Parvathipuram manyam District News
-
అక్కసు ఎందుకు బాబూ?
● మున్సిపల్, అంగ్వాడీల మండిపాటు ● చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ ● కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన అంగన్వాడీ, చిరుద్యోగులపై..పార్వతీపురం టౌన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవు ట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ సంక్షే మ పథకాలు క్రమం తప్పకుండా అందాయి.. పిల్లల చదువులకు ఆర్థిక కష్టాలు ఉండేవి కావు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అందజేస్తున్న అరకొర సంక్షేమ పథకాల ను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయకపోవడం విచారకరం.. చాలీచాలని వేతనాల తో ఇబ్బందులు పడుతున్న వారికి సంక్షేమ పథకా లు నిలిపివేయడం అన్యాయం.. చిరుద్యోగులపై ఇంత అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ అవుట్ సోర్సింగ్, మున్సిపల్, అంగన్వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఽసీఐటీయూ, అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కొందరు ఉద్యోగులు కన్నీరుకార్చారు. న్యాయం చేయాలంటూ డీఆర్వో హేమలతకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కేవ లం రూ.13వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, ఇంతటి తక్కువ జీతం పొందుతున్న వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు వచ్చిన అరకొర జీతంతో బతకడం కష్టంగా మారిందన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులా...? అంగన్వాడీ వర్కర్లకు 11,500, మినీ వర్కర్లు, హెల్పర్లకు రూ.7వేలు గౌరవ వేతనమే ఇస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.12వేలు జీతం లోబ డే ఉంది. అయినా అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా రికార్డుల్లో నమోదు చేసి ఉంటే.. తక్షణమే ఉద్యోగభద్రత కల్పి ంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవా ధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, అవుట్సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ, కాంట్రాక్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయి స్ యూనియన్ నాయకులు ఎస్.అవినాష్ కుమార్, ఎన్.కమల, వై.శ్రీధర్, బి.కొండలరావు, ఎ.బుజ్జ మ్మ, ఎం.విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీలు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వేతనాలు పెంచకపోగా ఇప్పుడు సంక్షేమ పథకాలను రద్దుచేయడం సరైన విధానం కాదు. అంగన్వాడీలను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణిస్తారు? ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలి. – సీహెచ్ రేవతి, అంగన్వాడీ వర్కర్ -
నేడు వీఆర్ సాగర్ వద్ద యోగాంధ్ర
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మక్కువ: పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్రలో భాగంగా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఏనుగుకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఏనుగు కొండ పరిసరాల ను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, అధికారులు ఉన్నారు. సీతంపేట వైపు ఏనుగులు భామిని/సీతంపేట: భామిని మండలంలో అల్లకల్లోలం సృష్టించిన ఏనుగుల గుంపు సీతంపేట ఏజెన్సీలోకి సోమవారం ప్రవేశించాయి. భామిని మండలం పోలవరం నుంచి పోలీస్ కోట మీదుగా సీతంపేట మండలం చిన్నబగ్గ, తాబేలవలస గ్రామాలకు చేరుకున్నట్టు అటవీశాఖాధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో ఏనుగుల గుంపు పల్లపు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతాలకు తరలివెళ్తున్నట్టు భావిస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగులు సంచరించే వైపు ఎవ్వరినీ వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 3,594 మంది టీచర్లకు స్థాన చలనం ● 97 మందికి ఉద్యోగోన్నతులు ● ముగిసిన బదిలీ, ఉద్యోగోన్నతుల తంతు విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలో నెలరోజులుగా సాగిన బోధన సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ తంతు ఎట్టకేలకు ముగిసింది. బదిలీ అయిన, ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులు సోమవారం నూతన స్థానాల్లో విధులకు హాజరయ్యారు. బదిలీ షెడ్యూల్కు ముందు చేపట్టిన ఉద్యోగోన్నతి ప్రక్రియలో వివిధ కేడర్లకు చెందిన 97 మంది ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం ఏర్పడిన ఖాళీలతో పాటు, క్లియర్ వేకెన్సీ, తప్పనిసరి బదిలీ స్థానాలు, రిక్వెస్ట్ బదిలీ టీచర్లకు చేపట్టిన బదిలీ షెడ్యూల్లో 3,594 మందికి స్థాన చలనం జరిగింది. బదీలీ అయిన వారిలో హెచ్ఎంలు 69 మంది, మోడ ల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 275, స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయు లు 1,345 మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయు లు, తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులు 1,816 మంది, భాషా పండితులు 60 మంది, పీఈటీలు 26 మంది, ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ మరియు ఇతరులు ముగ్గురు ఉన్నారు. -
నేలపైనే వైద్యం
అమ్మో.. మలేరియా..! ● సీతంపేట ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి ● ఒకే రోజు 23 మందికి మలేరియా పాజిటివ్ ● 349 ఓపీ నమోదు ● ఇందులో జ్వర పీడితులు 91 మంది గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి నాలుగు రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. బెడ్లు చాలడం లేదు. ఇద్దరు ముగ్గురికి ఒకే బెడ్పైన, వరండాలో నేలపైనే రోగులను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక్కడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఆస్పత్రి భవ నాన్ని పూర్తిచేసి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ఆస్పత్రిలో అద నపు బెడ్లువేసి వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆస్పత్రి వరండాలోనే వైద్యసేవలు పొందుతున్న రోగులు సీతంపేట: ఏజెన్సీలో మలేరియా కేసులు పెరు గుతున్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. సీతంపేట ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం 349 ఓపీ నమోదుకాగా, ఇందులో 91 మంది జ్వరపీడితులే. వీరిలో 23 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇన్పేషెంట్లుగా 39 మంది చేరారు. రోగులందరికీ మెరుగైన వైద్యసేవలందిస్తు న్నట్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ డి.వి. శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ప్రజలు కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. -
పథకాలు వర్తింపజేయాలి
పార్వతీపురం మున్సిపాలి టీలో అవుట్సోర్సింగ్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్నా ను. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, మా కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకా లు అందేవి. గతంలో మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. – రాజేష్, అవుట్సోర్సింగ్, ఉద్యోగి, పార్వతీపురం మున్సిపాల్టీ -
గిరిపుత్రుల నుంచి రూ.23 లక్షలు స్వాహా!
●సీసీ నిర్వాకమే.. 2014 నుంచి 2020 వరకు రాయగడ జమ్ము సీసీగా పనిచేసిన వ్యక్తిపైనే మాకు అనుమానాలున్నాయి. ఆయనే నిధులు దుర్విని యోగం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గతంలో సదరు సీసీ బదిలీపై వెళ్లారు. మరలా ప్రస్తుతం ఇక్కడే నియమించారు. గిరిజనులను మోసం చేయ డం దారుణం. సదరు సీసీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి. – మండంగి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాక్షి, పార్వతీపురం మన్యం: వారంతా గిరిపుత్రులు. అక్షరం రాని అమాయకులు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయడమే తెలు సు. అటువంటి వారికీ టోకరా పెట్టారు మన ‘వెలు గు’ సిబ్బంది. గిరిజనులకు రుణాల పేరిట ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు వాడేశారు. ఆ సొమ్ముల్లో ఒక్క రూపాయి కూడా ఆ అమాయకులకు వెళ్లలేదు. తీరా, ఇప్పుడు వారి పేరి ట రుణాలు కనిపిస్తే లబోదిబోమంటున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు, రాయగడ జమ్ము, చాపరాయిబిన్నిడి పంచాయతీలకు చెందిన సుమారు 14 మహిళా సంఘాల్లో సీ్త్ర నిధి(టీఎస్పీ) రుణాల్లో గోల్మాల్ చోటు చేసుకుంది. రుణాలు పొందకుండానే, దాదాపు 50 మంది గిరిజనులు రుణాలు పొందినట్లు చూపుతున్నారు. ప్రధానంగా అప్పట్లో సీసీగా పని చేసిన ఓ వ్యక్తిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2020 వరకు అతని పని చేసినట్లు గిరిజనులు చెబుతున్నారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో సంఘాల పేరిట సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. రాయగడ జమ్ము ఎస్హెచ్జీలో 27 మంది, చాపరాయి బిన్నిడి ఎస్హెచ్జీలో 12 మంది, బాలేసులో 11 మంది పేరిట రూ.23 లక్షలు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఆ నిధులు గిరిజనులకు ఇవ్వకుండానే.. ఒక్కొక్కరి పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు పొందినట్లు చూపుతున్నారు. అధికారులకు మొర.. తమకు తెలియకుండానే రుణాలు తీసుకున్నారని తెలియడంతో వల్లాడ, చాపరాయిబిన్నిడి, రేగిడి, కర్లగూడ, చినరావికోన గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తరలివచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణాల పేరిట టోకరా వెలుగు సీసీ నిర్వాకమేనా? -
తల్లికి వందనం అందలేదు
సాలూరు: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శ్యామ్ప్రశాద్ ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్తో పాటు డ్వామా పీడీ రామచంద్రరావు అర్జీలు స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు అందగా, రెవెన్యూ, తల్లికి వందనం పథకం అందలేదన్నవే అధికంగా ఉన్నాయి. తన ముగ్గురు పిల్లలు లలిత, లక్ష్మి, మణికుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ పార్వతీపురం మండలం డోకిశీల సచివాలయం పరిధిలోని జోగిదొరమెట్టవలస 6గామానికి చెందిన జట్టమ్మ తన పిల్లలతో కలిసి కలెక్టర్కు గోడువినిపించింది. భూమి అధికంగా ఉందని, అధిక విద్యుత్ విని యో గం, ఇన్కంట్యాక్స్, తదితర సమస్యలతో తమకు తల్లికి వందనం రాలేదంటూ పలువురు అర్జీలు అందజేశారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు. -
సైన్ంగ్ చెక్కులు.. స్టార్స్కు చిక్కులు!
సాక్షి, పార్వతీపురం మన్యం: షైనింగ్ స్టార్స్ నగదు పురస్కారం అందుకున్న విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు చిక్కులు తప్ప డం లేదు. స్వయంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పంపిణీ చేసిన చెక్కు లు చెల్లుబాటు కావడం లేదు. చెక్కులపై చేసిన సంతకమే ఇందుకు కారణం. దీంతో తల్లిదండ్రులు... తమ పిల్లలను తీసుకుని బ్యాంకులు, డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. సోమ వారం జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి వచ్చి సదరు చెక్కులను వెనక్కి ఇచ్చారు. అధికారుల నిర్వాకంతో.. పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఈ నెల 9న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే. పదోతరగతి, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఇన్చార్జి డీఈఓగా ఉన్న రాజ్కుమార్కు ఎఫ్ఏసీ ఇవ్వకుండానే చెక్కులపై సంతకాలు చేయించారు. ఇలా పదో తరగతికి సంబంధించి 95 మందికి మూడు రకాల చెక్కులను పంపిణీ చేశారు. అవి తీసుకుని బ్యాంకులకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ తగిలింది. అవి చెల్లవని చెప్పడంతో వారంతా డీఈఓ కార్యాలయం చుట్టూ నాటి నుంచి తిరుగుతున్నారు. సోమవారం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చెక్కులు తీసుకొచ్చి కార్యాలయంలో అందజేశారు. దీంతో కలెక్టర్ సహా, విద్యాశాఖాధికారులు బ్యాంకర్లతో మాట్లాడారు. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు తిప్పిపంపాయి. మరో దారి లేక, అప్పటికే విషయం పెద్దది కావడడంతో మళ్లీ కొంతమందిని డీఈఓ కార్యాలయానికి పిలిపించుకుని నేరుగా నగదు అందజేశారు. రెవెన్యూ స్టాంప్పై సంతకం చేయించుకుని మరీ నగదు ఇవ్వడం గమనార్హం. మంత్రి లోకేశ్ వద్ద పరువు పోతోందేమోనన్న భయంతో విద్యాశాఖాధికారులు సొంత డబ్బులు సర్దుబాటు చేశారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చెక్కుల్లో సమస్యలు లేవు : కలెక్టర్ షైనింగ్ స్టార్స్ చెక్కుల్లో సమస్యలు లేవని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. 95 మంది పదో తరగతి విద్యార్థులు షైనింగ్ స్టార్ కార్యక్రమంలో చెక్కులు పొందగా.. వారిలో 73 మందికి ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు బ్యాంకుల్లో తమ చెక్కులను డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు లేని మారుమూల, దూర ప్రాంతాల కు చెందిన విద్యార్థులకు నేరుగా చెల్లించే ఏర్పా టును కూడా చేశామని చెప్పారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఇటీవల మారడం వల్ల సమస్య ఏర్పడిందన్నారు. ఈ నెల 11వ తేదీ తర్వాత పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం చెక్కుల నగదు జమలో ఎటువంటి సమస్యా లేదని చెప్పారు. బ్యాంకుల్లో సమస్య తలెత్తితే జిల్లా రెవెన్యూ అధికారి (83338 13248), జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (91213 86194) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు. -
చంద్రబాబు అంటే మోసం
జగన్ అంటే నమ్మకం...చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కేసులు, మోసాలు, అవినీతి, అబద్ధాలు, దాడులు, దోపీడీలు తప్ప.. ప్రజలకు చేకూరిన లబ్ధి ఏదీ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది మోసాలు, అప్రజాస్వామిక పరిపాలనపై వైఎస్సార్సీపీ అధిష్టానం ముద్రించిన ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాలను సోమవారం సాయంత్రం చీపురుపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ, రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూన్ 12 నుంచి 2025 జూన్ 12 వరకు కూటమి ప్రభుత్వ పరిపాలన, 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు వైఎస్సార్సీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి సంస్కరణలు బేరీజు వేస్తూ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేసి ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతిని గుర్తుచేశారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేశారని, 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని అన్నారు. ఏడాది కూటమి పరిపాలనలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు రావాల్సిన జనరల్ ఫండ్స్ ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేఖ రాసినా సమాధానం రాలేదన్నారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. -
కొడుకును బడిలో చేర్చడానికి వచ్చి తండ్రి మృతి
పాచిపెంట: కొడుకును పాఠశాలలో చేర్పించడానికి వచ్చిన ఓ తండ్రి అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన పాచిపెంట మండల కేంద్రంలో సోమవారం విషాదం నింపింది. ఈ ఘటనపై వైద్యాధికారి, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయిగుడ్డి వలస గ్రామానికి చెందిన చెదల కన్నయ్య కుమారుడు గౌతం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. అయితే పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతికి సీటు రావడంతో సోమవారం ఉదయం రికార్డ్షీట్ తీసుకుని పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేసేందుకు పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది, స్థానికులు పాచిపెంట పీహెచ్సీకి హుటాహుటిన తరలించారు. వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. -
సామాన్యుల వరకు యోగా చేరువ కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో సామన్య మానవుడి వరకు యోగాను తీసుకు వెళ్లాలనేదే యోగాంధ్ర లక్ష్యమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యోగాంధ్ర, డీఏ జుగా, సీఎం సూర్యపవర్, పీఎం జన్మన్ తదితర అంశాలపై జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగా గత 25 రోజులుగా జిల్లాలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం రూపొందించిన కొన్ని పారామీటర్స్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృచేసిన అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటివరకు యోగాభ్యాసంలో భాగంగా మాత్రమే కార్యక్రమాలను చేపట్టామని, ఇదేస్ఫూర్తితో ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పిల్లలు, పెద్దలను భాగస్వాములను చేసి జిల్లా ముందంజలో ఉండేలా కృషిచేయాలని అధికారులను కోరారు. ● సీఎం సూర్యఘర్కు మనవాళ్లే ప్రచార కార్యకర్తలు సీఎం సూర్యఘర్ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులే ప్రచారకర్తలని కలెక్టర్ పేర్కొన్నారు. సూర్యఘర్ యూనిట్లు ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ● పీఎం జన్మన్ గృహాలు వేగవంతం కావాలి జిల్లాలో పీఎం జన్మన్ గృహాలు మరింత వేగవంతం కావాలని, ప్రతివారం ప్రగతి కనిపించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కురుపాం, సీతంపేట, జీఎల్ పురం మండలాల్లో ప్రగతి కనిపించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. -
పాఠశాలలో ప్రొజెక్టర్ చోరీ
రామభద్రపురం: మండలకేంద్రంలోని అగురువీధి ప్రాథమిక పాఠశాలలో కయాన్ ప్రొజెక్టర్ చోరీకి గురైంది. ఈ చోరీపై పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లతో కలిసి హెచ్ఎం బి.తిరుపతిరావు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. హెచ్ఎం తెలిపిన వివరాల ప్రకారం డిజిటల్ తరగతుల నిర్వహణలో భాగంగా 2022లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.30 లక్షలు విలువ చేసే కయాన్(ఇంటరాక్టివ్ ప్రాజెక్టర్)అందజేసింది. అయితే పాఠశాలల పునఃప్రారంభం తర్వాత శని,ఆదివారాలు సెలవుల్లో గుర్తు తెలియని దుండగులు తరగతి గది తాళం విరగొట్టి కయాన్ ప్రొజెక్టర్ దొంగతనానికి పాల్పడ్డారు. పాఠశాలకు చెందిన స్కావెంజర్ ఆదివారం ఉదయం తరగతి గదులు పరిశుభ్రం చేయడానికి వెళ్లి తలుపుల తాళం విరగ్గొట్టి ఉండడం ప్రొజెక్టర్ చోరీ జరిగినట్లు గుర్తించి తనకు సమాచారం ఇవ్వగా వెంటనే పాఠశాలకు చేరుకుని పరిశీలించి తోటి టీచర్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు పాఠశాలకు చేరుకుని చోరీ జరిగిన తరగతి గదితో పాటు పాఠశాల ఆవరణంతా పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.10 మంది జూదరుల అరెస్ట్పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలస సమీపంలో మామిడి తోటలో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ తెలియజేశారు. వారి నుంచి రూ.14,210 నగదు, 4 మోటార్ సైకిల్స్, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను కోర్టుకు తరలిస్తామ న్నారు.గంజాయి మత్తులో విద్యార్థిపై దాడివిజయనగరం క్రైమ్: నగరంలోని కేఎల్పురానికి చెందిన సాగర్ మరోసారి గంజాయి మత్తులో ఆర్కే కళాశాలకు చెందిన విద్యార్థి మహేంద్ర లక్ష్మణ్ కుమార్పై దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా సాగర్ గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థి, తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు, క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేలబావిలోపడి మతిస్థిమితంలేని వృద్ధుడి మృతిరాజాంసిటీ: నేలబావిలో పడి పట్టణ పరిధిలోని గొల్లవీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ (69) అనే మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ కొద్ది సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి ఒకటి రెండు రోజులు ఎటో వెళ్లిపోయి మళ్లీ వస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 15న మధ్యాహ్నం భోజనం అనంతరం ఎటో వెళ్లిపోయాడు. రాత్రి సమయం అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త తెలగవీధిలోని శ్మశాన వాటిక వద్ద బావికి స్నానానికి వెళ్తుండేవాడని వృద్ధుడి భార్య నారాయణమ్మ భావించి సోమవారం తెల్ల వారుజామున కుటుంబసభ్యులతో వెళ్లి చూడగా బావి ఒడ్డున లక్ష్మణ చేతికర్ర ఉండడంతో బావిలోకి చూశారు. బావిలో మృతదేహం తేలియాడడంతో పోలీసులకు మృతుని భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సామూహిక కుంకుమార్చనలు విజయనగరం టౌన్: స్థానిక రామానాయుడు రోడ్డులోని శ్రీకోటసత్తెమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు చేశారు. అనంతరం లలిత సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు అయిన మంగళవారం పెద్దచెరువులో తెప్పోత్సవం, ఘటాల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఉచిత సీట్లు ఇవ్వకపోతే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు
విజయనగరం అర్బన్: ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో పేదలకు ఉచితంగా కేటాయించిన సీట్లను ఇచ్చే చట్టాన్ని అమలు చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను ఉచితంగా పేదలకు కేటాయించాల్సి ఉండగా స్థానికంగా ఉన్న ఫోర్ట్సిటీ, సన్, బీసెంట్, చాణిక్య స్కూల్స్లో సీట్లు కేటాయించడం లేదని పలువురు తల్లిదండ్రులు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత నాలుగు పాఠశాలల ద్వారా 240 సీట్లు కేటాయించాల్సి ఉందని వాటిని వెంటనే కేటాయించమని ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ యూ.మాణిక్యంనాయుడికి సూచించారు. పీజీఆర్ఎస్కు 190 వినతులు ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుంచి 190 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువులోపల వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 46 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సౌమ్యలత 46 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదు అంశాలను పరిశీలించి, పూర్వా పరాలపై విచారణ చేసి, వాస్తవమైతే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 190 వినతులు -
ఇరువర్గాల కొట్లాట
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని తురకనాయుడు వలస గ్రామంలో హరిజనులు, ఎరగ్రొల్లల మధ్య కొట్లాట జరిగింది. జియ్యమ్మవలస పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం హరిజనవాడలో ఓ శుభకార్యం జరగడంతో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత అద్దె సామగ్రిని వ్యాన్పైకి ఎక్కిస్తున్న సమయంలో ఆ మార్గం గుండా ఎర్రగొల్లలకు చెందిన గొర్లి రాజు, గొర్లి చందులు స్కూటీపై వెళ్తూ దారికి అడ్డంగా ఉన్న సామగ్రిని తొలగించమని చెప్పగా, అక్కడే ఉన్న ఎత్తుల హరి కొద్ది నిమిషాలు ఓపిక పట్టమని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగారు. ఈ కొట్లాట హరిజన పేటలో హరిజనులు, ఎర్ర గొల్లల మధ్య తీవ్ర స్థాయిలో జరిగింది. కొట్లాటలో పలువురికి గాయాలు కాగా ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఎర్రగొల్లలు దౌర్జన్యానికి దిగుతూ తమపై కుల దూషణ చేశారంటూ హరిజనులు కేసు పెట్టగా, గొర్లి రాజు గొర్లి చందు, లక్ష్మి, గొర్లి మజ్జి, గొర్ల పాపారావులపై జియ్యమ్మవలస పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. దీంతో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు సిబ్బందితో తురక నాయుడు వలస గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇరువర్గాలను సమన్వయ పరిచారు. కార్యక్రమంలో జియ్యమ్మ వలస ఏఎస్సై ప్రశాంత్ కుమార్, చినమేరంగి ఎస్సై పి.అనీషలు పాల్గొన్నారు. -
ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ శివారు ప్రాంతంలో తిష్ఠవేసిన అడవి ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ పిల్లా వసుంధర, అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఏనుగుల సంచార ప్రాంతానికి చేరుకుని ఏనుగుల దాడినుంచి తప్పించుకునే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశువులను, మేకలను ఏనుగులున్న ప్రాంతాలవైపు తరలిపోకుండా చూసుకోవాలని,నిత్యం అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు.అటవీశాఖ అధికార సిబ్బంది ఎప్పకప్పుడు సమాచారం అందిస్తారని అందుకు అనుగుణంగా మెలగాలని సూచించారు. వాటికి హానికలిగించే చర్యలు చేపట్టవద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. -
సారా తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
పాలకొండ: సారా నిర్మాలనలో భాగంగా సోమవారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. సీతంపేట మండలం దిగువ బుడగరాయి వద్ద దారి కాపలా కాయగా పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక నవీన్ 20 లీటర్ల సారా, బుడగరాయి గ్రామానికి చెందిన సవర మంగయ్య 10 లీటర్ల సారా తరలిస్తూ పట్టబడినట్టు తెలిపారు. వారితో పాటు దిగువ బుడగరాయికి చెందిన పాత నేరస్తుడు సవర వెంకయ్యను అరెస్టు చేసి ముగ్గురిని కోర్టులో హజరు పరిచామని తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం విక్రయాలు చేపడుతున్న వీరఘట్టం మండలానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా సారా అమ్మకాలు చేస్తున్న గ్రామాలపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. -
పీజీఆర్ఎస్కు 118 వినతులు
పార్వతీపురం టౌన్: పార్వతీపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహి ంచిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 118 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిద శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 24 ఫిర్యాదులు పార్వతీపురం రూరల్: ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా అన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఇచ్చిన 24 ఫిర్యాదులను నేరుగా ఆమె స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులపై సంబంధిత పోలీస్స్టేషన్లకు ఫోన్ ద్వారా వివరాలను తెలియజేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్వాపరాలపై విచారణ చేసి చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే ఆ నివేదికను జిల్లా ఎస్పీ కార్యాలయానికి విధిగా పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదామ్ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్కు 60 అర్జీలు సీతంపేట: ఐటీడీఏలోని శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం పరిపాలనాధికారి వి.సునీల్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 60 మంది గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ డీఈ సింహాచలం, జీసీసీ మేనేజర్ నరసింహులు, ఏఈ నీలిమ,హెచ్వో జయశ్రీ, ఏఎంవో కోటిబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఇన్చార్జ్ ఎన్.జాకాబ్దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల భూముల దురాక్రమణపై విచారణ
లక్కవరపుకోట: మండలంలోని మల్లివీడు దళితులకు సంబంధించిన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకోవడంతో మండల రెవెన్యూ అధికారి కె. సన్యాసిరావు ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ నిర్వహించారు. భూముల ఆక్రమణ వ్యవహారంపై సాక్షి పత్రికలో ‘దళితల భూముల దురాక్రమణ’ శీర్షికన ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి సన్యాసిరావు, వీఆర్ఓ పూర్ణిమ, తదితరులు స్పందించి ఆ భూముల వద్దకెళ్లి విచారణ జరిపారు. ఈ భూములు ప్రభుత్వ గెడ్డ వాగుభూమికి సంబంధించినవని అధికారులు తెలిపారు. తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు విశాఖపట్నంలో జరగనున్న యోగా డే కార్యక్రమానికి వెళ్లారని, ఆయన వచ్చి విచారణ చేపట్టేవరకు ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టరాదని ఆర్ఐ సన్యాసిరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న దళితల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్ద పెదిరెడ్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 వరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించి, ఐదు పతకాలు కై వసం చేసుకున్నారు. లాంగ్జంప్లో ఎ.లక్ష్మి బంగారు పతకం చేజిక్కించుకోగా... పి.వసంత 100 మీటర్ల పరుగు పోటీలో బంగారు పతకం, 200 మీటర్ల పరుగుపోటీలో వెండి పతకం దక్కించుకున్నారు. అదేవిధంగా ట్రిపుల్ జంప్లో ఎం.బాలరాజ్ బంగారు పతకం చేజిక్కించుకోగా... 3000 మీటర్ల పరుగు పోటీలో ఎస్. అశోక్ బంగారు పతకంతో రాణించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. -
బడుగులపై కూలిన గోడ..!
