు. అయితే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతగాడు.. ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. రోగి అన్న విచక్షణ సైతం మరచి ఆమెపై పలుమార్లు దారుణంగా లైంగికదాడికి తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడి నిర్వాకం బయటపడింది. -
వాడి విడుదల మాకు చెంపదెబ్బ
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్రేప్ కేసులో బాలనేరస్థుడి విడుదల తమకు చెంపదెబ్బ లాంటిదని నిర్భయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తామెంత మొరపెట్టుకున్నా ఆ నీచుడిని విడుదల చేయడం సమాజానికి చాలా నష్టమన్నారు. అలాంటి నేరస్తుడి మొహాన్ని ప్రపంచానికి చూపించాలని డిమాండ్ చేశారు. వాడి ముసుగు తొలగించిన అందరూ చూసేలా చేయాలని, తత్ఫలితంగా వాడు మరో అఘాయిత్యానికి తెగబడకుండా నిరోధించాలని కోరారు. ఒక స్వచ్ఛందసంస్థ అక్కున చేర్చుకున్న ఆ దుర్మార్గుడు తమ బిడ్డను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడని నిర్భయ తల్లి ఆరోపించారు. మళ్లీ అలాంటి నేరానికి పాల్పడకుండా అతణ్ని ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. నిర్భయ వర్ధంతి సమీపిస్తున్న ఈ సమయంలో అతగాడిని విడుదల చేయడం తమకు చాలా బాధ కలిగించిందని, అయినా తాము నిస్సహాయులమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య18 ఏళ్లలోపు వయసున్న మగపిల్లలకు ధైర్యాన్నిస్తుందని వాదించారు. ఆడపిల్లలపై మరిన్ని నేరాలకు, అఘాయిత్యాలకు ఉసిగొల్పుతుందని వ్యాఖ్యానించారు. చాలామంది ఆ నేరస్తుడిని రక్షించడానికి ప్రయత్నించడం విచారకరమన్నారు. అటు నిర్భయ తండ్రి కూడా నేరస్తుడి విడుదలను వ్యతిరేకించారు. విడుదలకు ముందు అతని మానసిక స్థితిని, ఆలోచనాధోరణిని అంచనా వేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీన్ని నిరసిస్తూ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ మానవహక్కుల సంఘానికి ఒక మొమోరాండం సమర్పించారు. -
20 వేల చెప్పులతో నిరసన
పారిస్: భూతాపోన్నతి (క్లైఫై)పై పారిస్లో ఓ పక్క ప్రపంచ దేశాధినేతల సమావేశంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతుంటే మరోపక్క భూతాపోన్నతికి పెట్టుబడిదారి దేశాలే కారణమంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. క్లైఫైపై ఎప్పుడు, ఎక్కడ సదస్సులు, సమావేశాలు జరిగినా ప్రపంచ పర్యావర పరిరక్షణ కోసం కృషిచేసే స్వచ్ఛంద సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తుంటాయి. ఈసారి కూడా అవాజ్ అనే ఆన్లైన్ ఆర్గనైజేషన్ పారిస్లో సోమవారం ప్రారంభమైన భూతాపోన్నతి సమావేశాలకు రెండు లక్షల మందితో నిరసన తెలియజేసేందుకు ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నది. అయితే పారిస్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొని 20 వేల చెప్పులతో వినూత్నంగా నిరసన తెలిపింది. నేడు 175 దేశాల్లో అగ్రరాజ్యాల కర్బన ఉద్గారాలకు వ్యతిరేకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నాయి. శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని, పునరుత్పత్తి ఇంధనాలను, ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని స్వచ్ఛంద సంస్థలు అగ్రదేశాలను డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలతో పాటు భారత్కు కూడా తన కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని అవాజ్ ఆర్గనైజేషన్ కోరుతోంది. -
ఇది దీపికా పదుకొనే సర్వీస్!
అందంగా, నాజూగ్గా ఉండడం వేరు. అద్భుతమైన అభినయం ప్రదర్శించడం వేరు. ఈ రెండు వేర్వేరు అంశాలూ కలబోసిన బాలీవుడ్ నటి అంటే, ఇప్పుడున్న తారల్లో దీపికా పదుకొనే పేరే ముందు చెప్పుకోవాలి. ‘గోలియోం కీ రాస్లీలా... రామ్లీలా’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’ - ఇలా ఏ రకమైన సినిమా అయినా తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచారు - దీపిక. అయితే, ఇంత అందం, ఆదరణ, పేరు, డబ్బు ఉన్న నటి కూడా ఒకానొక టైమ్లో డిప్రెషన్కు లోనయ్యారు. ఒంటరితనం, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన ఆమె ఆ తరువాత కుటుంబ సభ్యుల సహాయంతో, వైద్యుల సహకారంతో తొందరగానే బయటపడ్డారు. ‘నా లాగా ఎందరో...’ అని భావించిన దీపికా పదుకొనే ఇప్పుడు అలాంటివారందరికీ అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ‘లివ్... లవ్... లాఫ్ ఫౌండేషన్’ పేరిట అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీవో)ను స్థాపించారు. ముంబయ్లో జరిగిన ఒక భారీ కార్యక్రమంలో ఇటీవలే ఈ సంస్థను ప్రారంభించారు. ప్రముఖులతో పాటు తన తల్లితండ్రులు ప్రకాశ్, ఉజ్జ్వల సమక్షంలో, ఈ ప్రయత్నం గురించి దీపికే స్వయంగా వివరించారు. ‘‘ఈ ప్రయత్నం నా మనసుకు ఎంతో సన్నిహితమైనది. ఒకప్పుడు డిప్రెషన్లో కూరుకుపోయిన నాకు అలాంటి పరిస్థితుల్లోని వారు ఎంత బాధలో ఉంటారో తెలుసు. అందుకే, నా వ్యక్తిగత అనుభవాన్ని ఆసరాగా చేసుకొని, అందరికీ సాయపడదలిచా’’ అని దీపిక చెప్పారు. ‘‘శారీరక అనారోగ్యం గురించి మాట్లాడినంత ఈజీగా మనం మాట్లాడడానికి ఇష్టపడని మానసిక సమస్య గురించి అందరిలో అవగాహన కలిగించడానికే ఈ ప్రయత్నం’’ అని ఆమె అన్నారు. డిప్రెషన్కు లోనై, దానిలో నుంచి ఎలా బయటపడాలో తెలుసుకొనే క్రమంలో తాను మరింత మెరుగైన వ్యక్తిగా మారినట్లు ఈ అందాల భామ చెప్పారు. జీవితాన్ని అంతం చేసుకోవాలనేంత డిప్రెషన్లోకి వెళ్ళే వారందరికీ కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగించడం ఈ ఎన్జీవో లక్ష్యం. ఈ సంస్థ తాలూకు వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. మొత్తానికి, దీపిక సినిమాలతో సరిపెట్టుకోకుండా సమాజానికి ఉపయోగపడే పనిలోనూ దిగిందండోయ్! స్టార్స్ స్వయంగా ఇలాంటి సర్వీస్ చేపడితే... విషయం జనంలోకి తొందరగా వెళుతుంది కదూ! -
ప్రమాదంలో దేశ భవిత
- ఏఎన్యూ ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్య ఒంగోలు సబర్బన్: దుర్మార్గాన్ని అడ్డుకోక పోతే దేశానికి భవిష్యత్తు ఉండదని ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్(ఏఎన్యూ)నన్నపనేని అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ అసోసియేషన్ భవన్లో ఆదివారం డాక్టర్ ఎం.ఎం.కల్బర్గి హత్యకు నిరసనగా సదస్సు జరిగింది. ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక-జనసాహితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజయ్య మాట్లాడారు. తమ అభిప్రాయాలతో విభేదించిన వారిని చంపుకుంటూ పోతున్న హిందూ మతోన్మాదుల దుర్మార్గాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపి యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం.ఎం.కల్బర్గిని హిందూ మతోన్మాదులు హత్య చేయటాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ వ్యవస్థలకు అధిపతులుగా మతోన్మాదుల్ని నియమించడం ద్వారా బీజేపీ.. దేశాన్ని హందూ మత రాజ్యంగా మార్చి తద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు.. నిరంకుశమైన రక్షణ కల్పించాలని భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక కన్వీనర్ పి.గోవిందయ్య, డాక్టర్ సి.హెచ్.శాంతి కుమారి, డాక్టర్ పణిధర్, హేతువాద సంఘం నాయకులు ఎస్వీ రంగారెడ్డి, వేదిక సభ్యుడు బీవీ శేషయ్య, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఐ. విజయసారధి, ప్రముఖ రచయిత మల్లవరపు రాజేశ్వరరావు , వేదిక నాయకుడు కారుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
దుస్తుల దుకాణంలో అగ్నిప్రమాదం
వనస్థలిపురం(హైదరాబాద్): వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని ‘ఉయ్లైక్’ దుస్తుల దుకాణంలో శనివారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తెల్లవారుజామున ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుకాణంలో షార్ట్సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి, రూ.5 లక్షల విలువైన దుస్తులు కాలిపోయాయని నిర్వాహకులు తెలిపారు. -
బాలలది గమ్యం తెలియని ప్రయాణం..!
ఒంగోలు సబర్బన్ : ‘బాలలు తెలిసీ తెలియని వయసులో బజారున పడుతున్నారు. వీరికి గమ్యం తెలియక ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. గ్రామాల్లో పనులు లేక తల్లిదండ్రులు వలస వెళ్తుండటమే ఇందుకు కారణం’ అని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.మోహన్కుమార్ అభిప్రాయపడ్డారు. హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఓ హోటల్లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఎన్జీఓ ప్రతినిధులకు ‘బజారున పడుతున్న బాలలు.. గమ్యం తెలియని ప్రయాణం’ అన్న అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నెల్లూరు రీజియన్ జిల్లాల పరిధిలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్కుమార్ మాట్లాడుతూ చిన్నారులు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల వలసలతో పిల్లలు తమ హక్కులు, కోల్పోతున్నారని చెప్పారు. గ్రామీణ బాలలు ఎక్కువగా అభివృద్ధి చెందిన పట్టణాలు, రాష్ట్రాలకు వె ళ్తున్నారన్నారు. తల్లిదండ్రులు పనుల ఒత్తిడిలో పిల్లలను ఒంటరిగా వదిలేయటంతో వారు రకరకాల అలవాట్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. బయటకు వెళ్లిన మగపిల్లలు హింసకు గురవుతుంటే, ఆడపిల్లలు లైంగిక వేధింపులకు బలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టాలున్నా అసలు చిన్నారులను అక్కడివరకూ వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందని మోహన్కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వలసలతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి హెల్ప్ సంస్థ డెరైక్టర్ ఎన్వీఎస్. రామ్మోహన్ వివరించారు. గ్రామాల నుంచి ఎంత మంది వలస వెళ్తున్నారో లెక్కించాలని ఎన్జీఓ సంస్థల ప్రతినిధులకు సూచించారు. దేశ జనాభాలో 50 శాతం యువకులు ఉన్నారని, వారిలో 42 శాతం మంది 18 సంవత్సరాల లోపు వయసు వారని చెప్పారు. సదస్సు కన్వీనర్ బాలశౌరి మాట్లాడుతూ వలస బాధిత బాలలను గుర్తించి వారి హక్కులు కాపాడాలని కోరారు. సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్.. వంటి ఆపదలో ఉన్న బాలలకు రక్షణ కల్పించాలని, వారికి సౌకర్యాలు సమకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల చైర్మన్లు డీవీఆర్కె శివప్రసాద్, డి.రోహన్కుమార్, పి.జయరాజ్తో పాటు చైల్డ్లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'ప్రజ్వల' కోసం మేము సైతం...
హైదరాబాద్: దేశంలోని ప్రతి రెడ్ లైట్ ఏరియాలో తెలుగు అమ్మాయిలు ఉన్నారని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రాపూర్లో వ్యభిచార గృహాలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఐడీ అధికారులు దాడి చేసి 64 మందిని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యభిచార గృహాలలో దాదాపు 95 శాతం మంది తెలుగు అమ్మాయిలే ఉన్నారని చెప్పారు. ఇది అందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వారిని రక్షించి... హైదరాబాద్లో ఆశ్రయం కల్పిస్తున్న గూడు ఈ ఏడాది సెప్టెంబర్ 30 తేదీతో చెదిరిపోనుంది. దీంతో ఆ తేదీ లోపు ఆశ్రయం పొందుతున్న వారందరికి కోసం కొత్తగా ఓ భవనం నిర్మించాలని ప్రజ్వల నిర్ణయించింది. అందులోభాగంగా సెప్టెంబర్ 30 లోపు ఓ భవనం కట్టుకుని అక్కడికి వెళ్లి పోవాల్సిన ప్రజ్వల భావిస్తుంది. అందుకోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించేందుకు ఆదివారం 'సాక్షి' టీవీలో ఏర్పాటు చేసిన లైవ్ షోలో ఆ సంస్థ ప్రతినిధులు సునీతా కృష్ణన్తోపాటు మల్లేశ్, అహ్మద్ అలీ పాల్గొన్నారు. అక్రమ రవాణా నుంచి తప్పించిన వారిని, వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చి... వారి కోసం ప్రజ్వల చేపడుతున్న సేవలను వారు వివరించారు. మానవత్వం మూర్తిభవించిన దాతలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి... దివ్య, రాజ్ ప్రొటెక్ట్ కంపెనీ : రూ.1,70, 000 ఇస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్, హైదరాబాద్: తమ స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి.. తనతో పాటు వారు కూడా సాయం చేస్తామని చెప్పారు నవ్య, హైదరాబాద్ : రూ 30 వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు దేవి, బెంగళూరు : రూ. 5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆమె ఉద్వేగానికి లోనైంది. మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ అవుతుంది కానీ సునీత కృష్ణన్లా చేసే వారు ఉండరని చెప్పారు. సుమంత్, హైదరాబాద్: తన జీతం నుంచి ప్రతినెల ఎంతో కొంత నగదు ఈ స్వచ్ఛంద సంస్థకు అందజేస్తామన్నారు. భార్గవ్, హైదరాబాద్ : రూ.50 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణారెడ్డి, తిరుపతి : రూ. 50 వేలు ఇస్తానన్నారు. తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల పేరు చెప్పేందుకు ఇష్టపడిన ఓ వ్యక్తి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. స్వరూపరాణి, గుంతకల్ : రూ. 500 ఇస్తానన్నారు. ఆమె ఉద్యోగి, తనకు వచ్చే రూ. 5 వేల జీతంలో నుంచి 500 ఇస్తున్నట్లు చెప్పారు. లత, ఖమ్మం : సునీతా కృష్ణన్ గొప్ప కార్యం చేస్తున్నారని చెప్పారు. పద్మ , సిద్ధిపేట : రూ. 5 వేలు ఇస్తున్నట్లు చెప్పారు మాళవిక, హైదరాబాద్: రూ. 25 వేలు.. సునీత కృష్ణన్ గారు సేవలను ప్రశంసించారు. రమ్య, హైదరాబాద్: రూ. 5 వేలు శ్రీనివాసులు, రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా) : రూ. వెయ్యి చైతన్య, మహబూబ్నగర్ : రూ. 5 వేలు వెంకటరమణ, దర్శి (ప్రకాశం జిల్లా) : రూ. 2 వేలు శ్రీనివాస్, భువనగిరి (నల్గొండ) : ప్రభుత్వం సాయం తీసుకుంటే ఈ సంస్థకు మరింత అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విజయలక్ష్మి, హైదరాబాద్ : రూ. వెయ్యి మేఘన(6), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా) : తన తండ్రిని అడిగి రూ. పదివేలు ఇస్తానని చెప్పింది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అకౌంట్ నెం 30312010131345 సిండికేట్ బ్యాంకు, శాలిబండ శాఖ, హైదరాబాద్ ఐఎఫ్ఎస్ కోడ్: SYNB0003031 -
జైళ్లలోకి జర్నలిస్టులకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: జర్నలిస్టులు, ఎన్జీవో కార్యకర్తలు, సినీ, డాక్యుమెంటరీ దర్శకులను ఇక నుంచి జైళ్లలోకి అనుమతించరు. వీరు జైళ్లలోకి వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం, వార్తలు రాయడంపై కేంద్రం నిషేధం విధించింది. బ్రిటిష్ దేశస్థురాలు లెస్లీ ఉడ్విన్ బీబీసీ కోసం తీసిన నిర్భయ డాక్యుమెంటరీపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపారు. ఇలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీల వల్ల సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని భావిస్తే... రాష్ట్రాలు అనుమతి జారీచేయవచ్చు. ఇలాంటి పనులపై జైలులోకి వెళుతున్న వారు రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. హ్యాండీక్యామ్, కెమెరా లేదా రికార్డర్లను మాత్రమే అనుమతిస్తారు. జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే ఖైదీలతో మాట్లాడాల్సి ఉంటుంది. రికార్డరు లేదా వీడియో కెమెరాను 3 రోజులు సూపరింటెండెంట్కు అప్పగించాలి. ఆయన ఏదైనా అభ్యంతరకరంగా అనిపిస్తే ఆ భాగాన్ని తొలగిస్తారు. ఖైదీలతో మాట్లాడి రాసే ఆర్టికల్స్ ప్రచురించే ముందు జైళ్లశాఖ ఉన్నతాధికారి అనుమతి తప్పనిసరి. -
'నోటీసులు అందాక చూస్తా..'