● ఇద్దరి దుర్మరణం ● మృతుల్లో ఒకరు మూగవారు ● మిద్దె ఇల్లు మట్టి తవ్వుతుండగా ప్రమాదం గంట్యాడ: పేదల కుటుంబాల్లో పెను విషాదం సంభచించింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కష్టం రావడంతో గ్రామమంతా అయ్యో పాపం అంటోంది. 25 ఏళ్లకు పైబడి కూలి పనులకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అ కూలి పనికి వెళ్లే మృత్యువాత పడ్డారు. వయసు మీద పడినా కుటుంబ పోషణ కోసం కూలిపనులకు వెళ్లడం వారికి తప్పలేదు. రోజూ మాదిరిగా ఆదివారం కూలి పనికి వెళ్లారు. అదే వారికి చివరి పని అవుతుందని భావించలేదు. పనిచేస్తుండగా గోడ మీదపడడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ విదారక సంఘటన గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామవరం గ్రామానికి చెందిన రీసు సత్యవతికి మిద్దె ఇల్లు ఉంది. ఆ ఇంటిని తొలగించి అందులో పశువులశాల కట్టేందుకు మిద్దె ఇంటిని కూల్చే పనులు చేపట్టారు. దీంతో ఆ పని చేసేందుకు అదే గ్రామానికి చెందిన ఎర్ర చిన్నయ్య(61), మూగవ్యక్తి కొలుసు పైడితల్లి (49) వెళ్తున్నారు. శనివారం చాలావరకు మట్టిని తవ్వి తరలించారు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో మిద్దె ఇంటి గోడను గునపంతో తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలి ఇద్దరు కూలీలపై పడిపోయింది. గోడ కింద వారిద్దరూ ఉండిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. మృతుడు చిన్నయ్యకు భార్య సత్యవతి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పైడితల్లికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దూరమైన పెద్దదిక్కు మృతుడు చిన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలు ముగ్గురికి వివాహాలయ్యాయి. చిన్నయ్య భార్యతో పాటు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. కల్లు గీత సమయంలో కల్లుగీస్తుంటాడు. కల్లుగీత అయిపోయిన తర్వాత కూలి పనులకు వెళ్తారు. కూలిపనులు చేస్తూ వచ్చే ఆదాయం ద్వారా కుమార్తెకు, కుమారులకు పెళ్లిళ్లు చేశాడు. అందరినీ అల్లారు ముద్దుగా పెంచి అందరి యోగ క్షేమాలు చూసిన ఇంటి పెద్ద దిక్కు, తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మూగవాడైనా కాయకష్టంతో పోషించాడు కొలుసు పైడి తల్లి మూగవాడు అయినప్పటికీ తన కాయ కష్టంతోనే కుటుంబాన్ని పోషించాడు. తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం భార్యతో కలిసి ఉంటున్నాడు. పైడితల్లి మృతి చెందడంతో ఇప్పడు ఏవిధంగా బతకాలంటూ భార్య రోదిస్తోంది. తండ్రి ఆకస్మిక మృతితో కుమార్తెలు గుండెలవిసేలా బావురుమంటున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే చర్యలు
విజయనగరం క్రైమ్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని ఎస్పీ వకుల్జిందల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేపడుతూ మద్యంబాబులను అరెస్ట్ చేశామన్నారు. నగర శివార్లతో పాటు జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ద్వారా తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. మందుబాబులతో పాటు వాహన తనిఖీలు, రహదారి భద్రతా నియమాలను ఉల్లఘించిన వారిని గుర్తించి ఈ చలాన్ విధిస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో 2,178 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 9,095 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులకు పట్టుబడిన వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని.. రెండోసారి పట్టుబడితే కేసులు తప్పవని.. మూడోసారి కూడా పట్టుబడితే అరెస్టు ఖాయమని హెచ్చరించారు. ఎస్పీ వకుల్ జిందల్ -
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగనుందని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పిలుపునిచ్చారు. సాలూరులో.. పార్వతీపురంటౌన్: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టరు ఎ.శ్యామ్ప్రసాద్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమానికి రావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రూ.10కి పడిపోయిన పైనాపిల్సీతంపేట: స్థానిక మార్కెట్లో ఆదివారం పైనాపిల్ను ఒక్కొక్కటి రూ.10కి విక్రయిస్తున్నారు. గడిచిన వారం రూ.15 పలికిన ధర ఒక్కసారిగా రూ.10కి పడిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా పైనాపిల్ దిగుబడి పెరగడం, మార్కెట్కు ఎక్కువగా తీసుకురావడంతో ధర పడిపోయినట్లు గిరిజనులు చెబుతున్నారు. ఉత్తమ ప్రతిభతో గుర్తింపు తీసుకురావాలి● డీఆర్ఓ హేమలత పార్వతీపురంటౌన్: యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా విజేతలకు ఏర్పాటు చేసిన బస్సు ఆదివారం కలెక్టరేట్ నుంచి బయల్దేరింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పర్యవేక్షించారు. కార్యక్రమానికి నియమించిన అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆమె తగు సూచనలు చేశారు. జిల్లా విజేతలు, కేర్టేకర్స్, సిబ్బందికి మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగాంధ్ర పోటీల్లో విజేతలను 16,17 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాకు పంపిస్తున్నట్లు చెప్పారు. యోగాంధ్ర జిల్లా కన్వీనర్ డా. జగన్మోహన్రావు మాట్లాడుతూ జిల్లా నుంచి 32 మంది విజేతలు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటున్నారని, వారంతా సోలో, గ్రూప్ యోగాసనాలు, సాంగ్, క్విజ్, పెయింటింగ్ స్కిట్, ఎస్సే, పోస్టర్, షార్ట్ఫిల్మ్ ఇలా 11 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారన్నారు. కార్యక్రమంలో పీఓ, ఆర్బీఎస్కే డా. టి.జగన్మోహన్రావు, ఏఓ సీహెచ్. రాధాకృష్ణ, డీటీ పి.లక్ష్మీకుమార్, తదితరులు పాల్గొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి● ఏపీ ఎస్టీ కమిషన్చైర్మన్ డీవీజీ శంకరరావు సాలూరు రూరల్: ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సాలూరు మండలంలోని జీగిరాం గ్రామానికి చెందిన అలేఖ్య ఎంటర్ప్రైజస్ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అధినేత అల్లాడ సునీతకు ఉత్తమ మహిళ పారిశ్రామిక వేత్తగా ఫాప్సి అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని విజయవంతంగా నడిపిస్తున్న సునీతకు అవార్డు రావడం అభినందనీయమన్నారు. -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం గ్రాడ్యుయేషన్ (జెనిత్స్–2020)డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్స్ చీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. పదేళ్లలో బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా పది వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో వారంతా ఉద్యోగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. బీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెమ్స్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధీర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పారామెడికల్ టెక్నీషియన్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.అశోక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు నడుచుకోవాలన్నారు. జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా ఇప్పటివరకూ పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ, జెమ్స్ సీఈఓలు ఆద్విక్, రామ్మోహన్ పాల్గోన్నారు. -
కూటమి వెన్నుపోటు
ఏడాదిలో అరాచకాలు, అక్రమ కేసులు 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారికంగా పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏడాది కాలం అవినీతి, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం మినహా పాలన సాగించలేదన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా నియంత్రించలేకపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఏక్టివిస్ట్లపై అక్రమ కేసులు బనాయించారు. తమ సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నిర్వీ ర్యం చేశారని, విద్య, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం: ఎన్నికల సమయంలో అధికారమే లక్ష్యంగా హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5 కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్సిక్స్ సహా 143 హామీలు ప్రకటించి నేడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురి చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి పేదప్రజలంటే లెక్కలేనితనమని, పేదల ను చిన్నచూపు చూడడం దుర్మార్గమని పేర్కొన్నా రు. మూడు రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కూట మి పేరిట పోటీ చేసి గెలిచిన సందర్భంలో ఏడాది ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ ముద్రించిన జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం పూస్తకాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ ఇతర పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు విజయనగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లడుతూ చెప్పారంటే చేస్తారంతే అన్న నమ్మకం వైఎస్జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉందని, అదే చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారన్న నమ్మకం మరోసారి రుజువవుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి మిగిలిన నాలుగేళ్లలోనైనా ప్రజలకు ఇచ్చిన హమీల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. పాలనలో వ్యత్యాసాన్ని గమనించండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం మొదటి ఏడాది సాగించిన పరిపాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వ్యత్యాసాలను పుస్తకంలో పొందుపరిచాం. ఏడాది పాలనలో హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెండు ప్రభుత్వాల మధ్య తేడాను వివరించాం. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ వివరిస్తాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ప్రతి నియోజకవర్గంలో ఆయా సమన్వయకర్తలు ఈ పుస్తకాలను ఆవిష్కరించనుండగా.. అనంతరం మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిర్ణీత సమయానికి జరగకుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులతో టెండర్లు ఖరారు చేసి నిర్మాణం ప్రారంభించాం. జీఎంఆర్ సంస్థ పనులు శరవేగంగా చేపడుతోంది. కేవలం పనుల పరిశీలన పేరిట హడావుడి చేయడం కాదు. ముందస్తుగా ప్రకటించిన విధంగా 2026వ సంవత్సరంలో ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగకుంటే ప్రభుత్వానిదే బాధ్య త. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, ఇప్పిలి అనంత్, అల్లాడ సత్యనారాయణ మూర్తి, శంబంగి వేణు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, కొప్పల వెలమ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏడాదిలో నయవంచన, నమ్మకద్రోహం పేదప్రజలంటే ప్రభుత్వానికి చులకన జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
విత్తనాల వ్యాన్ బోల్తా..
రేగిడి: పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్యాన్పై సంపత్ అనే వరి రకం విత్తనాలను తీసుకువస్తున్నారు. అయితే వ్యాన్ ఉంగరాడమెట్ట వద్దకు వచ్చేసరికి ఆదివారం వేకువజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇదిలా ఉంటే రైతుసేవా కేంద్రాల్లో విత్తనాలు అందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు దొరక్కపోవడం వల్లే ఇతర జిల్లాల నుంచి విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 మద్యం సీసాలు స్వాధీనం పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడి నుంచి మొత్తం 9 మద్యంసీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా ఎవరైనా అనుమతులు లేకుండా మద్యం తరలించినా, విక్రయించినా, మద్యం బెల్టుషాపులు నడుపుతున్నా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
నిబంధనలు తప్పనిసరి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాల్సి వస్తే నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు వారం రోజుల ముందే సంబంధిత పోలీస్స్టేషన్లో తెలియజేసి సబ్డివిజనల్ అధికారుల నుంచి అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు వారి మొత్తం వివరాలు వెల్లడిస్తూ ఎందుకు నిర్వహిస్తున్నారో? ఎంతమంది వస్తున్నారో? అన్న వివరాలతో పాటు ప్రారంభ, ముగింపు సమయం, సభా స్థలం, రూట్ మ్యాప్ వివరాలు కూడా తెలియజేయాలని చెప్పారు. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి -
క్రైమ్ కార్నర్..
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి పూసపాటిరేగ: మండల పరిధి గొల్లపేట సమీపంలో సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఆటో ఢీ కొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కిలుగుపేటకు చెందిన జీరు కనకారెడ్డి (41) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం సీహెచ్ అగ్రహారం ఫ్లై ఓవర్ వద్ద కూరగాయల లోడు దించేసి తిరుగు ప్రయాణంలో పూసపాటిరేగ వెళ్తుండగా గొల్లపేట సమీపంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కనకారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య తోటమ్మ, కుమారులు రాము, రమణ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆత్మహత్య డెంకాడ: మండలంలోని అక్కవరం పంచాయతీ పరిధిలో గల ఓ లే అవుట్లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని బోర సూరిబాబు (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురం మండలంలోని సవరవల్లి పంచాయతీ పరిధి రామదాసుపేట గ్రామానికి చెందిన బోర సూరిబాబు వ్యాన్ డ్రైవర్గా పని చేసేవాడు. కొంతకాలం నుంచి ఎయిర్పోర్టుకు కూలీలను తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. 15 రోజులుగా ఈ పనికి కూడా వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈనెల 14వ తేదీ రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త సూరిబాబును భార్య బోర గౌరి ప్రశ్నించింది. భోజనం చేయమని భార్య గౌరి చెప్పినా వినకుండా వెళ్లిపోయాడు. మరుసటి రోజు అక్కివరం పంచాయతీ పరిదిలోని ఒక లే అవుట్లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని ఉన్న సూరిబాబును స్థానికులు గుర్తించారు. భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి..పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ శివారులో ఈ నెల 8న గాయాలతో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు గుర్తించి జీఆర్పీ పోలీసుల సహాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
బియ్యం దొంగలను వదిలేస్తారా..!
● సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఎక్కడ నుంచి తరలించారో తేల్చని వైనం ● బొండపల్లి మండలంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం ● కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు విజయనగరం ఫోర్ట్: పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదు.. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రగల్భాలు పలికారు. కాని వారి మాటలు ఉత్తుత్తివేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడినప్పటికీ అసలు దొంగలను ఇప్పటకీ పట్టుకోకపోవడంపై అధికారుల తీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలకు అందించే పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందనే విమర్శలున్నాయి. పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముఠాకు కొంతమంది అధికారులు, డీలర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వారికి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. బొండపల్లి మండలంలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం.. పేద ప్రజలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. బియ్యం తరలింపుపై విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో కొద్ది రోజుల కిందట బొండపల్లి మండలం కొండకిండాంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం.. కిండాం అగ్రహారం మామిడితోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారంకు, మామిడి తోటల్లోకి తరలించడం సంచలనంగా మారింది. అయినప్పటకీ అధికారులు ఇంతవరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ డిపో బియ్యమో తేలలేదు.. జూన్ 5వ తేదీన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఏ రేషన్ దుకాణం నుంచి నేరుగా తరలించారో.. ఎవరు సహకరించారో.. ఇంతవరకు తేలలేదు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చడానికి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ చేస్తున్నాం.. పీడీఎస్ బియ్యాన్ని తరలించిన వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. వారు ఎక్కడ నుంచి బియ్యం తరలించారో విచారిస్తున్నాం. అసలు దొంగలను పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటాం. కె. మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ● జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి సాలూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో విఫలమవుతున్నారని ఆరోపించారు. ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని పట్టణంలోని తన స్వగృహంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. 2019 – 20 మధ్య జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా చేసిన పాలనా వివరాలు.. నేడు 2024 – 25 ఏడాది కాలంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పాలనా వివరాలను పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు.రెడ్బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక్కొక్కరిపై 20కి పైగా కేసులు నమోదు చేశారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుందనే అక్కసుతో సాక్షి మీడియాపై ఇటీవల దాడులు చేయించిన ఘనత చంద్రబాబు,లోకేష్కే దక్కుతుందని ఆరోపించారు. అమ్మకు మోసం కాదా..? గత ప్రభుత్వంలో ప్రతి తల్లికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి శతశాతం నెరవేర్చిన ఘనత జగన్ మోహన్రెడ్డికి దక్కుతుందని రాజన్నదొర అన్నారు. ఆనాడు పథకం అమలులో నిబంధనలు ఎక్కువగా పెట్టారని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు నేడు నిబంధనలు పెట్టలేదా అని ప్రశ్నించారు. తల్లికి వందనంలో రెండు వేల రుపాయలు లోకేష్ ఖాతాలోకి వెళ్లాయని పలువురు వైఎస్సార్సీపీ నేతలు విమర్శించడాన్ని టీడీపీ నాయకులు తప్పు బడుతున్నారని, మరి ఆ టీడీపీ నాయకులే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు జగన్ ప్యాలెస్కు వెళ్లిపోయాయని విమర్శించలేదా అని ప్రశ్నించారు. 150 పథకాలు అమలు చేయాల్సిందే.. సూపర్ 6తో పాటు 2014 – 19 మధ్య తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు జగన్ మోహన్రెడ్డి హయాంలో అమలైన పథకాలను కూడా తాము అమలు చేస్తామని టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని మాజీ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ లెక్కన సుమారు 150 సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
పాడుబడినా..!
● గిరిజనుల కష్టాలు పట్టని మంత్రి ● ధ్వజమెత్తిన ఏఐఎస్ఎఫ్ నాయకులుబొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరాయుడుపేట పంచా యతీ పరిధి బట్టివలస ప్రాథమిక పాఠశాల గిరిజన విద్యార్థులు పడుతున్న కష్టాలు ఆశాఖ మంత్రి సంధ్యారాణికి పట్టడం లేదని ఏఐఎస్ఎఫ్ రారష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బి.రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన సంఘం సభ్యులతో కలిసి పాఠశాల పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా ఇక్కడి గిరిజనుల సమస్యలను పట్టించుకుకోవడం లేదన్నారు. గత విద్యాసంవత్సరంలో ఇక్కడి ప్రాథమిక పాఠశాల దుస్థితిపై పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని, కనీసం ఐటీడీఏ అధికారులు సైతం ఇక్కడి పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే బేబీనాయన యూటీఎఫ్ ప్రతినిధులకు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తామని చెప్పిన మాట మరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పాలకులు, ప్రభుత్వయంత్రాంగం ఇక్కడి పాఠశాల దుస్థితిపై స్పందించి గిరిపుత్రుల విద్యాభివృద్ధికి కృషిచేయాలని కోరారు. -
ముత్తాయివలసలో ఏనుగుల సంచారం
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస, కలవరాయి గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శనివారం రాత్రి సీతానగరం మండలం నుంచి తరలివచ్చి ఆదివారం ఉదయానికి ఇక్కడి గ్రామాల్లోని మామిడితోటలో తిష్ట వేశాయి. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు, అటుగా వచ్చే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపు వేరే ప్రాంతానికి తరలి వెళ్లేవరకు ఆయా గ్రామాలమీదుగా ప్రయాణికులు రాకపోకలు చేయకూడదని సూచించారు. కమ్మవలస సర్పంచ్ పిల్లా వసుంధర, ఫారెస్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో శనివారం పడిన పిడుగులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ఇనుప రేకులు బద్దలు కావడంతో, లోపలున్న ఆయిల్ లీకై ంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో ఏఈ అనిల్కుమార్ స్పందించి ఆదివారం సాయంత్రానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అలాగే వీరఘట్టంలో పిడుగులు పడడంతో సిటీకేబుల్ వ్యవస్థ దెబ్బతిని, ప్రసారాలు నిలిచిపోయాయి. గృహోపకరణాలు దగ్ధం.. సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాల్లో శని, ఆదివారాల్లో కురిసిన ఉరుములు, పిడుగుల వర్షానికి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. మండల కేంద్రంలో 8 ఇన్వర్టుర్లు, 10 ఫ్యాన్లు, 4 టీవీలు కాలిపోయాయి. పలుచోట్ల వీధి దీపాలు కూడా కాలిపోయాయి. విజయనగరం ఐటీఐలో జాబ్మేళా రేపువిజయనగరం అర్బన్: ఐటీఐ అభ్యర్థుల కోసం ఈ నెల 17న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తామని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. హైదరాబాద్కు చెందిన రానె మద్రాస్ లిమిటెడ్ అనే సంస్థలో వివిధ కేడర్ పోస్టులకు ఆ రోజు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 2024వ విద్యాసంవత్సరంలో ఐటీఐ పాసై, ఈ ఏడాది ఆగస్టులో పరీక్షలకు హాజరు కాబోయే చివరి సంవత్సరం వె ల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు బయోడేటాతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, 2 పాస్పోర్టు ఫొటోలతో హాజరు కావాలని తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 8106025022, 9849944654 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంస్కృత కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం విజయనగరం అర్బన్: పట్టణంలోని మహారాజా సంస్కృత కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఏకై క సంస్కృత కళాశాల ఇదే. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తోంది. నామమాత్రపు ఫీజుతో కోర్సులు అందిస్తారు. దూర ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ వసతిగృహంలో సదుపాయాలు.. బ్రాహ్మణ విద్యార్థులకు సింహాచల దేవస్థానం ద్వారా ఉచితి భోజన సదుపాయం కల్పిస్తారు. కోర్సులివే.. పదో తరగతి ఉత్తీర్ణులకు (ఐదు సంవత్సరాల ఇంటర్ కోర్సులు) పీడీసీ – తెలుగు, పీడీసీ – సంస్కృతం.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు (ఓఎల్ కోర్సులు) బీఏ – తెలుగు, బీఏ – సంస్కృతం, బీఏ హిస్టరీ, బీఎస్సీ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు అర్హులవుతారని, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జనార్ధననాయుడు సూచించారు. -
సచివాలయ ఉద్యోగులకుస్థానచలనం..!
పార్వతీపురంటౌన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందేనన్న నిబంధనతో పాటు పలురకాల వైకల్యం, స్పౌజ్, రిక్వెస్ట్ కింద బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో గల 2,350 మంది సచివాలయ ఉద్యోగుల్లో బదిలీ టెన్షన్ నెలకొంది. ఉద్యోగుల్లో కొందరు తమకు నచ్చిన స్థానాలకు తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏదిఏమైనా పలు శాఖల తరువాత సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. కలెక్టర్ల అనుమతితో కౌన్సెలింగ్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరినీ కలిపి బదిలీ చేయలని ప్రభుత్వం షరతు విధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ల అనుమతితో త్వరలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించ న్నారు. వీటితో పాటూ ఆయా శాఖల సమన్వయంతో కౌన్సెలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. గతంలో పారదర్శకంగా బదిలీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023లో జరిగిన బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. ఎటువంటి వైరవీలకు తావు లేకుండా బదిలీ ప్రక్రియ సాగింది. ఉద్యోగులందరికీ న్యాయం చేసేవిధంగా బదిలీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన తరువాత బదిలీలకు చర్యలు చేపట్టడంతో తమకు ఎక్కడికి బదిలీ అవకాశం రానుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఈ బదిలీల్లో ప్రధానంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా సొంత మండల పరిధిలో ఉండేందుకు అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోంత మండలానికి బదిలీకి నో చాన్స్ అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో పని చేసిన వారందరికీ ఈ నిబంధన వర్తించనుండడంతో ఆందోళనలో ఉన్నారు. ఈ నెలాఖరుకు పూర్తి చేసే అవకాశం బదిలీ ఉత్తర్వుల ప్రకారం ఈ నెలాఖరుకు ప్రక్రియపూర్తి చేసే అవకాశం ఉంది. ఒకే చోట ఐదేళ్లు దాటిన ఉద్యోగులతో పాటు వైకల్యం ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగులు, రిక్వెస్ట్ ఉద్యోగులందరూ తమ సమగ్ర వివరాలను ప్రభుత్వం త్వరలో అందించే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. బదిలీల కౌన్సెలింగ్ మాత్రం ఉమ్మడి జిల్లాకు కలిపే ఉండనుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తికానుంది. సిఫార్సుల కోసం పరుగులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో విధులు నిర్వహించే విధంగా సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. తమకు కావాల్సిన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద సిఫార్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. తాజా బదిలీల్లో తమకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. బదిలీలకు ఉత్తర్వులు విడుదల సచివాలయ ఉద్యోగుల బదీలలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు ఒకే సచివాలయంలో పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న నియమాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నాం. రామచంద్రరావు, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, పార్వతీపురం మన్యం స్పౌజ్, వైకల్యం, రిక్వెస్ట్లపై కార్యాచరణ ఒకే చోట ఐదేళ్లు దాటిన వారికి బదిలీ తప్పనిసరి సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగుల పరుగులు -
పోలీసులకు చెమటలు పట్టించి తప్పించుకుపోయారు..
రామభద్రపురం: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్కూటీతో పోలీసులను పరుగులెత్తించారు. అయినా గంజాయి.. సంబంధిత వాహనాన్ని వారు వదిలేసి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొట్టక్కి వద్ద ఎస్ఐ వి.ప్రసాదరావు శనివారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తున్నారు. సాలూరు నుంచి స్కూటీపై హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు దూసుకురాగా అతి వేగాన్ని కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశంతో ఎస్ఐ ఆపారు. వారు ఆపకపోవడంతో ఎస్ఐ స్టేషన్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి అతివేగంతో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు గాంధీ బొమ్మ సెంటర్లోని సాలూరు నుంచి రామభద్రపురం వచ్చే టర్నింగ్ వద్ద కాపు కాశారు. ఆ సమయంలో అటుగా వస్తున్న డీఎస్పీ భవ్యారెడ్డి వాహనాన్ని కూడా తప్పించుకొని దూసుకెళ్లిపోయారు. దీంతో డీఎస్పీ కూడా ఆ బైక్ను వెంటాడారు. సెంటర్లో ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో డీఎస్పీ వాహనం వెనుకబడింది. ఈ క్రమంలో బైక్తో మరింత స్పీడుగా ఆ ఇద్దరు చిన్నమ్మతల్లి ఆలయం వైపున్న పక్క రూట్లోకి వెళ్లారు. ఆ రూట్ ఎటు వెళ్తుందో తెలియక మళ్లీ మెయిన్ రూట్లోకి వచ్చారు. బొబ్బిలి వెళ్లే రహదారికి వచ్చి వేగవంతంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో బైక్ కిందపడిపోయింది. అయితే వీరి వద్ద గంజాయి ఉండని తెలియక డీఎస్పీ వాహన చోదకులకు ఏమైందోనని ఆందోళన చెందారు. డీఎస్పీ తన వాహనం నుంచి దిగి వచ్చేలోపు వాహనదారులు వాహనాన్ని, వారితో ఉన్న రెండు బ్యాగులు, హెల్మెట్లు అక్కడే వదిలేసి పక్క పొలాల్లోకి పారిపోయారు. డీఎస్పీ వాహనం వెనుక వస్తున్న పోలీసులు వారి వెంట పడ్డారు. ఇంతలో చీకటి కావడంతో వారు రామభద్రపురం గ్రామంలోకి వెళ్లిపోయారు. పోలీసులు కనిమెరక వీధి, అగురు వీధి, గ్రామం పక్కనే ఉన్న పొలాల్లో గాలించారు. అయినా ఎక్కడా వారు కనిపించలేదు. పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో వాహనదారులు విడిచిపెట్టిన బైక్, రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులను పరిశీలించగా అందులో సుమారు 23 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ద్విచక్ర వాహన నంబరును పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు విశాఖలో ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేశారు. తప్పించుకోబోయి డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టిన బైక్ పారిపోయిన గంజాయి తరలిస్తున్న నిందితులు -
గర్భిణికి స్కానింగ్ కష్టాలు
17న అండర్ –16 క్రికెట్ జట్టు ఎంపికలు విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారు విజ్జి క్రికెట్ మైదానంలో మంగళవారం జరిగే ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2009 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. అలాగే పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డ్, జనన ధ్రువీవరణ పత్రం, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకు రావాలన్నారు. ఉదయం 7.30 గంటలకు నిర్వహించే ఎంపిక పోటీలకు క్రీడాకారులు వైట్ డ్రెస్, సొంత కిట్టుతో హాజరు కావాలని ఆయన సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు జిల్లా స్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న అండర్–15 బాల, బాలికల చెస్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 15న ఆదివారం నిర్వహించనున్నట్టు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కెవి.జ్వాలాముఖి శనివారం తెలిపారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనపగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎంపిక పోటీల్లో 2010 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాల, బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, వివరాలకు 97033 44488 నంబరును సంప్రదించాలని సూచించారు. -
పేదల ఇళ్ల స్థలాల కోసం ఆందోళన
విజయనగరం టౌన్: పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని పట్టణ బడుగు, బలహీన వర్గాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి నారాయణరావు, చెన్నా ధర్మ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై స్థానిక ధర్మపురి ప్రాంతంలో శనివారం నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పేదలకు హామీల వర్షం కురిపించారని, అర్బన్ ఏరియాలోని పేదలకు రెండు సెంట్లు, రూరల్ ఏరియాలోని పేదలకు మూడు సెంట్లు స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లు మంజూరు చేయలేదని, కొత్త వారికి ఎప్పుడిస్తారో కూడా స్పష్టత లేదన్నారు. తక్షణమే ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని లేకపోతే భవిష్యత్లో పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 16న తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నీలాపు అప్పలరాజు రెడ్డి, గంటా సీతమ్మ, గిడిజాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన వరాలేమయ్యాయి..!
బొబ్బిలి: గత ఎన్నికల్లో టీడీపీ కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించి అందులో విశ్వబ్రాహ్మణులకు ప్రకటించిన వరాల ఊసేలేదని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముగడ వెంకటరమణ అధ్యక్షతన పట్టణంలో సంఘ నాయకులు, సభ్యులతో శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల సంఖ్య 25లక్షల మందికి పైగా ఉండగా కూటమి ప్రభుత్వం కేవలం 7లక్షలకు కుదించి లెక్క చూపుతోందన్నారు. కచ్చితమయిన లెక్కను చూపేందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. విశ్వబ్రాహ్మణులకు టీడీపీ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదని, ఇందుకోసం తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామన్నారు. తమ కులానికి నష్టం కలిగించే జీఓ నంబరు 272ను సవరిస్తామన్న కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, స్వర్ణకారుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి అందలమెక్కిస్తామన్నారనీ, కానీ ఈ హామీపై కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఇవే అమలు కాలేదంటే ఇక ఈ రెండింటినీ ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగానికి అనుసంధానం చేస్తామనడం మరింత మోసమయిందన్నారు. నారా లోకేష్ తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. పంచ వృత్తులు చేసుకునే విశ్వబ్రాహ్మణులందరినీ ఒకే సామాజిక వర్గంగా పరిగణించాలని, దీనిపై ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో యువ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములగపాటి బంగార్రాజు, ఉపాధ్యక్షుడు దనాల కోట శోభన్బాబు, గణేష్, జి.నారాయణ, త్రినాధ హరిబాబు, కంచుమోజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాట తప్పిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇస్తామన్న లోకేష్ హామీ అమలు చేయాలి విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు -
క్రీడా పాఠశాల పిలుస్తోంది..
● ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం ● వచ్చే నెల 1 నుంచి 3 రోజుల పాటు జిల్లా స్థాయిలో ఎంపికలు ● జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హతవిజయనగరం: పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికిష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆటల్లో రాణిస్తే వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతోమంది తెలుగువారు క్రీడలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో మెరికలుగా తీర్చదిద్దడానికి కడపలో క్రీడా పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ఆటల్లో రాణించి, ఉన్నత స్థాయికి వెళ్లారు. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి (2025–26) 4, 5 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందిన వారికి మంచి భవిష్యత్తు లభించనుంది. 19వ తేదీ వరకు గడువు క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో 40 సీట్లు, ఐదో తరగతిలో 40 సీట్లకు సంబంధించి ఈ ఏడాది ప్రవేశాలను చేపట్టనున్నారు. ఒక్కో తరగతిలో 20 మంది బాలురు 20 బాలికలను తీసుకుంటారు. గతంలో మూడు దశల్లో (మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి) ఎంపికలను చేపట్టేవారు. ఈ ఏడాది నుంచి రెండు దశల్లో (జిల్లా, రాష్ట్ర స్థాయి) మాత్రమే ఎంపికలు నిర్వహిస్తారు. నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం 01–04–2015 నుంచి 31–03–2017 మధ్య జన్మించిన వారు, ఐదో తరగతిలో ప్రవేశాలకు 01–04–2014 నుంచి 31–03–2016 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం క్రీడా శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికలు ఇలా..! జిల్లా స్థాయి ఎంపికలను ఈ ఏడాది జులై 1 నుంచి 3వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో చేపట్టనున్నారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్, షటిల్రన్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 600 మీటర్ల పరుగు లాంటివి నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి శారీరక సామర్థ్య ఎంపికలను ఈ ఏడాది జులై 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరచిన వారు క్రీడా పాఠశాల ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిలుస్తారు. జులై 24 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. క్రీడాకారులకు చక్కని వేదిక భావి భారత క్రీడాకారులుగా ఎదగాలంటే.. క్రీడా స్ఫూర్తి ఉండి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలనుకునే వారికి క్రీడా పాఠశాల చక్కటి వేదిక. కార్పొరేట్ కంటే దీటుగా విద్యతో పాటు అనుభవజ్ఞులైన శిక్షకులతో శిక్షణ ఇస్తారు. ప్రవేశం దొరికితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. చదువు, క్రీడా శిక్షణ ఉచితమే. ఎంపిక పోటీలకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల వస్తే తెలియపరుస్తాం. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి, విజయనగరం -
పిడుగు పాటుకు ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మరణం
● హుస్సేనుపురంలో విషాదం వీరఘట్టం: ఉపాధి చెరువు పనుల వద్ద మొబైల్ హాజరు వేసుకునేందుకు వెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్ పిడుగు పాటుకు గురై శనివారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని హుస్సేనుపురం గ్రామ శివారులో చెరువు పనులు జరుగుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఖండాపు శ్రీనివాసరావు ఉదయం 9 గంటలకు పనుల వద్దకు వెళ్లి హాజరు వేసుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ హాజరు వేసుకునేందుకు చెరువు వద్దకు బయలుదేరాడు. అప్పటికే వర్షం పడుతుండడంతో వేతనదారులంతా వెనుదిరిగారు. గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద మొబైల్ యాప్లో అటెండెన్స్ వేసేందుకు శ్రీనివాసరావు మొబైల్ ఆన్ చేసే సరికి సమీపంలో పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని వేతనదారులు తెలిపారు. దూరంగా ఉన్న వేతనదారులు పరుగున వెళ్లి సపర్యలు చేశారు. వెంటనే వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరావు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకొంది. తల్లిదండ్రులు జట్లమ్మ, వెంకటనాయుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి.కళాధర్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలి మృతిరాజాం సిటీ: మండల పరిధి బొద్దాం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉండడాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ వై.రవికిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన విషయం సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచామన్నారు. దీంతో బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమనాన కాంతమ్మ (55)గా బంధువులు గుర్తించారని తెలిపారు. మృతురాలు గత 25 సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, అందే సమాచారం మేరకు మళ్లీ ఇంటికి తీసుకువెళ్లడం జరుగుతుందని బంధువులు తెలిపారని చెప్పారు. ఈ క్రమంలోనే రాజాం మండలం బొద్దాం వైపు వచ్చి ఈ నెల 13 అర్థరాత్రి సమయం నుంచి తెల్లవారు సమయంలో ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటుందని తెలిపారు. ఈ మేరకు మృతురాలి బంధువు వజ్జి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి.. బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి – గజపతినగరం రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు ఢీకొనిగాని, రైలు నుంచి జారిపడిగాని గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మృతి చెందినట్టు బొబ్బిలి రైల్వే హెచ్సీ బి.ఈశ్వర్రావు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, మృతుని శరీరంపై ఎర్ర రంగు షర్టుతో పాటు నలుపు రంగు ప్యాంటును ధరించి ఉన్నట్టు తెలిపారు. మృతుని జేబులో కేసింగ నుంచి చెన్నె సెంట్రల్కు వెళ్తున్నట్టు టిక్కెట్టు ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. మృతదేహాన్ని విజయనగరంలోని మహరాజ కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. -
అర్హులందరికీ తల్లికి వందనం ఇవ్వకుంటే న్యాయ పోరాటం
రేగిడి: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి తల్లికి వందనం పథకం అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం అందకపోతే న్యాయ పోరాటం చేసైనా ఈ పథకం అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అమలు చేయడం లేదని అన్నారు. విద్యాశాఖ దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారు 88లక్షల మంది విద్యార్థులు ఉండగా 55 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అందించారని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15వేలు అందజేస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు వారి ఖాతాల్లో రూ.13వేలు మాత్రమే జమ అవుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు మంజూరు చేసి పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2వేలు తగ్గించి రూ.13వేలు అందిస్తే ఇప్పటి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఏ కుటుంబంలో అయినా ఒకరికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తే ఆ కుటుంబంలో విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి నిబంధనలు పెట్టకుండా అందిరికీ అమ్మ ఒడి అందజేశామని వివరించారు. అర్హులై ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఈ పథకానికి ఎంపిక చేయకుండా టీడీపీ సానుభూతి పరులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గకుండా పని చేయాలని అన్నారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, డాక్టర్ బి.నరేంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలి
విజయనగరం: ఆత్మరక్షణ క్రీడ తైక్వాండోలో విజయనగరం జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి సత్తా చాటాలని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్.వేణుగోపాలరావు ఆకాంక్షించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో జరిగిన సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు మొత్తంగా 33 పతకాలు కై వసం చేసుకుని ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 19 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 8 కాంస్య పతకాలు చేజిక్కించుకుని విద్యలనగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అయ్యలు, వేణుగోపాలరావులు అభినందించారు. జిల్లా క్రీడాకారులు భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు -
రక్తదాతలు..ప్రాణదాతలే..!