ముంబయి: తనకు నోటీసులు అందిన తర్వాత న్యాయసలహా తీసుకొని ముందుకు వెళతానని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు. పుణెలో ఆయన స్థాపించిన స్వచ్ఛంద సంస్థ 'భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్-మహారాష్ట్ర' అనే పేరులో భ్రష్టాచార్ అనే పదాన్ని పుణెకు చెందిన స్వచ్ఛంద సంస్థల కమిషనర్ తొలగించారు. దీనిపై మీరు ఏమైనా స్పందిస్తారా.. చట్టపరంగా ముందుకు వెళతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు మాత్రమే కాకుండా మొత్తం 16 స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు పంపిచారని, అయితే తనకు నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని అన్నా హజారే చెప్పారు. -
సమైక్య సన్మానంపై గరంగరం
- ఏ అర్హతతో ఎంపిక చేశారు - ఉమా సొంతశాఖనే మరిచారు - టీడీపీకి ఇష్టులైన వారికే సత్కారాలు సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్జీవో సంఘ నేతలతోపాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు అసోసియేషన్ల ప్రతినిధులకు మంగళవారం బెంజిసర్కిల్లో జరిగిన నవ నిర్మాణదీక్షలో ముఖ్యమంత్రి చేతుల మీదగా సత్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏ ప్రామాణికంగా సత్కరించారని పలువురు సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొని సత్కారం పొందలేకపోయిన కొంతమంది సమైక్యవాదులు ఈ సన్మానాలపై గరంగరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తమకు సత్కారం చేయకపోయినా పర్వాలేదని.. అయితే తాము చేసిన పోరాటాన్ని గుర్తించకపోవడమే బాధాకరమంటున్నారు. మంత్రి ఉమా శాఖనే మరిచి జలవనరుల శాఖకు చెందిన సిబ్బంది, అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో తొలిరోజు నుంచి పాల్గొని నీటిపారుదలశాఖ ప్రాంగాణాన్ని స్తంభింపజేశారు. మంత్రి ఉమాకు చెందిన ఈశాఖ ఉద్యోగస్తుల్ని పూర్తిగా విస్మరించారు. ఎక్సైజ్,గ్రంథాలయ సంస్థ, పశుసంవర్థక శాఖ, ఉడా, తదితర ఇతర శాఖల ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని వంటావార్పులు, రోడ్లపైనే ధర్నాలు చేసి నిరసన తెలియజేశారు. వీరిని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు. ఎన్జీవో సంఘ నేతలతోపాటు రెవెన్యూ, కార్పొరేషన్ వంటి ముఖ్యమైన శాఖల ప్రతినిధులకు మాత్రమే సన్మానాలు జరగడంపై ఈ శాఖల సిబ్బంది గరంగరంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన నవనిర్మాణదీక్షలో సత్కారాలు కేవలం జిల్లానేతలకే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో హైదరాబాద్లో సచివాలయ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, వారంతా నవనిర్మాణదీక్షలోపాల్గొన్నారని వార్ని ఎందుకు సత్కరించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదులు ఆగ్రహం... ఆప్పట్లో అర్బన్ టీడీపీ కార్యాలయ కార్యదర్శి గోగినేని ధనశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రెండోసారి టీడీపీ నేతలందరికంటే ముందుగా పార్టీలకు అతీతంగా మదర్ థెరిస్సా విగ్రహం వద్ద ఆమరణదీక్ష చేయడంతో టీడీపీ నేతలంతా పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీలో ఇంకా కొంతమంది కార్యకర్తలు కీలకంగాపాల్గొన్నారు. అలాగే తొలినుంచి రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వామపక్ష నేతలు పెద్ద ఎత్తున ఉద్యమాలుచేశారు. వారిని ప్రభుత్వం గుర్తించలేదు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు తమకు సత్కరించాల్సిన అవసరంలేదని వామపక్షనేతలు అంటున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని ప్రక్కన పెట్టి ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతలకు ఇష్టులైన వారికి వివిధ రంగాల తరుఫున గుర్తించి సత్కారాలు చేయించారనే విమర్శలు వస్తున్నాయి. కాగా సమైక్యాంధ్ర ఉద్యమం అంటేనే మాజీ ఎంపీ లగడపాటి గుర్తుకు వస్తారని.. ఆయనను ఈ వేదిక ఎందుకు మరిచిపోయిందంటూ సమైక్యవాదులు ప్రశ్నించడం కొసమెరుపు. -
ఎన్జీవో హోంలో లైంగిక వేధింపులు
ఎన్జీవో హోంలో తనను లైంగికంగా వేధించారంటూ బంగ్లాదేశ్కు చెందిన ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసు విచారణకు జిల్లా కలెక్టర్ ఎ. బాబు ఓ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటు.. బంగ్లాదేశ్ హైకమిషనర్కు లేఖ రాశారు. టాస్క్ఫోర్స్ నివేదిక అందగానే దోషులపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. లైంగిక వేదింపుల ఆరోపణపై నగర కమిషనర్కు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఫిర్యాదు పంపుతున్నట్లు చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ గత మూడు నెలలుగా ఆ బంగ్లాదేశీ బాలికను అనధికారికంగా తమ ఆధీనంలో ఉంచుకుంది. వాళ్లే తనను లైంగికంగా వేధించారని ఆ బాలిక తెలిపింది. అయితే.. ఈ వేధింపులపై పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
కుట్రీరం
నీడ నుంచి ఓడ దాకా పచ్చని చెట్టు ఇచ్చే ప్రతిఫలాలకు లెక్కేలేదు. చెట్టుకీ మనిషికి ఉన్న అనుబంధాన్ని కాంక్రీట్ జంగిల్ కాసింత తగ్గించగలదే కాని తుడిచేయలేదు. ఆ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఈ ట్రీహౌస్లు. సిటీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ట్రెండ్.. పచ్చదనం నీడలో పయనించాలనే మనిషి ఆకాంక్షకు అచ్చమైన ప్రతిరూపంగా నిలుస్తోంది. - ఎస్.సత్యబాబు ఇల్లు, ఆఫీస్, హోటల్స్, థియేటర్స్.. ఇలా సిటీవాసి వెళ్లే ప్రతి చోటు సిమెంట్ మేటలు పరుచుకుని సహజత్వాన్ని దూరం చేసేవే. పార్క్లు మినహాయిస్తే.. పది రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా.. ప్రకృతి చిరునామా ఇక్కడ దొరకడం కష్టమే. వెదురుతో వెలిసిన ట్రీహౌస్లు ఈ సమస్యకు చెక్ పెడుతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకున్న వెదురు.. ఓ చెట్టునీడలో కుటీరాల్లా వెలిసి.. చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పల్లె పొలాల్లో.. రైతులు నిర్మించుకునే మంచెలను తలపిస్తూ.. పట్నవాసంలో పల్లెవాసనలు తీసుకొస్తున్నాయి. భూమికి కాసింత ఎత్తులో ఉండే ఈ ట్రీ హౌస్ను చూడగానే సగం రిలాక్స్ అయిపోతాం. ఎంత సేపయినా హాయిగా.. ‘నేను ఈ హౌస్ కట్టినప్పుడు నందివర్ధనం చెట్టు ఉండేది. ఒక కొమ్మ కొట్టేసి కట్టాం. ఇప్పుడు ఆ నందివర్ధనం బాగా పెరిగి ట్రీ హౌస్ పైకి వచ్చేసింది. చూడముచ్చటగా ఉంటుంది. ఈ ట్రీహౌస్లో ఎంతసేపైనా గడిపేయవచ్చు’ అంటూ తన ట్రీహౌస్ ప్రత్యేకతను వివరిస్తారు కొత్తపేటకు చెందిన డాక్టర్ సూర్యప్రకాశ్. కూకట్పల్లిలోని ఆలంబన ఎన్జీవో నిర్వాహకురాలు శిరీషకు ఈ ట్రీహౌస్ అంటే చాలా ఇష్టం. ‘మా స్కూల్ ఎదుట దీన్ని మూడేళ్ల కిందట కట్టాం. మా పిల్లలకు ఇది మంచి రిక్రియేషన్ ప్లేస్. నేల నుంచి 15 అడుగుల ఎత్తులో నిర్మించిన కుటీరంలో కూర్చునేందుకు ఇక్కడి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పోటీపడుతుంటారు. ట్రీహౌస్ కట్టే సమయంలో ఇక్కడో పెద్ద చెట్టు ఉండేది. ఇటీవల ఆ చెట్టు కొట్టివేయడంతో ట్రీ హౌస్ కొంత బోసిపోయినా.. ఇప్పటికీ ఇది బెస్ట్ మీటింగ్ పాయింట్గా నిలుస్తోంది. మా విద్యార్థులు హోమ్వర్కులు చేసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. ఇక్కడికే వచ్చేస్తుంటార’ని తెలిపారు శిరీష. గృహస్థు ఆశ్రమం.. ఎన్జీవోల నుంచి ప్రారంభమైన ఈ ట్రీ హౌస్ల ట్రెండ్.. ఇప్పుడు వ్యక్తిగత ఇళ్లకు కూడా విస్తరించింది. వ్యక్తిగత విశ్రాంతి నిలయంగా, రొటీన్కు భిన్నమైన ఆవాసంగా నగరవాసులు దీనిని భావిస్తున్నారు. అదే కోవలో ‘మంచిపుస్తకం’ పబ్లిషర్ అయిన సురేష్ కొసరాజు నాగోల్లోని తన ఇంటి టై మీద ఈ తరహా ఇల్లు కట్టుకుంటే.. వనస్థలిపురంలోని హస్తినాపురంలో నివసించే విమలాచార్య మామిడి చెట్టు కింద కట్టుకున్నారు. అస్సాం అయితే బెస్ట్.. ప్రస్తుతం నగరంలో నిర్మితమవుతున్న ట్రీ హౌస్లకు అస్సాం నుంచి వచ్చిన వెదురునే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర లభించే వెదురుతో పోలిస్తే థిక్నెస్ ఎక్కువుంటుందని, మరింత బలమైనదని అంటున్నారు. ఎక్కువ బరువును భరించడంతో పాటు.. పురుగులు కూడా పట్టవని చెబుతున్నారు. భూమిలోకి రెండున్నర అడుగులు, పైకి 5 అడుగులు మొత్తం 8 అడుగుల్లో రూపొందించగలిగిన ఈ ట్రీ హౌస్ నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.20 వేలలోపే. విరివిగా కట్టాలి.. నగరంలో గూడులేని వారెందరో ఫుట్పాత్లపైనే విశ్రమిస్తుంటారు. అలాంటి వారికి ఈ ట్రీ హౌస్లు అందుబాటులోకి తీసుకురాగలితే వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తలుచుకుంటే, ట్రీ హౌస్లను విరివిగా కడితే ఎందరికో ఉపకరిస్తుంది. -డా.సూర్యప్రకాష్, ఓపెన్ హౌస్ చారిటీ సంస్థ నిర్వాహకుడు -
అభ్యంతరకర వీడియో కేసులో మరొకరి అరెస్ట్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో అభ్యంతరకర వీడియో పోస్టు చేసిన కేసులో మరో నిందితుడిని సీబీఐ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కటక్ కు చెందిన దేబశిష్ దేవ్(30)ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోను దుండగులు సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేశారు. వాట్సాప్ లో ఈ వీడియో బాగా సర్క్యూలేట్ అవడంతో హైదరాబాద్ కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్ ఎల్ దత్తుకు లేఖ రాసింది. సుమోటుగా విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులను అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో స్పందించిన సీబీఐ అధికారులు గతవారం భువనేశ్వర్ కు చెందిన ప్రొపర్టీ డీలర్ సుభ్రాత్ సాహు అలియాస్ కాలియాను అరెస్ట్ చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బనగానపల్లె: స్థానిక ఎన్జీఓఎస్ కాలనీలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అవుకు మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన మొదటి భార్య పద్మావతికి చాలా కాలంగా సంతానం కలుగకపోవడంతో నాలుగు నెలల క్రితమే మిడతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తుండటంతో ఇద్దరు భార్యలు ఒకే ఇంటిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మీదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని అనుమానిస్తుండగా, భర్త వెంకటేశ్వర్లు మాత్రం ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, తహశీల్దార్ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ జయన్న విలేకరులకు తెలిపారు. -
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన అశోక్ బాబు
నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్కార్డులను ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల వ్యవహారంలో కూడా పీఆర్సీపై ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ సందర్బంగా అశోక్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
హమ్మయ్య..!
ఏలూరు : బదిలీల గుబులుతో సతమతమవుతున్న అధికారులకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోంది. ఎన్జీవో సంఘ అభ్యర్థనతో అన్ని శాఖల్లో నూరుశాతం బదిలీలకు బదులు అవసరమైన చోట్లకే స్థానచలనాలుండాలని సర్కారు ఆదేశాలివ్వడంతో గండం గట్టెక్కిందని ఊపిరి తీసుకుంటున్నారు. ప్రభుత్వశాఖల్లో బదిలీల ప్రక్రియను ఆయాశాఖల్లో అవసరాల మేర కే చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో కొంతమంది అధికారుల నెత్తిన పాలుపోసినట్టు అయింది. కాగా చాలా శాఖల్లో ఈ పరిణామంతో అధికారులు ఊరట పొందుతున్నారు. బదిలీల ప్రకటన విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ తాత్సారం చేసింది. తమకు అనుకూలంగా ఈ ప్రక్రియను మలుచుకోవాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు కలిసిరాలేదు. ఎటూకాని వేళలో ఈ బదిలీలు వద్దని అవసరాల మేరకే స్థానచలనాలు కల్పించాలని రాష్ట్ర ఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో ప్రభుత్వం ఈనెల 3 నుంచి 15వ తేదీలోగా అవసరాల మేరకే బదిలీలు చేపట్టేందుకు నిర్ణయించింది. హుద్హుద్ తుపాను కారణంగా జన్మభూమి- మా ఊరు సభలు అన్ని జిల్లాల్లో పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన జన్మభూమి సభలను తిరిగి చంద్రబాబునాయుడు ప్రారంభింపచేశారు. 10వ తేదీలోగా జన్మభూమి సభలు అన్ని జిల్లాల్లో పూర్తికానున్నాయి. దీంతో కీలకశాఖల్లో అవసరాల మేరకే బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖకు పూర్తిస్థాయి ఊరట రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూతో సంబంధం ఉన్న కిందిస్థాయి ఉద్యోగి నుంచి కలెక్టరు వరకు బదిలీలను చేపట్టేందుకు అవకాశం కనిపించడంలేదు. ఇప్పటికే ఖాళీలు ఉన్నచోట్ల రాజకీయ పైరవీల నేపథ్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల బదిలీలు 20 శాతం వరకు పూర్తైట్టు సమాచారం. బదిలీల గడువును ప్రభుత్వం పొడిగిస్తూనే వివిధ శాఖల్లో గుట్టుచప్పుడు కాకుండా అధికారులకు స్థాన చలనం కల్పిస్తుండడం విశేషం. కీలక పోస్టులు భర్తీ అయ్యే అవకాశం జిల్లాలో పలు కీలకస్థాయి పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉంటున్నాయి. ఇవి ఈ వారంలో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడ్పీ డిప్యూటీ సీఈఓ, డీఎంహెచ్ఓ, డీఆర్డీఏ పీడీ, హౌసింగ్ పీడీ, తదితర కీలక అధికారులు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చే అవకాశాలున్నాయి. -
టెక్నాలెడ్జ్
సిటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సేవాభావం పెరుగుతోంది. ఎక్కడ సామాజిక సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తున్నారు. మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున వాలంటీర్లుగా పనిచేస్తున్న వీరు.. విరాళాలు ఇవ్వడమే కాకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్జీఓ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నారు. సాఫ్ట్వేర్లు... హార్డ్వేర్లే కాదు... సామాజిక చైతన్యంతోనూ ముందుకు కదులుతున్నారు ఐటీ ఉద్యోగులు. సమయం, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ దిశగా తలో చేయి వేసి చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా గచ్బిబౌలి మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ‘గ్లోబల్ గివింగ్ క్యాంపెయిన్’ నిర్వహిస్తున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. సామాజిక సేవకు పాటుపడే ఎన్జీఓల నిర్వాహకులకు ‘ఆఫీస్ 365’పై వర్క్షాప్ ఏర్పాటు చేశారు. వచ్చే నెల 7 వరకు జరిగే ఈ వర్క్షాపులో తమ రోజువారీ కార్యకలాపాలు పొందుపరుచుకొనేలా ఇందులో తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తం 30 మంది ఎన్జీఓలకు చెందిన వారు మెళకువలు నేర్చుకొంటున్నారు. చాలా తెలిశాయి... ‘వెబ్లో ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఎలా చేయాలి వంటివి ఈ వర్క్షాప్లో నేర్చుకొంటున్నా. ఎంతో ఉపయోగకరంగా ఉంది’ అని ఎస్ఓఎస్ ఎన్జీఓకు చెందిన నిర్మలారాణి తెలిపారు. ‘ఈ ట్రైనింగ్ వల్ల వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కంటెంట్ను అప్లోడ్ చేయడమెలాగో తెలిసింది. అందించిన సేవలను ఓ క్రమపద్ధతిలో పెట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది’ అన్నారు మహిత సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సదానంద్. ‘ఏటా ఏటా అక్టోబర్లో మైక్రోసాఫ్ట్ గివింగ్ రిలే నిర్వహిస్తాం. భారత్తో పాటు 19 దేశాల్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంస్థ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసే ఎన్జీఓలకు విరాళాలు ఇస్తుంటారు. వారితో కలసి పనిచేస్తుంటారు’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ డెరైక్టర్ చిత్రసూద్ తెలిపారు. - వీఎస్ -
17న సీఎం చంద్రబాబు రాక!
ఏలూరు, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ నెల 17న జిల్లా పర్యటనకు రానున్నారు. షెడ్యూల్ అధికారికంగా ఖరారు కానప్పటికీ, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఈనెల 17న జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఏలూరులో నిర్మించిన ఎన్జీవో హోమ్ను ఆ రోజు సీఎం ప్రారంభిస్తారని చెబుతు న్నారు. ఉద్యోగులకు హెల్త్కార్డులు జారీ చేసే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడతారని సమాచారం. అనంతరం చంద్రబాబు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కలవపూడిలో జరిగే జన్మభూమి- మా ఊరు గ్రామ సభలో పాల్గొంటారు. చినకాపవరం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులకు శంకుస్థ్ధాపన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ కాళ్ల మండలంలో శుక్రవారం పర్యటించి, సీఎం పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. -
బదిలీల గేటు తెరిచారు
శ్రీకాకుళం పాతబ స్టాండ్: అంక్షలు తొలగాయి. గేట్లు తెరుచుకున్నాయి. ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గత రెండేళ్లుగా బదిలీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది మధ్యలో బదిలీలు అంటే పిల్లల చదువులు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయాన్ని ఎన్జీవో సంఘ ప్రతినిధులు, కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 30 వరకు సుమారు 40 రోజులపాటు సాగే బదిలీల జాతరకు మార్గదర్శకాలు ఇంకా తెలియలేదు. వెబ్సైట్లో జీవో ఇంకా పెట్టకపోవడం వల్ల ఆ వివరాలపై స్పష్టత లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. కాగా ఈసారి బదిలీలు పూర్తిగా రాజకీయ ప్రమేయంతో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ కాకముందే పలు శాఖల అధిపతులకు మంత్రులు, విప్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సిపారసులు ఆశాఖల ఆదిపతులకు చేరాయి. బదిలీ లపై నిషేధాన్ని సడలించనున్నారని నెల రోజు లుగా ప్రచారం జరుగుతుండటంతో అప్పటినుంచే బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు నాయకులను ఆశ్రయించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరీంగ్ విభాగాలకు సంబంధించి వందల సంఖ్యలో సిఫారసు లేఖలు అందినట్లు తెలిసింది. వీటి ఆధారంగా కొన్ని శాఖల్లో ఇప్పటికే బదిలీల జాబితాను కూడా తాత్కాలికంగా సిద్ధం చేసినట్లు సమాచారం. నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఒత్తిళ్లు, సిఫారసులు మరింత పెరగనున్నాయి. ఈ ప్రక్రియ అధికార పార్టీ నాయకులకు, కొందరు అధికారులకు కాసుల పంట పండించనుంది. శాఖలు, ఉద్యోగుల క్యాడర్ ఆధారంగా రేట్లు నిర్ణయించినట్లు తెలిసింది. నిర్ణీత రేటు చెల్లించేందుకు అంగీకరించి అడ్వాన్సుగా కొంత ముట్టజెప్పేవారికే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 25 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలోనై ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఉండగా వీరికి కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు జరుగుతాయి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల్లో మాత్రం సిఫారసులదే రాజ్యం. ఒకేచోట ఐదేళ్లుగా పని చేస్తున్నవారిని విధిగా బదిలీ చేయాల్సి ఉండగా, కనీసం రెండుమూడేళ్లు ఒకేచోట పని చేస్తున్నవారు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కానీ జీవోలో మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్నదాని బట్టి ఎందరు బదిలీ అవుతారన్నది స్పష్టమవుతుంది. మధ్యంతర బదిలీలతో కొంత ఇబ్బందే -హనుమంతు సాయిరాం, జిల్లా అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం ఏడాది మధ్యలో బదిలీలు చేయడం వల్ల ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. అయితే ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే. బదిలీలు అన్ని శాఖల్లోనూ పారదర్శకంగా జరగాలి. పాలకుల సిపారసుల కంటే నిబంధనలకు పెద్దపీట వేయాలని అధికారులను కోరు తున్నాం. -
పొగాకు రహిత గ్రామంగా థుట్రా
సాక్షి, ముంబై : చంద్రాపూర్ జిల్లా థుట్రా గ్రామం పొగాకు రహిత గ్రామంగా రాష్ట్రంలోనే రోల్ మోడల్గా నిలిచింది. ఈ గ్రామం ధూమపాన రహిత (స్మోక్లెస్) గ్రామంగా పేరు గ డించింది. 2007లో ‘సలామ్ ముంబై ఫౌండేషన్’ అనే ఓ సామాజిక సంస్థ ఈ గ్రామంలో ధూమపాన వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారానికి ప్రభావితమైన గ్రామ వాసులు ఇప్పుడు ధూమపానానికి దూరంగా ఉంటున్నారు. ఇది ఒక అద్భుత ప్రక్రియగా సంస్థ పేర్కొంది. ఈ గ్రామంలో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా పొగాకు ఉత్పత్తులకు బానిసలయ్యారని సంస్థ తెలిపింది. ఇప్పుడు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఈ గ్రామం ఆద ర్శంగా నిలవనుందని ఎస్ఎంఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ దీపక్ పాటిల్ పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... 2007లో ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గ్రామస్తులు పొగాకుపై ఆధారపడి ఉన్నారు. పొగాకును నమలడం, గుట్కా తినడం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వారికి సర్వ సాధారణమైపోయింది. వీరు బహిరంగంగా కూడా పొగ తాగేవారు సాయంత్రం వేళలో చాలా మంది మహిళలు ఒకే చోట చేరి పొగాకును సేవిస్తారు. చిన్నారులు కూడా పొగాకు ఉత్పత్తులను సేవించడం తమను ఆశ్చర్యానికి లోను చేసింది. ఇవన్నీ గమనించిన తాము ఓ ప్రణాళిక ప్రకారం వీరిలో మార్పు తీసుకొచ్చాం. పలువురి సాయం తాము గ్రామ ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సహాయం కూడా తీసుకున్నాం. పొగాకు సేవించడం ద్వారా వచ్చే అనర్థాలను క్షుణ్ణంగా బోధించాం. పొగాకు సేవించని పాఠశాల, గ్రామంగా తీర్చి దిద్దేందుకు వీరిలో అవగాహన పెంపొందించేందుకు ఇందుకు సంబంధించి అక్కడక్కడ పోస్టర్లను కూడా వేశాం. పొగాను సేవించడం ద్వారా కలిగే దుష్పరిణామాలను ఇంటిఇంటికి వెళ్లి ప్రచారం చేశాం. వీటి వల్ల కలిగే అనర్థాలను కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా చూయించాం. అంతేకాకుండా వైద్య సిబ్బంది కూడా వీరిలో మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వివిధ రకాల కార్యకలాపాలతో వివరించేవారు. టీవీ షోలు, ర్యాలీలు, వీధి నాటకాలు తదితర వాటి ద్వారా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను వివరించేవారు. అంగన్వాడీ సేవకులు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, గ్రామ స్థాయి కమిటీ తదితరులు సహాయం కూడా తీసుకున్నాం. ఈ గ్రామంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణ దారులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున నష్టం వచ్చింది. వారికి ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది. ఇది మొదటి విజయంగా తాము భావించాం. ఈ విషయంలో గ్రామ ఉప సర్పంచ్ వామన్ భివాపూర్ కీలక పాత్ర పోషించారు. ఇతను మొదటగా ఇక్కడి పాఠశాలను పొగాకు రహితంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత గ్రామస్తులకు అవగాహన కల్పించడంలో పూర్తి సహకారం అందించారు. -
జైపూర్ చేరుకున్న బిల్ క్లింటన్!
జైపూర్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక చార్డెట్ విమానంలో జైపూర్ చేరుకున్నారు. లక్షలాది మంది పాఠశాల విద్యార్ధులకు భోజన ఏర్పాటు చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లింటన్ పాలుపంచుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి జైపూర్ చేరుకున్న క్లింటన్ ఒబెరాయ్ రాజ్ విలాస్ లో బస చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న అక్షయ పాత్ర అనే స్వచ్చంద సంస్థ నిర్వహించే అతిపెద్ద వంటశాలను బుధవారం క్లింటన్ సందర్శిస్తారని నిర్వహకులు, పోలీసులు వెల్లడించారు. జైపూర్ జిల్లాలోనే ప్రతి రోజు 1100 పాఠశాలల్లో 1.25 లక్షల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా జైపూర్ లోని 20 వేల అంగన్ వాడి కార్యకర్తలకు, 4 వేల రోజువారి కూలీలకు కేవలం 5 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జైపూర్ లోనే కాకుండా రాజస్థాన్ లోని నతద్వారా, జోధ్ పూర్, బరాన్ పట్టణాల్లో వంటశాలలను నిర్వహిస్తోంది. జైపూర్ లోని ప్రతాప్ నగర్ లో సంస్కృత వేద పాఠశాలను కూడా క్లింటన్ సందర్శిస్తారని నిర్వహాకులు తెలిపారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో పర్యటించనున్నారు. -
ఏపీ ఎన్జీఓల సభలో చంద్రబాబు ప్రసంగం
-
నమో ‘నమూనా’తో నాశనమే
మోడీ హయాంలో 16 వేల మంది చిన్న, సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు కాలంలో మన రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల కంటె నాలుగు రెట్లు అధికంగా మోడీ హయాంలో జరిగాయి. నలభయ్ అయిదు శాతం చిన్న, సన్నకారు రైతులు సాగు నుంచి తప్పుకున్నట్టు ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వే తేల్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు కొత్త చర్చను లేవనెత్తాయి. ఆ చర్చంతా నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వం సరైనదా? కాదా? అనేదే. దేశ వ్యాప్తంగా మోడీని శీల పరీక్ష, శల్య పరీక్ష చేయడానికి కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలే కాదు, ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు, కళాకారులు, కవులు ముందు వరసలో నిలబడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత గాంధీల కుటుంబానికే కాదు, చాయ్వాలాలకు కూడా ఉంటుంది. అలాంటి సౌలభ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచారు. ఆ మేరకు మోడీ కూడా ఆ పదవికి అర్హుడే. అయినా మోడీ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అంశాన్ని పరిశీలిస్తే తప్ప దేశానికి నాయకత్వం వహించే అర్హత మోడీకి ఉందో లేదో తేల్చలేం. మోడీ ఎవరి ప్రతినిధి? విశ్లేషణ హిందూత్వ జాతీయవాదిగా సగర్వంగా చెప్పుకునే మోడీ ఇప్పుడు తనను తాను ఓబీసీగా గుర్తింపు పొందడానికి ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి కారణం 2004 నుంచి ఆరెస్సెస్, బీజేపీ సంఘ్ పరివార్ మత రాజకీయాలు పలచ పడడమే. మతం కంటె బతుకు తెరువు ప్రధానమని ప్రజలు భావించడం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ సాధించిందేమీ లేదు. దీనితో విఫల నమూనాల యూపీఏ ప్రభుత్వాన్ని మార్చే దిశగా ప్రజల ఆలోచనలు కొనసాగుతున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని పెట్టుబడిదారీ వర్గం, దాని అనుచరులైన మతతత్వ వర్గాలు తమ రాజకీయ ఎజెండాగా గుజరాత్ నమూనాను ముందుకు తీసుకువచ్చాయి. ఓబీసీ అని చెప్పుకుంటున్న మోడీ మహాత్మా జ్యోతిరావు ఫూలేను జాతీయ సమైక్యతా చిహ్నంగా తీసుకోకుండా భూస్వామ్య, అగ్రకుల వల్లభాయ్ పటేల్ను ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’గా ఎందుకు నిర్మిస్తున్నారు? దేశ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పటేల్ ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. సమైక్య చిహ్నంగా పటేల్ను ఎంచుకున్నారంటే, మోడీ భూస్వాముల ప్రతినిధిగా ప్రధానమంత్రి స్థానానికి పోటీ పడుతున్నారే కానీ, బీసీల ప్రతినిధిగా కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పదమూడేళ్ల పాలనా కాలంలో కార్మికులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి చేసిందేమీ లేదు. ఓబీసీల పురోగతికి విఘాతం 1970 దశకంలో దేశంలో కొన్నిచోట్ల ఓబీసీ ప్రాంతీయ రాజకీయాలు బలపడినాయి. దాని ఫలితంగానే కేంద్రంలో జనతా (1977), నేషనల్ ఫ్రంట్ (1989) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మతతత్వ వ్యతిరేక సెక్యులర్ రాజకీయాలు కొంతయినా రాణించే అవకాశం వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఓబీసీ కులాలు 90 దశకంలో రాజకీయ శక్తులుగా అవతరించాయి. ప్రధానంగా లాలూ ప్రసాద్ (ఆర్జేడీ), ములాయం సింగ్ యాదవ్(సమాజ్వాదీ), దేవెగౌడ (జేడీ-ఎస్), నితీశ్కుమార్, శరద్యాదవ్ (జేడీ-యూ), శిబు సోరెన్ (జేఎంఎం), రాం విలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ) అధికారం చేపట్టారు. అంతకంటె ముందు డీఎంకే, అన్నా డీఎంకే, తెలుగుదేశం తదితర ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు మోడీ చెప్పుకుంటున్న ఓబీసీ వాదం వల్ల చరిత్రాత్మక పాత్ర నిర్వహించడం ద్వారా ఈ పార్టీలు, నాయకులు ఇప్పటివరకు సాధించిన గుర్తింపునకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఓబీసీ గుర్తింపుతో మనుగడ సాగిస్తున్న ఆ పార్టీలకు మోడీ వాదం వల్ల భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ నాయకులు మోడీని ప్రసన్నం చేసుకోవడానికి బారులు తీరడం విచిత్రమే. గుజరాత్ నమూనా ఇదేకదా! నరేంద్ర మోడీని పెట్టుబడిదారీ వర్గం ‘అభివృద్ధి రక్షకుడు’గా పిలుచుకుంటుంది. కానీ గుజరాత్ అభివృద్ధి అంతా కొత్త వాణిజ్య వర్గం బనియాల అభివృద్ధిని విశాలం చేయడం తప్ప సామాన్య ప్రజల అభివృద్ధికి చోటు ఇవ్వలేదు. కొద్ది మంది ఓబీసీ న్యూ రిచ్ క్లాస్కు ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అంది ఉండవచ్చు. కానీ కింది వర్గాలకు చేరలేదు. మోడీ అభివృద్ధి నమూనా కొన్ని రంగాలలో ఉత్పత్తిలో పెరుగుదలకు సంబంధించినదే తప్ప సేవల రంగం, ప్రజల సంక్షేమంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించలేకపోయింది. 1991లో ఆరో స్థానంలో ఉన్న గుజరాత్ మానవాభివృద్ధి ఇప్పుడు పదకొండవ స్థానానికి చేరింది. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికంలో ఆ రాష్ట్రానికి 17వ స్థానం. రైతు రాజ్యం అని పిలుస్తున్న గుజరాత్లో 25 లక్షల మంది రైతులు, దళితులు, ఆదివాసీలకు చెందిన భూములను సెజ్లకు కట్టబెట్టారు. ఆ భూములకు పదేళ్ల దాకా నష్ట పరిహారాన్ని అందించలేదు. మోడీ హయాంలో 16 వేల మంది చిన్న,సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు కాలంలో మన రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల కంటె నాలుగు రెట్లు అధికంగా మోడీ హయాంలో జరిగాయి. నలభయ్ అయిదు శాతం చిన్న, సన్నకారు రైతులు సాగు నుంచి తప్పుకున్నట్టు ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వే తేల్చింది. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా పేర్కొనే బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల కంటె గుజరాత్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో జరిగిన భూపంపిణీ విధానం గుజరాత్లో కనిపించదు. 1960లో మహారాష్ట్ర నుంచి విడిపోయి ఏర్పడిన గుజరాత్ బనియా వ్యాపార వర్గాలతో నిండిపోయింది. అప్పటి నుంచి కూడా వివిధ రంగాలలో క్రమంగా వృద్ధి కనిపిస్తున్నది. ఉన్నట్టుండి 2002 తరువాత దేశంలో ఎక్కడా లేనట్టు రాకెట్ వేగంతో ఆ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని బీజేపీ ప్రచారం చేస్తున్నది. విద్వేషానికి ప్రోత్సాహం అనేక పోరాటాల ఫలితంగా ప్రపంచంలో సెక్యులరిజం అనే భావన రూపుదాల్చింది. అలాంటి సెక్యులరిజం ఈ దేశానికి ప్రమాదమనీ, హిందూత్వమే శ్రీరామరక్ష అని మోడీ నమ్మకం. 2001లో అధికారంలోకి వచ్చిన మోడీ దారుణ మారణకాండకు నాయకత్వం వహించాడు. వివిధ కమిషన్లు, అధికారిక లెక్కల ప్రకారం 2500 మంది అమాయక ముస్లింలను సంఘ్ పరివార్తో పాటు కాంగ్రెస్ పార్టీలు హతమార్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి మతోన్మాదాన్ని జాతీయవాదంగా చలామణి చేయించడానికి మోడీ యత్నిస్తున్నారు. 1500 మందిని పొట్టన పెట్టుకున్న 1969 నాటి గుజరాత్ హత్యాకాండను మించిన మారణహోమాన్ని సృష్టించాలని మోడీ 2002లో హిందూత్వ ఉన్మాదులను రెచ్చగొట్టాడు. గుజరాత్ మారణకాండను నివారించడానికి మోడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనేక కమిషన్లు నిర్ధారించాయి. ఇప్పుడు మతోన్మాదం ఓబీసీ ముసుగు ధరించి మోడీ రూపంలో కబళించడానికి వస్తున్నది. అభివృద్ధికీ, రాజకీయాలకూ ఒక వ్యక్తిని కేంద్రబిందువును చేసి మాట్లాడడమంటే; ఒకే వ్యక్తి దేశ భవిష్యత్తును మార్చగలడని ప్రచారం చేయడమంటే మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ పరిస్థితి కేవలం ముస్లింలకే కాదు, మత మైనారిటీ లు, దళిత క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులకు కూడా ప్రమాదకరమే. ఆదివాసీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు వారిలో వారు కలహించుకునేటట్టు చేసే పథకాలను సంఘ్ పరివార్ అమలు పరుస్తున్నది. కాబట్టి మోడీకి ఒకసారి అధికారం ఇస్తే దేశాన్ని మధ్య యుగాలకు నడిపినట్టు అవుతుంది. అలాంటి ఒక అభివృద్ధి నిరోధక సమాజాన్ని మోడీ ద్వారా నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొనాలి. బీజేపీ హిందూత్వ రాజకీయాలను ఎదుర్కొనడం అంటే ప్రజా సమూహాల ఆకాంక్షలను, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడమే. ప్రధాని పదవి చేపట్టే అర్హత రాజ్యాంగం ప్రకారం మోడీకి ఉంది. కానీ మానవ సమాజం నిర్మించుకున్న కొన్ని విలువల ప్రకారం ఆయన ఆ పదవికి అర్హుడు కాలేరు. హారతీ వాగీశన్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, నల్సార్), సుదర్శన్ బాలబోయిన (రీసెర్చ్ స్కాలర్, ఓయూ) -
నింగికేగిన ఉద్యమ జోషి