● స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవంరాజాం సిటీ: అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న, రక్తదానం.. మహాదానం అంటూ ఎన్ని ప్రచారాలు చేసినా, స్పందన మాత్రం కొందరిలోనే కనిపిస్తోంది. రక్తదానం చేయాలని ఉన్నా కొన్ని అపోహలు, మనకెందుకులే అన్న భావనతో చాలా మంది రక్తదానం చేసేందుకు ఇష్ట పడడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రస్తుతం సేకరిస్తున్న రక్తం ఆపదలో ఉన్నవారికి సరిపోవడంలేదు. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ కొంతమంది రక్తదాతలు ముందుకొచ్చి దానం చేయడంతోపాటు అడపాడదపా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ అపాయంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇటువంటి సమయంలో స్వచ్ఛంద సంస్థలు, యువకులు చొరవచూపి రక్తదానానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రాణంతో సమానం.. ప్రమాదాల్లో గాయపడిన వారికి, అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి రక్తం ఎంతో అవసరం. రక్తాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించాల్సిందే కానీ కృత్రిమంగా తయారుచేయలేం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం. ఒకరి రక్తం మరొకరి ఆయుష్షు కాపాడుతుంది. రక్తానికి పేద, ధనిక భేదాలు లేవు. ఒకమనిషి రక్తం మరో మనిషికి అందిస్తేనే వారి ప్రాణాలు నిలుస్తాయన్న సంగతి తెలిసినా చాలా మంది రక్తదానం చేయడానికి భయపడుతున్నారు. కొంతమంది మాత్రం ఎప్పుడు రక్తం అవసరం వచ్చినా మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారు కూడా రక్తదానం చేయపోతే అత్యవసరమైన వారి పరిస్థితి ఇబ్బందికరమే. రక్తదానానికి వీరు అర్హులు.. అపోహలు వీడి రక్తదానం చేయాలనుకునేవారు ఆరోగ్యంగా ఉండడంతోపాటు 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు, 50 కిలోల బరువు కలిగిఉండాలి. హిమోగ్లోబిన్ శాతం 12.5 ఉండాలి. చికెన్గున్యా, టైఫాయిడ్, మలేరియా, ఇతర వ్యాధులు సోకిన వారు నయమైన నాలుగు నుంచి ఆరు నెలల తరువాత రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసేవారి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ● రక్తాన్ని సేకరించే ముందు వైద్యులు దాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.వీరు అనర్హులు.. మధుమేహ వ్యాధి గ్రస్తులు, రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రక్తం ఇవ్వకుండా ఉండాలి. అలాగే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నవారు, గుండెపోటుకు గురైనవారు మూర్ఛవ్యాధి ఉన్నవారు, కంటి జబ్బులు, కంటి కలక వంటివి ఉన్నప్పుడు రక్తదానం చేయవద్దు. -
అస్తవ్యస్తంగా వరద కాలువలు
● నిలిచిపోయిన కల్వర్టుల నిర్మాణం ● ఆందోళనలో రైతులు పార్వతీపురం రూరల్: ఓ వైపు వాతావరణంలో మార్పులు సంభవించి వానలు ముంచుకొస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం కదలిక కనిపించడం లేదు. ఎక్కడ చూసినా పంట కాలువలు పూడికలతో నిండిపోయి వర్షం కురిస్తే వరదనీరు కాలువల ద్వారా చెరువుల్లోకి పారేందుకు ఆస్కారం లేకుండా అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధిహామీ పథకంలో పూడిక తీత వంటి పనులు చేపట్టే వెసులుబాటు ఉన్నా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆ ఊసే లేకుండా పోయింది. సంబంధిత అధికారులు ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోనప్పటికీ ఏ ఛానల్లో ఎంత పరిధి నిధులు అవసరమన్నది ఉపాధి, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రతిపాదనలు చేసి ఇప్పటికే పనులు పూర్తిచేయాలి. కానీ వాటి జోలికే అధికారులు వెళ్లలేదు. ఎక్కడ చూసినా ఆధ్వానమే జిల్లాలో చాలా వరకు పంటలకు ఆధారమైన పంట కాలువలు పూడికలతో నిండిపోయి వాటి ఆనవాళ్లే లేకుండా మారాయి. ప్రధానంగా చెరువులైతే వాటి విస్తీర్ణం తగ్గి బక్కచిక్కిన దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. వాటికి సంబంధించిన భూములు కూడా శిథిలమయ్యాయి. గతంలో కూడా పనులు సక్రమంగా చేపట్టక వాటి లైనింగ్ పనులు పూర్తిగా పాడై పంట సాగుకు నీరు పారని దుస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే వాటి పనులు జరిగి ఉంటే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు. నాలుగు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఎక్కడా పనులు ప్రారంభించిన దాఖలాలు కన్పించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఇదే దుస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా వందల కొద్దీ చెక్డ్యాంలు గతంలో నిర్మించారు. వాటితో గిరిజన రైతుల ఆయకట్టు భూమికి పుష్కలంగా సాగునీరు అందేది. సమీపంలో ఉన్న వాగుల ద్వారా చెరువులు, గెడ్డలు నిండి వాటి ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ జరిగేది. ఈ క్రమంలో వేసవిలో కూడా గిరిజన రైతులు పంటలు పండించుకునేందుకు ఆస్కారం ఉండేది. కొన్నేళ్లుగా వాటివైపు చూసే నాథుడే లేక అలాగే చెక్డ్యాంల నిర్వహణ మరమ్మతులు జరగక కాలువల్లో పూడికలు పేరుకుపోయి రైతులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిస్తే నీరు వృథాకావడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల సైతం ముంపు బారిన పడక తప్పదని ఆప్రాంత గిరిజనులు వాపోతున్నారు. -
అలసత్వంతో అవినీతి
జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన పంటకాలువల్లో పూడికలు తీసే పనులు జనవరి నుంచి మే మాసం లోపే అధికారులు పూర్తి చేసి వర్షాకాలానికి సన్నద్ధం కావాలి. ఈ పనులేవీ చేయకుండా వర్షాకాలం వచ్చిన తరువాత నిధులు కేటాయించి కాలువల్లో వరదనీరు ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ నిధులను దుర్వినియోగం చేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపిణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తోటపల్లి కాలువకు సంబంధించిన పనుల్లో ఓ అధికారి పనులు నిర్వహించకుండానే ఎం బుక్లు చేసి నిధులు ఏవిధంగా తారుమారు చేశారో తెలిసిందే. ఇదే వైఖరిని అధికారులు కొనసాగిస్తున్నారు. – ఎం.కృష్ణమూర్తి, రైతుసంఘం నాయకుడు -
ఆటో బోల్తా పడి ఇద్దరు మహిళలకు గాయాలు
చీపురుపల్లి: పట్టణంలోని రాజాం రోడ్లో వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఆటో బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు గాయలయ్యాయి. ఇద్దరిలో సవరపు సావిత్రికి తీవ్రగాయాలు కాగా గుంప సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్న ఆటోలో గరివిడి మండలానికి చెందిన సవరపు సావిత్రి, విజయనగరానికి చెందిన గుంప సావిత్రితో పాటు మరికొంత మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్వేస్టేషన్ దాటిన తరువాత వెదుళ్లవలస జంక్షన్ వద్ద ఎదరుగా మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనం రావడాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. దీంతో బొండపల్లికి చెందిన సవరపు సావిత్రి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే విజయనగరానికి చెందిన గుంప సావిత్రికి స్వల్ప గాయలయ్యాయి. దీంతో ఆ ఇద్దరినీ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తీవ్ర గాయాల పాలైన సవరపు సావిత్రిని అత్యవసర వైద్యం నిమిత్తం విజయనగరం రిఫర్ చేశారు. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి..స్థానిక సీత చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8,860 నగదు సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడిపందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏగోటివలస పొలాల్లో ఏనుగుల గుంపుసీతానగరం: మండలంలోని కోట సీతారాంపురంలో నాలుగు రోజులుగా తిష్ఠవేసిన ఏనుగుల గుంపు శుక్రవారం ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. కోట సీతారాంపురం గ్రామానికి వచ్చిన 8 ఏనుగుల గుంపు 9కి చేరడంతో తాజాగా 9 ఏనుగుల గుంపు ఏగోటివలస పొలాల్లో సంచరిస్తున్నాయి. కోటసీతారాంపురం రైతు కె.రత్నాకర్ పొలంలో మొక్కలు ధ్వంసం చేయడంతో నష్టం వాటిలిందని తెలియజేశారు. ఇక్కడి పొలాల్లో ఏనుగులు ఏమేరకు నష్టాల్ని తెస్తాయోనని చెరకు, మామిడిరైతులు ఆందోళన చెందుతున్నారు. 20 లీటర్ల సారాతో వ్యక్తి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారాను తరలిస్తున్న ఓ వ్యక్తి పట్టుబడినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయం వద్ద సీఐ విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన వ్యక్తికి సారాను సరఫరా చేసిన మరో వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జియ్యమ్మవలస మండలంలో గల పెదతుంబలి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా గ్రామ కమిటీ తీర్మానం మేరకు ప్రకటించినట్లు సీఐ పేర్కొన్నారు. -
విద్యుత్షాక్తో లైన్మన్ మృతి
శృంగవరపుకోట: ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై ఆ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మన్ మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం జామి మండలంలోని సోమయాజుల పాలెం గ్రామంలో జరిగింది. శాసనాపల్లి సచివాలంయలో జూనియర్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్న షేక్ రహ్మాన్ శుక్రవారం సోమయాజులపాలెంలో విద్యుత్ పోల్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడు, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన విజయనగరంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం వచ్చిందని, కుటుంబానికి ఆసరాగా కొడుకు ఉన్నాడని, మురిసిపోయామని, తమ ఆనందం మూడు రోజులు ముచ్చటే అయ్యిందని, ఇక తమకు దిక్కెవరంటూ మృతుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలిచివేసింది. చికిత్స పొందుతూ వృద్ధుడు..లక్కవరపుకోట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలో గల కేజీహెచ్లో చికిత్స పొందుతూ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన పెదగాడ అప్పారావు(77) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన ఎల్.కోట జంక్షన్ నుంచి అప్పారావు సోంపురం వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన అప్పారావును విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
యోగాంధ్ర పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపాలి
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాల్లో బాగంగా జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలను పర్యవేక్షించారు. జిల్లాలోని వివిధ మండల,పట్టణ స్థాయి యోగాంధ్ర పోటీల్లో గెలుపొందిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించామన్నారు.యోగా చిత్రలేఖనం, సాంగ్స్, ఎస్సే, గ్రూప్ యోగా ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. యోగా గురు మోహన్ గంతాయత్ బృందంతో కూడిన ఐదుగురు సభ్యులు జిల్లా స్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు, హోమియో వైద్యురాలు డా.సుశీల,జిల్లా కన్సల్టెంట్ డా రఘు,యోగా మాస్టర్స్ మోహన్ గంతాయత్, జనార్దన రావు, డా.హేమాక్షి, డా.వర్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
మెరుగైన వైద్య సేవలు కల్పించాలి
పార్వతీపురటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో గణనీయమైన సంఖ్యలో గిరిజనులు, పేదలు నివసిస్తున్నారని జిల్లాలో ప్రధానంగా వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రులే ఆధారమని కానీ చాలా ఆస్పత్రుల్లో సరైన మౌలిక వసుతులు లేవని వెంటనే మెరుగుపరచాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అభివృద్ధి వేదిక కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాలోని సాలూరు, కురుపాం, సీతంపేట, పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి, వైద్య సదుపాయాలపై రోగులు, ఆయా ఆస్పత్రుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ హేమలతకు వినతిపత్రాన్ని అందించి సమస్యలను వివరించారు. వెంటనే వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఒక బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువగా.. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి 150 పడకలకు, సాలూరు ఆస్పత్రి 100 పడకలకు, కురుపాం 50 పడకలకు, భద్రగిరి 50 పడకలకు, సీతంపేట 250 పడకలకు అప్డేట్ అయినప్పటికీ భవన నిర్మాణాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీని వల్ల ఒకే బెడ్పై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పడుకోవలసి వస్తోందన్నారు. అంతే కాక సాలూరులో గైనకాలజిస్ట్లు ఉన్నా ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రాలేదని, సాలురులో డాక్టర్ల కొరత కుడా చాలా ఎక్కువగా ఉందన్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీతో సహా అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చేలా డాక్టర్లను నియమించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు అత్యధికంగా నివసించే ప్రాంతమైన మక్కువ మండలంలోని నంద, దుగ్గేరు, సాలూరు మండలంలోని కురుకూటి, పాచిపెంట మండలంలోని వేటగాని వలస వంటి ప్రాంతాల్లో అదనంగా పీహెచ్సీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. కార్యక్రమంలో కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు కె.విజయయగౌరి, వేదిక నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, సీఐటీయూ మన్యం జిల్లా కార్యదర్శి బీవీ రమణ, డీవైఎఫ్ఐ నాయకుడు పి.రాజశేఖర్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివద్ధి వేదిక కమిటీ డిమాండ్ డీఆర్ఓకు వినతి పత్రం అందించిన కమిటీ సభ్యులు -
మా పొట్ట కొట్టారు
● కలెక్టరేట్ వద్ద ఎండీయూ వాహన ఆపరేటర్ల ఆందోళన ● కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● చిరుద్యోగులను తొలగిస్తున్న పాలకుల పదవులను ఊడగొడతామని హెచ్చరిక పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఎండీయూ ఆవరేటర్లు ●కూటమి నిర్ణయం సరైనది కాదు కూటమి ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం సరైనది కాదు. పాత విధానంలోనే ఇళ్ల వద్దకు రేషన్ సరుకులు అందజేసేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 196 మంది ఆపరేటర్లు రోడ్డున పడ్డారు. వారికి ప్రభు త్వం భరోసా కల్పించాలి. రాష్ట్ర నాయకులతో కలి సి ప్రభుత్వంపై ఉద్యమం చేపడతాం. – పి.మన్మథ, ఎండీయూ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు ●పెండింగ్ వేతనాలు చెల్లించాలి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి. ప్రభు త్వం జూన్ 1 నుంచి రేషన్ వాహనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎండీయా ఆపరేటర్లు ఎంతో మంది ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి. – ఎం.గౌరీశంకరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ●వీధిన పడ్డాం కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో వీధినపడ్డాం. ప్రభుత్వం ఎండీ యూ వ్యవస్థపై పునరాలోచించాలి. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలి. పెండింగ్ వేతనాలు చెల్లించాలి. – జంజేటి ప్రసాద్, ఎండీయూ ఆపరేటర్, పార్వతీపురం పార్వతీపురంటౌన్: ఎన్నికల ముందు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు... లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నమ్మించారు.. తీరా అధికారంలోకి వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దుచేసి వేలాదిమందికి ఉపాధి లేకుండా చేశారు... ఎండీయూ వ్యవస్థను ఆపేసి ఆపరేటర్ల పొట్టకొట్టారు.. వివిధ శాఖల్లోని చిరుద్యోగులను తొలగిస్తున్నారు.. ఉపాధిహామీ మేట్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఫీల్డు అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు.. ఇవే వేధింపుల పరంపర కొనసాగితే పాలకుల పదవులు కూడా ఊడగొట్టేరోజు వస్తుందని ఎండీయూ ఆపరేటర్లు హెచ్చరించారు. తమకు జరిగిన అన్యాయానికి నిరసగా కలెక్టరేట్ను శుక్రవారం ముట్టడించారు. కూటమి ప్రభుత్వ చిరుద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. ఇంటింటికీ రేషన్ సరఫరాను జూన్ 1 నుంచి నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తమ బతుకు బండికి భరోసా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. 196 ఎండీయూ వాహనాల ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
●పిల్లలను తరలిస్తే ఊరుకోం
బలిజిపేట: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెదపెంకి దళితపేట ప్రాథమిక పాఠశాల–1లో చదువుతున్న 3, 4, 5 తరగతుల పిల్లలను మోడల్ స్కూల్కు తరలించడం అన్యాయమంటూ పాఠశాల వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. దళితపేటలో సుమారు 800 కుటుంబాలు నివసిస్తున్నాయి. కూలి పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే వృద్ధులు, బందువులకు పిల్లలను అప్పగిస్తాం. ఆ సమయంలో దూర ప్రాంతంలోని పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లి, తేవడం కష్టం. పాఠశాల కమిటీ సమావేశం జరపకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకాభిప్రాయంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మా పిల్లలను వేరే పాఠశాలకు పంపిచేది లేదని తెగేసి చెప్పారు. ఊరి బడిని నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు నల్ల ఈశ్వరరావు, దళితపేటవాసులు పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ విజయనగరం అర్బన్: గిరిజన ప్రాంతాల్లో రేషన్ సరఫరాను పాత ఎండీయూ విధానంలో కొనసాగించాలని, లేదంటే ప్రత్యేక రేషన్ డిపోలను ఏర్పాటుచేసి సరుకులు సరఫరా చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ తీసుకోవడంలో గిరిజనుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ శుక్రవారం మాట్లాడారు. ప్రస్తుతం రేషన్ తీసుకోవడంలో గిరిజనులు పడు తున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లయి కమిషనర్కు ఎస్టీ కమిషన్ లేఖ రాసిందన్నారు. ఎండీయూ విధానాన్ని ఆపడంవల్ల గిరిజనులు వ్యయప్రయాసలకు గురవుతు న్నారని, ఏజెన్సీలో ఇంటింటికీ రేషన్ సరఫరా విధానం కొనసాగించాలని కోరారు. -
రాష్ట్రంలో హిట్లర్, ముస్సోలిని పాలన
● అందరికీ తల్లికి వందనం అని చెప్పి అన్ని నిబంధనలేమిటి? ● ఏం సాధించారని ఏడాది సుపరిపాలన సంబరాలు.. ● మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు రాజన్నదొర సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో రెడ్బుక్ పాలన సాగుతోందని.. హిట్లర్, ముస్సోలిని వంటి నియంతలను చంద్రబాబు, లోకేశ్లు తలపిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్న దొర విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని దగా చేసి, అన్ని వర్గాలనూ మోసగించి.. ఏడాది కాలంలో ఏం సాధించారని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారని కూటమి నాయకులకు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. నిజంగా వారు మంచి పరిపాలన అందిస్తే.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజ లు ఎందుకు బ్రహ్మరథం పడతారని ప్రశ్నించారు. సాలూరులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదేం సుపరిపాలన? ఇది ఏ సుపరిపాలనో తనకై తే అర్థం కావడం లేదని రాజన్నదొర అన్నారు. ‘తల్లికి వందనం గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం ఇస్తున్నది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినది. దీపం–2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది కాలంలో ఒక్కటే ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం వారి గొప్పా.. ఏ ప్రభుత్వం వచ్చినా కచ్చితంగా దానిని కొనసాగిస్తుంది. సూపర్ సిక్స్ కాకుండా.. గత ప్రభుత్వం అమలు చేసినవి, ఇతర పథకాలన్నీ కలిపి 150 వరకూ ఉంటాయి.. అవన్నీ ఎక్కడ? సంక్షేమ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు.. గతంలో ఇచ్చిన పథకాలన్నీ నిలిపివేశారు. ఇదేనా, ఇలాగేనా సుపరిపాలన? అడిగితే అరెస్టులు, మాట్లాడితే కేసులు.. అంబేడ్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. హిట్లర్, ముస్సోలిని పాలన సాగుతోంది..’ అని విమర్శించారు. ఏడాదిలోనే పాలన తేలిపోయింది.. ఏడాది కాలంలోనే కూటమి పాలన తేలిపోయింద ని రాజన్నదొర విమర్శించారు. వారిది నిజంగా సుపరిపాలన అయితే.. వారి భాషలో కనీసం ప్రతిపక్ష నేత కాని, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారని ప్రశ్నించారు. పొదిలిలో జన ప్రవాహం కనిపించిందని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. -
ముగిసిన టీచర్ల బదిలీ కౌన్సెలింగ్
రం, కురుపాం, కొమరాడ మండలాల సుదూర ప్రాంతాల స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురు మహిళా టీచర్లు ఆవేదన చెందారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్ ఖాళీలను ఉన్నతాధికారుల సూచనల మేరకు చివరి వరకు చూపించలేదన్నారు. మిగిలిన 152 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖాకీల హడావిడిపై గురువుల గుర్రు విజయనగరం క్రైమ్: డీఈఓ మాణిక్యంనాయుడు ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద సీఐ శ్రీనివాస్, వన్టౌన్ ఎస్ఐలు రామగణేష్, రమణ, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కౌన్సెలింగ్ కేంద్రంలో పోలీసుల హడావిడిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ లోపాలను విడిచిపెట్టి గురువులపై పోలీసులతో పెత్తనం సాగించాలని చూస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.● ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసినా చూపించిన క్లస్టర్ ఖాళీలు ● 2,300 మంది ఎస్జీటీలకు బదిలీ విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు.. నిరసనలు.. బైఠాయింపులు.. కౌన్సెలింగ్ కేంద్రంలో ఖాకీల హడావిడితో చివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాతిపదికన చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. 2,300 మంది ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో బదిలీచేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగినా ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లియర్ వేకెన్సీలు మాత్రమే భర్తీ చేశారు. క్లస్టర్ ఖాళీలు చూపించలేదు. చివరి రోజు 1,001 నుంచి ప్రారంభించిన కౌన్సెలింగ్ చివరి నంబర్ వరకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని అందరికీ సమాచారం ఇచ్చారు. ఒకే రోజు దాదాపు వెయ్యిమందిని పిలవడంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం పరిసరాలు ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. తాజాగా ఉన్న ఖాళీ స్థానాలన్నిటినీ తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు కోరుకోవడంతో, రిక్వెస్ట్ బదిలీల ఉపాధ్యాయులు అధికంగా తమ స్థానాల్లోనే ఉండిపోయేందుకు సుముఖత తెలిపారు. 1,400 సీరియల్ ప్రారంభ సమయానికి మైదాన ప్రాంత మండలాల స్కూల్స్లో పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. మిగిలిన ఉపాధ్యాయులు ఏజెన్సీ మండలాలైన జీఎల్పు -
పది మంది తహసీల్దార్లకు బదిలీ
పార్వతీపురం రూరల్: జిల్లాలో పదిమంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీపై వెళ్లే తహసీల్దార్లు నిర్దేశించిన సమయంలో వారికి కేటాయించి మండలాల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. ఇద్దరికి ఉద్యోగున్నతి ఇద్దరు గ్రేడ్–1 వీఆర్వోలు సీహెచ్ భారతమ్మ, బి.శ్రీనివాసరావుకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగో న్నతి కల్పిస్తూ శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వారిని కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
తహసీల్దార్కు బదిలీ ట్రీట్మెంట్!
సాక్షి, పార్వతీపురం మన్యం: కొద్ది రోజులుగా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, మండల తహసీల్దారు మధ్య నెలకొన్న వివాదంలో ఊహించిందే జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకు ‘అధికారం‘ తలొగ్గింది. పార్వతీపురం తహసీల్దారు జయలక్ష్మికి బదిలీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆమెను జియ్యమ్మవలస మండలానికి పంపించా రు. తహసీల్దారును ఇక్కడి నుంచి పంపించేయాల ని అధికారులపై ఒత్తిడి చేసిన టీడీపీ శ్రేణులు.. చివరికి తమ పంతం నెగ్గించుకున్నాయన్న చర్చ ఉద్యోగవర్గాల్లో సాగుతోంది. ఇదీ వివాదం.. కొద్దిరోజుల కిందట పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర రాత్రి సమయంలో ఫోన్ చేసి, అసభ్య పదజాలంతో తనను దూషించారని తహసీల్దారు జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఒక లేఖ బయటకు వచ్చిన విషయం విదితమే. దీనిపై తహసీల్దారు నిర్ధారణ చేయనప్పటికీ.. ఎమ్మె ల్యే మాత్రం మీడియా సమావేశం పెట్టి మరీ... సద రు మహిళా అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె పెద్ద అవినీతిపరురాలని చెప్పారు. డిజిటల్ సంతకాల కోసం గ్రామస్తుల నుంచి రూ.లక్షల్లో డిమాండ్ చేశారని ఆరోపించారు. మరోసారి ఆమెను కించపరిచేలా, అసభ్యకరంగా మాట్లాడారు. ఆ మరుస టిరోజు పార్వతీపురం తహసీల్దారు కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తహసీల్దారు జయలక్ష్మికి వ్యతిరేకంగా పలువురితో ఫిర్యాదులు చేయించారు. ఆ సమయంలో విచారణకు వచ్చిన సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వద్దే నినాదాలు చేశారు. ఆమెను విధుల నుంచి తప్పించాలని, ఇక్కడ నుంచి పంపించేయాలని పట్టుబట్టారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ తూలనాడారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదిక కలెక్టరుకు అందజేస్తామని అప్పట్లో సబ్ కలెక్టర్ చెప్పారు. నివేదిక వివరాలేవీ బహిర్గత పరచలేదు సరికదా.. తప్పు ఎవరిది తేల్చారో గానీ... ఎమ్మెల్యేతో వివాదం కేసులో ట్విస్ట్ పంతం నెగ్గించుకున్న టీడీపీ! తహసీల్దార్ జయలక్ష్మిని తాజాగా జరిగిన బదిలీల్లో జియ్యమ్మవలస మండలానికి పంపించారు. వాస్త వానికి ఆమె పార్వతీపురం మండలానికి వచ్చి ఎన్ని రోజులూ కాలేదు. మధ్యలో కొన్ని నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆ సెలవు వెనుక కారణం కూడా రాజకీయ ఒత్తిళ్లే అన్న విమర్శలు వినిపించా యి. ఇక్కడ చేయలేక, ఆమెనే బదిలీకి దరఖాస్తు చేసుకున్నారా, లేక రాజకీయ కారణాలతో మరోచోటకు పంపించి వేశారా? అన్న చర్చ నడుస్తోంది. ఇంకేం పని చేయగలం? కూటమి ప్రభుత్వంలో ఒక మహిళా తహసీల్దారుకు జరిగిన అన్యాయంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. విధుల్లో ఒత్తిడి తీసుకురావడమే కాక.. మాట వినలేదన్న కారణంతో చిన్న విషయాన్ని రాజకీయం చేసి, ఆమెను మరోచోటకు బదిలీ చేయడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వేధిస్తే ఇంకేం పని చేయగలమని వాపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం రాజకీయ నాయకులు చెప్పినట్లే తలాడిస్తున్నారని వాపోతున్నారు. -
సోమవారం సాలూరులో పీజీఆర్ఎస్
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమ వారం సాలూరులో నిర్వహిస్తామని కలెక్ట ర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జిల్లా అధి కారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సా లూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధికారులందరూ సాలూరులో నిర్వహించనున్న పీజీఆర్ఎస్లో పాల్గొనాలని కోరారు. గిరిజన వర్సిటీ పనులు వేగవంతం చేయండి ● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్ విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాల ని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. వర్సిటీ పనులను శుక్రవారం పరిశీలించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమణిని కలిసి నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ 2019లో స్థాపితమైన విశ్వవిద్యాలయ నిర్మాణం ఇప్పటి కీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. పను ల్లో ప్రభుత్వం అశ్రద్ధ చూపడం తగదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గిరిజన వర్సిటీది కీలకపాత్రగా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె.విజయగౌరి, నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆర్.జమ్ము క్లస్టర్లో రూ.23 లక్షల అవినీతి ● దర్యాప్తునకు డిమాండ్ చేసిన ఏపీ గిరిజన సంఘం నాయకులు గుమ్మలక్ష్మీపురం: మండలంలోని రాయగడ జమ్ము వెలుగు పథకం క్లస్టర్లో 2014 నుంచి 2020 వరకు సీసీగా పనిచేసిన గరుగుబిల్లి శ్రీనివాసరావు ఉన్నతి పథకం రుణాల పేరుతో రూ.23 లక్షలు అవినీతికి పాల్పడ్డారని ఏపీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మండంగి రమణ, మండంగి శ్రీనివాసరావు ఆరోపించా రు. అవినీతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురంలోని గిరిజన సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాయగడ జమ్ము క్లస్టర్లో రాయగడ జమ్ము, బాలేసు, చాపరాయి బిన్నిడి పంచాయతీలు (వీఓఏలు) ఉన్నాయి. ఈ మూడు వీఓఏల పరిధిలో సుమారు 14 మహిళా సంఘాల నుంచి ట్రైబల్ సబ్ప్లాన్ నిధులు ఉన్నతి పథకం కింద గిరిజనులకు అప్పులు ఇస్తామని చెప్పి సంతకాలు చేయించుకొని రూ.23 లక్షలను సీసీ స్వాహా చేశారు. అప్పట్లోనే ఈ అవినీతిపై ఐటీ డీఏ పీఓ, ఏపీఎంలకు ఫిర్యాదు చేశాం. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అవినీతికి పాల్పడిన శ్రీనివాసరావును మరలా రాయగడజమ్ము క్లస్టర్కు సీసీగా నియమించారు. దీనిని చూస్తే అధికారులే అవినీతికి ప్రోత్సాహిస్తున్నట్లుందని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు గతంలో జరిగిన అవినీతికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని, శ్రీనివాసరావు ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చే శారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకు లు పువ్వల తిరుపతిరావు, బిడ్డిక శంకరరావు, సన్యాసిరావు, సుబ్బారావు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం.సురేష్బాబు అన్నారు. స్థానిక రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తకొరత నివారణకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది డి.మృదుల, రమేష్కుమార్, కె.రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వందనం.. అమల్లో మోసం
అమ్మ ఒడి పథకంలో ఉన్న నిబంధనలపై విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేశ్లు.. తల్లికి వందనం పథకం విషయంలో అంతకుమించి నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారని రాజన్నదొర ప్రశ్నించారు. ‘గతంలో అమ్మఒడి సుమారు 80 లక్షల మందికి ఇచ్చాం.. ఒక్క విద్యార్థి చొప్పున అమలు చేస్తేనే అంతమంది. మీరు అందరికీ ఇస్తామన్నా రు. అందుకోసం మీరు ప్రత్యేకంగా ఎంత బడ్జెట్ కేటాయించారు. ఎందరికి కోత పెడుతున్నారు. కార్పొరేషన్ల నిధులు ఇటు మళ్లించారా? ఓట్లు దండుకోవడానికి ఎక్కువ మంది పిల్లలకు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు అన్ని నిబంధనలతో కొర్రీ పెడుతున్నారా?’ అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు తాము 70 శాతం హాజరు నిబంధన పెడితే.. ఇదే టీడీపీ విమర్శించిందని.. ఇప్పుడు ఉన్నది ఏమిటన్నారు. తాము పాఠశాల నిర్వహణ కోసం రూ.2 వేలు చొప్పున ఉంచితే కూటమి నేతలు గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు రూ.13 వేలు ఇస్తామని జీవో ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఈ నిబంధనలు ఏవీ మీరు చెప్పలేదు. ఎన్నికలప్పుడు అందరి ఓట్లు కావాలి. ఇప్పుడు నిబంధనలతో భారీగా కోత పెట్టారు. వారి కన్నీళ్లు మీకు తగులుతాయి. ‘తల్లికి వందనం.. అమల్లో మో సం’ అని విమర్శించారు. జగన్ పోరాటం వల్లే ఇప్పుడైనా పథకం అమలు చేస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధు లు, నాయకులు పాల్గొన్నారు. -
ముగ్గురూ ముగ్గురే..!
డీసీసీబీలో సూపర్వైజర్గా పనిచేస్తూ.. నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్ తెర్లాంలోని డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్(సూపర్వైజర్)గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్గా తెలంగాణ సర్కిల్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దినేష్ కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివాడు. తండ్రి అల్లు లక్ష్మణరావు వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నారు. తల్లి అల్లు గౌరి నందిగాం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) సభ్యురాలు. పెద్ద కుమారుడు సుధీర్కుమార్ వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్నాడు. – అల్లు దినేష్, నందిగాం, తెర్లాం మండలం● కష్టపడి చదివి..ఎస్బీఐలో కొలువులు ● ఆనందం వ్యక్తంచేస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులుతెర్లాం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కష్టపడి చదివారు. ఆ ముగ్గురూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో కొలు వులు సాధించారు. ఒకే గ్రామానికి చెందిన ము గ్గురికి ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ఒక్కసారే రావడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అల్లు దినేష్, గంటసాధిక్, కొల్లి ప్రకాష్లు బుధవారం వెలు వడిన ఎస్బీఐ పరీక్షా ఫలితాల్లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.రైతు బిడ్డ ప్రకాష్.. నందిగాం గ్రామానికి చెందిన కొ ల్లి ప్రకాష్ తె లంగాణ సర్కిల్లో ఎస్బీ ఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రకాష్ తండ్రి సింహాచలం రైతు. తల్లి లక్ష్మణమ్మ గృహిణి. ప్రకాష్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. –కొల్లి ప్రకాష్, నందిగాం, తెర్లాం మండలంమొదటి ప్రయత్నంలోనే ఎస్బీఐలో ఉద్యోగం.. నందిగాం గ్రామానికి చెందిన గంట సాంబశివ, పార్వతమ్మల కుమారుడు సాధిక్..మొదటి ప్రయత్నంలోనే మహారాష్ట్ర సర్కిల్లో ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాధిక్ బీకామ్ చదివాడు. తండ్రి సాంబశివ గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి పార్వతమ్మ నందిగాం జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. –గంట సాధిక్, నందిగాం, తెర్లాం మండలం -
‘చిటుక’ నివారణే లక్ష్యం..
సాధారణంగా వ్యాధి సోకిన జీవాలకు చికిత్స చేసే వ్యఽవధి ఉండదు. వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. సంవత్సరం వయసున్న గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే గొర్రెల్లోను, వలస గొర్రెల్లోనూ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంటు వ్యాధులు సోకక ముందే ఈ వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. గొర్రెల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి. ఎల్.విష్ణు, పశుసంవర్థక శాఖ ఎ.డి, బొబ్బిలి● -
గంజాయి నిందితుడి ఆస్తుల సీజ్
విజయనగరం క్రైమ్: గత ఏడాది గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఒడిశా వాసికి చెందిన రూ.42 లక్షల ఆస్తులు సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. 2024లో జిల్లాలోని ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్ గ్రామానికి చెందిన వ్యాపారి పతి ఖిల అలియాస్ గురు (32)కు చెందిన రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గురు 200కిలోల గంజాయిని గతేడాది అక్టోబరు 6న తరలిస్తూ ఎస్.కోటలో పందిరప్పన్న జంక్షన్ వద్ద పోలీసులకు పట్టుబడినట్లు చెప్పారు. విచారణలో నిందితుడు గురు కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. అలా వచ్చిన అక్రమ సంపాదనతో రూ.42,70,000 విలువైన స్థిర, చరాస్థులను కూడబెట్టినట్లు గుర్తించామన్నారు. ఆస్తుల అటాచ్ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టర్ వి.నారాయణమూర్తి, ఇతర పోలీసు అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. గంజాయి నిందితుడి అరెస్ట్సాలూరు రూరల్: మండలంలోని దుద్దిసాగరం గ్రామ శివారులో గత నెల 7వ తేదీన 183.800 కేజీల గంజాయితో కారును రూరల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో పరారైన నిందితుల్లో ఒకడైన దీపక్ కుమార్ పొధార్ను ఈ నెల 10వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని సెమిలిగుడలో గల ఫ్యూజన్ హోటల్లో పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మెజిస్ట్రేట్ వద్దకు రిమాండ్ నిమిత్తం పరిచినట్లు చెప్పారు. పాము కాటుతో వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని చినకాద గ్రామానికి చెందిన ఆవాల సూర్యనారాయణ(31) పాముకాటుకు గురై మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు సూర్యనారాయణ 10వ తేదీ రాత్రి గ్రామ సమీపంలో మల విసర్జనకు వెళ్తున్న సమయంలో చీకట్లో పాము కాటు వేయడంతో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య రాము, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ముందస్తు నివారణ లేకపోతే..‘చిటుక’లో గొర్రెల మృతి..!
● రోగాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ● టీకాలు వేయిస్తే వ్యాధి నివారణ ● తొలకరి వర్షాలు, అకాల వర్షాలకు మొలిచిన గడ్డిని వేయరాదు ● పశు సంవర్థక శాఖాధికారుల సూచనలురామభద్రపురం: గొర్రెల పెంపకందారులకు తీవ్రనష్టం కలిగించే వ్యాధి ‘చిటుక’ రోగం. ఇందులో 40 శాతం వరకు మరణాల రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నిమిషాల్లోనే చనిపోతాయి. గొర్రెల పెంపకందారులు ప్రధానంగా చిటుక రోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి సోకితే చిటికెలో వెంటనే మరణించే ప్రమాదం ఉండడం వల్ల దీనిని చిటుక రోగం అంటారు. జిల్లాలో 1,30,180 గొర్రెలు, 43,101 మేకలు ఉన్నాయి. వాటికి ఈ వ్యాధి సోకుండా, అలాగే వ్యాధి నివారణకు ప్రభుత్వం ఇప్పటికే టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ వ్యాధితో గొర్రెలకు నష్టం జరగకుండా ఉండేందుకు టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. టీకాల కార్యక్రమం మొదలైన నేపథ్యంలో గొర్రెల్లో ఈ వ్యాధి ఎప్పుడు వస్తుంది?లక్షణాలు ఎలా ఉంటాయి?నివారణ పద్ధతులపై పశుసంవర్ధక శాఖాధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీకాలు వేయిడంతో వ్యాధి నివారణ.. గొర్రెలు, మేకల్లో గాలికుంటు, మశూచి, పీపీఆర్, చిటుకు రోగం, దొమ్మ, గొంతువాపు మొదలైన అంటువ్యాధులు ఒక మంద నుంచి వేరే మందకు అత్యంత వేగంగా, సులభంగా వ్యాపించి ప్రాణనష్టం కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో చికిత్స చేసేందుకు తగిన వ్యవధి కూడా ఉండదు. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులకు చికిత్స బదులు నివారణే శ్రేయస్కరం అని గుర్తించాలి. అంటు వ్యాధులు సోకక ముందే వ్యాఽధి నిరోధక టీకాలు వేయిస్తే గొర్రెలు, మేకల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం.. మేకల్లో ఈ వ్యాధి తీవ్రత అంతగా కనిపించదు.గొర్రెలకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. తొలకరిలో ఎక్కువగా వస్తుంది. తొలకరిలో పెరిగిన పచ్చికను అతిగా మేయడం వల్ల శరీరంలో ఎప్సిలాల్ అనే విష పదార్థం విడుదల కావడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. మేతను తినేసి అకస్మాత్తుగా దాణాను మార్చడం వల్ల కూడా వచ్చే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. -
వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: వచ్చే నెల 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్కు సంబంధించి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగిన అన్ని క్రిమినల్ కేసులతో పాటు చెక్బౌన్స్ కేసులను గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టి జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవా లని సూచించారు. తద్వారా కక్షిదారులకు డబ్బు సమయం వృథా కావన్నారు. పోలీస్ అధికారులు వారెంట్ పెండింగ్ ఉన్న కేసులు, గంజాయికి సంబంధించిన కేసులు, పోక్సో యాక్ట్కు సంబంధించిన కేసులలో నిందితులకు అవగాహన కల్పించాలని, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయ పడ్డారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి బుజ్జి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 80 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి పిలుపు -
మాతాశిశు ఆరోగ్యం మెరుగుకు కృషి
● రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఎ.డి అనిల్కుమార్ పార్వతీపురంటౌన్: మాతాశిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్యశాఖ అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ కేవీఎస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై ప్రస్తావించి సమీక్ష చేశారు. గర్భిణులకు వైద్యసేవలు మెరుగు పరిచే లక్ష్యంగా జననీ మిత్ర యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మాతాశిశు మరణాలు నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్టేట్ కన్సల్టెంట్స్ డా.నరేంద్ర, వెంకటేష్లు యాప్పై వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.పద్మావతి, డీఐఓ డా.నారాయణరావు, ప్రోగ్రాం అధికారి డా.వినోద్, పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బడి బస్సు భద్రమేనా ?
బడి బస్సుల భారంపార్వతీపురంటౌన్: ప్రైవేట్ స్కూల్ విద్యలో ఇటు పుస్తకాలు, ఫీజుల మోతతో పాటూ బస్సు రవాణా మరింత బరువెక్కింది. ఏటా స్కూల్ ఫీజులు పెంచుతున్న విద్యాసంస్ధలు ఈ ఏడాది బస్సుల ఫీజులనూ వదల్లేదు. గతంలో పట్టణాలకు సమీపంలో రూరల్ గ్రామాలకు వెళ్లే బస్సుల్లో ఒక్కో విద్యార్థికి రూ.9వేలు, పట్టణ పరిధిలో రూ.7 వేలు వసూలు చేసేవారు. ఈ విద్యా సంవత్సరంలో రూరల్ గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రూ.13వేలు, పట్టణ పరిధిలో విద్యార్థులకు రూ.10వేలుగా నిర్ణయించారు. చిన్నపాటి పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్ధులకు రూ. 13వేల నుంచి రూ.15 వేల వరకు ఫీజ వసూలు చేస్తుంటే బస్సు రవాణాకు మరో రూ.13వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు బస్సు ట్రాన్స్పోర్టు భారంగా మారింది. ఇద్దరు పిల్లల స్కూల్ బస్సులకు చెల్లించే సోమ్ముతో పట్టణాల్లో మూడు నెలల పాటు ఇంటి అద్దె చెల్లించవచ్చుననే ఆలోచనలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఉన్నారు. బస్సు భారంతో స్కూల్ విద్యలోనే తరగతి చదివించేందుకు భారీ మొత్తం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సూమారు. 200 వరకు ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 58 వరకు బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 18,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. బస్సుల రవాణాకే ఏడాదికి లక్షల్లో చెల్లిస్తున్నారు. స్కూలు బస్సుల రవాణా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు వ్యాపారం..తల్లిదండ్రులకు భారంగా మారింది. విజయనగరం టౌన్: పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు పూర్తికావచ్చాయి. గురువారం పూర్తిస్థాయిలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకువెళ్లి వచ్చేందుకు గాను బస్సులు ముస్తాబవుతున్నాయి. అన్ని అనుమతి పత్రాలతో, ఫిట్నెస్ను సరిచూసుకుని బస్సు పనితీరు తదితర అంశాలపై స్కూల్ యాజమాన్యాలు, ఆర్టీఓ అధికారులు రంగం సిద్ధం చేశారు. స్కూల్ బస్సుకు సంబంధించి అన్ని రకాల సర్టిఫికెట్లు, ఫిట్నెస్ సక్రమంగా ఉంటేనే తిరగాలని, లేకుంటే కఠిన చర్యలకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడిబస్సుల భద్రతకు సంబంధించి జిల్లా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 15 ఏళ్లు దాటిన బస్సులకు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తమ స్కూల్ బస్సులో క్షేమంగా వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకునేందుకు గాను బస్సుల ఫిట్నెస్ను అధికారులు ఎప్పటికప్పుడు పర్వేక్షిస్తున్నారు. ఫిట్నెస్ సక్రమంగా ఉంటేనే వాటికి అనుమతులిస్తున్నారు. జిల్లాలో 510 స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు దాదాపు 400కి పైగా బస్సులు ఫిట్నెస్ పూర్తిచేసుకుని పాఠశాలలు, కళాశాలలకు విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మరిన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలతో పాటూ ఇతర అనుమతి పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ఎంపిక కీలకంస్కూల్ బస్సు డ్రైవర్ల ఎంపికలో విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. శిక్షణ పొందిన, ఆరోగ్యంగా ఉన్న డ్రై వర్లకు ఎక్కువ వేతనం చెల్లించాలన్న కారణంగా 50 ఏళ్లు నిండిన వారిని ఎంపిక చేసుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్ వయసు 50 ఏళ్లకు మించకూడదని, తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రై వర్ బీపీ, సుగర్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. యాజమాన్యాలదే బాధ్యతజిల్లాలో సుమారు 510కి పైగా స్కూల్ బస్సులు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. వాటిలో సుమారు 400 బస్సులకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు పాటించని బస్సులను తిరస్కరించారు. మిగిలిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్నారు. అయితే తిరస్కరణకు గురైన బస్సులను మళ్లీ పరీక్షలు చేయించుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని అధికారులు అంటున్నారు. స్కూల్స్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో బస్సు భద్రత తప్పనిసరి అని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉనాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులపై అధికారుల కొరడా 15 ఏళ్లు దాటిన బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు జిల్లాలో 400 బస్సులు ఫిట్నెస్లో పాస్ మిగిలిన బస్సులకు పరీక్షలు చేస్తున్న అధికారులుఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం ప్రతి స్కూల్ బస్సుకు సంబంధిత పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలి. లేకపోతే అటువంటి బస్సులను తిరగనిచ్చే ప్రసక్తే లేదు. పాఠశాల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని బస్సులు నడపాలి. పాఠశాలలు ప్రారంభం నాటి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. 15 ఏళ్లు దాటిన బస్సులు, 15 ఏళ్లకు దగ్గరగా ఉన్న బస్సులు తుక్కుగా అమ్మేసి వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దుచేసుకోవాలి. – మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయనగరం -
అన్నార్తులకు ఆసరా
గరుగుబిల్లి: ఏ ఆధారం లేని నిరుపేదలు కడుపారా రెండుపూటలా తినేందుకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఓ మంచి కార్యక్రమానికి గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు శ్రీకారం చుట్టారు. వృద్ధాప్యంలో వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి అవకాశం లేని వారిని గుర్తించి వారి వద్దకు నేరుగా క్యారియర్లతో రెండుపూటలా భోజనం సరఫరా చేసేందుకు శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రం ద్వారా చర్యలు చేపట్టారు. ఈ మేరకు గురువారం గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామంలో క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరఘట్టం, రావివలస, చిట్టపులివలస, కెల్ల తదితర దాదాపు పది గ్రామాల్లో గత కొన్నేళ్లుగా క్యారియర్ల ద్వారా అనార్తులకు భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాగూరులో 12 మందిని గుర్తించి వారికి కూడా ప్రతిరోజూ క్యారియర్ల ద్వారా భోజనం సరఫరా చేయనున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకే ఆహారాన్ని చిట్టపులివలసలో ఉన్న సత్యసాయి అన్నపూర్ణ సేవా కేంద్రంలో తయారు చేసి మినీ వాహనం ద్వారా తమ సిబ్బంది అన్నార్తులకు నేరుగా క్యారియర్లను అందిస్తారని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా మరికొద్ది రోజుల్లో గరుగుబిల్లి మండలంలోని దత్తివలస, కారివలస, చిలకాం గ్రామాలకు కూడా ఆహారాన్ని క్యారియర్ల ద్వారా సరఫరాచేయనున్నట్లు తెలిపారు. దాతల సహకారం అన్నార్తుల ఆకలి తీర్చేందుకు మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పలువురు దాతలు ముందుకొచ్చి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా కేతిరెడ్డి గాయత్రినాయుడు జ్ఞాపకార్థం ఆయన భార్య రాధాకాంతమ్మ రూ. 2లక్షలు, గురజాడ సంస్థల అధినేత రూ.2లక్షలు, అక్కేన సత్యనారాయణ జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు అంబటి తిరుమల రావు రూ.లక్ష, ఎల్లాపు కాశీవిశ్వనాథ తన తండ్రి జ్ఞాపకార్ధం రూ.లక్ష, అమెరికాలో ఉంటున్న విమలాకర్, సరళ దతాని ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష, తిరుమల తన తండ్రి జగన్నాథం జ్ఞాపకార్ధం రూ.50వేలు ఆర్థిక సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నఖచిత్రకారుడు పల్ల పరిశి నాయుడు వేసిన నఖ చిత్రమాల పుస్తకాన్ని గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ.స్వామినాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా రిమ్స్ సేవా సంస్థల ప్రతినిధి రమణబాబు, విశ్రాంత ఏఎస్పీ కె. భార్గవ నాయుడు, ఆధ్యాత్మిక గురువు వైఆర్వీ గణపతిరావు, సీతంనాయడు, బొత్స తవిటినాయుడు, మిరియాల సత్యనారాయణ, కేతిరెడ్డి శ్రీను, రిటైర్డ్ ఎస్ఈ కె.చంద్రశేఖరరావు, కొప్పల వెలమ సంఘం డైరెక్టర్ ఎ.మధుసూధనరావు, బి. తాతబాబు, తదితరులు పాల్గొన్నారు. రోజూ క్యారియర్లతో భోజనం సరఫరా -
శతాధిక వృద్ధుడి మృతి
వీరఘట్టం: వీరఘట్టం పట్టణానికి చెందిన శతాధిక వృద్ధుడు వూణ్న రామలింగేశ్వరుడు(103) గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రస్తుత జనరేషన్లో 25–30 ఏళ్ల లోపే చాలా మందికి సుగర్, బీపీ, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఆయనకు నేటివరకు జ్వరం అనే మాట కూడా తెలియదని ఆయన కుమారుడు సురేష్ తెలిపారు. కళ్లజోడు లేకుండా న్యూస్పేపర్ ప్రతిరోజూ చదివేవారని, బుధవారం రాత్రి భోజనం చేసి పడుకున్న తన తండ్రి నిద్రలోనే కన్నుమూశారని చెప్పారు. ఇన్నాళ్లూ ఒకరిపై ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా రామలింగేశ్వరుడు ఉన్నారన్నారు. -
మామిడి, పామాయిల్ మొక్కల ధ్వంసం
● కోటసీతారాం పురంలో ఏనుగుల తిష్ఠ సీతానగరం: మండలంలో దట్టమైన తోటలు న్న కోట సీతారాంపురంలో నాలుగు రోజులు గా ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. గ్రామానికి చెందిన అల్లు వాసు, సూర్యనారాయణకు చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటలో చెట్లను, పామాయిల్ తోటలో మొక్కలను ధ్వంసం చేశాయి. లక్షలు ఖర్చుచేసి మామిడి తోటను తయారు చేసి పంటకోతకు వచ్చే సమయానికి ఏనుగులు ధ్వంసం చేయడంతో అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనావేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. ఏనుగు పిల్లకు ‘సీత’గా నామకరణం కోట సీతారాంపురం గ్రామంలో బుధవారం జన్మించిన ఏనుగు పిల్లకు ‘సీత’ అని ట్రాకర్స్, బీట్ అధికారులు, గ్రామస్తులు కలిసి నామకర ణం చేశారు. 8 ఏనుగుల గుంపుతో కోట సీతారాంపురం వచ్చిన ఏనుగుల గుంపులో పెద్ద ఏనుగు శిశువుకు జన్మనివ్వడంతో ఏనుగు ల గుంపు 9కి చేరింది. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి విజయనగరం: గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోర దుర్ఘటన బాధాకరమన్నారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో 35 మంది వైద్య విద్యార్థులు మృతి చెందడం, మరో 16 మంది తీవ్రంగా గాయపడడం హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. విమాన ప్రమాదాలను అరికట్టడంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష విజయనగరం క్రైమ్: ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన మాదిరెడ్డి అప్పారావు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2023లో ఆండ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి ఎస్ఐ సిద్ధార్థ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం గజపతినగరం సీఐ అప్పలనాయుడు నిందితుడిని అరెస్టు చేశారు. అభియోగపత్రాన్ని ఎస్ఐ ప్రభాకర్ కోర్టులో దాఖలు చేశారు. అప్పారావుపై నమోదైన కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో మహిళా కోర్టు ఐదవ అడిషనల్ జడ్జి పద్మావతి నిందితునికి శిక్ష ఖారారు చేస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితునిపై నేరం రుజువయ్యేలా పోలీస్శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శకుంతల వాదనలు వినిపించారు. సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
క్లస్టర్ ఖాళీలు చూపించాల్సిందే..
● కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన ● బైఠాయించి ప్లకార్డులతో నిరసన ● కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై మండిపాటు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకపోవడం ఉపాధ్యాయులను ఆందోళన, ఆవేదనకు గురిచేస్తోంది. ఎస్జీటీ పోస్టుల బదిలీలను మాన్యువల్ విధానంలో జరపాలన్న ఉపాధ్యాయుల ఆందోళనకు కూటమి ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాన్యువల్ కౌన్సెలింగ్లో పోస్టుల ఖాళీలన్నింటినీ చూపించకపోవడంతో పారదర్శకత లోపించిందంటూ ఉపాధ్యాయులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించాలని, తమ చేతుల్లో ఏమీ లేదంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో గురువారం నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనే బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు సీరియల్ నంబర్ 500 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్ సాయంత్రం 4 గంటల సమయంలో 370 నంబర్ వచ్చింది. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మరోసారి క్లస్టర్ ఖాళీలు చూపించాలంటూ డిమాండ్ను లేవనెత్తారు. తొలుత అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నిరసనకు పిలుపునిచ్చారు. కౌన్సెలింగ్ ప్రాంగణం బయట, లోపల ఉన్న ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా నిరసనకు దిగి నినాదాలు చేశారు. ఈ సమయంలో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల్లోని ఖాళీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా, రాత్రి 9 గంటల తర్వాత విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ జరిపారు. అంతా అస్తవ్యస్తం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాల విద్యాబోధనలో నైపుణ్యాభివృద్ధికి కీలకంగా నిలిచే స్కూల్ కాంప్లెక్స్ల విధానాన్ని రద్దు చేసింది. వాటి స్థానంలో క్లస్టర్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. క్లస్టర్ మార్గదర్శకాల ప్రకారం ఇంతవరకు ఉన్న స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలు వాటి దూరం. ఆయా స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఆధారంగా జిల్లాలోని 162 స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో అదే సంఖ్యలో క్లస్టర్స్ను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్కు ప్రధానోపాధ్యాయుడితో పాటు స్కూళ్ల సంఖ్యను అనుసరించి ఒకటీ లేక రెండు ఎస్జీటీ పోస్టులను కేటాయించాలని క్లస్టర్ విధానంలో నిర్దేశించారు. అయితే ఈ పోస్టుల ఖాళీలను ప్రస్తుతం మాన్యువల్ కౌన్సెలింగ్లో తొలిరోజు నుంచి చూపించడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని పోస్టులు కొత్తగా రూపొందించినవి మాత్రమేనని, మంజూరైన పోస్టులు కాదన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడైనా పోస్టులు ఖాళీ అయితే క్లస్టర్ పరిధిలో నియమించిన ఉపాధ్యాయులు ఆ స్థానాల్లోకి వెళ్లి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వీటిని జూనియర్లకు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత మిగిలిపోయిన జూనియర్ ఉపాధ్యాయులకు ఈ పోస్టులను కౌన్సెలింగ్లో కేటాయిస్తామన్నారు. అయితే, క్లస్టర్ పరిధిలో పోస్టుల ఖాళీలను సైతం చూపించి, కౌన్సెలింగ్లోనే భర్తీచేయాలని ఉపాధ్యా య సంఘాలు పట్టుబట్టాయి. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: సైబర్ నేరగాళ్లు పెట్టే ప్రలోభాలకు గురికావద్దని, వారు చేసే వివిధ మోసాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులివ్వవద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, వాటిని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయొద్దన్నారు. అలా చేసి ఇబ్బందులు, లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. బెట్టింగ్ యాప్లు ఉపయోగించినా, ఇతరులకు ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మీరు లాటరీ గెలిచారు. మీకు పాస్వర్డ్ వస్తుంది. లేదా మీ మొబైల్కు వచ్చే పిన్ నంబర్ చెప్పండంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. స్క్రాచ్ చేయండి. రివార్డు పొందండి అని వచ్చే సందేశాలను క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని, ఏపీకే (ఏపీకె) పేరు మీద డాక్యుమెంట్ వస్తుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని కలెక్టర్ వివరించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రలోభపెట్టే యాప్ల జోలికి వెళ్లొద్దన్నారు. ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ
● జిల్లావ్యాప్తంగా 19,741 బస్తాల సరఫరా పార్వతీపురంటౌన్: పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలోని 1,504 పాఠశాలలకు 5,184 బస్తాలను, 150 వసతి గృహాలకు 13,456 బస్తాల ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం స్థానిక డీవీఎంఎం స్కూల్లో ఫైన్క్వాలిటీ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ కార్యక్రమం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా విద్యా శాఖాధికారితో కలిసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు ఈ సందర్భంగా ఫోర్టిఫైడ్ సన్నబియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులకు చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేయగానే బియ్యం ఏ సీజన్లో పండింది? పండించిన రైతు, చేరుకున్న రైతు సేవా కేంద్రం, బియ్యం రకం, ఏ రైస్ మిల్లులో మరపట్టా రు? చేరుకున్న స్టోరేజీ గోదాము, రైస్ వచ్చిన ప్రాంతం, ధ్రువీకరించిన సాంకేతిక సిబ్బంది, ప్యాకింగ్ ఏజెన్సీ పేరు తదితర వివరాలు తెలుసుకునే అవకా శం ఉందన్నారు. ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సరుకు పంపిణీ అవుతాయన్నా రు. జిల్లాకు పాలకొండలోని వెంకటేశ్వర రైస్ మిల్ నుంచి బియ్యం ప్యాకింగ్ అయి వచ్చినట్లు తెలిపా రు. ఇకపై సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నామని, విద్యార్థులు తప్పనిసరిగా ఈ పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఐ.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వారణాసి శ్రీధరరావు, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మరుగున బడిన వైభవం
● గత ప్రభుత్వంలో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, బెల్ట్ పంపిణీ ● పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు ● నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖల మార్పు ● నేడు అధ్వానంగా పాఠశాలలు ● తాగేందుకు నీరులేని పరిస్థితి ● అస్తవ్యస్తంగా పాఠశాలల నిర్వహణ ● ఉపాధ్యాయులకు అందని తల్లికి వందనం ఉత్తర్వులు పార్వతీపురం రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టి అమలు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అమ్మ ఒడి పేరుతో నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇచ్చిన హామీ మేరకు రూ.15వేలు తల్లుల ఖాతాల్లో జమచేసేది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పాఠ్యపుస్తకాల ను, బ్యాగ్లను, బూట్లు, సాక్సులు, బెల్ట్తో పాటు రెండు జతల యూనిఫాం ఇచ్చి వాటిని కుట్టించేందుకు తల్లిదండ్రులపై భారం లేకుండా కుట్టుకూలి సైతం ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా మౌలిక సదుపాయాల కల్పన కు సైతం నోచుకోని దుస్థితి విద్యాలయాల్లో నెలకొంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో నాడు– నేడు పథకం ద్వారా అత్యంత ఆధునికంగా పాఠశాలల రూపురేఖలను తీర్చిదిద్ది మెరుగైన సదుపాయా లు కల్పిస్తే వాటి నిర్వహణను సైతం కూటమి పాలకులు గాలికొదిలేశారు. దీంతో ప్రభుత్వ విద్యాలయాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. తాగేందుకు నీరు లేక.. ప్రతి పాఠశాలలో సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కూటమి పాలకుల నిర్లక్ష్యంతో వాటి నిర్వహణ కూడా చేయలేని పరిస్థితుల్లో అవి మూలకు చేరి నిరుపయోగంగా ఆయా పాఠశాలల్లో దర్శనమిస్తున్నాయి. గత విద్యాసంవత్సరం నుంచి తాగునీటి విషయంలో ఈ సమస్య ఉందని తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు ఓ గదిలో పెట్టి తాళం వేసి ఉంచుతున్న దృశ్యాలు ప్రతి పాఠశాలలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. మరమ్మతులు ఎందుకు చేయడం లేదని ఉపాధ్యాయులను ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు రావడం లేదని బదులిస్తున్నారు. అరకొరగా వచ్చిన నిధులు స్టేషనరీ నిర్వహణకు ఉపయోగిస్తున్నామని బదులిస్తున్నారు. నిర్వహణ లోపంతో.. పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లు, ప్రాంగణాలు, తుప్పలు, డొంకలతో అధ్వానంగా దర్శనమిస్తున్నా యి. అలాగే వంటశాలల నిర్మాణాలు లేక తరగతి గదుల పక్కనే వంట నిర్వహణ జరుగుతోంది. గత ప్రభుత్వంలో విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో విద్యాలయాలను తీర్చిదిద్ది కార్యాచరణ చేస్తే ప్రస్తుతం పాఠశాలల పరిస్థితి నిర్వహణలో పంతో అధ్వానంగా మారింది. మూలకు చేరిన బెంచీలు, అధ్వానంగా ఉన్న తరగతి గదులతో నేలపై కూర్చుంటున్న విద్యార్థులు, మరమ్మతులకు గురై మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు, పాడైన ఆట వస్తువులు, తలుపులు లేని తరగతి గదులు ఇలా పలు సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. 30మంది దాటి విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.25వేలు నిర్వహణ నిమిత్తం మంజూరు చేయగా 30కి తక్కువ మంది ఉన్న విద్యార్థుల పాఠశాలలకు రూ.10వేలు మంజూరు చేస్తున్నారు. ఈ కొద్దిమేర నిధులను సైతం విడతల వారీగా విడుదల చేయడంతో పాఠశాలలో నిర్వహణ కష్టతరం అవుతుందని ఉపాధ్యాయులు బాహాటంగానే బదులిస్తున్నారు. ఉత్తర్వులు రాలేదు నాడు అమ్మ ఒడి పథకానికి సంబంధించి తల్లిదండ్రుల వివరాలు పాఠశాల ద్వారా నివేదికలు సమర్పిస్తే డీబీటీ పద్ధతిలో వారి ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం నగదు జమచేసేది. అయితే పాఠశాల నిర్వహణకు రూ.వెయ్యి తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు చేరేది. ప్రస్తుతం ప్రభుత్వం గురువారం నేరుగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పేరిట రూ.15వేలు జమ చేస్తామని బహిరంగంగా చేసిన ప్రకటన మేరకు తమకేమీ ఉత్తర్వులు రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు సైతం వారి ఖాతాల్లో ఎలాంటి నగదు జమ కాలేదని చెబుతున్నారు. ఏ నివేదిక ప్రకారం ఎంత మందికి తల్లికి వందనం జమ చేస్తారో? లేదా ప్రకటనలకే పరిమితం అవుతారో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. నాటి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగా పండగ వాతావరణంలో వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏవీ కన్పించడం లేదని తల్లి దండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
సమస్యలతో రెడీ..!