ఉద్యమజ్యోతి నింగికేగింది. ‘పోరాడితే పోయేదేం లేదు విభజన ముప్పు తప్ప’ అనే స్ఫూర్తితో పోరాడిన ఎన్జీఓ నేత దామోదరజోషి గుండె ఆగింది. సమైక్యమే ఊపిరిగా ఉద్యమించారాయన. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే అనర్థాలు ఆయన మనసులో కల్లోలం రేపాయి. ఎలాగైనా సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే అకుంఠిత దీక్షతో ఢిల్లీ నడివీధిలో సీమాంధ్రుల వాణిని ఎలుగెత్తి చాటేందుకు సహచరులతో కలిసి వెళ్లారు. సమైక్య సమరంలో చివరకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు (టౌన్), న్యూస్లైన్: సమైక్య సమరంలో వీర మరణం చెందిన దామోదర జోషిది ఉద్యమ కుటుంబం. జోషి సోదరులు ప్రజా ఉద్యమాల్లో చు రుగ్గా పాల్గొన్నారు. ఎంతో మందికి సాయం చేశారు. సహచర ఉద్యోగుల తో పాటు స్థానికులతో శభాష్ అనిపిం చుకునేలా నడుచుకున్నారు. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడుకు చెందిన దామోదరజోషి నెల్లూరులో కుటుంబం తో ఉంటున్నారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తింస్తున్నారు. సమై క్య ఉద్యమంలో భాగంగా పంచాయతీరాజ్ తరపున ఢిల్లీ ఆందోళనకు వెళ్లి సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జోషి మృతితో జిల్లా ప్రజానీకంతో పాటు ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన జోషికి పలు మండల కార్యాలయాల్లో ఎక్కడికక్కడే శ్రద్ధాంజలి ఘటించారు. కుప్పకూలిన కుటుంబ సభ్యులు జోషి మరణ వార్త తెలుసుకున్న కుటుం బసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలారు. జోషి భార్య మేరి స్థానిక కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి ఒక కుమార్తె లాస్య, కుమారుడు సంతోష్ ఉన్నారు. కుమార్తె బీటెక్ పూర్తి చేసుకుని సూళ్లూరుపేటలో డ్వామాలో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. భర్త మరణ వార్తను విన్న భార్య మేరి ఒక్కసారిగా కేఎన్ఆర్ పాఠశాలలో కుప్పకూలారు. సహచర ఉపాధ్యాయులు ఆమెను అయ్యప్పగుడి సమీపంలో ఉన్న టీచర్స్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకొచ్చారు. స్నేహితులు, బంధువులు అనునయిస్తున్నప్పటికీ ఆమెను ఓదార్చడం కష్టమైంది. కుమార్తె, కుమారుడు ఓమూల కూర్చొని కుమిలి, కుమిలి ఏడవడం చూసి ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు.. హైస్కూల్ స్థాయిలోనే ఎస్ఎఫ్ఐ వైపు జోషి ఆకర్షితుడయ్యారు. ఐటీఐ చదువుతూ విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించారు. ఉద్యోగం వచ్చాక కూడా 1990లో జన విజ్ఞాన వేదిక తరపున రాత్రి బడుల్లో అక్షరాస్యత కార్యక్రమంలో పని చేశారు. సోదరులు షార్లో, ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యమించారు. ఉద్యోగ ప్రస్థానం టైపిస్టు స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్గా , సూపరింటెండెంట్గా పనిచేస్తూనే సర్వీసులోనే మరణించారు. పొదలకూరు, నెల్లూరు పంచాయతీరాజ్, జెడ్పీ కార్యాలయం, మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. జోషి మృతికి ఎంపీ మేకపాటి సంతాపం ఎన్జీఓ నేత దామోదరజోషి మృతికి వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఢిల్లీ నుంచి ఎంపీ ‘న్యూస్లైన్’తో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీలో సమైక్య పోరులో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోవడం ఉద్యమానికి తీరనిలోట న్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. జోషి ఆశయ సాధనకు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. మృతుడి కుటుంబ సభ్యులకు మేకపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చిత్తూరులో గ్రీవెన్స్డే రద్దు
చిత్తూరులో గ్రీవెన్స్డే రద్దు తిరుపతి, మదనపల్లెలోనూ స్తంభించిన పాలన ఈ-సేవల్లో నిలిచిన కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు నిరసనగా ఎన్జీవోల సమ్మె కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పాలనా వ్యవహారాలు సోమవారమూ స్తంభించాయి. చిత్తూరులోని కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రతి సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్డే రద్దయింది. ఉద్యోగుల సమ్మె కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గ్రీవెన్సడే రద్దయిన విషయం తెలియకుండా జనం కలెక్టరేట్కు వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోల ఆందోళన కొనసాగు తోంది. కలెక్టరేట్లో తెరచి ఉన్న ఒకటి రెండు ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవో నాయకులు మూయిం చారు. డ్వామా కార్యాలయం ముందు ఎన్జీవో అసోసియేషన్ నాయకులు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా 66 తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలమనేరులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం మూతపడింది. మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేశారు. కుప్పంలోనూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో గ్రీవెన్స్డే రద్దు చేశారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లోనూ జాయిం ట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఇంటిపన్ను వసూలు, పరిపాలన అనుమతులు, కొళాయి కనెక్షన్లు మంజూరు వంటి పనులు ఆగిపోయాయి. సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. పారిశుద్ధ్య నిర్వహణ వంటి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఎక్కడి పనులు అక్కడే వారం రోజులుగా ఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పరిపాలన పూర్తిగా స్తంభించింది. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వాణిజ్యపన్నులు, రవాణా, డీఈవో, రెవెన్యూ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో ఎక్కడి ఫైల్స్ అక్కడే నిలిచిపోయాయి. అధికారులు కార్యాలయాలకు వస్తున్నా ఫైల్రాసే ఉద్యోగులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్కు వార్షిక వర్క ప్లాన్లు పంపాల్సిన సమయమిదే. అయితే ఈ పనులేమీ జరగడం లేదు. ఈ-సేవ కేంద్రాలు మూతపడ్డాయి. బంగ్లాల నుంచే పాలన.. కలెక్టర్ రాంగోపాల్, జాయింట్ కలెక్టర్ బసంతకుమార్లు బంగ్లాలోని క్యాంపు కార్యాలయం నుంచే పరిపాలన సాగిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తమ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ నుంచి అడిగే సమాచారం పంపి ఇంటి ముఖం పడుతున్నారు. -
ఎగిసిన సమైక్యం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య పోరు హోరెత్తుతోంది. ఎన్జీఓలు, సమైక్యవాదులు ఏడోరోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగించారు. పార్లమెంట్లో విభజన బిల్లు పెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లాలో బంద్కు పిలుపునిచ్చా రు. ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం దుర్మార్గమైన చర్యగా ఎన్జీఓలు అభివర్ణించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య, కాంగ్రెస్ నేత రంగమయూర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఏపీఎన్జీఓలు బుధవారం ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను మూయించారు. వాకాడులో ఆర్టీసీ డిపో కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య, కాంగ్రెస్ నేత రంగమయూర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఏపీఎన్జీఓలు బుధవారం ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను మూయించారు. వాకాడులో ఆర్టీసీ డిపో కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. -
మార్మోగిన సమైక్య నాదం
ఏలూరు, న్యూస్లైన్ :పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్జీవోలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరో రోజుకు చేరింది. పంచాయతీరాజ్, సబ్ ట్రెజరీ మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు లేక కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. విధులకు హాజరు కాని ఉద్యోగుల వివరాలతో కూడిన నివేదికలను ఆయా శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం కలెక్టరేట్కు పంపుతున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు ఇప్పటికైనా తెలంగాణ బిల్లును అడ్డుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎన్జీవోలు హెచ్చరించారు. బైక్లపై ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను, పలుచోట్ల పెట్రోల్ బంకులను మూయించివేశారు. ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ నాయకులు టి.యోగానందం, ఆర్ఎస్ హరనాథ్, కె.రమేష్కుమార్, సతీష్, నెర్సు రామారావు, క్రిష్టవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీలు.. రాస్తారోకోలు భీమవరం ప్రకాశ్ చౌక్లో విద్యార్థులు, ఎన్జీవోలు, సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోలు, టీడీపీ నాయకులు పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లను మూయించివేశారు. కేంద్ర మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. తణుకులో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి, పెట్రోల్ బంకులను ఎన్జీవోలు మూయించివేశారు. సాయంత్రం నరేంద్ర సెంటర్లో దిగ్విజయ్సింగ్, షిండే దిష్టి బొమ్మలను దహనం చేశారు. పెనుగొండలో విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రాజ్యసభలో విభజన బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. నిడదవోలు సినిమా హాల్స్లో ఉదయం ఆటను ఎన్జీవోలు నిలిపివేరుుం చారు. బైక్ ర్యాలీ నిర్వహించి ఓవర్ బ్రిడి ్జసెంటర్లో రాస్తారోకో చేశారు. కొవ్వూరులో దుకాణాలను, సినీ థియేటర్లను, మండల పరిషత్ కార్యాలయాన్ని మూయించివేశారు. చాగల్లు, తాళ్లపూడిలలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. పాలకొల్లులో వ్యాపార, విద్యాసంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులను సమైక్యవాదులు, ఎన్జీవోలు మూయించేశారు. దీంతో పట్టణంలో బంద్ వాతావరణం నెలకొంది. గాంధీబొమ్మల సెంటర్లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గారపాటి గోపాలరావు, గుడాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో పెట్రోల్ బంకులను మూయించారు. గోపాలపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆకివీడులో సినిమా థియేటర్లలో రెండు ఆటలను నిలుపుదల చేశారు. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డారుు. భీమడోలు మండలం పొలసానిపల్లి గీతాంజలి కళాశాల విద్యార్థులు భీమడోలు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. నమూనా రాజ్యసభ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. చింతలపూడిలో బంద్ జరిగింది. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లను మూయించివేశారు. బోసుబొమ్మ సెంటర్లో రాస్తారోకో చేశారు. -
కొనసాగిన సమైక్య పోరు
సాక్షి, కాకినాడ :రాష్ట్ర విభజనను అడ్డుకునే సంక ల్పంతో ఏపీ ఎన్జీఓలు చే స్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఐదోరోజుకు చేరుకుంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణవేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, కార్యకలాపాలను స్తంభింపచేశారు. మరోపక్క ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది కూడా విధులు బహిష్కరించి సమ్మెలో చేరారు. రాజ్యసభలో మంగళవారం ప్రవేశపెడుతున్న తెలంగాణ బిల్లును లోక్సభకు రానివ్వకుండా వీగిపోయేలా సీమాంధ్ర ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం డిమాండ్ చేశారు. కాకినాడలో ఆశీర్వాదం, సంఘం జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ల ఆధ్వర్యంలో ఎన్జీఓలు బృందాలుగా ఏర్పడి జిల్లా తపాలా, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులను బయటకు పంపి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. వివిధశాఖల ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి జిల్లాపరిషత్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ ఎదుట నిరసన శిబిరం వరకు ర్యాలీ చేపట్టారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ పాటించాలని ఆశీర్వాదం విజ్ఞప్తి చేశారు. ఎన్జీఓ సంఘం నగర అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు రాజమండ్రి మూడవపట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఏపీ ఎన్జీఓ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరి బీఎస్ఎన్ఎల్, సీటీఆర్ఐ, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయాలను మూయించారు. ఓఎన్జీసీ, గెయిల్ కార్యాలయాల వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విధులు బహిష్కరించినా వైద్యసేవలు.. వైద్యుల జేఏసీ పిలుపు మేరకు కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. అయితే విష యం తెలియక ఆస్పత్రులకు వచ్చిన రోగుల కు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం వరకు వైద్య సేవలను కొనసాగించారు. కాగా మంగ ళవారం నుంచి అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రుల వద్ద బోర్డులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు కూడా సోమవారం నుంచి సమ్మె బాట పట్టడంతో గ్రామ సచివాలయాలు మూతపడ్డాయి. ఒకపక్క పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాటపట్టగా, సమైక్యాంధ్ర కోసం మున్సిపల్ ఉద్యోగులు రెండు రోజుల పెన్డౌన్ను సోమవారం ప్రారంభించారు. బుధవారం నుంచి వారు కూడా నిరవధిక సమ్మెలోకి రానున్నారు. -
ఉద్యమ బావుటా
తెలంగాణ బిల్లును నిరసిస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులు మద్దతుగా కదం తొక్కిన విద్యార్థులు రెండో రోజూ మూతపడిన కార్యాలయాలు స్తంభించిన పాలన ఏలూరు, న్యూస్లైన్: తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ ఎన్జీవోలు చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరింది. దాదాపుగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలన్నీ మూతపడ్డారుు. దీంతో పాలన స్తంభించింది. ఏలూరు సహా అన్ని పట్టణాల్లోనూ ఎన్జీవోలు, ఉద్యోగులు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిం చారు. పలుచోట్ల విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉద్యోగులతో కలసి కదం తొక్కార్జు. ఏలూరు ఎన్జీవోలు కళా జాతాలు, డప్పు వారుుద్యాల సందడి నడుమ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలో గల అన్ని విభాగాల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించివేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాలకు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, అసోసియేషన్ ప్రతినిధులు ఆర్ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్, పి.సోమశేఖర్, రమేష్కుమార్, నర సింహమూర్తి నాయకత్వం వహించారు. ఆకివీడులో ఎన్జీవోలు రాస్తారోకో చేసి ప్రభుత్వ కార్యాలయాలను మూ రుుంచివేశారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వారికి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలో ఎన్జీవోలు ర్యాలీ, మానవహారం చేశారు. నరసాపురంలో ఎన్జీవోలు పంచాయతీరాజ్, ముని సిపాలిటీ, సబ్ ట్రెజరీ కార్యాలయాలను మూరుుంచివేశారు. సమ్మెలో లేని ఆ శాఖల ఉద్యోగులను బయటకు పంపించివేశారు. నిడదవోలులో ఎన్జీవోలు మానహారం ఏర్పాటు చేశారు. అనంత రం ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ముట్టడించారు. భీమవరం జువ్వలపాలెం రోడ్డులో చైతన్య కళాశాల విద్యార్థులు రాస్తారోకో జరి పారు. ఎన్జీవోలు ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. తణుకులో మునిసిపల్ ఉద్యోగులు పెన్డౌన్ చేసి ధర్నా నిర్వహించారు. ఎన్జీవోలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకొల్లు లాకుల సెంటర్లో ఎన్జీవోలు రాస్తారోకో చేసి నిరసన గళమెత్తారు. ఇరిగేషన్, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, వైఎస్సార్ సీపీ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ పాల్గొన్నారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీవోలు ధర్నా చేశారు. తాళ్లపూడిలో నిరసన ప్రదర్శన జరిగింది. -
స్తంభించిన సేవలు
రెండవ రోజూ ఎన్జీవోల సమ్మె మూత పడిన ప్రభుత్వ కార్యాలయాలు గుంటూరుసిటీ, న్యూస్లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా ఎన్జీవోలు చేపట్టిన సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కలెక్టర్ కార్యాలయం, జిల్లాపరిషత్ కార్యాలయం, మెప్మా, గృహనిర్మాణ, సాంఘిక సంక్షేమ కార్యాలయాలను ఉద్యోగులు మూసి వేయించారు. అన్ని ప్రభుత్వ విభాగ కార్యాలయాలకు వెళ్లి సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ సీమాంద్ర నాయకులందరూ పార్టీల కతీతంగా రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విడదీయటానికి సిద్ధ పడుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎన్జీవో నగర అధ్యక్షుడు దయానందరాజు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పెరికల చినవెంకయ్య, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మహిళ కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. నిందితులను శిక్షించేందుకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన మహిళలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతునే ఉన్నాయి. అందుకు ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనే తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.... రాష్ట్రంలోని లలిత్పూర్లో ఓ యువతి ప్రభుత్వేతర సంస్థలో విధులు నిర్వర్తిస్తుంది. ఆ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాంతో బాధితురాలు లలిత్పూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మనోజ్ సమయ్య, బబ్లూ, మరోకరని పోలీసులు నిందితులను గుర్తుంచారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. -
తీర్మానం ఉండాల్సిందే...