సర్కారు బడి.. ● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● పనిచేయని ఆర్వో ప్లాంట్లు, మరమ్మత్తులకు గురైన మరుగుదొడ్లు ● మంజూరుకాని యూనిఫాంలు పార్వతీపురం/సీతంపేట: వేసవి సెలవులు ముగిశాయి. బడిగంట మోగే వేళయింది. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు చకచకా ముస్తాబవుతున్నారు. వీరికి పలు సమస్యలతో స్వాగతం పలికేందుకు చాలా సర్కారు బడు లు రెడీ అయ్యాయి. అధ్వాన పరిసరాలు, మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు, అసంపూర్తి భవన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. నాడు–నేడు నిధులతో పూర్తిచేయాల్సిన అదనపు భవన నిర్మాణాలు ఏడాదిగా నిలిచిపోవడంతో ఈ ఏడాది కూడా విద్యార్థులను వసతి సమస్య వెంటాడనుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను చూసే హెల్త్ వలంటీర్లు లేరు. ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు కార్యరూపందాల్చలేదు. నాడు సంస్కరణలు.. నేడు నిర్వీర్యం ఏడాది కిందటి వరకు విద్యార్థులను ఊరి బడి ఆకర్షించేది. పాఠశాలల పునఃప్రారంభమంటే పండగలా ఉండేది. విద్యాకానుకలు, అమ్మఒడి, నాణ్యమైన ఆంగ్ల మీడియం చదువులు, అందంగా ముస్తాబైన పాఠశాలలు విద్యార్థులను మురిపించేవి. ప్రభుత్వం మారడంతో సర్కారు బడులకు ప్రాధా న్యం తగ్గిందని విద్యార్థుల తల్లిదండ్రులే చెబుతున్నారు. రెండోవిడత నాడు–నేడు పథకం కింద జిల్లాలోని 544 పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేయడాన్ని తప్పుబడుతున్నారు. పేద, మధ్యతరగతి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సర్కారు బడులపై కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదంటున్నారు. ఆందోళ నలు చేస్తే తప్ప తల్లికి వందనం నిధులు విడుదల చేయని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు స్కూళ్ల విలీనం సన్నాహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి చేరిచేస్తున్నాయి. కొనసాగుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పార్వతీపురం మన్యం జిల్లాలో 2,232 మంది బదిలీల కోసం దరఖాస్తు చేశారు. మొదటి రోజు 400 మందికి బదిలీ అయ్యింది. ఈ బదిలీ ప్రక్రియ మరో ఐడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు దూరంగా ఉండనున్నారు. యూనిఫాం పెండింగ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,503 ఉన్నాయి. ఈ పాఠశాలలో 89,173 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థి కిట్లు కింద నోట్ పుస్తకాలు 4,87,214 వచ్చాయి. 89,173 బ్యాగ్లు, 64,476 బెల్ట్లు, 89,168 షూస్ వచ్చాయి. విద్యార్ధులకు సంబంధించి యూనిఫాం ఇంతవరకు మండల కేంద్రాలకు చేరలేదు. బడులను బలోపేతం చేయాలి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికే జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల ల్లో చేపడుతున్న దోపిడిపై అధికారులకు ఫిర్యాదుచేశాం. ప్రభుత్వ విధానం కార్పొరేట్ విద్యావ్యవస్థ కు బలం చేకూర్చేలా ఉంది. – పాలక రంజిత్కుమార్, గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి -
కలెక్టర్ ఏరువాక
గరుగుబిల్లి: మండలంలోని చిలకాం పంచాయ తీ దత్తివలస గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. పొలంలో దుక్కిచేసి ఏరువాకను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం అనాదిగావస్తున్న సంప్రదాయమన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్, ఎంపీపీ ఉరిటి రామారావు, డీపీఎం పి.షణ్ముఖరాజు, వ్యవసా యాధికారి విజయభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జన్మనిచ్చిన ఏనుగు ● 9కి చేరిన ఏనుగుల గుంపు సీతానగరం: మండలంలోని దట్టమైన తోటలు న్న కోటసీతారాంపురంలో మూడు రోజులుగా ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. ఓ ఆడ ఏనుగు బుధవారం మరో గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. దీంతో ఏనుగుల సంఖ్య 9కి చేరింది. ఏను గు ప్రసవ సమయంలో మిగిలిన 7 ఏనుగులు అడ్డుగోడగా నిలిచాయి. జనం కంట పడకుండా రక్షణ కల్పించాయి. -
కుట్రపూరితంగానే సాక్షిపై దాడులు
●మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే.. ●గతంలో విజయమ్మ, భారతమ్మలపై నీచంగా మాట్లాడారు.. ●నాడు కూటమి నేతలకు అది తప్పు అనిపించలేదా? ●మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు రాజన్నదొర సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: మహిళల పట్ల అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా ఖండిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎనలేని గౌరవ మర్యాదలు ఇస్తామని చెప్పారు. అలాంటి మహిళలను అసభ్యకర పదజాలాలతో విశ్లేషకులు సంబోధించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సాలూరులోని తన నివాస గృహంలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. సాక్షి టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరా వు, విశ్లేషకులు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు తెలిపారు. దానికి ఆయన క్షమాపణ చెప్పి వివరణ ఇచ్చుకున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెఢ్డిలకు ఆపాదించడం తగదన్నారు. పార్టీ కూడా ఖండించిందని చెప్పారు. ఈ వ్యవహారంలో డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం సరికాదన్నారు. గతంలో ఎల్లో మీడియాకు చెందిన టీవీ చానళ్లలో మహిళలను కించపరిచేలా జర్నలిస్టులు, విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అది ఎవరికీ తప్పుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని కించపరచలేదా? గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కించపరుస్తూ అనేకమంది వ్యాఖ్యలు చేశారని రాజన్నదొర తెలిపారు. అప్పుడు లేని కేసులు, అరెస్టులు ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించా రు. ఇప్పటికీ వైఎస్ విజయమ్మ, భారతీరెడ్డిలను కించపరిచే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పారు. వాటిపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అవితప్పుగా కనిపించడం లేదా? అని నిలదీశారు. సమావేశాల్లో కావచ్చు.. ప్రెస్ మీట్లో కావచ్చు, డిబేట్లో గానీ.. మాట్లాడే వారే బాధ్యులు అవుతార ని రాజన్నదొర అన్నారు. నిర్వహణ చేస్తున్న చాన ల్ పైన, ప్రింట్ మీడియాపైన తప్పును నెట్టడం భావ్యం కాదన్నారు. ‘సాక్షి’ మీడియాను కుట్ర పూరితంగా మూసివేయాలని చూస్తున్నారని.. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యాలయాలపై ఈ దాడులని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చడానికే... ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టామని రాజన్నదొర తెలిపారు. ఆ కార్యక్రమం రాష్ట్రమంతా విజయవంతమైందని.. ప్రజల్లో ప్రభుత్వంపైన అసమ్మతి పెరిగిందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం రకరకాలుగా ఆలోచనలు చేస్తోందన్నారు. గిరిజన బాలిక హత్యపై ఎందుకు స్పందించరు? కూటమి ప్రభుత్వం మహిళల గురించి గొప్పగా చెప్పుకుంటోందని.. ఇదే సమయంలో అనంత పురం జిల్లాలో తన్మయ అనే గిరిజన అమ్మాయిని అన్యాయంగా చంపేశారని.. ఆ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసు పెట్టడం కాదని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవా ల్సి ఉందన్నారు. గిరిజనశాఖ మంత్రి ఏ విధంగా ఆదుకుంటున్నారో.. హోం శాఖ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఒక దళిత బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగిందని.. సాలూరు నియోజకవర్గం సామంతవలస, మర్రివలస సమీపంలో యువతిని దారుణంగా ఉరి వేసి చంపేశారని.. సాలూరు మండలంలో గిరిజన ఎంపీటీసీని జుట్టు పట్టుకుని కొట్టారని... వారికి ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు. అప్పుడు మహిళ ల పట్ల ఈ గౌరవం ఎందుకు కనిపించలేదన్నారు. తాము గానీ, తమ అధినేత గానీ ఎప్పుడూ మహిళలకు అగ్రతాంబూలం ఇస్తామని గుర్తు చేశారు. అబలల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
● ఇష్టానుసారం ఉద్యోగుల బదిలీలు ● రెండు గంటల్లోనే ఒకరి ఉత్తర్వులు తారుమారు ● ఆర్జేడీ కార్యాలయం నుంచే మొత్తం తతంగం ● నడిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?
సాక్షి, పార్వతీపురం మన్యం: ఐసీడీఎస్లో బదిలీలు పెట్టిన చిచ్చు.. చల్లారేలా కనిపించడం లేదు. అక్రమంగా సాగిన ఈ ప్రక్రియ కొంతమందికి లబ్ధి కలిగిస్తే.. మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. విశాఖ జోనల్ పరిధిలో ఆర్జేడీ కార్యాలయం నుంచి సాగిన పైసా వసూల్ బదిలీలు.. చివరికి న్యాయస్థానం మెట్లు ఎక్కే వరకూ సాగేలా ఉంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో బదిలీలకు అవకాశం కల్పించిన విషయం విదితమే. ఈ నెల 9వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది. విశాఖ జోనల్ పరిధిలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ తంతు వివాదాస్పదంగా మారింది. మొత్తం ఆర్జేడీ కార్యాలయం నుంచి చక్రం తిప్పిన ఓ సీనియర్ సహాయకుడు.. ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇష్టానుసారం, వేలంపాట మాదిరి చేపట్టిన బదిలీలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. ●విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవోను బదిలీ చేస్తూ సాయంత్రం 5.30కి ఉత్తర్వులు అందాయి. మరొకరికి ఆ స్థానంలో నియమించేశారు కూడా. అక్కడ నుంచి కదలడానికి ఇష్టపడని సదరు సీడీపీవో.. తనకున్న పలుకుబడితో కేవలం రెండు గంటల్లోనే ఉత్తర్వులు మార్పు చేసుకున్నారు. మరలా యథా స్థానంలో కొనసాగేందుకు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ●బదిలీలను ఇష్టానుసారం.. తమకు నచ్చిన విధంగా చేసి పడేశారు. రెండేళ్లు పూర్తి కాకపోయినా.. ‘రిక్వెస్’ పెట్టుకోకపోయినా స్థానచలనం కలిగించారు. ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. కనీసం విజ్ఞప్తి కూడా పెట్టుకోలేదు. ఆమెకు ‘రిక్వెస్ట్’ పెట్టుకున్నట్లుగా కారణం చూపుతూ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేశారు. ●చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గ్రేడ్–2 సూపర్వైజర్గా రెండేళ్ల కిందట ఉద్యోగోన్నతిపై ఒక సూపర్వైజర్ గజపతినగరం నియోజకవర్గంలోని ప్రాజెక్టుకు వెళ్లారు. వాస్తవానికి ఆమెకు బదిలీకి అవకాశం లేదు. తాజా బదిలీల్లో ఆమెను తన సొంత ప్రాంతమైన చీపురుపల్లి నియోజకవర్గానికే మరలా వేయడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్లయినా సర్వీసు పూర్తి కాని ఓ సూపర్వైజర్కు భోగాపురం నుంచి గంట్యాడ పోస్టింగ్ ఇచ్చారు. ●వితంతువులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త వెసులుబాటు ఇవ్వాల్సి ఉంది. ఈ శాఖలో వితంతువుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోలా వ్యవహరించారు. కేన్సర్తో బాధ పడుతున్న ఓ ప్రాజెక్టు సూపర్వైజర్.. చికిత్సకు వీలుగా ఉంటుందని, విశాఖపట్నంలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నచోటే ఉంచేశామని.. సంతోషించాలని ఆర్జేడీ కార్యాలయం నుంచి సమాధానం రావడం విశేషం. ఎవరికో లబ్ధి కలిగించాలని.. వేరెవరినో బలిచేస్తూ బదిలీల తంతు సాగింది. 50 ఏళ్లు దాటిన వారికి ఏజెన్సీలోని కొండ ప్రాంతాలకు వేశారు. ●పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ఓ సూపర్వైజర్ను విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. మన్యం జిల్లాలో ఆ స్థానంలోకి కొత్తగా వస్తున్న వారు విధుల్లో చేరితేనే.. ప్రస్తుతం ఉన్నవారిని రిలీవ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న సూపర్వైజర్లు ఇంకా రిలీవ్ ఆర్డర్లు తీసుకోకుండానే సీడీపీవోలు అత్యుత్సాహం చూపినట్లు తెలుస్తోంది. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నా.. సంబంధిత సూపర్వైజర్లను రిలీవ్ చేస్తున్నట్లుగా వారి వ్యక్తిగత మెయిల్కు ఆర్డర్లు పంపేశారు. చక్రం తిప్పుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఐసీడీఎస్లో వేలంపాట మాదిరి జరిగిన బదిలీల తంతులో ఆర్జేడీ కార్యాలయం చుట్టూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారికి లబ్ధి కలిగించేందుకు ఓ సీనియర్ సహాయకుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గతంలో విజయనగరం జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీడీపీవో వేధింపులు భరించలేక.. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తమ వివరాలను గోప్యంగా ఉంచుతూ, విషయాన్ని లేఖ రూపంలో ఆర్జేడీ కార్యాలయానికి పంపారు. దీనిపై ఎటువంటి విచారణ కూడా చేపట్టకుండా సదరు ఉద్యోగితోపాటు.. మరో కీలకాధికారి ఆ ఫిర్యాదును కనుమరుగు చేసినట్లు సమాచారం. మరోవైపు అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు ఉద్యోగులు న్యాయస్థానం తలుపుతట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
వసివాడుతున్న బాల్యం!
పని ప్రదేశంలో బాలలుబాలలను పనిలో పెడితే... కఠిన చర్యలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకార్మికుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ● పనుల్లో నలిగిపోతున్న పిల్లలు ● నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంవిజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాఽథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి. భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. -
అడ్డగోలు అవిశ్వాసం సంపూర్ణం
బొబ్బిలి: టీడీపీ నాయకులు పదవీ కాంక్షతో చేపట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇప్పటికే వైఎస్సార్సీపీకి పజలు కట్టబెట్టిన మున్సిపల్ చైర్మన్ పదవిని కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవిని కూడా అదే అవిశ్వాసంతో రాజకీయం చేసి తమ వైపు తిప్పుకున్నారు. దీంతో అడ్డగోలు అవిశ్వాసం పూర్తయినట్లయింది. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని, ఇందుకు అనుకూలంగా చేతులెత్తాలని ఆర్డీఓ రామమోహన రావు కోరారు. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే బేబీ నాయన చేతులెత్తడంతో మూడవ వంతు కౌన్సిలర్లు (22మంది) చేతులెత్తారు. వారితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన రెండో వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ కూడా చేతులెత్తడంతో సంఖ్యాపరంగా సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీఓ ధ్రువీకరించారు. అనంతరం వారితో సంతకాలు చేయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. కాగా ఈ అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. వారంతా వైఎస్సార్సీపీ కార్యాలయంలోనే ఉండిపోయారు. -
అండర్–14 క్రికెట్ పోటీల్లో ‘విఘ్నేష్’ సత్తా
● దూసుకుపోతున్న తెర్లాం యువకుడు ● ముంబైలో జరుగుతున్న టోర్నమెంట్ ● టోర్నమెంట్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ● రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కై వసంతెర్లాం: ముంబైలో జరుగుతున్న అండర్–14 క్రికెట్ టోర్నమెంట్లో తెర్లాం మండలం ఎన్.బూర్జవలస గ్రామానికి చెందిన యువకుడు పైల విఘ్నేష్ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. టోర్నమెంట్లో ఓ జట్టు తరుఫున విఘ్నష్ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో రెండుసార్లు మేన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మన్గా ఎంపికయ్యాడు. ఒక మ్యాచ్లో 91 బంతుల్లో 104 పరుగులు, మరో మ్యాచ్లో 62 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముంబైలో పలు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అకాడమీలు నిర్వహించే టోర్నమెంట్లో విఘ్నేష్ ఈ ఘనతను సాధించాడు. అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీల్లో రాణిస్తున్న విఘ్నేష్ను మండలానికి చెందిన పలువురు అభినందించారు. విఘ్నేష్ తండ్రి పైల గణపతి ఎన్.బూర్జవలస పంచాయతీ సర్పంచ్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. -
రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కురుపాం మండలంలోని సందిగూడ నుంచి కాగుమాను గూడ వరకు 820 మీటర్ల రహదారి నిర్మాణానికి, కాగుమానుగూడ నుంచి సాలిదంగు వరకు 820 మీటర్ల రహదారి, పొద్దీస నుంచి సాలమానుగూడ వరకు 1320 మీటర్ల రహదారి, సాలమాను గూడ నుంచి చాపరాయిగూడ వరకు 1300 మీటర్ల రహదారి, దాముగూడ నుంచి చినబంటుజోల వరకు 815 మీటర్లు, మంటికొండ నుంచి దాముగూడ వరకు 733 మీటర్లు, జె పులుపుట్టి నుంచి వై పులిపుట్టి వరకు 1140 మీటర్లు, జాజరుగూడ నుంచి జె పులుపుట్టి వరకు 1120 మీటర్లు, తిత్తిరి నుంచి దొమ్మిడి వరకు 1208 మీటర్లు, దొమ్మిడి నుంచి గాలిమానుగూడ వరకు 1034 మీటర్లు, తిత్తిరి నుంచి గునుగూడ వరకు 1197 మీటర్ల రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహదారులు గిరిజన ఆవాసాలను బయట ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు అత్యావశ్యమని కమిటీ భావించింది. త్వరగా రహదారుల నిర్మాణం పూర్తిచేసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జీఏపీ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ19416 నుంచి కబడ్డీ టీమ్కు శిక్షణపాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లా అండర్ 18న కబడ్డీ టీమ్కు శిక్షణ ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కబడ్డీ ఆసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అండర్ 18 కబడ్డీ టీమ్ జాతీయస్థాయిలో పాల్గొనడానికి క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండ్ 18 కబడ్డీ పోటీల్లో పాల్గొనదలచిన వారికి శిక్షణ అందిస్తామని, వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ 9440529144 నంబర్ను సంప్రందించాలని సూచించారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, కోశాధికారి శనగల సీతారాం, సభ్యులు కాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదంవేపాడ: మండలంలోని భర్తవానిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణంలోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితుడు పోతల రామునాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారు జామున తన షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో ప్రింటర్తో పాటు నోట్బుక్స్, ఇతక సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ మీటర్ కాలిపోయిందని, ఫ్రిడ్జ్ పాక్షికంగా కాలిపోయిందని, సుమారు ఏభై వేలు రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఆమె చూపు పదిలంచీపురుపల్లి: మరణానంతరం చూపు పదిలంగా ఉండాలంటే నేత్రదానం చేయాలి. అప్పుడే ఆ నేత్రాలు నిరంతరం సజీవంగా ఉంటాయి. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణానికి చెందిన అంధవరపు జగదాంబ చూపు కూడా నిరంతరం పదిలంగా ఉండనుంది. దీనికి ఆమె నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేయడమే కారణం. పట్టణంలోని ఆంజనేయపురంలో నివాసం ఉంటున్న ఆంధవరపు జగదాంబ(57) బుధవారం ఉదయం మృతిచెందారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అక్కడికి వెళ్లి నేత్రదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి భర్త అంధవరపు నర్సింగరావు తన భార్య నేత్రాలు దానం చేసేందుకు అంగీకరించగా విజయనగరం రెడ్క్రాస్ సొసైటీ టెక్నీషియన్ రమణ, సుధాకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి నుంచి కార్నియా సేకరించారు. సీతం అధ్యాపకుడికి గుర్తింపు● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ విజయనగరం అర్బన్: ఐఐటీ మద్రాస్ నిర్వహించిన నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీస్ ఎన్హేన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపిందుకు విజయనగరం పట్టణంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మొగలి మధుబాబుకు ‘ఎన్పీఈఎల్ స్టార్ బిలీవర్’గా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన నాలుగు విభిన్న సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఐఐటీ మద్రాస్లో జరగనున్న ప్రత్యేక ‘స్టార్ బిలీవర్స్’ వర్క్షాప్కు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుబాబును కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ డార్టర్ దామోదరనాయుడు, ఇతర అధ్యాపకులు అభినందించారు. -
సబ్జైల్ ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేర ప్రవృత్తిని విడనాడాలని సూచించారు. జైలులో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదన్నారు. అనంతరం సబ్ జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను తనిఖీ చేశారు. పారా లీగల్ వలంటీర్ల విధులపై ఆరా తీశారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని, భోజనశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ను సందర్శించి వంట సరుకులను పప్పు దినుసులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ , సబ్ జైల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. -
ఆండ్ర ఎస్సైకి ఎస్పీ ప్రశంసలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధి బిరసాడవలన గ్రామసమీపంలోని గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను ఆండ్ర ఎస్సై కె.సీతారామ్ కాపాడారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అనంతరగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెంకు చెందిన గెమ్మెల రాంబాబు, గెమ్మెల అప్పలస్వామిలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు డయల్ 100, 112 నంబర్కు సమాచారం ఇవ్వగా సకాలంలో ఎస్సై సీతారాం స్పందించి ఘటనా స్థలికి చేరుకుని, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని 108 సిబ్బంది సహకారంతో అంబులెన్స్లో ముందుగా గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆ ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను స్పెషల్ బ్రాంచ్ ద్వారా తెలుసుకున్న ఎస్పీ వకుల్ జిందల్ ఆండ్ర ఎస్సై సీతారాంను అభినందించారు. -
ఆర్టీసీ ఉద్యోగులలో ఆందోళన తొలగించాలి
● నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిమాండ్ పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న పార్వతీపురం, పాలకొండ, సాలూరు ఆర్టీసీ డిపోల సమస్యలపై ఏపీపీటీడీ, డీపీటీఓలకు అనేక మార్లు మెమొరాండాల ద్వారా సమస్యల పరిష్కారానికి తెలియజేసినప్పటికీ ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా మరిన్ని సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన, అభద్రత తొలగించి జిల్లాలో పారిశ్రామిక శాంతి నెలకొల్పాలి. ఈ మేరకు బుధవారం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, గతంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో అంగీకరించారు. అయినప్పటికీ అమలు చేయని అంశాలపై జోనల్ కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ జరిపి సామరస్య పూర్వకంగా చేసే ఉద్యమాలకు యాజమాన్యం కనీసం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సమ్మె నోటీసు’ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ చొరవ తీసుకుని సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆర్టీసీ జిల్లా, డిపో అధికారులను ఆదేశించి సమ్మె జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. కలెక్టర్కు 30 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధం విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, 15 రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు బుధవారం ఆరు జిల్లాల సంఘం నాయకులు కలిసి తమ సమస్యలు వినిపించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ నాయకులపై దౌర్జన్యం, అనారోగ్య సెలవులు పెట్టిన ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫెల్, డిపో కమిటీ నాయకులు బి.రామారావు, ఎం.కృష్ణ, వై.విష్ణు, గురుమూర్తి, జి.ప్రభాకరరావు, ఎస్.కోట డిపో అధ్యక్ష, కార్యదర్శి ఎ.రాజయ్య, జి.వి.రమణ, తదితరులు ఉన్నారు. -
మెట్టవలసలో డీఎంఓ పర్యటన
రామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధి మెట్టవలస గిరిజన గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థికి కుడుమూరు మేఘన(14) ఈనెల 9వ తేదీ రాత్రి విషజ్వరంతో మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయాన్ని విషజ్వరంతో గిరిజన విద్యార్ధిని మృతి శీర్షికన ఈ నెల 11న సాక్షి వార్త ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన డీఎండ్హెచ్వో మెట్ట్వలస గ్రామాన్ని సందర్శించి మేఘన మృతికి గల కారణాలతో పాటు అక్కడ వైద్యశిబిరం నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారిణి వై.మణిని ఆదేశించారు. దీంతో ఆమె బుధవారం మెట్టవలస గిరి జన గ్రామాన్ని సందర్శించి మృతిచెందిన గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు సూర్యనారాయణ,సంధ్యలను పరామర్శించారు.అలాగే మేఘన ఎలా మృతిచెందింది? మృతికి గల కారణాలేంటి? ఎన్ని రోజులు జ్వరం వచ్చింది? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతురాలి కుటుంబసభ్యులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఒకరిద్దరికి వైరల్ జ్వరాలు ఉండడంతో వారికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు.సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామప్రజలకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఎన్.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
నిజజీవితంలో స్మార్ట్ స్కిల్స్ అవసరం
● జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మివిజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధి పనిలోనే కాకుండా నిజ జీవితంలో కూడా స్మార్ట్ స్కిల్స్ అవసరమని జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి అన్నారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో ‘స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఏ సెక్యూర్ ఫ్యూచర్’ అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో బుధవారం నిర్వహించిన వర్క్షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చెందేందుకు వయస్సుతో సంబంధం లేదన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సాఫ్ట్స్కిల్స్పై నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ఈసీఈ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.హేమ పర్యవేక్షణలో వర్క్షాప్ రి సోర్స్ పర్సన్స్గా ఎస్బీఐఎల్డీ చీఫ్ మేనేజర్ (ఫ్యాకల్టీ) సురేష్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ వి.అభినాష్, డాక్టర్ కె.శ్రీకాంత్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.రాజేశ్వరరావు, ఎస్బీఐ అధికారులు, ఎం.సురేష్ బాబు, ఎ.శ్రీనివాసరావు, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు సేవలు దూరం
విజయనగరం ఫోర్ట్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతు ముంగిటకే సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల(రైతు సేవా కేంద్రాలు)ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. విత్తు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అక్కడే అందించేవారు. దీంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేయడానికి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పింది. రైతులే తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పురుగు మందులు ఇండెంట్ పెట్టుకునే విధంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ కియోస్క్లను ఏర్పాటు చేశారు. దీంతో రైతులకు వారి గ్రామాల్లోనే సేవలు అందడంతో ఎంతో సంతోషించేవారు. జగన్మోహన్ రెడ్డి పాలన చెరిపేసేలా చర్యలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అన్ని సేవలు ఒకే చోట అందడంతో అన్నదాతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన ముద్రను చెరిపేసే విధంగా ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ విమర్శలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చేసింది. ఇప్పడు ఏకంగా రేషనలైజేషన్ పేరుతో రైతు భరోసా కేంద్రాలను కుదించేస్తోంది. ఉన్న సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తోంది. ఒక వైపు ఖాళీ పోస్టులు భర్తీ కాకపోగా, ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడంతో కర్షకులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 396 జిల్లాలో 396 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 10 అర్బన్ రైతు భరోసా కేంద్రాలు కాగా 386 గ్రామీణ ప్రాంత రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 383 మంది సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్యను 357కు తగ్గించేసింది. 26 మంది సిబ్బంది తగ్గిపోయారు. 242 మంది గ్రామ వ్యవసాయ సహాయకులకు గాను 223 మందికి తగ్గించేశారు. గ్రామ ఉద్యాన సహాయకులు 79మందికి గాను 72కు తగ్గించేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందే సేవలు రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు ఉండేవారు. రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ ఈక్రాప్ బుకింగ్కు రైతు డేటాను ఆప్లోడ్ చేయడం పంట సాగుదారుల హక్కు ధ్రువీకరణ పత్రం జారీ, విత్తన సేకరణ కార్యకలాపాలు పీఎం కిసాన్, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ వంటి పంట రుణాల కోసం డేటాను ఆప్లోడ్ చేయడం పొలంబడి,, సీడ్ విలేజ్ ప్రోగ్రాం, మినీకిట్ ట్రయల్ ఫ్లాట్లు, మొదలైన ఫ్లాగ్ షిప్ పోగ్రాంల నిర్వహణ పొలం బడి పద్ధతి ప్రదర్శనలు స్మార్ట్ టీవీ ద్వారా క్రాప్ నిపుణులతో సాంకేతిక స్టేషన్ల చిరునామా ప్రత్యక్ష ప్రసారం వివిధ పథకాల కింద లబ్ధిదారుల సామాజిక తనిఖీ డిజిటల్ లైబ్రరీ ద్వారా తెగుళ్లు, వ్యాధులపై అవగాహన కల్పించడం పశు ఆరోగ్య కార్డుల జారీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, జంతువుల ప్రథమ చికిత్స ఈక్రాప్ బుకింగ్ ద్వారా పశుగ్రాసం అవసరాన్ని లెక్కించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాల కుదింపు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన సహాయకుల తగ్గింపురేషనలైజేషన్ పూర్తిరేషనలైజేషన్ పక్రియ పూర్తయింది. ఆ వివరాలను ఉన్నతా ధికారులకు పంపించాం. దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించనున్నాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
సైబర్ నేరాల ఛేదనకు దర్యాప్తు ముమ్మరం
విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన సైబర్ కేసులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు.సైబర్ నేరాలను ఛేదించేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసుల మిస్టరీని ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల ఛేదనకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని దర్యాప్తు అధికారులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాల్లో బాధితులు ఏ తరహాలో మోసపోయింది? ఆయా కేసుల్లో ఇప్పటివరకు సంబంధిత దర్యాప్తు అధికారులు చేపట్టిన దర్యాప్తు, తీసుకున్న చర్యలను అధికారులను అడిగి అదనపు ఎస్పీ తెలుసుకున్నారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే బాధితులు సంప్రదించి, సకాలంలో 1930కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన తరువాత బాధితుల నగదు ఎవరి బ్యాంకు ఖాతాకు బదిలీ జరిగింది? ఎక్కడ, ఎవరు ఆయా నగదును విత్ డ్రా చేశారన్న వివరాలను సాధ్యమైనంత వేగంగా రాబట్టాలన్నారు. అనంతరం, ఆయా బ్యాంకు ఖాతాల నుంచి నిందితులు నగదు విత్ డ్రా చేయకుండా ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఫ్రీజ్ అయిన నగదు కోర్టు అనుమతితో బాధితుల బ్యాంకు ఖాతాకు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. మోసగాళ్ల ప్రలోభాలకు లొంగవద్దని, ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకుండా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఐలు బి.సుధాకర్, బి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, శంకరరావు, ఎల్.అప్పల నాయుడు, కె.నారాయణరావు, జి.రామకృష్ణ, కె.దుర్గా ప్రసాద్, షణ్ముఖరావు, ఎ.అశోక్ కుమార్, వి.నారాయణమూర్తి, ఎస్సైలు నజీమా బేగం, రమేష్ కుమార్, షేక్ శంకర్, కె.కిరణ్ కుమార్ నాయుడు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ సౌమ్యలత సమీక్ష -
ఉత్తమ టీడీపీ కార్యకర్త.. మన ఫీల్డ్ అసిస్టెంట్..!