రాష్ర్ట విభజన అంశంలో చర్చకు మద్దతిస్తూ సమైక్య తీర్మానం అంశాన్ని మరచిపోతున్న వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన సమైక్యవాదులు తీర్మానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదం వినిపిస్తూ విభజనకు సహకరిస్తున్న నాయకులకు కొందరు ఉద్యోగ నేతలు వత్తాసు పలుకుతుండడాన్ని ఖండిం చారు. సమైక్యవాదానికి అనుకూలంగా తీర్మానం చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుమ్మక్కయ్యారు.. సమైకాంధ్ర ముసుగులో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంతో ఎన్జీఓ సంఘ నాయకుడు ములాఖత్ అయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోటి వెంట ఏ మాటలు వస్తున్నాయో అశోక్బాబు కూడా అవే మాట్లాడుతుండడం దీనికి నిదర్శనం. రెండు నెలలుగా ఉద్యోగాలు వదిలి ఉద్యమాలు చేస్తే వచ్చిన ఫలితం ఏమిటో అర్థం కావడం లేదు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవ్వలేదు. - చందాన మహందాతనాయుడు, చైర్మన్, ఎన్జీఒ సంఘం, బొబ్బిలి తీర్మానం ఉండాలి... అసెంబ్లీలో విభజన బిల్లుపై ఓటింగ్ జరగకుండా చర్చ జరిపితే పరోక్షంగా రాష్ట్ర విభజనను ఆమోదించినట్లే. సమైక్య తీర్మానం తప్పకుండా చేయాల్సిందే. వైఎస్ఆర్ సీపీని అడ్డుకోవడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగదు. - ఎ. అశోక్, ఎస్ఎఫ్ఐ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు... ఎన్జీఓ సంఘ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. ఉద్యమం చేయడం ద్వారా సొంత లాభం చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడిచి సీమాంధ్ర ప్రజలను మోసగించారు. ఇది క్షమించరానిది. సమైక్యాంధ్ర సాధన చేతకానప్పడు మొదట్లోనే వదిలేయాల్సింది. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలకు అమ్మేశారు. - డి.రఘు, విద్యార్థి సంఘ నాయకుడు, బొబ్బిలి తీర్మానం, చర్చ రెండూ జరగాలి బిల్లును తిప్పికొట్టేందుకు పనికొచ్చే చట్టబద్ధత గల తీర్మానం, చర్చ రెండూ అవసరమే. ఇందులో ఏ ఒక్కటి చేపట్టకపోయినా సమైక్యానికి అన్యాయం జరుగుతుం ది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యా య, ఉద్యోగ సంఘాలు ఆ దిశగా శాసన సభ, మండలి సభ్యులపై డిమాండ్ చేయకపోవడం అన్యాయం. - కొన్నాన శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు, వీఆర్ఓ సంఘం. టీడీపీ వైఖరి మారింది విభజన బిల్లుపై టీడీపీ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. సీమాంధ్ర టీ డీపీ నేతలంతా చర్చకు వ్యతిరేకమని ముందు చెప్పి చర్చలో పాల్గొనడం ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. వారంతా డ్రామాలు ఆడుతున్నారు. వారికి కొందరు వత్తాలు పలుకుతుండడం సరికాదు. - బూతాల వెంకటరమణ, ప్రైవేట్ టీచర్ తీర్మానం చేయకపోతే విభజనను అడ్డుకోలేం సమైక్య తీర్మానం చేసి పార్లమెంటుకు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు పంపకపోతే విభజన బిల్లును అడ్డుకోలేం. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ దిశగా చట్టసభల్లో వ్యవహరిం చేలా ఒత్తిడి చేయాలి. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు వక్రభాష్యం చెబుతుండడం దురదృష్టకరం.- సామల సింహాచలం, రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ టీచర్ల సంఘం మోసం చేయవద్దు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చట్టసభల్లో తీర్మానం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేయాలి. ఈ విషయంలో రాష్ట్రస్థాయి సంఘం నాయకులు తమ సొంత నిర్ణయాలు రుద్దడం శోచనీయం. చట్టబద్ధమైన ప్రక్రియను అమలు చే యాలని ఒత్తిడి తేవడంలో బేషజానికి పోవడం సమైక్యవాదులను మోసం చేయడమే. - బంకపల్లి శివప్రసాద్, ప్రచారకార్యదర్శి, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి. కిరణ్ కోవర్టుగా అశోక్బాబు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబు చర్చకు డిమాండ్ చేయడంతో ఆయన వైఖరి తేటతెల్లమయ్యింది. చర్చలో పాల్గొనడం విభజనను ఆమోదించినట్లే. ఈ విషయంలో అశోక్బాబు కిరణ్కుమార్రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. - ఎస్. శ్రీనివాసరావు, యువజన సంఘం నాయకుడు -
వేతనాలు చెల్లించకుంటే ఉద్యమం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: వయోజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సాక్షరభారత్ కో ఆర్డినేటర్లకు ఏడాది నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కో ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇనపకుర్తి పోతన్నదొర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం సంవత్సరం నుంచి వేతనాలు ఇవ్వక పోవడం విచారకరమన్నారు. సంక్రాంతి పండుగకైనా జీతాలు చెల్లించాలని కోరారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం పండగపూట పస్తులు లేకుండా చూడాలన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి దుబ్బ కోటేశ్వరరావు మాట్లాడుతూ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలవవ్వడంతో 2,202 మంది కోఆర్డినేటర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. అప్పులు చేసి కేంద్రాలకు వార్తపత్రికలు వేస్తున్నామన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు కొన్ని శ్రీనివాసరావు, అప్పలనాయుడు, కె. చిరంజీవి పాల్గొన్నారు. -
రాజకీయ క్రీనీడ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్జీవో ఎన్నికలపై రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. యూనియన్ ఎన్నికలను ఆధిపత్య క్రీడగా మార్చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల నేతలు తెరవెనుక పావులు కదుపుతూ తమకు అనుకూలమైన వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే బలవంతంగానైనా ఆ పని చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 52 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలకు చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన శాఖల ఓట్లు తక్కువే. వైద్య ఆరోగ్యశాఖలో ఎక్కువ మంది అనర్హులు ఓటర్లుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆ శాఖ లో 15 మంది ప్రమోషన్లు పొంది గెజిటెడ్ ఉద్యోగులుగా మారారు. వారిని నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో ఓటర్లుగా ఎలా గుర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా యూనియన్లో విభేదాలకు కారణమైన దీన్నే కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు అవకాశంగా తీసుకుని ఎన్జీవో ఓటర్లను ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని అసంతృప్తితో ఉన్న ప్రత్యర్థి వర్గంలోని ఉద్యోగులను ప్రసన్నం చేసుకుని అశోక్బాబుకు ప్యానల్కు ఓటు వేసే విధంగా కాంగ్రెస్, టీడీపీల నేతలు యత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అశోక్బాబు ప్యానల్కే ఎక్కువ ఓట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్జీవో హోం వద్ద ఆ ప్యానల్ ఫ్లెక్సీలే ఏర్పాటు చేశారు. బషీర్ ప్యానల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా కొందరు ఉద్యోగ నాయకులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీవో హోం అశోక్బాబు వర్గానికి చెందినది కాదని, ఉద్యోగులందరిదని పేర్కొంటున్నారు. అశోక్బాబు వచ్చినప్పుడు చూపిన ఆదరణ, బషీర్ వచ్చినప్పుడు ఎందుకు చూపడం లేదని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇరువురూ ఎన్జీవో నేతలే అయినందున ఒకేలా చూడాలని, లేదా ఎవరినీ పట్టిం చుకోకుండా ఎవరికి వారు ప్రచారం చేసుకునేలా చూడాలన్న వాదన వినిపిస్తోంది. సంఘంలో చోటు చేసుకుం టు న్న ఈ పరిణామాలే కాంగ్రెస్ నేతలకు అవకాశంగా మారాయి. మరోవైపు మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల, కేంద్ర మంత్రి కృపారాణిల వద్దకు ఓటర్లు, నేతలను తీసుకెళ్లి తమకు అనుకూలంగా చెప్పించాలన్న యోచనలో అశోక్బాబు వర్గం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, వైఎస్ఆర్సీపీ ఈ వ్యవహారంలో తలదూర్చడం లేదు. ఉద్యోగ సంఘాల్లో రాజకీయప్రమే యం తగదన్న యోచనలో ఆ పార్టీ ఉంది. ఎన్జీవోల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ అభిమానులే ఉన్నప్పటికీ దీన్ని యూనియన్ వ్యవహారంగానే ఆ పార్టీ పరిగణిస్తోంది. -
ఎన్జీఓ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన బషీర్
ఒంగోలు ఒన్టౌన్, న్యూస్లైన్: ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ ఆదివారం నామినేషన్ను దాఖలు చేశారు. సంఘ ఉపాధ్యక్ష పదవికి కనిగిరికి చెందిన శివరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన ఎన్జీఓ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పర్చూరు అశోక్బాబును ఎన్నికల్లో ఓడించేందుకు ఆయన వ్యతిరేక వర్గమంతా ఏకమై ఉమ్మడి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది. జిల్లాకు చెందిన పలువురు నాయకులు నామినేషన్ సందర్భంగా బషీర్కు సంఘీభావం తెలిపారు. ఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి.రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎ.స్వాములు, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు నాసర్ మస్తాన్వలి, కార్యదర్శి ప్రకాష్, డిజె ప్రసాద్, వీరనారాయణ, శోభన్బాబు, బడే మీరావలి, జిల్లాకు చెందిన మరో 150 మంది ఎన్జీఓలు బషీర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీ ఎందుకంటే... తాను అధ్యక్ష పదవికి ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో బషీర్ ‘న్యూస్లైన్’కు వివరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఏపీ ఎన్జీఓ సంఘ ఎన్నికల్లో గెలుపొందేందుకు అశోక్బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ వారి ఆదేశానుసారం ఉద్యమాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు పోరాడతామని బీరాలు పలికిన అశోక్బాబు మధ్యలోనే కాడి కిందేశారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెరుపు సమ్మె చేస్తామని ప్రగల్బాలు పలికిన ఆయన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినా..సమ్మె ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్ర విభజనకు మూల కారకులైన దిగ్విజయ్సింగ్ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించిన అశోక్బాబు అసలు ఆ విషయాన్ని మరిచిపోయారని ఆక్షేపించారు. సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చే పార్టీలను కలుపుకొని ఉద్యమించాలని తామెంతగా చెప్పినా పట్టించుకోలేదని బషీర్ వెల్లడించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయాలని అశోక్బాబు చెప్తుండటం సందేహాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల ఊసేదీ... అశోక్బాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బషీర్ ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఇప్పటికే రెండున్నర పీఆర్సీలు కోల్పోయారని, పదో పీఆర్సీ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదన్నారు. ఉద్యోగులంతా కనీసం తాత్కాలిక భృతి (ఐఆర్) వర్తిస్తుందని ఆశించినా..ఆ విషయంలో ప్రభుత్వ స్థాయిలో పట్టుబట్టిన దాఖలాల్లేవన్నారు. ఉద్యోగుల హెల్త్కార్డుల విషయంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అక్రమంగానైనా గెలుపొందేందుకు అశోక్బాబు ప్రయత్నిస్తున్నారని బషీర్ దుయ్యబట్టారు. సంఘంలో మొత్తం 866 మంది ఓటర్లుండగా, వీరిలో 33 మంది పేర్లు రిపీట్ అయ్యాయని వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బు వెదజల్లైనా గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా నిజాయితీపరులైన ఎన్జీఓలు సమైక్యాంధ్రకు కట్టుబడిన వారిని ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సామాజిక కార్యకర్త ఆత్మహత్య
బంగ్లాపైనుంచి దూకి తనువు చాలించిన ఖుర్షీద్ అన్వర్ అత్యాచార ఆరోపణలతోనే ఈ తీవ్ర నిర్ణయం? న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెమోక్రసీ స్వచ్ఛంద సంస్థకు డెరైక్టర్గా కొనసాగుతున్న ఖుర్షీద్ అన్వర్ ఆత్మహత్య చేసుకున్నారు. వసంత్కుంజ్లోని తన ఇంటిపైనుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖుర్షీద్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఓ యువతి ఆరోపించడంతో కలత చెందిన ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పలు టీవీ ఛానళ్లలో కూడా యువతిపై అత్యాచారం జరిపాడంటూ పదే పదే కథనాలు ప్రసారం చేశాయి. ఆయన ఆత్మహత్యకు ప్రత్యక్షసాక్షి పెయింటర్ భగవతి ప్రసాద్. ఆయన మాట్లాడుతూ... ‘నేనో సైన్ బోర్డుకు పెయింట్ వేస్తున్నాను. అంతలోనే పెద్దగా శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే ఓ మనిషి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే సాయం కోసం అరిచాను. చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకొని అతణ్ని ఫొర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తీసుకెళ్లాం. అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశార’న్నాడు. ఓ ఎన్జీవోలో పనిచేస్తున్న యువతి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తాను చేసిన ఆరోపణల గురించి మాట్లాడుతూ... ‘అన్వర్ డెరైక్టర్గా కొనసాగుతున్న ఎన్జీవోలోనే పనిచేస్తున్న నా స్నేహితురాలితో కలిసి సెప్టెంబర్ 12న అన్వర్ ఇంట్లో పార్టీకి వెళ్లాను. అక్కడ నా స్నేహితురాలు ఆల్కహాల్ తాగి వాంతులు చేసుకుంది. దీంతో అన్వర్, సహచర ఉద్యోగులు ఆ రోజు అక్కడే ఉండమని సలహా ఇచ్చారు. దీంతో అక్కడే పడుకున్నామ’ని చెప్పింది. ‘తర్వాత రోజు ఉదయం అన్వర్ ఓ క్యాబ్ను సమకూర్చడంతో ఇంటికి వెళ్లిపోయిన ఆ యువతి మరుసటి రోజే తనపై అత్యాచారం జరిపాడంటూ అన్వర్పై ఆరోపణలు చేసింది. స్నేహితులకు విషయం చెప్పడంతో వారంతా కేసు పెట్టమని సలహా ఇచ్చారు. కానీ ఆమె కేసు పెట్టకుండా మణిపూర్లోని ఇంటికి వెళ్లిపోయింది. ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత సహచరులతో కలిసి జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును కమిషన్ పోలీసులకు పంపార’ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇదిలాఉండగా అన్వర్ డైరీలో ఈ విషయమై కొంత సమాచారం దొరికిందని, ఇతర ఎన్జీవోలకు చెందిన యువతులు తనను లక్ష్యంగా చేసుకొని, తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా అందులో ఉందని పోలీసులు తెలిపారు. -
గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్కుమార్ గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. కోల్కతాకు చెందిన స్వచ్ఛంద సంస్థ భారత్ బచావో ఆందోళన్ ఈ విషయమై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి లేఖ రాసింది. గంగూలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా లేఖలో కోరింది. లా ఇంటర్న్గా పనిచేస్తున్న యువతిని గంగూలీ లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఈ కేసు ఉన్నత స్థాయి కేసని, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను మాయం చేసే అవకాశముందని ఎన్జీవో ఆందోళన వ్యక్తం చేసింది. లైంగికంగా వేధింపుల ఘటన జరిగిన హోటల్ లీ మెరిడియన్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఆ పోలీస్ స్టేషన్కు కూడా ఎన్జీవో లేఖ రాసింది. వెంటనే స్పందించి ఆధారాలు సేకరించాలని లేఖలో కోరింది. ‘పోలీసులు అవసరమైన ఆధారాలన్నింటిని సేకరించాలి. సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకోవాల’ని లేఖలో కోరినట్లు భారత్ బచావో సంఘటన్ అధ్యక్షురాలు వినీత్ రుయా తెలిపారు. గంగూలీని అరెస్టు చేయాలనే డిమాండ్తో మానవ హక్కుల దినం సందర్భంగా ఈ నెల 10న ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మానవహక్కుల సంఘం చైర్మన్ అయిన రుయా ఇదివరకే హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు కూడా లేఖ రాశారు. అంతేకాక గంగూలీ ఇంటిముందు మౌనదీక్ష కూడా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గంగూలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశారు. సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యులు కమిటీ కూడా గంగూలీ ప్రవర్తనను తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాగా బాధితురాలు తనపట్ల జరిగిన అన్యాయాన్ని బ్లాగు ద్వారా వివరించడంతో.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఆమెకు లేఖ రాసిన విషయం తెలిసిందే. -
సమైక్యాంధ్ర సాధించేవరకు పోరాటం
టెక్కలిరూరల్, న్యూస్లైన్: ప్రాణాలైనా అర్పిస్తాం... సమైక్యాంధ్రను సాధిస్తామంటూ ఉపాధ్యాయ, ఎన్జీవో, కార్మిక జేఏసీ నాయకులు నినదించారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై గురువారంతో 100 రోజులు పూర్తయిన సందర్భంగా టెక్కలి అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా, మానవహారం నిర్వహించారు. సమైక్య నినాదాలు వినిపించారు. రాష్ట్ర విభజనకు కుట్రలు చేస్తున్న నాయకులారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. విభజిస్తే ఊరుకోమని, శ్రీ కృష్ణ కమిటీ నివేదికను తక్షణమే అమలు చేయాలని నినదించారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు మద్దతిస్తున్న మంత్రులంతా తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో విభజన పరులకు బుద్ధిచె బుతామని శపథం చేశారు. సమైక్యాం ధ్రతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, సూపరింటెండెంట్ శ్యామల, ఏవో విజయకుమార్, జేఏసీ నాయకులు సంపతిరావు మోహనరావు, బసవల ధనుంజయరావు, సత్తారు కోటేశ్వరరావు, చమళ్ల భాస్కరరావు, బాడాన నారాయణరావు, నేతాజీ, ఆర్.శేషు, భూషణం, వైఎస్ఆర్ సీపీ నాయకుడు చింతాడ గణపతి, ఎస్.రాజా తదితరులతో పాటు సమైక్యవాదులంతా పాల్గొన్నారు. -
సమైక్య శంఖారావంలో ఎన్.జి.ఓ,విద్యార్ధి నేతల ప్రసంగం
-
సమ్మెకు విరామం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. దీంతో శుక్రవారం నుంచి జిల్లాలో 25 వేల మంది ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు. ఇది తాత్కాలిక విరామమేనని, అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జిల్లా జేఏసీ నాయకులు చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన వచ్చినప్పటి నుంచి జిల్లాలో 35 శాఖలకు చెందిన 25 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఎన్జీఓలు సమ్మెలోకి వచ్చినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని మండలాల్లో జేఏసీలను ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. పాలన పూర్తిగా స్తంభించింది. ఫలితంగా మండల కేంద్రంతోపాటు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కూడా మూత పడింది. సమ్మె కాలంలో వందలాది ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయానికి సుమారు రూ 6 కోట్ల నష్టం వాటిల్లింది. ఖజానా కార్యాలయాలు మూతపడడంతో రూ.80 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. రెవెన్యూలో 300 ఫైళ్లు కదల లేదు. పంట రుణ లక్ష్యం కూడా నెరవేరలేదు. రూ.300 కోట్ల రుణ లక్ష్యం కాగా కేవలం రూ.90 కోట్లు రుణాలుగా అందజేశారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సమ్మెకారణంగా ఆ శాఖ రూ.25 కోట్ల ఆదాయం నష్టపోయింది. తెరుచుకోనున్న ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులు సమ్మె గురువారం అర్ధరాత్రి నుంచి విరమించనుండడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. సమ్మె విరమించిన నేపథ్యంలో ఎన్జీఓలతోపాటూ రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు విధులకు హాజరు కావాలని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సమ్మెకు సహకరించిన జిల్లా ప్రజానీకంతో పాటూ కలెక్టర్, జేసీలకు జేఏసీ నాయకులు పేడాడ జనార్దనరావు, ప్రభూజీ కృతజ్ఞతలు తెలిపారు. -
సీమాంధ్ర వ్యతిరేకులతో మంత్రుల కమిటీనా?
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: సీమాంధ్ర వ్యతిరేకులతో మంత్రుల కమిటీ వేయడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, స్వయం సహాయక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 21మంది మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారిని ఎన్జీవో సంఘం నాయకులు, విద్యుత్ జేఏసీ నాయకులు తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కమిషనర్, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె మంత్రి పురంధేశ్వరి తెలుగు జాతిని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టి మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. రాజీనామా చేయడానికి మదనపడ్డామని బహిరంగంగా చెప్పడాన్ని చూస్తే సిగ్గుతో తల వంచుకోవాలన్నారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ఇటలీ వనితకు తాకట్టు పెట్టారా అని ప్రశ్నించారు. సోనియాజీ క్విట్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర మంత్రులను తెలుగు జాతి ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలో ఉందన్నారు. రాజీనామాల పేరుతో రాజీ డ్రామాలు ఆడవద్దని హెచ్చరించారు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, డిస్కంలు సమ్మెలోకి దిగడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. దక్షణాదిలో గ్రిడ్ ఫెయిలైతే ఐదు రాష్ట్రాల్లోని మంత్రులు ఇబ్బంది పడతారని కేంద్రం దిగి వస్తోంది తప్ప సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ లేని దిగ్విజయ్సింగ్ చర్చలకు పిలుస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. విద్యుత్ జేఏసీ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ విద్యుత్ వదిలినప్పటి నుంచి అన్ని బల్పులు వేసి విద్యుత్ను వాడితే గ్రిడ్ ఫెయిల్ అవుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సంఘీభావం తెలిపినవారిలో మున్సిపల్ జేఏసీ నాయకులు సబ్దార్, గౌడ్, రామచంద్రప్రభు, దస్తగిరమ్మ, కెజియాజాస్లిన్, శ్రీదేవి, విమల, రసూలమ్మ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు. దీక్షలు చేస్తున్న వారికి ప్రభుత్వ వైద్యులు రక్తం, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. -
రైల్వే ఉద్యోగుల బోనస్కు కేబినెట్ పచ్చజెండా
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. 2012-13కుగానూ రైల్వేశాఖలో అర్హులైన అందరు ఎన్జీవోలకు(సుమారు 12.37 లక్షల మంది) 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలన్న రైల్వేశాఖ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించింది. దసరా ముందు ఉత్పాదకత ఆధారిత బోనస్ ప్రకటించడం రైల్వేశాఖలో ఆనవాయితి. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.8975 రూపాయలు బోనస్గా ఇవ్వడం వల్ల రైల్వేశాఖపై రూ.1043.43 కోట్ల భారం పడనుంది. మరోవైపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) 750 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా విధానంలో నాణ్యతను పెంచేందుకు ఉద్దేశించిన ‘రాష్ట్రీయ ఉచ్చ్తర్ శిక్షా అభియాన్’ పథకాన్ని కూడా ఆమోదించింది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ సమగ్ర టెక్స్టైల్స్ పార్క్ పథకాన్ని కొనసాగించే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. -
జిల్లాలో ఉద్ధృతంగా కొనసాగిన సమైక్య ఉద్యమం
సాక్షి, రాజమండ్రి : సమైక్య ఉద్యమంలో 52వ రోజైన శుక్రవారం జిల్లా నిరసనలు, ర్యాలీలతో మారుమోగింది. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరుసగా రెండవ రోజు కూడా జిల్లా అంతటా బీఎస్న్ఎల్, తపాలా శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను ముట్టడించారు. జిల్లాలో 250కి పైగా ప్రధాన బ్యాంకుల శాఖలు మూతపడగా రూ.300 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. విజయవాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బస్సులు, ఇతర వాహనాల్లో ఉదయాన్నే తరలి వెళ్లారు. ధవళేశ్వరంలో దీక్షా శిబిరం వద్ద ఇరిగేషన్ ఉద్యోగి ఏడుకొండలు కట్టబ్రహ్మన్న వేషంతో, మరో ఉద్యోగి వై. సూర్యనారాయణ పొట్టి శ్రీరాములు వేషంతో ఆకట్టుకున్నారు. రాజమండ్రిలో గోకవరం బస్టాండు వద్ద ఎన్జీఓలు మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పశుసంవర్థక శాఖ జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో రోడ్డుపై డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. బొమ్మూరులో మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ 50 గంటల దీక్షను జిల్లా టీడీపీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప విరమింప చేశారు. ఉద్యోగులు ఓఎన్జీసీ కార్యాలయాన్ని రెండవ రోజు కూడా ముట్టడించారు. తెలుగుతల్లికి దిష్టితీత కాకినాడ జెడ్పీ సెంటర్లో న్యాయశాఖ ఉద్యోగులు మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు రోడ్డుపై బూరాలు ఊదుతూ, దస్తావేజు లేఖరులు విల్లంబులతో నిరసన ప్రదర్శన చేశారు. న్యాయశాఖ గుమస్తాలు రామారావుపేటలో తెలుగుతల్లి విగ్రహాలకు కొబ్బరికాయలతో దిష్టి తీశారు. పీఆర్ డిగ్రీ కళాశాలలో కొందరు అధ్యాపకులు విధులు నిర్వహిస్తుండడంతో సమైక్యవాదులు అక్కడకు చేరుకుని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణకు పసుపు, కుంకుమ, గాజులతో చీర అందచేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయనను జేఏసీ శిబిరం వద్దకు తీసుకువచ్చి సమైక్య నినాదాలు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు అచ్చంపేట సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. విలియమ్స్ విద్యాసంస్థల విద్యార్థులు, నిర్వాహకులు రాయుడుపాలెంలో ర్యాలీ, రాస్తారోకో చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తూరంగి నుంచి సర్పవరం జంక్షన్ వరకూ బెక్ ర్యాలీ చే శారు. సమైక్యాంధ్రను కోరుతూ బుర్రకథాగానం అమలాపురం గడియారస్తంభం సెంటర్ శిబిరంలో కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిమ్ క్రీడాకారులు రిలే దీక్షలు చేపట్టారు. భీమనపల్లిలో బుడగ, బేడ జంగాలు బొబ్బిలి బుర్రకథలు ఆలపించి సమైక్య రాష్ట్రం కోసం మద్దతు పలికారు. ఉప్పలగుప్తంలో మండల రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గొల్లవిల్లిలో రైతు సంఘం నేతలు, ఎన్.కొత్తపల్లిలో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేశారు. ముమ్మిడివరంలో బుడగా, బేడ సంఘం ఆధ్వర్యంలో బుర్రకథలో కేసీఆర్, సోనియాలను ప్రధాన పాత్ర లుగా చేసి వారికి శాపనార్థాలు పెడుతూ ప్రదర్శన చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో యాత్ర చేశారు. రావులపాలెం సెంటర్, గోపాలపురంలో జాతీయ రహదారిపై మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ఆత్రేయపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు చిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. రాజోలు నుంచి అప్పనపల్లికి పాదయాత్ర రాజోలు ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాజోలు నుంచి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయం వరకూ 16 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దారిలో మామిడికుదురు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అప్పనపల్లి చేరుకుని శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై మండల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డ్రిల్ చేస్తూ నిరసన తెలిపారు. తూర్పుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్ను సమైక్య వాదులు ముట్టడించి, కార్యకలాపాలను అడ్డుకున్నారు. వాహనాలు బయటికి రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. మలికిపురంలో అధ్యాపకులు డప్పు వాయిస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. బట్టేలంక సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సామర్లకోటలో వీఆర్ఓ అవసరాల గోపాలకృష్ణ 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. పెద్దాపురం జేఏసీ శిబిరంలో కళాకారుడు అశోక్కుమార్ జూనియర్ ఎన్టీఆర్గా సమైక్య గీతాలకు డ్యాన్స్ చేసి అలరించాడు. ఉద్యోగులు తహశీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. తుని అల్లూరి సీతారామరాజు సెంటర్లో తుని, పాయకరావుపేట పండ్ల వర్తక సంఘం సభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు జేఏసీ దీక్షల్లో పాల్గొన్నారు. రోడ్డుపై బ్యాడ్మింటన్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పురపాలక సంఘ ఉద్యోగులు దీక్షలు కొనసాగించారు. ఏలేశ్వరంలో నాయీ బ్రాహ్మణులు బ్యాండుతో ర్యాలీ చేసి, అనంతరం రోడ్డుపై క్షవరాలు చేస్తూ నిరసన తెలిపారు. జగ్గంపేటలో జర్నలిస్టుల బంద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జగ్గంపేట బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల సమైక్యవాదులు ఒకే వేదికపై చేరి సమైక్య నినాదాలు చేశారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. గండేపల్లి, కిర్లంపూడి ప్రాంతాల జేఏసీ సభ్యులు బంద్కు మద్దతు పలికారు. కె.గంగవరంలో ఉపాధ్యాయులు రైల్రోకో చేపట్టారు. కాకినాడ, కోటిపల్లి రైల్ కారును 10 నిమిషాలు అడ్డుకున్నారు. ద్రాక్షారామ, కాజులూరుల్లో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది. రంపచోడవరంలో ప్రధానోపాధ్యాయులు, వార్డెన్ల సమావేశాన్ని సమైక్య వాదులు అడ్డుకున్నారు. రాజమండ్రిలో ప్రైవేట్ కళాశాలల జేఏసీ సమావేశం ప్రైవేట్ కళాశాలల జేఏసీ రాజమండ్రి మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సమావేశమై 23 నుంచి నగరంలో పూర్తి బంద్ చేసేందుకు నిర్ణయించారు. నర్సరీ నుంచి పీజీ వరకూ ప్రైవేట్ విద్యా సంస్థల వరకు బంద్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారు. నగరంలో 25న విద్యార్థులతో మహా సైకిల్ ర్యాలీ, 26న పుష్కరాల రేవులో స్కేటింగ్, కోలాటం, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. 27న విద్యార్థి గళ ఘోష, 28న మోరంపూడి సెంటర్లో విద్యార్థి లక్ష గళార్చన నిర్వహిస్తారు. 30న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు పుష్కరాల రేవు వద్ద రిలే దీక్షలు చేపడతారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కన్వీనర్ గంగిరెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. ముమ్మిడివరం మండలం అయినాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన వంటా వార్పూ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో కుండలు చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మామిడికుదురులో కార్యకర్తలు చేపట్టిన దీక్షలు 32వ రోజుకు చేరాయి. రాజోలు కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హోరెత్తిన మహా ‘జన’ గర్జన అమలాపురం/అంబాజీపేట, న్యూస్లైన్ : అంబాజీపేట సమైక్య నినాదాలతో హోరెత్తింది. మండల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబాజీపేట సెంటర్లో మహాజన గర్జన ఉద్ధృతంగా జరిగింది. మండలవ్యాప్తంగానే కాకుండా ఇతర మండలాల నుంచి సైతం వేలాదిగా సమైక్యవాదులు తరలిరావడంతో అంబాజీపేట సెంటర్ జనసంద్రమైంది. విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు తదితరులు ఈ గర్జనకు హాజరయ్యారు. ఉదయం భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బలరామ హలపూజ, గోపూజ నిర్వహించారు. అనంతరం మహాజనగర్జనలో జేఏసీ నేతలు, ప్రతినిధుల ప్రసంగాలు, విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, సమైక్యాంధ్ర, దేశభక్తి గేయాలతో హోరెత్తింది. గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ, రైతులు, రాక్షసుల వేషధారణల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కళాభారతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హస్యవల్లరి కరతాళ ధ్వనులందుకుంది. జిల్లా టైలర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి.వి.రామారావు హిజ్రా వేషదారణతో చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. 450 అడుగుల జాతీయ పతాకాన్ని పురవీధుల్లో ఊరేగించడం హైలైట్గా నిలిచింది. మండల ఉద్యోగ జేఏసీ నాయకుడు డి.రాంబాబు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహజన గర్జనలో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు బండారు రామ్మోహనరావు, కల్వకొలను తాతాజీ, ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు గణపతి, కె.సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. -
ఎమ్మెల్యే అశోక్బాబుకు చుక్కెదురు
తుని, న్యూస్లైన్ : రాష్ర్ట విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఎన్జీఓలు, జేఏసీ, ఇతర కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు మాత్రం పదవులను వీడడం లేదని ఎన్జీఓలు దుయ్యబట్టారు. శనివారం స్థానిక జీఎన్టీ రోడ్డులో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజా అశోక్బాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. అయితే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. 38 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజల తరఫున ఎన్నికైన ఆయన ఎందుకు ఉద్యమంలోకి రావడం లేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలపై అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెల్యే శిబిరం నుంచి నిష్ర్కమించారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని సమైక్యవాదులు ఆరోపించారు. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలకు తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల నాయకులు దాడిశెట్టి రాజా, నరిసే శివాజీ, పోలిశెట్టి సోమరాజు, వంగలపూడి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, సకురు నాగేంద్ర నెహ్రూ, అప్పన శ్రీరాములు తదితరులు సంఘీభావం తెలిపారు. -
పొలికేక విజయవంతం
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ‘ప్రొద్దుటూరు పొలికేక’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సభను నిర్వహించారు. సభకు సమన్వయకర్తలుగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ ఉషారాణి, ఎంఈఓ రాజగోపాల్రెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డిలు సభ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. నాలుగు రోజుల ముందు ఇందు కోసం ప్రత్యేకంగా పొలిటికల్, నాన్ పొలిటికల్, ఉపాధ్యాయ జేఏసీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గం అంతా విస్తృత ప్రచారం చేయడంతో సభకు లక్ష మందికిపై జనం హాజరయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు ఉద్యోగుల వేషధారణ ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి. మరికొంత మంది విద్యార్థులు, ఉద్యోగులు దేశభక్తి గేయాలు ఆలపించారు. యూకేజీ విద్యార్థి జేసుతోపాటు టీచర్ వెంకటేశ్వరరెడ్డిలు అల్లూరి సీతారామరాజు, వీఆర్ఓ రాజశేఖరరెడ్డి శ్రీకృష్ణదేవరాయులు వేషధారణలు, వంగపండు ఉష సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