చిత్రంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా ఉత్తమ టీడీపీ కార్యకర్త అవార్డు అందుకుంటున్న వ్యక్తి పేరు ఎస్.లోకేశ్. ఈయన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పార్వతీపురం మండలం సూడిగాం గ్రామ ఫీల్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రజాధనాన్ని నెలనెలా జీతంగా తీసుకుంటున్న ఉద్యోగి పార్టీ ఉత్తమ కార్యకర్తగా ప్రశంసా పత్రం తీసుకోవడం, సాక్షాత్తూ సీఎం కుమారుడే దానిని అందజేయడం ఇప్పుడు జిల్లా ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నది నిబంధన. పార్వతీపురం మండలం చినబొండపల్లిలో సోమవారం మంత్రి లోకేశ్ నిర్వహించిన పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో ఫీల్డు అసిస్టెంట్ పాల్గొని ఉత్తమ కార్యకర్తగా ప్రశంసలు అందుకోవడం గమనార్హం. దీనిని ప్రజాసంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆయనను విధుల నుంచి తొలగించాలని, లేదంటే పోరుబాట సాగిస్తామని హెచ్చరించారు. ఉపాధిహామీ పనుల్లో టీడీపీ ప్రలోభాలకు ఈ చిత్రమే సజీవ సాక్ష్యంగా పేర్కొన్నారు. – పార్వతీపురం రూరల్ -
అఘాయిత్యాలపై.. అబలల నిరసన
పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై మహిళలు నిరసన గళం వినిపించారు. ఆడబిడ్డలకు భద్రత కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘా యిత్యాలకు నిరసనగా వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రం ఇందిరా కాలనీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రెడ్డి పద్మ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైందన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని రుజువు అవుతున్నా హోం మంత్రికి చీమకుట్టినట్లు కూడా అన్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగిరిలో మైనర్ బాలికపై అత్యాచారం, అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని కనిపించకపోతే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాప్తాడులో టీడీపీకి చెందిన 14 మంది మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే దర్యాప్తులో జాప్యం చేయడం విచారకరమన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా అంటూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, మహిళలకు సురక్షితమైన పాలన అందించడం చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలన్నారు.దిశ చట్టాన్ని నిర్వీర్యం చేశారు..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహి ళల రక్షణకోసం తక్షణమే స్పందించే దిశ చట్టాన్ని నేటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే కాకుండా చట్టం కాలేదని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మహిళలు మండిపడ్డారు. బాలికలకై నా, మహిళలకై నా దిశ చట్టం పోలీసు వ్యవస్థ ద్వారా దన్నుగా ఉండేదని, ఏదైనా ఘటన జరిగితే స్పందన కూడా అంతే వేగంగా గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసిందని, హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ సాటి మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. దారుణమైన ఘటనలు రోజురోజుకి రాష్ట్రంలో పెరుగుతున్నా ఎన్నో కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోతునా కూటమి నాయకులు మాత్రం ఇవేవీ పట్టకుండా జగన్మోహన్ రెడ్డిపై ఏవిధంగా బురద జల్లాలో ప్రణాళికలు వేసుకుంటూ తిట్టే పని పెట్టుకున్నారని విమర్శించారు. సేవ్ ఉమెన్.. సేవ్ ఆంధ్రా అంటూ నినాదాలు చేశారు.నాడు మహిళలకు పెద్దపీటగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేశారన్నారు. మహిళల భద్రతపై జగనన్న దిశ యాప్ ద్వారా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలిచారన్నారు. ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల ఖాతాల్లో వేస్తూ ప్రతీ మహిళ తమ కుటుంబం మొత్తం సమాజంలో గౌరవంగా బతికేలా సంస్కరణలు చేశారని వైఎస్సార్సీపీ మహిళ విభాగం నేతలు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దుష్టపాలనకు ముగింపు పలకాలని, అంబేడ్కర్ రాజ్యాంగం ఆచరణలోకి తేవాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజక వర్గాల మహిళా విభాగం అధ్యక్షులు దాసరి నాగరత్నం, శెట్టి పద్మావతి, జంపు కన్నతల్లి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పలు అనుబంధ విభాగాల మహిళలు, నాయకులు పాల్గొన్నారు. -
వేధింపుల కేసులో ముద్దాయిలకు ఏడాది జైలు
● రూ.51వేల జరిమానా విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముగ్గురు ముద్దాయిలకు ఏడాది జైలు, రూ.51వేల జరిమానా విధిస్తూ విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి తీర్పు వెల్ల డించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్ళితే..విజయనగరానికి చెందిన ప్రవీణ గోగులకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్కు చెందిన పసుపులేటి జాషువాతో 2017లో పైళ్లెంది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం, మూడు తులాల బంగారు వస్తువులను కానుకగా కన్నవారు ఇచ్చారు. పైళ్లెన అనంతరం భర్త పసుపులేటి జాషువా, అతని తల్లిదండ్రులు భాస్కరరావు, సుజాతలు అదనంగా మరో రూ.5లక్షలు కట్నంగా తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడేవారని 2018 లో ఆగస్టు 6 వ తేదీన అప్పటి దిశ మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా అప్పటి మహిళా ఎస్సై ఎ.వెంకటరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో ఫిర్యాది భర్త పసుపులేటి జాషువా (ఎ1), మామ భాస్కరరావు (ఎ2) అత్త సుజాత (ఎ3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో పై విధంగా స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున ఏపీపీ శాంతి గౌతమి వాదనలు వినిపించారు. అప్పటి ఎస్సై ఎ.వెంకటరావు దర్యాప్తు చేయగా, కోర్టు కానిస్టేబుల్ వై.పూర్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారని డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. -
పైడితల్లికి పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృ తాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. హోంగార్డు కుటుంబానికి ’చేయూత’● రూ.3 లక్షల చెక్కు అందజేత విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బీవీ రమణమూర్తికి ‘చేయూత’ కింద రూ.3,23,050 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ డీపీఓలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించినా లేదా ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హెూంగార్డ్స్ స్వచ్ఛందంగా ఒకరోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయ మన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హెూంగార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విష జ్వరంతో గిరిజన విద్యార్థిని మృతిరామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ మెట్టవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని పదవ తరగతి చదువుతున్న కుడుమూరు మేఘన(14) విషజ్వరంతో సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ సంఘటనపై మృతురాలి తల్లి సంధ్య తెలిపిన వివరాల ప్రకారం..రెండు రోజులుగా ఆమెతో పాటు కుమారుడు మహేంద్ర విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ డాక్టర్ వద్ద మందులు వాడుతున్నారు. ఇంతలో సోమవారం ఉదయానికి చిన్న కూతురు మేఘన(14)కు కూడా జ్వరం సోకింది. వెంటనే ఆర్ఎంపీని పిలిచి వైద్యపరీక్షలతో పాటు రక్త పరీక్షలు చేశారు. రక్తపరీక్షల్లో మలేరియాతో పాటు పచ్చకామెర్లు సోకినట్లు డాక్టర్ చెప్పగా మందులు కూడా వాడారు. సాయంత్రానికి కూడా తగ్గకపోవడంతో డాక్టర్ సూచన మేరకు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి జ్వరం విషమించింది వెంటనే విజయనగరం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తండ్రి సన్యాసిరావు మేఘనను 108లో విజయనగరం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మేఘన మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చాక చూసిన కుటుంబసభ్యులు అమ్మా వేసవి సెలవులకు వచ్చి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా? అంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. జ్వరం వచ్చిన ఒక్కరోజులోనే మృతి చెందడమేంటని గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మేఘన కొటికిపెంట ఏకలవ్య పాఠశాలలో చదువుతోంది. ఆమె తమ్ముడు మహేంద్ర గొట్లాం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. మృతురాలి అక్క సాలూరులో నర్సు శిక్షణ తీసుకుంటోంది. -
ఫలించని గురువుల నిరీక్షణ
విజయనగరం అర్బన్: గురువుల తొలిరోజు నిరీక్షణ ఫలించలేదు. పోరాడి సాధించుకున్న మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూశారు. చివరకు సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలతో ఎస్జీటీల బదిలీల ప్రక్రియను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం బదిలీ కౌన్సెలింగ్కు సిద్ధమైంది. సీరియల్లో ఉన్న తొలి 400 మంది ఉపాధ్యాయులకు సమచారం ఇవ్వడంతో వారంతా జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. పాఠశాలవిద్య కమిషన్ నుంచి కౌన్సెలింగ్కు సంబంధించి రావాల్సిన లింక్ రాకపోవడంతో వాయిదా వేశారు. బుధవారం నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిన ఉపాధ్యాయులకు సీరియల్ నంబర్ ప్రకారం సమాచారం పంపుతామని తెలిపారు.నిరసన..ఉమ్మడి విజయనగరంలో నూతనంగా ఏర్పడిన క్లస్టర్ కేంద్రాల్లో పోస్టుల ఖాళీలను చూపించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు నిరసన తెలిపారు. తొలుత డీఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత ఖాళీలను ప్రస్తుతం చూపించాలన్న నిబంధనలు లేవని, బదిలీల ప్రక్రియ చివర్లో వాటిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని డీఈఓ వివరించారు. దీనిని వ్యతిరేకిస్తూ కౌన్సెలింగ్ ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు నిరసనకు దిగారు.అడ్డగోలు పదవికి మరో అవిశ్వాసంబొబ్బిలి: వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాదరణతో గెలుచుకున్న స్థానిక సంస్థలపై కూటమి నేతలు కన్నేసిన విషయం తెలిసిందే!. ఇటీవల బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిని తమకు 10 మంది మాత్రమే కౌన్సిలర్లున్నప్పటికీ 20 మంది ఉన్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో కొందరిని ప్రలోభాలతో తిప్పుకున్నారు. చైర్మన్ గిరీని అడ్డగోలుగా పొంది సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ పదవిని సైతం లాక్కునేందుకు సిద్ధపడ్డారు. వైస్ చైర్మన్ గొలగాని రమాదేవిపై ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహనరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న అవిశ్వాస తీర్మానం సమావేశానికి ఇరు పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు హాజరు కానున్నారు. -
అప్రమత్తతే ప్రధానం
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం: విపత్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అప్రమత్తం చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్నాయని, వర్షాకాలంలో ప్రజలకు, పశుసంపదకు, పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. ప్రాజెక్టులవద్ద గేట్లు ఎత్తివేసిన సమయంలో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. వరదల సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, అవసరమైన మందులు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇన్వెర్టర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటిని ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ సహాయకుల ద్వారా పరీక్షించాలన్నారు. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్లో నగదు బదిలీలు!
సాక్షి, పార్వతీపురం మన్యం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియ అత్యంత ‘నగదు’ పారదర్శకంగా చేపట్టారు. అర్హతే ప్రామాణికం అన్న పదాలను పూర్తిగా పక్కనపెట్టి.. డబ్బే పరమావధిగా లెక్క కట్టి నిర్వహించారు. కోరుకున్న వారికి.. కోరుకున్న చోటకు ‘ఆర్డర్స్’ ఇచ్చిపడేశారు. నిబంధనల ప్రకారం.. అసలు బదిలీలకే అవకాశం లేనివారిని ఏకంగా ఏజెన్సీ ప్రాంతాలకు విసిరికొట్టేశారు. నిన్నటి వరకూ ధీమాగా ఉన్న అటువంటి వారంతా.. ఒక్కసారిగా తమ బదిలీ ఉత్తర్వులు చూసి కంగుతిన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కొంతమందిపై గత ప్రభుత్వ ముద్ర వేసి, పూర్తిగా ‘కూటమి’ టీమ్ ఉండాలన్న ఉద్దేశంతో మార్పు చేశామని విశాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర జోనల్ పరిధి ప్రాతిపదికగా.. సాధారణ బదిలీల్లో భాగంగా ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర జోనల్ పరిధి ప్రాతిపదికగా ప్రక్రియ చేపట్టారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి కచ్చితంగా బదిలీ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా.. ఐసీడీఎస్లో చిత్రవిచిత్రాలు జరిగాయి. ఫలానా చోటకు వెళ్లాలంటే.. ఇంతనీ ఒక రేటు కట్టేసి వసూలు చేసినట్టు సమాచారం. ఎప్పటి నుంచో స్థానచలనం కోసం ఎదురుచూస్తున్న సీడీపీవోలు, సూపర్వైజర్లు కాస్త పలుకుబడితోపాటు, అడిగినంత ఇచ్చుకోవడానికీ వెనుకాడలేదు. మొత్తం ప్రక్రియకు విశాఖ ఆర్జేడీ కార్యాలయంలో ఒక సీనియర్ సహాయకునితో పాటు, విజయనగరం కార్యాలయంలో మరో ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఎక్కువ కాలం విజయనగరం జిల్లాలో పని చేసిన అనుభవం ఉండటం వల్ల తమకున్న పరిచయాలతో మధ్యవర్తిత్వం వహించారు. సీడీపీవోల్లో కాస్త పలుకుబడి ఉన్నవారు.. అధికార పార్టీ విధేయులు తాము కోరుకున్న స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సూపర్వైజర్లు సైతం అధికార పార్టీ సిఫారసు లేఖలతో పాటు.. వెళ్లే పోస్టు ప్రాంతాన్ని బట్టి ఒక ‘రేటు’ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ఓ పట్టణ ప్రాజెక్టులో పోస్టు కోసం ఒక సూపర్వైజర్ సుమారుగా రూ.1.50 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన మండలాల పరిధిలోని ప్రాజెక్టులకూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. విజయనగరంతోపాటు.. భోగాపురం, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాజెక్టుల కోసం బాగా డిమాండ్ ఏర్పడింది. ఓ ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టులో బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయ్యింది. వాస్తవంగా ఐదేళ్లు పూర్తయినా, బదిలీ చేయాలని దరఖాస్తు చేసినా బదిలీ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆమె ఎలాంటి అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. సోమవారం అర్ధరాత్రి వచ్చిన బదిలీ ఉత్తర్వులతో ఆమె అవాక్కయ్యారు. బదిలీలకు అవకాశం లేకున్నా సరే.. ఏజెన్సీకి కొట్టేశారు! సూపర్వైజర్లకు స్థానచలనం ఉండాలంటే కచ్చితంగా పని చేసే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకోవాలి. లేకుంటే.. వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునైనా బదిలీ చేయవచ్చు. ఐసీడీఎస్లో అందుకు భిన్నంగా సాగింది. కనీసం రిక్వెస్ట్ పెట్టని వారిని ఎనిమిది మంది వరకూ బదిలీ చేశారు. సోమవారం అర్ధరాత్రి వేళ అపాయింట్మెంట్లు ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాజెక్టు నుంచి ఒక సూపర్వైజర్ను బదిలీ అర్జీ పెట్టుకోకుండానే పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ప్రాజెక్టుకు విసిరికొట్టేశారు. ఇదే మాదిరి విజయనగరం ప్రాజెక్టు నుంచి మరో సూపర్వైజర్కు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట ప్రాజెక్టుకు బదిలీ చేశారు. చీపురుపల్లి నుంచి పెదబయలుకు.. గజపతినగరం నుంచి జి.మాడుగల, మరొకరికి హుకుంపేట వేశారు. ఇవన్నీ అధిక శాతం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ప్రాజెక్టులే. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదు. ఆదివారం కొంతమందిని నామమాత్రంగా పిలిచి, కొన్ని ఆప్షన్లు ఇచ్చి మమ అనిపించేశారు. రెండేళ్లు పూర్తి కాని గ్రేడ్–2 వారినీ ఏజెన్సీకి బదిలీ చేశారు. వీరిలో ఎవరినీ కౌన్సెలింగ్కు కూడా పిలవలేదు. ఉద్యోగ నియామక సమయంలో ఏజెన్సీ ప్రాంతం వేసినా వెళ్లిపోదుమని.. 50 ఏళ్లు దాటాక గిరిజన ప్రాంతాల్లో ఎలా పని చేయగలమని పలువురు వాపోతున్నారు. ఇదే సమయంలో కొంతమందిని ముందు ఏజెన్సీ ప్రాంతానికి వేసి.. తర్వాత మైదాన ప్రాంతానికి పంపారు. జాబితాలు మారడానికి కూడా డబ్బు ప్రభావం చూపిందని వినిపిస్తోంది. ఇందుకు విజయనగరంలోని ఓ ఉద్యోగితోపాటు.. ఆర్జేడీ కార్యాలయంలోని మరో ఉద్యోగి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. గతంలో బదిలీలు కలెక్టర్ చేతిలో ఉండేవి. దీన్ని వ్యతిరేకించి మరీ.. మరలా ఆర్జేడీ పరిధిలోకి ఆ శాఖ ఉద్యోగులు తెచ్చుకున్నారు. ఇటువంటి లాబీయింగ్ల కోసమే ఇలా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ మంత్రి సొంత ప్రాంతంలోనే బదిలీలకు పైరవీలు జరగడం గమనార్హం. డబ్బులు సమర్పిస్తే కోరుకున్న చోటకు.. మైదాన ప్రాంతం కావాలంటే.. భారీగా ముట్టజెప్పాల్సిందే నిబంధనలను పక్కనపెట్టి, కొందరిని గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసిన వైనం ఆర్జేడీ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ ఉద్యోగి -
బాధ్యతగా పనిచేయండి
సీతంపేట: బాధ్యతగా పనిచేసి గిరిజన విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, హెచ్డబ్ల్యూఓలతో సోమవారం సమావేశమయ్యారు. టెన్త్ ఫలితాలపై సమీక్షించారు. ఫలితాల సాధనలో వెనుకబడిన హెచ్ఎంలకు పలు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలను అభినందించారు. పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి డ్రాపౌట్ అవ్వకూడదన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వాటర్ ట్యాంక్, ఆర్వో ప్లాంట్లను పరిశుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూఓ మంగవేణి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలి ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
పార్వతీపురం: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ సర్వీసెస్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీంలో భాగంగా మండల విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చదువుపట్ల విద్యార్థుల్లో ఆశక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. బడికి రాని పిల్లను గుర్తించి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, చదువుకు జాతి, లింగం, భాష, మతంతో సంబంధంలేకుండా పిల్లలును మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఆరోగ్యకరమైన పరిస్థితులలో పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తూ సక్రమంగా పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో లోక్అదాలత్ సభ్యుడు టి.జోగారావు, ఏజీపీ బి.సత్యనారాయణ, న్యాయవాది ఎం.వెంకటరామణ, పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదర్రావు -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194ఆటో బోల్తా పడి గిరిజన మహిళ మృతిపాచిపెంట: మండలంలోని పనుకువలస పంచాయతీ చీపురు వలస సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో ఓ గిరిజన మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి, మండలంలోని చినచీపురువలస గ్రామానికి చెందిన కోట సోమమ్మ (64) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది కూలీలతో కర్రివలస గ్రామంలో పత్తి చేను గొప్పు తవ్వకానికి ఆమె వెళ్లింది. వర్షం కారణంగా పని మధ్యలో ఆగిపోవడంతో, గ్రామస్తులతో కలిసి గ్రామానికి తిరిగి ఆటోలో వెళ్తుండగా చీపురువలస గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోమమ్మకు తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 సహాయంతో సాలూరు సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సోమమ్మ భర్త పారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలమండ కంటకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. మృతురాలి శరీరంపై గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అంచులు గల చీర, నలుపు రంగు జాకెట్ కలిగి ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. చామన ఛాయ రంగులో ఉండే ఆమె ఎడమ చేతి మోచేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089, 08912883218 నంబర్లకు తెలియజేయాలని కోరారు. మరో గుర్తు తెలియని వ్యక్తి..విజయనగరం క్రైమ్: జిల్లా కేంద్రంలోని లీలామహల్ రోడ్డు వద్ద మంగళశారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి లీలామహల్ రోడ్డులో గల బార్ వద్ద పడి ఉండడంతో స్థానికులు చూసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంటనే హాస్పిటట్ సిబ్బంది తమకు సమాచారం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మృతదేహాన్ని గుర్తు పట్టేవారు ఫోన్ 9121109419 నంబర్కు సమాచారం తెలియజేయాలని కోరారు. యువకుడి ఆత్మహత్య● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విజయనగరం క్రైమ్: దగ్గరి వారికి తెలిసిన వారి నుంచి అప్పు ఇప్పించడమే ఆ యువకుడి తప్పయింది. డబ్బులు తీసుకున్న తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి వేధింపులను తట్టుకోలేక కోరుకొండకు చెందిన 27 ఏళ్ల యువకుడు శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. ఈ నేపథ్యంలో మృతుని స్నేహితులు, బంధువులు, కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు ఇటు జేసీకి, అటు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మృతుడి అన్నయ్య హరీష్ మాట్లాడుతూ తన తమ్ముడు అలమండ సంతలో అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పాడు. తమ్ముడి మృతదేహం వద్ద ఉన్న ఫోన్లో రికార్డ్ అయిన వాయిస్ల ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాడు. వెంటనే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఏఎస్పీ ఆదేశాలతో సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సైని కలవగా ఫిర్యాదు ఆధారంగా నిందితులను పిలిచి మాట్లాడతామని ఎస్సై చెప్పారని వివరించాడు. పురుగు మందు తాగి మరో యువకుడు..వంగర: మండల పరిధిలోని అరసాడ గ్రామానికి చెందిన కడుముల వెంకటేష్ (19) మనస్తాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ నెల 9న గడ్డిమందు తాగిన వెంకటేష్ను బంధువులు రాజాం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రెండేళ్ల క్రితం మృతిచెందగా తల్లి రమణమ్మ కూలిపనులు చేస్తోంది. ఏదైనా పని చేసుకోమంటూ కుమారుడికి హితవు చెప్పేది. దీంతో మనస్తాపం చెందిన వెంకటేష్ పురుగు మందు తాగేశాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్శంకర్ తెలిపారు. -
మత్తు రహిత భారతదేశం మనందరి లక్ష్యం
విజయనగరం లీగల్: యువత మత్తు పదార్థాలకు బానిసవుతోందని దానివల్ల వారి భవిష్యత్తు, అలాగే దేశ భవిష్యత్తు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ఆమె ఆధ్వర్యంలో సోమవారం విజయనగరంలోని ఫూల్బాగ్లో ఉన్న నూతన జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ సిబ్బందికి న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మాదకద్రవ్యాలపై అవగాహనతో పాటు వారి క్షేమం అనే పథకాన్ని జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి న్యాయశాఖ ఉద్యోగులందరికీ అవగాహన కల్పించామని తెలిపారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని మత్తు పదార్థాలకు బానిసలైన పక్షంలో సరిగ్గా విధులు నిర్వహించలేరన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా ఉద్యోగులు ఆల్కహాల్ స్వీకరించినట్లు తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, డాక్టర్ న్యూరో సైకియాట్రిస్ట్ నిమ్స్ కాలేజ్ ప్రొఫెసర్ విముక్తి సీడ్ సంస్థ కౌన్సిలర్ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
రాష్ట్రంలో ఆటవిక పాలన
● కూటమి హయాంలో ఎక్కడ చూసినా అరాచకాలు, అఘాయిత్యాలే.. ● ఆడబిడ్డలకు రక్షణ కరవు ● తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ● అందులో భాగంగానే వైఎస్సార్సీపీ అధినేత జగన్, భారతమ్మలపై నిందలు ● మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పార్వతీపురంలోని వైఎ స్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆడబిడ్డలపై దాడులు కనిపించలేదా? ఒక చర్చావేదికలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు.. జర్నలిజం వృత్తిలో ఎంతో అనుభవం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు సమాధానమిచ్చారని తెలిపారు. దానిని వైఎస్సార్సీపీ పైన.. జగన్, భారతమ్మల మీద ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, వాటితో తమకు ఏం సంబంధమూ లేదని వైఎస్సార్సీపీ స్పష్టం చేసిందని.. జరిగిన పొరపాటుకు సదరు జర్నలిస్టులు కూడా క్షమాపణ చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను కప్పిపుచ్చడానికే లోకేశ్ డైరెక్షన్లో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య బాధాకరమన్నారు. తన బిడ్డ కనిపించలేదని గత నెల 3న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోనే పురుగులు పట్టి, ఆడబిడ్డ మృతదేహం కనిపించిందని.. బీరు సీసాతో దారుణంగా ఆమెను హత్య చేసినట్టు తెలుస్తోందని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే చనిపో యిందని.. వారే సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని చెప్పారు. అదే అనంతపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై 14 మంది టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా లైగింక దాడికి పాల్పడినా ఏ ఒక్కరూ స్పందించలేదన్నారు. నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి పోయిందన్నారు. పట్టపగలే వారికి రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మరుగునపర్చడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నాడు విజయమ్మ, భారతమ్మల మీద వ్యాఖ్యలు చేయడం తప్పు కాదా? ఆత్మగౌరవం, మహిళల మనోభావాలంటూ మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు.. నాడు విజయమ్మ, జగన్ సతీమణి భారతమ్మలపై నిందలు వేసి, దుర్భాషలాడటం తప్పు అనిపించలేదా? అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. వారూ మహిళలే కదా, వారికి ఆత్మాభిమానం ఉండదా? వారికి ఇప్పుడు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. ‘నాడు మాజీ మంత్రి సుచరితపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు.. రోజాపై టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ, చేబ్రోలు కిరణ్ తదితరులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు లేదా? మీ ఐ–టీడీపీలోనే నీచంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశారు. ఐ–టీడీపీ చంద్రబాబు, లోకేశ్ల కోసం పని చేయడం నిజం కాదా? దానికి బాధ్యత వహిస్తూ వారిద్దరూ క్షమాపణ చెబుతారా?’ అని ఆమె ప్రశ్నించారు. పౌరుల రక్షణ కోసం పోలీసు శాఖ కాదా.. పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తోందని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పౌరుల రక్షణ ఆ శాఖ బాధ్యత కాదా? అన్నారు. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క సమీక్ష అయినా చేశారా? అక్రమ కేసులు, అరెస్టులు.. రెడ్బుక్ అమలు.. ఇదే మీకు తెలిసిన పాలన. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెడతారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంద’ని తెలిపారు. పోలీసు వ్యవస్థను రెడ్బుక్ రాజ్యాంగం అమలు కోసం కాకుండా.. ప్రజలు, పిల్లల రక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని పుష్పశ్రీవాణి విమర్శించారు. జగన్ను, ఆయన కుటుంబాన్ని తిట్టడానికే ఆ పదవి ఇచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ‘సింహాచలం దుర్ఘటనను సమీక్షించింది కూటమి నాయకులు, కార్యక్రమాన్ని నిర్వహించింది వారే.. భక్తులు చనిపోయిన తర్వాత కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించలేద’ని అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందన్నారు. మారుమూల జియ్యమ్మవలస, కొమరాడ మండలంలో చిన్నపిల్లల వద్దే దొరుకుతోందని చెప్పారు. గంజాయి వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. వంద రోజుల్లో ఈ మాదక ద్రవ్యాన్ని నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. వెయ్యి రోజులైనా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. గంటకు సుమారు ముగ్గురిపైన.. రోజుకు కనీసం 70 మందిపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? అని నిలదీశారు. ప్రెస్మీట్లు, బూతులు మాట్లాడానికే హోం మంత్రి పరిమితమయ్యారన్నారు. ఆడపిల్లల మీద ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నా ఏ రోజైనా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారా? అని ప్రశ్నించారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని పుష్పశ్రీవాణి అన్నారు. జగన్ను తిట్టడానికే హోంమంత్రి పదవి మహిళాభ్యున్నతికి పాటుపడిందే జగన్.. మహిళాభ్యున్నతి అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి నాయకులు.. వారి కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఏం చేశారని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళాభ్యున్నతి, సాధికారికత శ్రద్ధ, చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేద్దామ న్న ఆలోచన వీరికి లేదన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళాభ్యున్నతి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. దాదాపు 11 పథకాలు వారి కోసమే అమలు చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, వలంటీర్లలో 55 శాతం, 13 మంది జిల్లా పరిషత్ అధ్యక్షుల్లో ఏడుగురు మహిళలే అని తెలిపారు. మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి, వారికి ఆర్థిక భరోసానిచ్చారని గుర్తు చేశారు. -
నిధులు లేక నిలిచిన పల్లె ప్రగతి!