సమైక్య ఉద్యమానికి రూ.50 వేలు వితరణ
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్లైన్: ఐవోసీ డీలర్ వర్రా గురివిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి బుధవారం రూ.50 వేలు విరాళాన్ని స్థానిక ఎన్జీవో హోంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి చేతుల మీదుగా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లుకు అందించారు. ఉద్యమంలో ప్రజలు పాలు పంచుకుని సమైక్యాంధ్ర సాధనకు కృషిచేయాలని ఈ సందర్భంగా గురివిరెడ్డి పేర్కొన్నారు. ఏఆర్బీసీవీఆర్ ట్రావె ల్స్ యాజమానులు బి.శ్రీనివాసులరెడ్డి, ఆసం సురేష్కుమార్రెడ్డిలు కడపలో జరిగే సమైక్యగర్జన కార్యక్రమానికి బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాదులో జరిగే సమైక్యవాదుల సమావేశానికి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని, అవసరమయ్యే డీజిల్ను పెట్రోలు బంకుల యాజమాన్యం ఉచితంగా సమకూరుస్తుందన్నారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు అన్ని వర్గాలవారు అలుపెరుగని పోరాటాలు చేయాలన్నారు. ఈవో పీఆర్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, ఆర్ఐ రాఘవేంద్ర, వెటర్నరీ డాక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రిలే దీక్షలు
సాక్షి, అనంతపురం : అందరిదీ ఒకే కోరిక ... తెలుగువారంతా తరతరాలుగా ఒక్కటిగానే ఉండాలని.. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలని. అందుకే ప్రజలంతా ముక్తకంఠంతో ‘సమైక్య’ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. 20వ రోజు సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించారు. ప్రజలతో పాటు ఎన్జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకుంటుండడంతో ఉద్యమం తారస్థాయిని అందుకుంది. అనంతపురం నగరంలో ఏపీ ఎన్జీవోలు పెద్దఎత్తున ప్రదర్శనలు చేశారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘ఎస్మా’కు భయపడేది లేదని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్కో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో పాటు జాక్టో ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తెలుగుతల్లి కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి, డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల ఎదుట జాతీయరహదారులు సిబ్బంది, వైద్య సిబ్బంది, సీఐటీయూ, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా అధికారుల అధ్యక్షుడు, డీఆర్ఓ హేమసాగర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఒక్క రోజు దీక్ష చేశారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ప్రతి కాలనీకి చెందిన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు హోరెత్తించారు. సప్తగిరి, టవర్క్లాక్, తెలుగుతల్లి కూడళ్లలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంజారాలు సంప్రదాయ వేషధారణతో చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వారు ఆట పాటలతో హోరెత్తించారు. అనేక ఆటంకాల మధ్య సోమవారం నుంచి జేఎన్టీయూ, ఎస్కేయూలలో మొదలైన ఎంసెట్ కౌన్సెలింగ్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు కౌన్సెలింగ్ను వాయిదా వేశారు. ఉన్నతాధికారులతో చర్చించి తరువాత తేదీ ప్రకటిస్తామని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఎస్కేయూలో విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి, ఉద్యోగ, అధ్యాపక జేఏసీల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ఎన్జీఓలు, పలు ప్రభుత్వశాఖల ఉద్యోగులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ, జాక్టో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో జాక్టో రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. నాయీ బ్రాహ్మణులు ప్రదర్శన చేశారు. హిందూపురంలో ఉప్పర, బెస్త సంఘాలు, ఏపీఆర్జేసీ, శ్రీవాల్మీకి రామమందిర బృందం, నేషనల్ మజ్దూర్ యూనియన్, విద్యాసంస్థల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరింపజేశారు. కదిరిలో జేఏసీ, జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి దీక్షా శిబిరాలకు వచ్చి మద్దతు తెలిపారు. రెవెన్యూ, న్యాయశాఖ ఉద్యోగులు, గ్యాస్ ఏజెన్సీ, హోటళ్ల నిర్వాహకులు, స్వర్ణకారులు పట్టణంలో ర్యాలీ చేశారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వినియోగదారుల రిలే దీక్షకు వైఎస్సార్సీపీ నాయకుడు ఎల్ఎం మోహన్రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ, వంటా వార్పు నిర్వహించారు. మడకశిరలో ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, సమైక్యవాదులు ర్యాలీ చేశారు. గొరవయ్యలు నృత్యాలతో అలరించారు. సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. అమరాపురంలో కురబసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తచెరువులో వైఎస్సార్సీపీ నేత సోమశేఖర్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పుట్టపర్తిలో సమైక్యవాదులు ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జేఏసీ రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పెనుకొండలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బలిజ, కుమ్మర, వడ్డెర సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెడీమేడ్ గార్మెంట్స్ అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కణేకల్లు, రాప్తాడు, బెళుగుప్ప, ఉరవకొండలో సమైక్యవాదులు ర్యాలీలు చేశారు. నార్పలలో ఎన్జీఓలు రిలే దీక్షలు చేపట్టారు. పుట్లూరులో జేఏసీ నాయకుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ, ట్రాన్స్కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. యాడికిలో సమైక్యవాదులు ఆమరణ దీక్షలు చేపట్టారు. కూడేరులో విద్యార్థులు రోడ్డుపై చదువుకుంటూ నిరసన తెలిపారు. -
మహిళలతో ఎలా వ్యవహరించాలంటే..
సాక్షి, ముంబై: ఫిర్యాదు చేయడానికి స్టేషన్లకు వచ్చే మహిళలతో మర్యాదగా వ్యవహరించేందుకు నగర పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలు, చిన్న పిల్లల కేసుల్లో ఎలా నడచుకోవాలనే విషయమై కొన్ని స్వచ్ఛందసంస్థలు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నాయి. ఎవరైనా ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆమెతో ఎలా ప్రవర్తించాలనే విషయమై కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఎన్జీఓ నేహా ప్రోగ్రామ్ డెరైక్టర్ నైరీన్ దారువాలా తెలిపారు. అంతేగాకుండా పోలీసు స్టేషన్కు వచ్చిన మహిళ పరిస్థితిని అర్థం చేసుకొని సౌమ్యంగా స్పందించాలని పోలీసులకు సూచించారు. వి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనంజయ్ కులకర్ణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ను ఆశ్రయించే ప్రతి ఒక్క మహిళకూ న్యాయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం నిజమేనని అంగీకరించారు. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ధనుంజయ్ తెలిపారు. శిక్షణలో భాగంగా పోలీసులకు సెప్టెంబర్ మొదటివారంలో ప్రత్యేక సుహృద్భావ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పౌరులు పాల్గొననున్నారు. అంతేగాక జోన్ 3, 4, 5, 6కు చెందిన పోలీసుల కోసం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలీసులను బృందాల వారీగా విభజించి శిక్షణ ఇస్తారు. ఒక్కో బృందంలో 50 మంది కానిస్టేబుళ్లతోపాటు అధికారులు ఉంటారని దారువాలా తెలిపారు. ‘మహిళల కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు నియమనిబంధనలను తప్పకుండా పాటించాలి. వారికి సంబంధిత చట్టాల గురించి తెలియజేయడం ద్వారా కూడా వారికి హింస నుంచి రక్షణ కల్పించవచ్చు’ అని ఆమె తెలిపారు. ఈ శిక్షణలో చిన్న చిన్న నాటకాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ శిక్షణలో పోలీసులు పాల్గొన్న తరువాత.. వివిధ సందర్భాల్లో ఇక నుంచి వారు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా చేసి చూపించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, ముంబై పోలీసులు మహిళల కోసం నగరవ్యాప్తంగా నాలుగువేల ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 150 మంది సిబ్బంది కన్నా తక్కువగా ఉన్న పోలీస్టేషన్లలో ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు లేదా పోలీసు అధికారులను నియమించనున్నారు. ఇందుకోసం ఇటీవల 140 మంది మహిళా పోలీసులకు శిక్షణ కూడా ఇచ్చి గుర్తింపుకార్డులు జారీ చేశారు. మహిళలపై నేరాలు నిరోధించడానికి వీళ్లు పనిచేస్తారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు 300 నంబర్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని కులకర్ణి సూచించారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గం
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో అలుపెరగకుండా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా వరుసగా 19రోజులుగా ఎగసిన సమైక్య ఉద్యమం ఆదివారం కూడా ప్రభంజనంలా సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో యథావిధిగానే హోరెత్తాయి. విశాఖ జిల్లా గోపాలపట్నం, వేపగుంటల్లో విజయమ్మ దీక్షకు మద్దతుగా క్రైస్తవమత పెద్దలు ప్రార్ధనలు చేశారు. దీక్షకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఎంపీ సబ్బంహరి మాట్లాడుతూ, అందరి చెమట చుక్కలతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఏదో ఓ రోజు ఓ నేత వచ్చి రాష్ట్రాన్ని బాగుచేస్తారని అన్నారు. ఎస్మాకు బెదిరేది లేదన్న ఉద్యోగ సంఘాలు అనంతపురం నగరంలో ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్మాకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. వీహెచ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్కేయూ జేఏసీ నేతలు అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రాయదుర్గంలో ముస్లింలు, ఉద్యోగులు, సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు ఆయన సతీమణి కాపు భారతి సంఘీభావం ప్రకటించారు. విశాఖ పోర్టులో నేడు కార్యకలాపాలు బంద్ విశాఖ పోర్టు ట్రస్టులో సోమవారం సరుకుల ఎగుమతి దిగుమతులు నిలిచి పోనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పోర్టులో ఎగుమతి దిగుమతుల కార్యకలాపాలు నిర్వహించే అన్ని సంఘాలు బంద్కు పిలుపు నిచ్చాయి. సరుకుల ఎగుమతి దిగుమతి నిలిచిపోనుండటంతో ఈ ప్రభావం నౌకలపైనా పడనుంది. సమ్మెకు దిగిన కోర్టుల సిబ్బంది విశాఖ జిల్లా న్యాయస్థానాల సిబ్బంది ఆదివారం అర్థరాత్రి నుంచి సమ్మె చేపట్టారు. జిల్లాలో 61 న్యాయస్థానాల నుంచి 653 మంది శాశ్వత సిబ్బంది, మరో 200 మంది పార్ట్టైమ్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విధులు బహిష్కరించడంతో కోర్టుల్లో కార్యకలాపాలు ఎలా సాగుతాయన్న విషయమై చర్చ జరుగుతోంది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు సమైక్యాంధ్ర కోరుతూ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మోకాళ్లపై నిలబడి క్రైస్తవుల ప్రార్థన వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో మోకాళ్లపై నిలబడి క్రైస్తవులు ప్రార్థ్ధనలు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఐఎంఎ వైద్యులు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద ముస్లింలు నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. సమైక్యంగా ఉండాలంటూ బోనాలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మైలవరంలోని జాతీయ రహదారిపై తెలుగుతల్లి సెంటర్లో రజక సంఘం అధ్వర్యంలో ఆదివారం చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగామలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో రోడ్లను శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరం వద్దనే ముస్లింల నమాజ్ అవనిగడ్డలో ముస్లిం సోదరులు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్దే సమైక్యాంధ్ర కోరుతూ ప్రత్యేక నమాజ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం రాజా నగరం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. రాజానగరంలో జరిగిన యాత్రలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ముమ్మిడివరంలో జరిగిన యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నాయకులు పోలు కిరణ్మోహన్రెడ్డి, నగర యూత్ కన్వీనర్ గౌతమ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. రోడ్డుపైనే లక్ష్మీగణపతి హోమం బ్రాహ్మణ సంఘం, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో సుమారు 300 మంది ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. వడ్డెర సంఘం వినూత్న నిరసన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వడ్డెర సంఘం, వడ్డెర ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో విభజనను నిరసిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సోమప్ప సర్కిల్లో ఇటుకలతో గోడకట్టారు. రాళ్లు కొట్టడంతో పాటు రోళ్లు తయారు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ నాయకులు ఒంటికాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఎంపీ మేకపాటి ఆధ్వర్యంలో రాస్తారోకో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు కనుపర్తిపాడులో వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరులలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్దన్రెడ్డి, దబ్బల రాజారెడ్డి,పాశం సునీల్కుమార్, బాల చెన్నయ్య ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో దున్నపోతులకు కేంద్రమంత్రుల మాస్కులు తగిలించిన ఫ్లెక్సీతో వినూత్న నిరసన చేశారు. పెన్నా నదిలో కేసీఆర్కు కర్మకాండలు నిర్వహించి పిండ ప్రదానం చేశారు. గుంటూరు బస్టాండ్ సెంటర్లో ఆటోకార్మిక యూనియన్ ర్యాలీలో ఎంపీ రాయపాటి సాంబశివరావు పాల్గొని ఆటోను నడిపి ర్యాలీని ప్రారంభించారు. రేపల్లెలో ఆర్టీసీ కార్మికులు బస్డిపోలో చీపుర్లు పట్టుకుని శుభ్రం చేసి నిరసన తెలిపారు. కారంపూడిలో జరిగిన సమైక్యవాదుల నిరసనలో వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు. చేనేత కార్మికుల ర్యాలీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సుమారు 3 వేల మందితో చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డిని సమైక్య వాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా కడపలో క్రైస్తవులు సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీ చేపట్టి మానవహారం నిర్మించారు. కమలాపురంలో క్రైస్తవులు మోకాళ్లపై నిలబడి ప్రార్థనలు చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా నేడు కొయ్యలగూడెం బంద్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బంద్కు ఎన్జీవోల జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో బ్రాహ్మణ సంఘం యాగం చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ బస్సుయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ పాల్గొన్నారు. రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద గ్రామస్తులు, యువకులు రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 50 అద్దెబస్సులతో విజయనగరం పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గరివిడిలో సమైక్యవాదులు గంగిరెడ్లతో ప్రదర్శన చేపట్టిన అనంతరం హోమాలు , డప్పువాయిద్యాలతో రోడ్డుపై ఆటాపాటా నిర్వహించారు. పోలీసు వలయంలో ‘అనంత’ సమైక్యాంధ్ర ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తోన్న ‘అనంత’పై ప్రభుత్వం డేగకన్ను వేసింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 15 వేల మంది పోలీసులు జిల్లాలో మోహరించగా, తాజాగా ఆదివారం 13 వేల మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను కేటాయించారు. రాయలసీమ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలను విభజించి... రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికే అదనపు బలగాలను మోహరిస్తున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 15న డీజీపీ దినేష్రెడ్డి తిరుపతిలో రాయలసీమ ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆరా తీశారు. అదే జరిగితే ‘అనంత’ అగ్నిగుండమయ్యే అవకాశం ఉందని ఎస్పీ శ్యాంసుందర్ డీజీపీకి వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విస్తృత పోలీసు బలగాలు జిల్లాకు తరలివస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా, పోలీసులు బలగాలు ఆదివారం సాయంత్రం అనంతపురంలో భారీఎత్తున కవాతు నిర్వహించాయి. -
ఎన్జీఓ జేఏసీకి అధికారుల సంఘం మద్దతు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్జీఓ జేఏసీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో శనివారం నుంచి జిల్లా అధికారులు పాల్గొని సంఘీభావం తెలుపుతారని జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్వో రామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఎన్జీవోల నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటామని పేర్కొన్నారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సమావేశమవుతామని తెలిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. 20న మధ్యాహ్న సమయంలో ప్రదర్శన, 21న జిల్లా అధికారుల పెన్డౌన్, 22న జిల్లా అధికారులంతా మాస్ క్యాజువల్ లీవ్లో వెళ్లనున్నట్టు ప్రకటించారు. దశలవారీగా జిల్లా అధికారులు జేఏసీకి కార్యాచరణ ప్రణాళికతో మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. -
వానలోనూ.. సమైక్య జోరు
సాక్షి, కడప : సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో బలంగా వినిపిస్తోంది. జోరువానలో సైతం సమైక్య ఉద్యమ హోరు తగ్గలేదు. రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలతో జిల్లా వేడెక్కుతోంది. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ఎన్జీఓల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పులివెందుల, రాయచోటిలో సమైక్య బంద్ సక్సెస్ అయింది. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రహదారులను దిగ్బంధంచేశారు. కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలను సైతం ముందుకు కదనీయలేదు. సోనియా, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను తగలబెడుతునే ఉన్నారు. కడప, పులివెందులలో మహిళా ఉపాధ్యాయులు రోడ్లపైనే శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. వైఎస్సార్ సీపీనేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ముస్లింల ఆధ్వర్యంలో కడప నగరంలో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. జేఏసీ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, నగర పాలక సంస్థ, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఉద్యానశాఖ అధికారులు, ఉద్యోగులు ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు,ఏడీలు దశరథరామిరెడ్డి, మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ప్రైవేటు వైద్యులు చేస్తున్న స్కూటర్ ర్యాలీని పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేశారు. అంబులెన్స్లు నిరసనల్లో పాల్గొనగా వాటిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి,మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి ఆమరణ దీక్ష శుక్రవారంతో ఐదవ రోజు పూర్తి చేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమందిగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేశారు. జోరువాన, చలిని సైతం లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో ఆందోళన కొనసాగిస్తున్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్బాబు, అంజాద్బాష దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలిపారు.జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో పట్టణం నలువైపుల ఉన్న రహదారులను పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారు. ద్విచక్ర వాహనాలను సైతంముందుకు కదలనీయలేదు. మార్కెట్ వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, అల్లె ప్రభావతి పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారంతో రెండవ రోజుపూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి సంఘీభావం తెలిపారు. వైస్సార్ సీపీ, మెడికల్ షాప్, పెయింటర్స్, కళ్లుగీత కార్మికుల ఆధ్వర్యంలో వర్షంలోనూ వైఎస్సార్ సర్కిల్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అక్కడే వంటా వార్పు చేపట్టారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి దీక్ష శుక్రవారం రెండవరోజు పూర్తి చేసుకుంది. ఈయన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్రెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీక్షలకు మద్దతు తెలిపారు. ముస్లింలు సైతం భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు తమ సంఘీభావాన్ని తెలిపారు. బద్వేలులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి పెద్ద ఎత్తున జేఏసీ, ఆర్టీసీ, ఉపాధ్యాయ ఐక్య కార్యచరణసమితి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. పోరుమామిళ్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కలసపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వైపులా రహదాలను దిగ్బంధనంచేశారు. ద్విచక్ర వాహనాలను సైతం తిరగకుండా అడ్డుకున్నారు. వర్షంలోనే తడుస్తూ వైఎస్సార్ సీపీ నేతరాచమల్లు ప్రసాద్రెడ్డి,మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి ఆందోళనను పర్యవేక్షించారు. రెవెన్యూ ఉద్యోగులు, బీఈడీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టైలర్స్, వాకర్స్, అర్నాడ్డ్ జిమ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం నిర్వహించి బంద్ పాటించారు. తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నడిరోడ్డుపై క్రికెట్ ఆడుతూ, వంటా వార్పు చేపట్టారు.టైలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో న్యాయవాదులు, ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రరాయచోటిలో బంద్ సక్సెస్ అయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జమాతె ఉలేమా హింద్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాలుగురోడ్ల కూడలిలో రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పుకార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి బంద్ను పర్యవేక్షించారు. వీరబల్లిలో సమైక్యవాదులు రెండు వేల మందికి పైగా అన్నదానం చేశారు. -
సమ్మె సంపూర్ణం
ఒంగోలు, న్యూస్లైన్: జిల్లాలో సకల జనుల సమ్మె రెండో రోజు బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఎన్జీఓలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులకు గైర్హాజరయ్యారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో ఆర్టీసీ బుధవారం * 70 లక్షల రాబడిని కోల్పోయింది. వైఎస్సార్ సీపీతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. పర్చూరులో పట్టువదలని దీక్ష: పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీక్షను విరమించాలని ఒత్తిడి వస్తున్నా ఆయన అంగీకరించడంలేదు. భరత్కు సంఘీభావంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా పర్చూరులోని బొమ్మల సెంటర్కు చేరుకున్నారు. సమైక్యాంధ్ర జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పర్చూరులో బంద్ నిర్వహించారు. రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డుపైనే ఆటలాడుతూ రాష్ట్ర విభజనను నిరసించారు. భరత్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో పోలీసులు కూడా ఏదో విధంగా దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు కార్యకర్తల దృష్టికి వచ్చింది. దీంతో 40 మంది మహిళా కార్యకర్తలు ఆయనకు సంఘీభావంగా రిలే దీక్షలో పాల్గొన్నారు. కనిగిరి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బన్నీ ఆధ్వర్యంలో మోటారు బైక్ర్యాలీతోపాటు మానవహారం నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండు వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. బస్టాండు సెంటర్ నుంచి ఆటోవర్కర్స్ యూనియన్ నిరసన ర్యాలీ చేసి, కేసీఆర్, సోనియా, దిగ్విజయ్సింగ్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పామూరు మండలం కొండారెడ్డిపల్లిలో సోనియా శవయాత్ర నిర్వహించారు. హనుమంతునిపాడు, వేములపాడుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన, మానవహారం చేపట్టారు. అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీఓలు కలిసి జేఏసీగా ఏర్పడి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాల గురించి గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ తెలిసేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. జే.పంగులూరులో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారంతా సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ, మానవహారంలో వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా బంద్ నిర్వహించాయి. గిద్దలూరులో జరిగిన జేఏసీ మౌన ప్రదర్శనకు వైఎస్సార్ సీపీ నేత, ఎన్ఆర్ఐ రామమోహనరెడ్డి పాల్గొని మద్దతు పలికారు. బేస్తవారిపేట మండలం పోతులపాడులో విద్యార్థులు ధర్నా చేసి సమైక్యాంధ్రకు జై అంటూ నినాదాలు చేశారు. కంభంలో మాజీ సైనికులు నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు చేగిరెడ్డి లింగారెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓల వినూత్న నిరసన: ఒంగోలులో న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం ఆట లాడుతూ రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ సంఘ నేతలు కలెక్టరేట్ వద్ద బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోనియా చెప్పినట్టు వినేదంటూ గంగిరెద్దుకు ఆంటోని కమిటీ ప్లకార్డు కట్టారు. నిరసనల్లో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ పాల్గొన్నారు. చీరాలలో గడియార స్తంభం సెంటర్ వద్ద రెండు వేలమంది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పొన్నలూరులో బీసీ సంఘాల నాయకులు బంద్ చేశారు. కొండపి మండలం కే.ఉప్పలపాడులో సోనియా, నేతివారిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను విద్యార్థులు, ప్రజలు దహనం చేశారు. బల్లికురవలో ఆర్యవైశ్య సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి మూడోరోజుకు చేరుకున్నాయి. త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో విద్యార్థులు, గ్రామస్తులు కలిసి రాస్తారోకో చేశారు. త్రిపురాంతకం మండలం దోర్నాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. పెద్దారవీడులో విద్యార్థులు, వైఎస్సార్సీపీ నేతలు కలిసి ర్యాలీ నిర్వహించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్సీ శిద్దా రాఘవరావు పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ సంఘ నేతలు కాలేజీ స్టూడెంట్స్తో కలిసి ర్యాలీ నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టిబొమ్మను ద హనం చేశారు. రాచర్లలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కందుకూరులో సమైక్యపరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్ సిబ్బంది ఏరియా వైద్యశాల వద్ద, విద్యుత్శాఖ ఉద్యోగులు కందుకూరు డీఈ కార్యాలయం వద్ద, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఈఈ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించారు. కరేడులో సమైక్య గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. చీమకుర్తిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎన్జీఓలు అంతా కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. మద్దిపాడులో విద్యార్థులు, ఉద్యోగులు కలిసి జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. మద్దిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు గ్రామస్తులు వంటావార్పు చేపట్టారు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం, తిమ్మసముద్రంలలో నిరసన కార్యక్రమాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకులను సైతం మూసివేయించారు. -
కలిసి వస్తే.. సమైక్యాంధ్ర సాధ్యం
ఉద్యోగ,ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు, కార్మిక, మేధావులంతా ముందుకు కలిసి కట్టుగా వస్తే సమైక్యాంధ్ర సాధ్యమని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు అన్నారు. ఆదివారం ఎన్జీవో హోంలో వేదిక ప్రతినిధులు తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణ, చౌదరి నారాయణమూర్తి, హనుమంతు సాయిరాం, బరాటం లక్ష్మణరావు, దుప్పల వెంకటరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, అశోక్, నాగరాజ్, విజయ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూపీఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భయపడరన్నారు. యూపీఏ ప్రభుత్వం మరో ప్రకటన చేసే వరకు సమైక్య లక్ష్యసాధన కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరుచుకునేలా ప్రశాంతంగా ఉద్యమాలను యువత నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చేసినంత మాత్రాన తెలంగాణ విభజన జరగదన్నారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణా సొత్తు కాదని, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి ఆస్తిగా పేర్కొన్నారు. విద్యాసంస్థలు, కర్మాగారాలు, అక్కడ ఉన్న సంపద ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. హైదరాబాద్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని, నెత్తురు ధారపోసైనా కాపాడుకుంటామని శపథం చేశారు. ఊరూరా తెలుగు తల్లి జెండాలు జిల్లాలో ప్రతి ఊళ్లోనూ తెలుగుతల్లి జెండాలు ఆవిష్కరించాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సాగాలని కోరారు. దీనికి ప్రజాస్వామ్య, సమైక్య వాదులంతా ముందుకు రావాలన్నారు. సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని లేకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ను ముక్కలు చేయాలంటే ఒప్పుకోని బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ను ఎందుకు ముక్కలు చేయాలని యోచిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఉద్యోగుల జోలికి వెళితే చర్యలు తప్పవని ప్రతినిధులు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, మేధావుల సంఘాలు మరింత ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయన్నారు. ఉద్యోగులు మెరుపు సమ్మెకు సమాయత్తమవుతున్నారని తెలిపారు. కేసును ఉపసంహరించుకోవాలి రాజాంలో విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారులకు కోరారు. వారు సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమాలు చేశారే తప్ప చెడ్డవారు కాదని, దీని గురించి ఎస్పీని కలుస్తామని చెప్పారు. నేడు భారీ ర్యాలీ సమైక్యాంధ్ర సాధన కోసం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం సూర్యమహల్ నుంచి ఏడు రోడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కె.వేణుగోపాల్, శ్రీనివాసానందస్వామి, ఎంఆర్కె దాస్, విజయ్, డి. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఉగ్రరూపం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థి జేఏసీ, ఎన్జీఓలు ఉమ్మడిగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో చేపట్టిన ఉద్యమం ఐదో రోజూ ఉధృతంగా సాగింది. వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్, సిటీ సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం హైవేపై రాస్తోరోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరులో జర్నలిస్ట్లు కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గూడూరు రాణిపేటకు చెందిన పెంచలయ్య గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఎన్జీఓ నేతలు నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నెల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు వద్ద హైవేపై ఆందోళనకారులు ఒకటిన్నర గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. హైవేపై ఆందోళనకారులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మినీబైపాస్ రోడ్డులోని పూలే విగ్రహం వద్ద గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. రాజీనామాలు చేయని సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాగేశారు. టీడీపీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి కనకమహల్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీ నేత రమేష్రెడ్డి నేతృత్వం వహించారు. సూళ్లూరుపేటలో బస్టాండ్ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేట, తడతో పాటు అన్ని మండలాల్లో ఆందోళన కారులు సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుంచి టవర్క్లాక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైవేలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జర్నలిస్ట్లు కళ్లకు గంతలు కట్టుకుని టవర్క్లాక్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. రాణిపేటకు చెందిన పెంచలయ్య అనే వ్యక్తి రాష్ట్ర విభజన వార్తలు టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజులుగా విభజన వార్తలతో పెంచలయ్య ఆందోళన చెందుతున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కావలిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేసేందుకు ఆదివారం బీసీ భవన్లో ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార సంఘాలు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ను కార్యాచరణ కమిటీ కన్వీనర్గా ఎన్నుకున్నాయి. ఇకపై ఆందోళనలు ఉధృతం చేయాలని ఆందోళనకారులు తీర్మానించారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబపురం గ్రామస్తులు కాగలపాడు రోడ్డులో ఆదివారం గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వెంకటగిరిలోని బంగారుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సోనియా దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాతబస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.