● మంజూరుకాని 15వ ఆర్థిక సంఘ రెండో విడత నిధులు ● రావాల్సిన నిధులు రూ.33 కోట్లు ● పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులులేని వైనం ●త్వరలో విడుదల కానున్నాయి 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల కానున్నాయి. విడుదలైన వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేస్తాం. పారిశుద్ధ్య పనులు చేయా లని ఈఓపీర్డీలకు, కార్యదర్శులకు సూచించాం. మంచినీటి ట్యాంకులు ఎప్పటికప్పుడు శుద్ధిచేసేలా చర్యలు తీసుకుంటాం. – మోహనరావు, డీఎల్పీఓ రామభద్రపురం: పల్లె ప్రగతికి నిధుల లేమి వెంటాడుతోంది. కనీసం పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణకూ నిధులు లేని పరిస్థితి. జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వివిధ అభివృద్ధి పనులకు ఆధారమైన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు సుమారు రూ.33 కోట్లు విడుదల కాలేదు. దీంతో పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల పనులు జరగడం లేదు. వీధులు సరైన రహదారులు లేక మట్టిరోడ్లపైనే గ్రామీణ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కేవలం ఇంటి పన్నులు సిబ్బంది జీతాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల నిర్వహణకే సరిపోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్లెల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడంలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో వీధుల్లోని డ్రైనేజీలు శిథిలమైనా మరమ్మతులు చేయలేకపోతున్నారు. కొత్తగా కాలువల నిర్మాణాలు జరగడం లేదు. వాడుక నీరు వీధుల్లోనే ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మురుగునీరు నిల్వ ఉండి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వీధి దీపాల నిర్వహణపై నిధుల కొరత ప్రభావం పడుతోంది. చాలా పల్లెలు చీకటిలోనే కాలం వెల్లదీస్తున్నాయి. -
అసంతృప్తుల నోరు నొక్కేశారు!
వాస్తవానికి చినబొండపల్లి వద్ద జరిగిన పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఒక విధంగా నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, ఎమ్మెల్యే తీరుపై అంతా ఏకరవు పెడతారని అంతా అనుకున్నారు. ఉదయం నుంచే చాలా మంది కార్యకర్తలకు బెదిరింపులు వెళ్లాయ ని.. ఎవరు మాట్లాడినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. ●మాజీ ఎమ్మెల్సీ జగదీష్ కూడా ఉదయం జరిగి న కార్యక్రమానికే అలా వచ్చి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకు ఆయనను కూడా పోలీసులు అనుమతించలేదని తెలిసింది. చాలా రోజులుగా ఆయనను స్థానిక ఎమ్మెల్యే దూరం పెట్టిన విషయం విదితమే. ●చినబొండపల్లి వద్ద జరిగిన పార్టీ కార్యక్రమానికి ముందుగా అనుమతి ఉన్న వారినే లోపలికి వదిలారు. దీంతో ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు.. స్థానికంగా ఉన్న కొంతమంది పార్టీ నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ●పార్వతీపురం మండలం నర్సిపురం జనసేన వీర మహిళలు.. సమావేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ●పాలకొండ నియోజకవర్గం నుంచి కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి లోపలికి వెళ్లలేక బయ టే ఉండిపోయారు. ●కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి నుంచి కొంతమంది సీనియర్ నాయకులు అక్కడకు వచ్చారు. తమను లోపలికి వదలకపోవడంపై పోలీసులతో వాదనకు దిగారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి లోపలికి వదిలి.. తమను పంపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. -
అనుమతి లేని విద్యాసంస్థల బోర్డులు తొలగించాలి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యాసంస్థల బోర్డులను విద్యా శాఖాధికారులు తొలగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, జె.రవికుమార్ మాట్లాడుతూ..మరో 4 నాలుగు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, కానీ విద్య పేరుతో వ్యాపారం ముందే మొదలైపోయిందని విమర్మించారు. రాజాం మండలంలో ఉన్న అభ్యాస్ పాఠశాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంటర్నేషనల్ అనే బోర్డు ఏర్పాటు చేశారని, ఆ విధంగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజాం మండలంలోనే ఉన్న నారాయణ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ–టెక్నిక్ బోర్డు ఏర్పాటు చేసి ఆ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం పట్టణంలో గల ఆదిత్య జూనియర్ కళాశాలకు అనుమతులు లేకున్నా, కాకినాడ ఆదిత్య పేరు పెట్టారన్నారు. ఇలా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డుల పేరుతో ఆ విద్యా సంస్ధలు పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యా శాఖాధికారులు ఇలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని బోర్డులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరిగే తాము చేపట్టే ఆందోళనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేసీని కలిసిన వారులో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్, ఎస్.సమీర తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జేసీకి వినతిపత్రం -
జాతీయలోక్ అదాలత్లో క్లెయిమ్ల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత విజయనగరం లీగల్: మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లను జాతీయలోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు హాల్లో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 5న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ అదాలత్లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్లు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలిపార్వతీపురం: విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీహెచ్ విజయ్కుమార్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని విభిన్న ప్రతిభావంతులకు వర్తింప జేయాలని కోరారు. సుదూర ప్రాంతాలకు 50 శాతం రాయితీ వర్తింప జేయాలని, ఆర్టీసీలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జీఓ నంబర్ 77 ప్రకారం 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నిర్వహిస్తున్న షాపుల్లో 5శాతం షాపులను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ముగ్గురికి గాయాలుదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి సరితి వారి కళ్లాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు పెదమానాపురం హెడ్ కానిస్టేబుల్ కాశీరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న కారును పెదమానాపురం నుంచి రామభద్రపురం వెళ్తున్న కారు ఢీకొనడంతో రెండు కార్లలో ఉన్న ఆగూరి సంతోషి, పువ్వల రవిబాబు, పువ్వల శాంతమ్మలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ప్రారంభం
విజయనగరం అర్బన్: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత కలెక్టరేట్లో సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని జిల్లా ముఖ్యప్రణాళిక శాఖ కార్యాలయం వద్ద ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి అమరావతి నుంచి వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలోకలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జేసీ ఎస్.సేతు మాధవన్, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, సీపీఓ జి.బాలాజీ, జిల్లా అధికారులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి సాధించాల్సి అభివృద్ధిని ఈ డాక్యుమెంట్లలో పొందుపరిచినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి ఇలా శ్రీకారం చుట్టామన్నారు. -
తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యం
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీళా గాంధీ గజపతినగరం: స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్లో భాగంగా 2047నాటికి తలసరి ఆదాయం 15శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆదిశగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీళా గాంధీ అన్నారు. గజపతినగరంలోని గ్రామసచివాలయం–2 పై అంతస్తులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర –2047 విజన్ ప్లాన్ యూనిట్ను ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపికతో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహణ సదస్సులు నిర్వహించి రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని, ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్, యంత్రపరికాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్, డ్రాగన్ ప్రూట్, అరటి, బొప్పాయి, జామ, కొబ్బరి వంటి పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతుల కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ మండ లాల తహసీల్దార్లు బి.రత్నకుమార్, డి.రాజేశ్వరరావు, నీలకంఠంరెడ్డి, గజపతినగరం,దత్తిరాజేరు,బొండపల్లి,గంట్యాడ మండలాల ఎంపీడీఓలు బి.కల్యాణి, వై.రాజేంద్ర ప్రసాద్, జి.గిరిబాల, వెంకటరమణమూర్తి, స్థానిక సర్పంచ్ నరవ కొండమ్మ, ఈఓపీఆర్డీ సుగుణాకరరావు, పంచాయతీ ఈఓ జనార్దనరావు, తుమ్మికాపల్లి సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు. -
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు హుండీల ఆదాయాన్ని స్థానిక శివాలయం వీధిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో సోమవారం లెక్కించారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 రోజులకు గాను చదురుగుడి హుండీల నుంచి రూ.29 లక్షల 38వేల 935 నగదు, 20 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 541 గ్రాముల వెండి లభించాయన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి హుండీల నుంచి రూ.6 లక్షల 92వేల 729 నగదు, 1 గ్రాము.400మిల్లీగ్రాముల బంగారం, 49 గ్రాముల వెండి లభించాయన్నారు. వీటితో పాటు అన్నదానానికి సంబంధించి రూ.16వేల12 ఆదాయం ద్వారా లభించిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణ అధికారులుగా గ్రేడ్–1 ఈఓ బి.శ్రీనివాసరావు, బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఎన్.రాజకుమారి, శ్రీవారి సేవకులు, ఆలయసిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
మెంటాడ:మండలంలోని బిరసాడవలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫారాన్ని తక్షణమే తరలించాలని కోరుతూ ఆ గ్రామస్తులు కోళ్లఫారం ఎదుటు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు అయిదో రోజు సోమవారం కొనసాగాయి. వీరికి పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలుపుతున్నారు. నాలుగో రోజు ఆదివారం నిరాహార దీక్ష శిబిరానికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. తక్షణమే కోళ్ల ఫారాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కోళ్ల ఫారం వల్ల బిరసాడవలసతో పాటు చుట్టు పక్క అయిదు గ్రామాలకు చెందిన ప్రజలు రోగాల పాలవుతున్నారని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, నాయకులు రెడ్డి రాజప్పలనాయుడు, జనసేన నాయకులు సబ్బవరపు రాజశేఖర్ పాల్గొన్నా రు. -
పోస్టల్ పథకాలు ప్రజలకు చేరువచేయాలి
విజయనగరం టౌన్: పోస్టల్ శాఖ పథకాలను ప్రజలకు చేరువచేయాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ సూచించారు. సేవల్లో ఏపీ సర్కిల్ పరిధిలోని 127 డివిజన్లలో విజయనగరం తపాలా శాఖ వెస్ట్ సబ్డివిజన్ కార్యాలయం ప్రథమ బహుమతి కై వసం చేసుకుంది. ఈ మేరకు కంటోన్మెంట్ తపాలా కార్యాలయంలో విజయోత్సవ సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఉద్యోగులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. పోస్టల్ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ప్రతి పథకంపై ప్రజలు అవగాహన పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ పోస్ట్మాస్టర్ ఇ.మధు, ఐపీబీపీ మేనేజరు సతీష్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పునరావృతం కాకూడదు
పీజీఆర్ఎస్లో అర్జీలుపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దరఖాస్తులు పునరావృతం కాకూడదని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీరామ్మూర్తిలతో కలిసి ప్రజల నుంచి 44 వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సూచించారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జియ్యమ్మవలస మండలం అర్నాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, రానున్న వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, రోడ్డు నిర్మించాలని గ్రామానికి చెందిన ఎం. సురేష్ అర్జీ అందించారు. ● పార్వతీపురం పట్టణంలోని బెలగాంలో హెడ్పోస్టాఫీసు వీధిలో చెత్త కుండీ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం పందులు సంచరిస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గిరి పట్నాయక్ ఫిర్యాదు చేశారు. ● మక్కువ మండలం ఎర్ర సామంతవలస గ్రామానికి చెందిన ఆర్. పార్వతమ్మ సర్వే నంబర్ 101లో భూమిని 20ఏళ్లుగా సాగు చేస్తున్నానని కానీ తన భూమిని వేరేవారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి తన భూమి తనకు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని కోరారు. ● పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామానికి చెందిన అల్లు కుమారి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి బి.శ్యామల, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి ఎస్. మన్మథరావు, డీపీఓ టి.కొండలరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 23 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ఏపీవో చిన్నబాబు నిర్వహించిన పీజీఆర్ఎస్కు 23 వినతులు వచ్చాయి. సీతంపేటలో ఎంపీహెచ్ఏ పోస్టు ఇప్పించాలని జోగైనాయుడుగూడకు చెందిన సవర లక్ష్మణరావు కోరారు. సవర భాష వలంటీర్ పోస్టు ఇప్పించాలని చీడిగూడకు చెందిన సవర బెనర్జీరావు వినతి అందజేశారు. దబ్బగూడకు చెందిన సవర ముసలమ్మ ట్రాక్టర్ లోన్ ఇప్పించాలని కోరింది. మినీ ఫ్లోర్మిల్ కావాలని బి.భారతి విన్నవించింది. అంటికొండకు చెందిన నిమ్మక సుందరరావు ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్నవి చెల్లించాలని అర్జీ చేశారు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరిస్తూ వేజ్బోర్డు చట్టాల్ని పరిరక్షించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలు ధరించి స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపులు, ఇతర సదుపాయాలకు వేతన బోర్దులు ఏర్పాటైన 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు ప్రసావనకు రాకుండా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్నాయుడు, మురళి, శంకర్రావు, అప్పారావు, ప్రసాదరావు, గొర్లె సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
● జేసీ సేతు మాధవన్ ● పీజీఆర్ఎస్కు 153 వినతులువిజయనగరం అర్బన్: సమస్యలతో వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలు సమర్పించే అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతులు రీ ఓపెన్ కాకుండా పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డీపీఓ టి.వెంకటేశ్వర్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బిశాంతి పాల్గొని వివిధ శాఖలకు సంబంధించి 153 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్సెల్కు 41 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి 41ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫిర్యాదు దారుల ముందే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి సమస్యలను వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఎస్పీ 41 ఫిర్యాదులను స్వీకరించగా వాటిలో భూతగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆక్కే చౌదరి, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్పొరేట్ల సేవలో ప్రభుత్వం
విజయనగరం గంటస్తంభం: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ షైనింగ్ స్టార్ అవార్డుల ఎంపికలో ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి డి.రాము, సీహెచ్ వెంకటేష్లు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో 20వేల రూపాయల, నగదు, సర్టిఫికెట్, అవార్డుతో సత్కరించింది. సోమవారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులకు ఎంపికై న వారికి అందజేశారు. దీనికి గాను ప్రతి మండలం నుంచి ఓసీకి ఇద్దరు, బీసీకి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని ఎంపిక చేసి మండలానికి ఆరుగురికి చొప్పున అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డులకు ఎంపికై న ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో 29 మంది ప్రైవేట్ విద్యాసంస్ధల నుంచి ఉంటే 17 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసిన వారున్నారు. పాఠశాలలకు సంబంధించి మొత్తం 158 మందిలో 65 మంది ప్రైవేట్ పాఠఽఽశాలల నుంచే ఎంపికయ్యారు. ఈ రకమైన అవార్డులు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఒకే ప్రమాణాలు పాటించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోయి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా, సిలబస్ పూర్తిగా అవకుండా, అరకొర సౌకర్యాల మధ్య చదువు సాగించి అత్యధిక మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ షైనింగ్ అవార్డ్స్ ఇవ్వకపోవడం వారి కష్టాన్ని విస్మరించడమేనన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రతి మండలంలో ఓసీ ఇద్దరు, బీసీ ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరిని చొప్పున ఎంపిక చేయాలి. కానీ విజయనగరం జిల్లాలో ఈ ఎంపిక విషయంలో అన్నాయం జరిగిందని ఆరోపించారు. 580 మార్కులు వచ్చిన ఓసీ కేటగిరికి చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఎంపిక చేసి అదే 580 మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠఽశాలల్లో చదువుకున్నప్పటికీ వెనుకబడిన తరగతుల విద్యార్థిని ఎంపిక చేయకపోవడం సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుందన్నారు. కాబట్టి ఇప్పటికై నా ఈ అవార్డులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు..ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. వారికే షైనింగ్ అవార్డ్స్ కేటాయింపు ధ్వజమెత్తిన ఎస్ఎఫ్ఐ నాయకులు -
సారా నియంత్రణే లక్ష్యంగా కార్డన్సెర్చ్
విజయనగరం క్రైమ్/గుర్లు: సారా నియంత్రణే లక్ష్యంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘కార్డన్ సెర్చ్‘ చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాల కట్టడితో పాటు సారా అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా చీపురుపల్లి పోలీస్సబ్ డివిజన్ పరిధి గుర్ల పోలీస్ స్టేషన్ పరిధి దేవుని కణపాక గ్రామంలో ఆదివారం ఉదయం 5గంటలకు చీపురుపల్లి సర్కిల్ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. స్టేషన్ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామస్తుల ఇళ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారన్నారు. గ్రామంలో నివాసం ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు, ప్రజల రక్షణకు భరోసా కల్పించేందుకు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు 35 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారని చెప్పారు. గ్రామంలోని అన్ని ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్సీడీ పరికరాలతో తనిఖీ చేశారని చెప్పారు. అదేవిధంగా వారి దగ్గర లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని ఆరు ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో దిగ్బంధం చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 400లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశామన్నారు. ఈ ఆపరేషన్లో చీపురుపల్లి సీఐతో పాటు గుర్ల, గరివిడి, బుదరాయవలస ఎస్సైలు పి.నారాయణరావు, లోకేశ్వరరావు, లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ115 శ్రీ200 శ్రీ210సోషల్మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్టుపాలకొండ: భామిని మండలానికి చెందిన జామి వెంకటేష్ అనే వ్యక్తిని సోషల్మీడియాలో పోస్టు పెట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆ వివరాలను సీఐ చంద్రమౌళి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇన్స్టా గ్రామ్లో రీల్ పోస్టు చేయగా దానిపై వెంకటేష్ అసభ్యంగా కామెంట్ చేసినట్లు తెలిపారు. దీనిపై జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు వెంకటేష్ను అరెస్టు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, సోషల్మీడియాలో పెట్టే పోస్టులకు అడ్మిన్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్సై ప్రయోగమూర్తి ఉన్నారు. యువకుడి ఆత్మహత్యశృంగవరపుకోట: మండలంలోని గౌరీపురం గ్రామానికి చెందిన శానాపతి సాయికుమార్ (26) గడ్డిమందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా సాయికుమార్ తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం రాత్రి విపరీతంగా కడుపునొప్పిరావడంతో భరించలేక అందుబాటులో ఉన్న గడ్డిమందును తాగేశాడు. దీంతో గమనించిన తండ్రి అప్పారావు ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కిమ్స్, అక్కడినుంచి కేజీహెచ్కు తరలించి చికిత్స అనంతరం బాగుందని ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం సాయికుమర్కు మళ్లీ విపరీతమై కడుపునొప్పి రావడంతో ఇంటివద్ద చనిపోయాడు. దీనిపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు బొలెరో వ్యాన్లు ఢీ: ఒకరికి గాయాలుదత్తిరాజేరు: మండలంలోని ఎస్.బూర్జవలస పోలీస్స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రెండు బొలెరో వ్యాన్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలం కుసుమూరు నుంచి గజపతినగరం వైపు సామగ్రితో వెళ్తున్న బొలెరో వ్యాన్ను వెనుక నుంచి వస్తున్న మరో బొలెరో వ్యాన్ ఢీకొనడంతో తెర్లాం మండలం కుసుమూరు గ్రామానికి చెందిన బడిమిశెట్టి శ్రీను కాలికి బలమైన గాయమైనట్లు ఎస్సై తెలిపారు. గాయాలపాలైన బడిమిశెట్టి శ్రీనును 108లో ఆస్పత్రికి తరలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీహెచ్సీకి రోగుల తాకిడిబాడంగి: స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రాని(సీహెచ్సీ)కి జ్వరం, డయేరియా రోగుల తాకిడి ఆదివారం పెరిగింది. ఆస్పత్రి నూతన భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఉన్నపాటి పాతభవన ఇరుకు గదుల్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఇన్పేషెంట్ వార్డులో మంచాలు చాలకపోవడంతో ఆస్పత్రి వరండాలో కూడా మంచాలు, బెంచీలు వేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. దీంతో ఎక్స్రే, గైనకాలజిస్టు, ఇన్ఫెషెంట్ వార్డులోకి డాక్టర్లు, సిబ్బంది, రోగుల ధువులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన ఓపీరోగులకు కూడా ఆస్పత్రిలో చోటుచాలక ఆరుబయట చెట్లకింద ఓపీ టికెట్ల నమోదు, ఎన్ఓపీ బయోమెట్రిక్లు చేపడుతున్నారు. అత్యవసర వైద్యసేవలకోసం రిఫరల్ కేసులను తరలించేందుకు గతంలో అంబులెన్స్ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ వాహనం మూలకుచేరడంతో పేదరోగులు ప్రైవేట్ అంబులెన్స్లకు అద్దెలు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. -
వివాహిత ఆత్మహత్యా యత్నం
వేపాడ: మండలంలోని వల్లంపూడి పోలీస్స్టేషన్ ఎదురుగా రోడ్డుపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కాపు సోంపురానికి చెందిన రొంగలి లక్ష్మి కొంత కాలంగా భర్తకు దూరంగా తన ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కొంత కాలం క్రితం వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన ప్రస్తుతం వల్లంపూడిలో నివాసముంటున్న యోగుల కాళీతో పరిచయం ఏర్పడింది. కాళీ తన భార్య, ఇద్దరు పిల్లలతో వల్లంపూడిలో నివాసముంటున్నాడు. రొంగలి లక్ష్మి, కాళీల మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలంగా లక్ష్మి వద్దకు కాళీ వెళ్లకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఆదివారం వల్లంపూడి పోలీసులు కాళీతో పాటు లక్ష్మిని స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామపెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరం పొరపాటు చేశామని ఇద్దరికీ పిల్లలు ఉన్నందున ఇకపై ఎవరి బతుకులు వారు బతుకుదామంటూ కాళీ నచ్చచెప్పే ప్రయత్నం లక్ష్మికి చేశాడు. దీంతో కలత చెందిన ఆమె తనను నమ్మించి కాళీ మోసం చేశాడని ఈ జీవితం తనకు అవసరం లేదంటూ స్టేషన్ బయటకు పరుగెత్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆమె శరీరంపై రగ్గు కప్పి లక్ష్మిని కాపాడి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, లక్ష్మి ఇచ్చిన వాగ్మూలంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. -
శాసీ్త్రయ ధృక్పథం పెంపొందించడమే లక్ష్యం
బొబ్బిలి: ప్రజల్లో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించి, విజ్ఙాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జనవిజ్ఙాన వేదిక పనిచేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేవీవీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జేవీవీ రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్లో విజయనగరంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా విజ్ఙాన మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్థిక వనరుల సమీకరణ అంశాలపై సభ్యులతో చర్చించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్, ఉపాధ్యక్షుడు సత్యం నాయుడు,శివానంద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి విద్యార్థులు
బొబ్బిలి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్జూనియర్ విభాగంలో ఎన్.హర్షిత, బి వరలక్ష్మి, క్యాడెట్ విభాగంలో బి.భరద్వాజ్, జూనియర్ విభాగంలో బి గౌతమి, పి.సంజన, సోమేశ్ యాదవ్, బి.శివరామకృష్ణ, సీనియర్స్ విభాగంలో కె.అభినవ్, వై.కిశోర్ కుమార్, బి.రోహిత్, ఎన్.కిరణ్లు తాడిపత్రిలో పోటీలకు హాజరవుతున్నారన్నారు. వారంతా గత నెల 31న బొబ్బిలిలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ముందు నిలిచారన్నారు. -
లోహ జగత్తు పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: మానవ శరీరం అనేక లోహమూలకాల సమూహం. ఆయా లోహాలు శరీరం ఎదుగుదల, క్షీణతలపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ‘లోహ జగత్తు’ పుస్తకంలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించినట్లు ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక అయ్యన్నపేట పాల్నగర్లో ఉన్న చాగంటి తులసి స్వగృహంలో తన సోదరి చాగంటి కృష్ణకుమారి రచించిన లోహ జగత్తు పుస్తకావిష్కరణ ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సుమనస్పతి రెడ్డి మాట్లాడుతూ తెలుగులో సరళమైన భాషలో లోహ జగత్తు పుస్తకం కథాకథనంలో ప్రజలకు అందుబాటులో రావడం వల్ల విదార్థులకు విషయ పరిజ్ఞానం సముపార్జనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర నాయకుడు ఎంవీఆర్.కృష్ణాజీ మాట్లాడుతూ ప్రపంచ నాగరికత వెనుక లోహ మూలకాలు, మనిషి జీవితంలో లోహాల వినియోగం సైన్స్ అభివృద్ధి సమాజంపై ప్రభావం చూపిందన్నారు. లోహ జగత్తు పుస్తకం కథా కథనం వెలువరించడం వెనుక తన తండ్రి చా.సోకు ఆమె ఇచ్చిన మాట ఉందన్నారు. జీవనంలో లోహాలు, నానోటెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారు? సైన్స్ అంటే భయాలు లేకుండా పోతాయని వివరించారు. లోహ జగత్తు పుస్తకం కథాకథనానికి అనుగుణంగా చిత్రాలు వేయడంతో లోహాల ప్రయోజనం తెలుసుకోవడం సులభతరమైందని చిత్రకారిణి కె.మధురశ్రీ అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్. మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ లలితకుమారి, చిత్రకారుడు చా.సో కుమారుడు చాగంటి బాపిరాజు, చాసో అభిమానులు, వర్ధమాన రచయితలు, సాహితీ స్రవంతి నిర్వాహకుడు చీకటిదివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ సహాయంతో ఓపెన్ డ్రింకింగ్కు అడ్డుకట్ట
● వన్టౌన్ పీఎస్ పరిధిలో 6 కేసులు ● టూటౌన్ పరిధిలో 11 కేసుల నమోదువిజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్డివిజన్ పరిధి విజయనగరం వన్టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఆదివారం ఓపెన్ డ్రింకింగ్కు పోలీసులు చెక్ పెట్టారు. డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి, ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. టూటౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పూల్భాగ్ కాలనీ నందిగుడ్డి ప్రాంతంలోను, 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కణపాక, అయ్యన్నపేట ఏరియాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై డ్రోన్స్ పంపారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించి పోలీసులు రైడ్స్ నిర్వహించారు. వన్ టౌన్ పోలీసు స్టేషను వరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై ఆరు కేసులు, టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న వారిపై 11 కేసులను నమోదు చేశామని ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పేకాట, ఓపెన్ డ్రింకింగ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, జాతర్లు, ధర్నాల నిర్వహణలో అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీని కనిపెట్టేందుకు డ్రోన్ వినియోగిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ వినియోగించాలని, శివారు ప్రాంతాలపై నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. -
అపూర్వ సమ్మేళనం
● అంగరంగా వైభవంగా వజ్రోత్సవం ● విదేశాల నుంచి తరలివచ్చిన పూర్వ విద్యార్థులు ● పూర్వ విద్యార్థులతో కిటకిటలాడిన వీరఘట్టం హైస్కూల్ ప్రాంగణం ● గతంలో పనిచేసిన ఉపాధ్యాయులకు సత్కారంవానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను పూర్వ విద్యార్థులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు చదువు చెప్పిన మాస్టార్లను గౌరవించడం విద్యార్థుల బాధ్యత అన్నారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు.. వీరఘట్టం హైస్కూల్లో 1970లో చదువుకున్న దౌలూరు కై లాసరావు పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష చెక్కును ఉత్సవ కమిటీకి అందజేశారు. అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. అలాగే వజ్రోత్సవం విజయవంతం చేయడంలో కృషి చేసిన 1982 బ్యాచ్కు చెందిన బెహరా ప్రసాద్, ఇట్లా మన్మథరావు, కోణార్క్ శ్రీనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి దోహదం పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు నిర్వహించే ఆత్మీయ కలయికలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి కె.రాజ్కుమార్ అన్నారు.ఆత్మీయ కలయికకు ఇంతమంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాల చరిత్రలో ఓ సంచలనమని డీఈఓ అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులు వాన సత్యంనాయుడు, సీరపాణి, బీవీ సత్యానందం, కె.సత్యమూర్తి, నిష్టల నరసింహమూర్తి, కె.శేషమ్మ, పెంకి సుందరరావు, మాచర్ల శ్రీరాములుదొర, ఎంబీ బెనర్జీ, పొట్నూరు భరతుడు, ధర్మాన సిమ్మయ్య, అడివినాయుడు, జీఎస్ఎన్, వారాడ వేణుగోపాలరావు, యర్రా అప్పలరాజు, తెంటు రామినాయుడు తదితరులను ఉత్సవ కమిటీతో పాటు డీఈఓ ఘనంగా సత్కరించారు.వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 2 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ సంబరానికి హాజరు కావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. వీరఘట్టంలోని పంచముఖ ఆంజేయస్వామి ఆలయ సెంటర్ నుంచి పూర్వ విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారి గుండా హైస్కూల్కు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అంచనాలకు మించి పూర్వ విద్యార్థులు రావడంతో హైస్కూల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తొలుత హైస్కూల్కు ఐదెకరాల స్థలాన్ని ఇచ్చిన స్థలదాత దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ఆయన మనుమడు హైకోర్టు న్యాయవాది రౌతు సురేష్కుమార్, ఆయన కుటుంబసభ్యులు ప్రతిష్టించారు. తర్వాత శ్రీకాకుళం గురజాడ సంస్థల అధినేత గుండ్రెడ్డి స్వామినాయుడు ప్రపంచ మల్లయోధుడు కోడి రామ్మూర్తినాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ వజ్రోత్సవానికి హాజరైన మాజీ గురువులకు ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవాఽయిద్యాలు, పూర్ణ కలశాలతో సాదర స్వాగతం పలికారు. సభా వేదికపై ఆసీనులైన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి, వజ్రోత్సవ జ్ఞాపికలను అందజేశారు. ఇది గొప్ప కార్యక్రమం వజ్రోత్సవానికి హాజరైన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 52 బ్యాచ్లను సమన్వయం చేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులను అభినందించారు. చదువు చెప్పిన మాస్టారును గౌరవించాలి వీరఘట్టం హైస్కూల్లో జరుగుతున్న వజ్రోత్స -
డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా.. కిమిడి నాగార్జున బాధ్యతల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్గా కిమిడి నాగార్జున ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ సీహెచ్.ఉమామహేశ్వరరావు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కిమిడి నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తానన్నారు. డీసీసీబీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన నాగార్జునకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, కోండ్రు మురళీమోహన్, బోనెల విజయ్ చంద్ర, లోకం నాగమాధవి, పి.అదితి గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యేలు భంజ్దేవ్, కిమిడి గణపతిరావు, డాక్టర్ కేఏనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డీసీసీబీ సిబ్బంది అభినందనలు తెలిపారు. డీసీఎంఎస్ సేవలను విస్తృతం చేస్తా విజయనగరం ఫోర్ట్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ సేవలను విస్తృతం చేయడం ద్వారా సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చైర్మన్ గొంప కృష్ణ అన్నారు. స్థానిక సంఘంకార్యాలయంలో ఆదివారం డీసీఎంఎస్ చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ప్రభుత్వం నుంచి లభించే గౌరవ వేతనం. ఇతర అలివెన్స్లు తీసుకోబోనని, ఆ డబ్బును డీసీఎంఎస్ బలోపేతం చేసేందుకు వినియోగిస్తానని ప్రకటించారు. డీసీఎంఎస్ ఫలాలను అందరికీ అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. సంఘం ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. సేవలను మరింత ఎక్కువ మందికి అందిస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన కృష్ణను మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్, పి. అదితి గజపతిరాజు, బోనెల విజయచంద్ర, కోళ్ల లలితకుమారిలు అభినందించారు. -
జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
విజయనగరం క్రైమ్: ఆర్పీఎఫ్ డీజీ ఆదేశాలతో విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ఆదివారం కార్టన్ సెర్చ్ జరిగింది. ఈ మేరకు విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, ఎస్సై శ్రీధర్లతో పాటు 30 మంది సిబ్బంది ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు రైల్వేస్టేషన్లో గంజాయి అక్రమ రవాణా, ఇతర మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి విజయనగరం రైల్వే స్టేషన్లోని అన్ని విశ్రాంతి గదులతో పాటు క్లాక్ రూమ్లు, పార్సిల్ ఆఫీస్ వద్ద సోదాలు నిర్వహించారు. అలాగే స్టేషన్లో ఉన్న 5 ఫ్లాట్ఫారాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. స్టేషన్కు వచ్చిన భువనేశ్వర్–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్, సమతా ఎక్స్ప్రెస్ రైళ్లను స్టేషన్ మేనేజర్ ఆదేశాలతో ప్రతి కంపార్టుమెంట్లోనూ సోదాలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఏ విధమైన మత్తుపదార్థాలు కానీ, గంజాయి సరఫరా కానీ జరగలేదని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఈ తనిఖీల్లో పీసీలు రామకృష్ణ, సత్యనారాయణ, నారాయణలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
కలగానే మినీ జలాశయం..!
సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025జంపరకోట పెద్దగెడ్డపై..కూటమి నాయకులు ఏమన్నారంటే.. 2024 ఎన్నికల సమయంలో పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పర్యటించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువగళంలో భాగంగా ఇక్కడకు వచ్చిన నారా లోకేష్, వారాహి యాత్రలో నేటి డిప్యూటీ సీఏం పవన్కల్యాణ్ మాట్లాడుతూ జంపరకోట జలాశయం పనులు పూర్తికి కేవలం రూ.22 కోట్లు ఖర్చు చేస్తే చాలన్నారు. వేలాది ఎకరాలకు సాగు నీరు అందించి రైతుల కన్నీరు తుడవచ్చన్నారు. తాము అధికారంలోకి వస్తే... పాలకొండను బంగారు కొండగా మార్చేస్తాం.. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. వారి మాటలు నమ్మారు. రైతులు ఓట్లేశారు. ఏడాది గడిచిపోయినా కూటమి నాయకులు ఇచ్చిన హామీల మేరకు ఈ జలాశయం పూర్తికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు, రైతులు తాము మళ్లీ మోసపోయామని గుర్తించారు. జంపరకోట పెద్దగెడ్డపై మినీ జలాశయం పూర్తి చేయాలని తమ పొలాలకు సాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు. దశాబ్దాల కిందట తమ నుంచి సేకరించిన భూములు వృథాగా వదిలేయడంతో రూపు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. పాలకొండ రూరల్: ఆ గెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతుల మూడున్నర దశాబ్దాల కల. ఇది పూర్తయితే సుమారు రెండు వేల ఎకరాలకు పైబడి భూముల్లో మూడు పంటలు పండించేందుకు పుష్కల అవకాశం. అయినా పాలకులు పట్టించుకోలేదు. తాజాగా గత ఏడాది జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పాలకొండ వచ్చిన కూటమి ముఖ్య నాయకులు ఆ జలాశయం పూర్తికి హామీలు ఇచ్చారు. కూటమి సర్కారు వచ్చింది.. ఏడాదైంది... అయినా సర్కారు చేపట్టిన చర్యలు శూన్యమే అని తేలిపోయింది. అదే పాలకొండ మండలం జంపరకోట పెద్దగెడ్డపై నిర్మిస్తామన్న మినీ రిజర్వాయర్ కథ. 0.1 టీఎంసీల నీటి సామర్థ్యంతో... 36 ఏళ్ల క్రితం పాలకొండ మండలం జంపరకోట పెద్దగెడ్డపై మినీ జలాశయం నిర్మాణానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎత్తైన మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను అనుకుని ఉన్న కొండల్లో ఈ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 0.1 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ జలాశయం పూర్తి చేయగలిగితే దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడి భూములకు సాగునీరు అందించవచ్చన్న సమున్నత లక్ష్యంతో ఈ పనులకు అప్పటి జలవనరుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ జలాశయం పూర్తి చేయగలిగితే ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వివిధ రకాల పంటలు పండించవచ్చని జలాశయం దిగువన ఉన్న నాలుగు పంచాయతీల రైతులు భావించారు. రూ.2.25 కోట్ల మేర అంచనాతో... ఈ మినీ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా మండలంలో జంపరకోట, డోలమడ, ఎం.సింగుపురం, జి.వెంకటాపురం, మల్లివీడు, లోవిడి లక్ష్మీపురం గ్రామాలకు చెందిన 8.50 హెక్టార్లలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. రూ.2.25 కోట్ల మేర అంచనాలతో తొలి దశలో పనులు ప్రారంభించారు. మినీ రిజర్వాయర్ పనుల కోసం జంపరకోట వద్ద 79.61 ఎకరాలను సేకరించారు. వివిధ కారణాలతో దాదాపు రెండు దశాబ్ధాలు నత్తనడకన పనులు కొనసాగాయి. అప్పట్లో రూ.36 లక్షల మేర ఖర్చు చేసింది. మట్టి పనులు, కాంక్రీటు పనులు చేపట్టి 2002లో పనులు నిలిపేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రూ.15.32 కోట్ల అంచనాతో 2006లో పనులు పునః ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో 36.44 శాతం పనులు జరిగాయి. 2011నాటికి రూ.55 లక్షలు నిర్వాసితులకు నష్ట పరిహారం అందించారు. ఈ సమయంలో నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్ ఒత్తిడి చేయటంతో 2017లో ఒప్పందం రద్దు చేశారు. 2018లో టీడీపీ హయాంలో రూ.17.83 కోట్లతో నూతన ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో నిధులు అందించకపోవటం, వివిధ దశల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుని నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ 25 శాతం పనులు కూడా చేపట్టకపోవటంతో 2019లో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మొత్తం కాలంలో వైఎస్సార్ హయాంలో మినహా టీడీపీ చేసింది ఏమీ లేదు. తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ పీసీ హయాంలో స్పందించి నాటి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత క్రమంలోకి జంపరకోటను చేర్చింది. నిధులు అనుకున్న మేర కేటాయింపునకు చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వ మార్పు జరిగింది. న్యూస్రీల్ మూడున్నర దశాబ్దాలుగా రైతుల ఎదురు చూపులు ఎన్నికల వేళ కూటమి నేతల హామీలు అధికారం చేపట్టి ఏడాదైనా సర్కారు చర్యలు శూన్యం హామీని అమలు చేయాలంటున్న అన్నదాతలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం.. జంపరకోట జలాశయం పూర్తి చేస్తారని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం. నేటికి 36 సంవత్సరాలు గడిచాయి. ఈ ప్రభుత్వం తన హయాంలో రిజర్వాయర్ కడితే వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది. రైతులు రెండు పంటలు పండించవచ్చు. పంటలు పండితే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. మా పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది. కూటమి చొరవ చూపి పనులు ప్రారంభించాలి. ప్రస్తుతం మా రైతులు జలాశయ ప్రాంతంలో ఉన్న వనరులు వినియోగించి తాత్కాలిక పంటలు వేసి జీవనం సాగిస్తున్నారు. – జి.చిన్నారావు, బియ్యాలవలస, పాలకొండ మండలం జీవితాలు బాగుపడతాయని.. జంపరకోట జలాశయ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడు ఇక్కడకు రావటం లేదు. ఏడాది గడిచినా పనులకు సంబంధించి ఎటువంటి చర్యలు లేవు. అప్పట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు, గిరిజనులు, రైతులు ఇక్కడ ఉన్న వనరులు కోల్పోయి పంటలు పండించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్ పూర్తి చేస్తే పంటలు పండితే మా జీవితాలు బాగుపడతాయి. – నిమ్మక సింహాచలం, గిరిజన రైతు, జంపరకోట -
సువర్ణముఖి నది ఒడ్డున ఏనుగుల సంచారం
సీతానగరం: మండలంలోని లక్ష్మీపురం – ఏగోటివలస గ్రామాల మధ్యనున్న సువర్ణముఖి నది ఒడ్డున తోటల్లో ఏనుగులు ఆదివారం సంచరిస్తూ కనిపించాయి. శనివారం వెంకటాపురం – బూర్జ తోటల్లో సంచరించిన ఏనుగుల గుంపు ఆదివారం ఉదయానికి లక్ష్మీపురం పురవీధుల్లో కనిపించాయి. ఉదయం 10 గంటల తరువాత నది ఒడ్డుకు చేరాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గడిచిన మూడు రోజులుగా మండలంలోనే ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు పంట పొలాల వైపు సంచరించే సమయంలో తమ పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఏకగ్రీవం విజయనగరం అర్బన్: ఏపీ ప్రజా రవాణా శాఖ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం ఆర్టీసీ జోన్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘం కార్యాలయంలో ఆదివారం ఎన్నిక జరిగింది. జోన్ నూతన కమిటీలోని విశాఖ జోనల్ అధ్యక్షుడుగా సీహెచ్ మోహన్రావు, కార్గో విశాఖపట్నం జోనల్ అధ్యక్షుడుగా టీఎస్ ప్రసాద్, విజయనగరం జోనల్ వర్క్షాప్ జోనల్ కార్యదర్శిగా డి.శ్యాంసుందరావు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ టీవీ రావు, రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యులు ఎం.అనంతకుమార్, సీఎస్ఐ విశాఖ రీజియన్ సీహెచ్మోహనరావు సమక్షంలో ఎన్నిక జరిగింది. అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలి ● ఆర్టీసీ ఎన్ఎంయూ జోనల్ కమిటీ డిమాండ్ విజయనగరం అర్బన్: ఆర్టీసీలో ఉద్యోగులపై అధికారులు చేపడుతున్న అక్రమ సస్పెన్షన్లు మానుకోవాలని లేకపోతే ఉద్యమాలు తప్పవని ఆర్టీసీ ఎన్ఎంయూ విజయనగరం జోనల్ కమిటీ హెచ్చరించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన సంఘం జోనల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంస్థ క్రమశిక్షణ చర్యలపై జారీ చేసిన మార్గదర్శకాలపై 01/2019 సర్క్యులర్ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగులను ఇష్టారాజ్యంగా సస్పెన్షన్స్, తొల గించడం చేస్తుండడంపై న్యాయం కోరుతూ అనకాపల్లిలో 100 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలపై అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. విజయనగరం డిపో ఉద్యోగ, సంఘ నాయకులపై స్థానిక అధికారులు దుర్భాషలాడటంపై ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జోన్ పరిధిలోని అన్ని డిపోలలోనూ, గ్యారేజీలలోనూ ఇదే పద్ధతిలో అధికారుల తీరు ఉందని దీన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి పీవీ మోహన్, రాష్ట్ర కార్యదర్శి కె.నర్సింగరావు, జోనల్ కార్యదర్శి బీఎస్ రాములు, జిల్లా కార్యదర్శి పీజీ రాఫీల్, వివిధ డిపోల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసే వరకు ఉద్యమం
● కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన ● కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విజయనగరం అర్బన్: ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలనే ప్రధాన డిమాండ్తో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. స్థానిక కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యులు నిరసనలు తెలుపుతూ కదం తొక్కారు. నిరసనలో ఉపాధ్యాయులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్జీటీల బదిలీలను మాన్యువల్లో నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తొలిత షెడ్యూల్లో ప్రకటించిన వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డి.శ్రీనివాస్, వి.రవీంధ్రనాయుడు, జోగారావు, కేఎస్ శ్రీనివాసరావు, సూరిబాబు, బంకపల్లి శివప్రసాద్, డి.రాము, డి.ఈశ్వరరావు, జేవీఆర్కే ఈశ్వరరావు, పైడిరాజు, పి.శ్రీనివాసరావు, ఎన్.రమణ, కంది రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్లకార్డుతో నిరసన -
మంత్రి వస్తున్నారని మెరుగులు
పార్వతీపురం రూరల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. అలాగే డివైడర్లకు రంగులు అద్దుతున్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లతో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు లోకేష్ పర్యటనతో అప్రమత్తమయ్యారు. మెరుగులు దిద్దే పనుల్లో బిజీ అయ్యారు. వెంకంపేట – చినబొండపల్లి గ్రామాల మధ్య మధ్య మంత్రి లోకేష్ పార్టీ కేడర్తో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆ మార్గంలో గుంతలను పూడ్చి రహదారిపై మెరుగులు అద్దారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను సైతం నరికేసి తమ పార్టీ జెండాలు పెట్టుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ముందుగా ఉదయం 11 గంటలకు పదో తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరు కానున్న క్రమంలో ప్రధాన రహదారిపై డివైడర్లకు మెరుగులు దిద్దారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో రహదారులకు తాత్కాలిక మరమ్మతులు జిల్లా కేంద్రంలో డివైడర్లకు మెరుగులు -
ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
విజయనగరం క్రైమ్: ఏపీ సెక్రటేరియట్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను సృష్టించి నిందితులు రూ.53 లక్షలు కాజేశారు. ఈ మేరకు ముఠాలోని ఐదుగురిని ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రదీప్నగర్కు చెందిన నిందితుడు కె.సాయి వెంకట్ సుజిత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దానిని చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, గుంటూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు సుజిత్ను సంప్రదించారు. విజయవాడలోని సెక్రటేరియట్లో పలు ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి ఒకొక్కరి నుంచి రూ.5 నుంచి ఎనిమిది లక్షల వరకు మొత్తంగా రూ.53 లక్షలు తీసుకొని మోసం చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి వారికి అందించారు. ఏడుగురు బాధితులను విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు అక్కడే ఉంచారు. తొందర్లోనే మీకు సమాచారం ఇస్తామని చెప్పి వారిని వెళ్లిపోమ్మన్నారు. ఎంతకీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుల్లో ఒకరైన ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన బాధితుడు ఎస్.వినోద్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. సీఐ ఎస్.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఐదుగురు ఏపీ వాసులు, నలుగురు హైదరాబాద్కు చెందిన వారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు అయిందనే విషయం తెలిసిన వెంటనే నిందితులు పరారయ్యారు. ఇంతలోనే.. ముఠాలో కీలక నిందితుడైన విజయనగరానికి చెందిన సాయి వెంకట్ సుజిత్కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులైన విజయనగరానికి చెందిన సీహెచ్ మహేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన రూబిన్ కుమార్, ఏలూరుకు చెందిన జాన్, యాకూబ్లు విజయనగరం వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేరం చేసినట్టు అంగీకరించారు. హైదరాబాద్లో నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్టు అంగీకరించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సుజిత్ కోలుకోగానే అరెస్టు చేస్తామన్నారు. కేసును వేగవంతంగా ఛేదించినందుకు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఏడుగురు నుంచి రూ.53 లక్షల వసూలు నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ల అందజేత పోలీసులకు పట్టుబడిన నిందితులు -
విద్యాశాఖ మంత్రి రాకకు ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురం టౌన్: రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు సోమవారం రానున్న దృష్ట్యా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఏఎస్పీ అంకిత సురానా ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమాన్ని స్థానిక రాయల్ కన్వెన్షన్లో ఏర్పాటు చేయగా వసతులను వారు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణిి అధికారులను ఆదేశించారు. అనంతరం చినబొండపల్లిలో జరిగే కార్యక్రమం ఏర్పాట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ తేజేశ్వరరావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం
● పుట్టగొడుగుల్లా షాపులు ● సహకరిస్తున్న విద్యుత్ సిబ్బంది ● రెడ్డి కంచేరులో విద్యుత్కష్టాలు ● గ్రామానికి లోడు సరిపడక ప్రజలు అవస్థలు భోగాపురం: మండలంలోని రెడ్డి కంచేరు గ్రామ ప్రజలు విద్యుత్ కష్టాలతో గడిచిన కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి అతి సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమవుతోంది. ఇదే అదునుగా కొంతమంది అక్రమార్కులు గ్రామంలోని రహదారులను ఆక్రమించి పదుల సంఖ్యలో కొత్త షాపులను నెలకొల్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా..షాపులకు నిత్యం విద్యుత్ చౌర్యం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు కర్రలు కట్టి మరీ విద్యుత్ చౌర్యం చేస్తున్నారని, దీనివల్ల గ్రామానికి లోడు సరిపడక విద్యుత్ సరఫరాలో నిత్యం ఆటంకం ఏర్పడుతోందని వాపోతున్నారు. విద్యుత్ చౌర్యం పట్టపగలే బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం స్పందించడం లేదని, షాపుల నిర్వాహకులకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆరు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా..గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి చౌర్యానికి పాల్పడుతున్నారని వాపోతున్నారు. దీంతో ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతోందని, వేసవి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులకు సహకరిస్తూ సుమారు 2వేల మంది జనాభా ఉన్న గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలివిద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కర్రలు కట్టి యథేచ్ఛగా దొంగతనంగా విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. మాకు సరఫరా సక్రమంగా అందివ్వడం లేదు. కానీ నెల నెలా బిల్లులు చూస్తే నిజంగానే షాక్ కొడుతోంది. గ్రామానికి మానేసి షాపులకు దొంగతనంగా విద్యుత్ను ఎలా సరఫరా చేస్తారు? విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. సీరపు అప్పలరాముడు, రెడ్డి కంచేరునరకయాతన అనుభవిస్తున్నాం ప్రతిరోజూ విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుండడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంత ఘోరం ఎన్నడూ చూడలేదు. వేసవికాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అక్రమార్కులకు సహకరించకుండా గ్రామానికి విద్యుత్ సరఫరాను సక్రమంగా ఇవ్వాలి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొల్లేటి అప్పలరాజు, రెడ్డి కంచేరు -
ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలి
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా డ్రైవ్ను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంచి పారిశుద్ధ్య పరిస్థితులు ఏర్పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకు గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణ జరగాలని వాటిని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. వ్యక్తిగతంగా, గృహపరంగా పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలని తద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని కోరారు. నీటి నిలవకు అవకాశం లేకుండా ఖాళీ కొబ్బరి బొండాలు, సీసాలు, టైర్లు, పాత్రలు తదితర పరికరాలపై దృష్టిసారించి అవి ఎక్కడ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జూన్లోనే పారిశుద్ధ్య డ్రైవ్ జూన్ నెలలోనే జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టడం వల్ల రానున్న నెలల్లో సులభతరమవుతుందన్నారు. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామాల దగ్గరలో ఉండే నీటి వనరులలో గంబూషియా చేపలను వదలడం వల్ల లార్వా నిరోధక వ్యవస్థగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ, బయట దోమల నివారణగా స్ప్రేయింగ్ జరగాలని ఆదేశించారు. దోమ తెరల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని, కాలువల్లో పూడికలు తీయాలని, మురుగునీరు ఎక్కడా నిలవ లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
సేదదీరుతూ అనంతలోకాలకు..!
పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడడంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండడంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం తాగాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళ్తానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళ్తానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం తో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ నల్ల పిక్కలో కూరుకుపోయి కూలీ దుర్మరణం మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన -
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయుల వినూత్న నిరసన
పార్వతీపురం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించడం సరికాదని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆఫ్లైన్లోనే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిల్చొని శనివారం నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి దానికి భిన్నంగా ప్రస్తుత విద్యా శాఖ డైరెక్టర్, విజయనగరం, శ్రీకాకుళం, కడప తదితర జిల్లాల్లో వెబ్ కౌన్సెలింగ్కు ఉపాధ్యాయులను సంసిద్ధత చేయడం శోచనీయమన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఆయా జిల్లా కేంద్రాల్లో సమావేశమై వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారన్నారు. బదిలీల ప్రక్రియను పునఃసమీక్షించి వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా కౌన్సెలింగ్ చేసి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆఫ్లైన్ కౌన్సెలింగ్కు డిమాండ్ -
రామతీర్థంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శనివారం పలువురు చిన్నారులు చేసిన సంప్రదాయబద్ధ నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరంలోని మయూరి నృత్యాలయ డైరెక్టర్ శ్రీదేవి కృష్ణ ఆధ్వర్యంలో స్వామి సన్నిధిలో విద్యార్థినులు నత్య నీరాజనాన్ని సమర్పించారు. రఘుకుల తిలకా రారా..నిన్నెత్తి ముద్దులాడెదరా..అంటూ జానపద గేయానికి చిన్నారులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. హడలెత్తిస్తున్న ఏనుగులుభామిని: మండలంలోని తాలాడలో నాలుగు ఏనుగుల గుంపు శనివారం హడలెత్తించింది. ఎండ తీవ్రత తగ్గిన వెంటనే తోట నుంచి బయటకు వచ్చి రోడ్లు వెంబడి సంచరించిన ఏనుగులు బెంబేలెత్తించాయి. కొద్ది రోజులుగా తాలాడ సమీపంలోని ఐలమ్మ తోటలో తిష్ఠ వేసిన ఏనుగులు ఆహారం కొరతతో సాయంత్రం బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు వెంట స్థానికులు పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి మొక్కజొన్న గింజల బస్తాలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు ఎటువైపు పయనిస్తుందోనన్న భయాందోళనతో ఏనుగుల వెంట వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గోతిలో పడి కార్మికుడికి తీవ్ర గాయాలుబొబ్బిలి: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అలజంగి ఆచారి శుక్రవారం రాత్రి బాడంగి, రామభద్రపురం మండల కేంద్రాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రామభద్రపురం–జగనన్న కాలనీల మధ్య ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు. దీంతో తల, కాలర్బోన్లకు గాయాలయ్యాయి. గాయపడిన ఆచారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆచారిని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకర రావు శనివారం వెళ్లి పరామర్శించారు. పేద కార్మికుడికి తీవ్ర గాయాలైతే ఆదుకోవాల్సిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీంతో పేదలైన కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. ఆచారి నిరుపేద అని, ఇద్దరు చిన్న ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని, దాతలెవరైనా ఫోన్ 7780623626 నంబర్ను సంప్రదించి తోచినంత సహాయం చేయాలని కోరారు. నేడు డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున బాధ్యతల స్వీకరణవిజయనగరం అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా కిమిడి నాగార్జున ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీసీబీ సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నగరంలోని పూల్భాగ్ రోడ్డులో ఉన్న ‘జె’ కన్వెన్షన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పదవీ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కింజరావు అచ్చెన్నాయుడు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్గా గొంప కృష్ణ.. అలాగే జిల్లా సహకార మార్కెంటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్గా నియమితులైన గొంప కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ సాయికుమార్ తెలిపారు. మధాహ్నం 1 గంటకు నగరంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. -
అంతా ఎదురుచూపులు
–10లోఆ రెండింటి కోసమే.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శనివారం చిన్నారులు చేసిన సంప్రదాయబద్ధ నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆటల్లేవు..ఆహ్లాదం లేదు..! అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూల్ చిన్నారుల భవితను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025పార్వతీపురం టౌన్: కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవి అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా.. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఇంకోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామంటూ ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు పథకాల సొమ్మును ఎప్పుడొచ్చి పడతాయా.. అని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. జూన్ వచ్చిందంటే చాలు తల్లుల దగ్గర నుంచి రైతుల వరకు అందరిదీ ఒకటే టెన్షన్. ఒక వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. మరోవైపు రైతులకు వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. ఈ క్రమంలో అన్ని కుటుంబాల్లో ఆర్థిక అవసరం ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పథకాలు వర్తించే లబ్ధిదారులంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతుభరోసా పథకాల ద్వారా అందించిన సొమ్ము తమ ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు రైతుకు అందించేలా హామీ ఇచ్చింది. కానీ అధికారం చేపట్టి ఏడాదైనా నేటి వరకు వాటి జాడ లేకుండా పోయింది. న్యూస్రీల్గతంలో క్రమం తప్పకుండా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మఒడి, రైతు భరోసా పథకాలు అందజేసేవారు. తల్లులకు, అన్నదాతలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా విద్యాసంవత్సరం, ఖరీఫ్ సీజన్కు సకాలంలో నిధులు జమ చేసేవారు. అమ్మఒడి పథకం ద్వారా నాలుగు విడతల్లో 83,821 మంది తల్లుల ఖాతాల్లో రూ.497.28 కోట్లు, రైతు భరోసా కింద 1,42,930 మంది అన్నదాతల ఖాతాల్లో నాలుగేళ్లకు కలిపి రూ.878.07 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. అన్నదాత సుఖీభవ జాడ లేదు.. పాఠశాలలు తెరవక ముందే తల్లికి వందనం కావాలంటున్న తల్లులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పని పథకాల లబ్ధి జిల్లాలో అమ్మ ఒడి లబ్ధిదారులు 83,821 మంది రైతు భరోసా లబ్ధిదారులు 1,42,930 మంది అన్నదాతకు అన్యాయం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అన్నారు. ఆచరణలో అమలు కావడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు గతంలో రైతుభరోసా పథకం ధ్వారా క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒక్కటీ అందించడం లేదు. – వంగపండు శంకరరావు, రైతు, పార్వతీపురం ఎంత మంది ఉంటే.. అందరికీ అన్నారు... తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. గతంలో క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ప్రభుత్వం ఈ పథకంపై గాలి మాటలు చెబుతోంది. తక్షణమే ప్రకటన విడుదల చేయాలి. – ఎస్.ప్రసన్న, విద్యార్థి తల్లి, పార్వతీపురం గతంలో క్రమం తప్పలేదు.. అమ్మ ఒడి పథకం ద్వారా గత ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా నిధులు జమ చేసేవారు. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందు ఈ నిధులు జమ చేసేవారు. పిల్లల ఫీజులకు, ఇతర అవసరాలకు ఈ మొత్తం ఉపయోగపడేది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చింది. సంవత్సరం గడుస్తున్నా జమ చేయ లేదు. – వి.జయలక్ష్మి, తల్లి, వైకేఎం కాలనీ, పార్వతీపురం తల్లుల్లో టెన్షన్.. అప్పుడు అమ్మఒడి.. ఇప్పుడు తల్లికి వందనం. పథకాలు పేరు మారినా వీటి కింద లబ్ధిదారులకు అందబోతున్న సొమ్ము ఒక్కటే.. గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏడాదికి రూ.13,500 వేలు తల్లుల ఖాతాలో క్రమం తప్పకుండా జమ చేసేవారు. కానీ ఇప్పుడు తల్లికి వందనం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఇంట్లో చదువుకునే పిల్లలందరికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా హామీ అమలు చేయకపోవడంతో తల్లులలో ఆందోళన నెలకొంది. ఈ నెల 12న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం అయ్యే తేదీ దగ్గర పడింది. ఆ లోపే తల్లికి వందనం కింద సొమ్ములను జమ చేస్తారా.. లేదా.. అన్నది అందరిని పట్టి పీడిస్తున్న ప్రశ్న. ఇప్పుడు గతం కంటే విద్యార్థుల సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. ఒకటికి రెండుసార్లు దరఖాస్తులను వడపోస్తున్నారు. ఆ రెండింటి సొమ్ములు ఎప్పుడు ఖాతాలో వేస్తారంటూ ప్రజల్లో ఆందోళ నెలకొంది. -
నగరంలో భారీ వర్షం
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం గంట సమయం ఏకధాటిగా కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో విలవిలలాడిన అన్ని వర్గాల ప్రజలు మధ్యాహ్నం కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం చింతలవలస వెళ్లే మార్గంలోని ధర్మపురి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగటంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ యంత్రాంగం జేసీబీ సహాయంతో వృక్షాన్ని తరలించటంతో సమస్య పరిష్కారమైంది. ఇదిలా ఉండగా ఎప్పటిలానే భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం: నగరంలో చిన్నపాటి వర్షానికి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఇదే సమస్య ఉత్పన్నమవుతుండగా... సరఫరా పునరుద్ధరణకు గంటల తరబడి సమయం పడుతుండటం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా మరల సాయంత్రం 5 గంటల తరువాత పునరుద్ధరించటం ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి ముందుగానే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ పేరిట విద్యుత్ లైన్ల వెంబడి ఉండే చెట్లు, చెట్లు కొమ్మలు తొలగించే చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతుంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 3 గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం -
అయిపోయిన ఉద్యోగాలకు.. టెండర్లు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పెళ్లి జరిగిపోయింది.. ‘వడ్డింపు’ కూడా పూర్తయిపోయింది. కానుకల చదివింపులూ అయిపోయాయి. అంతా అయ్యాక.. ఆహ్వాన కార్డులు కొట్టిస్తే ఎలా ఉంటుంది? విద్యుత్ శాఖలో అదే పరిస్థితి నెలకొంది. ఏపీ ఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ పరిధిలో టెండర్ ద్వారా లోడ్ మానిటరింగ్ సెల్ (ఎల్ఎంసీ) పోస్టుల భర్తీకి తాజాగా టెండర్ పిలిచారు. ఈ పోస్టులను తాత్కా లిక ప్రాతిపదికన కాంట్రాక్టర్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండో కంటికి తెలియకుండా భర్తీ ప్రక్రియ కూడా ఎప్పుడో జరిగిపోయింది. గత ఏప్రిల్ నెలలో వీరు విధుల్లో చేరిపోవాలి. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. 21 నెలల కాలానికి ఈ పోస్టులను తొలుత భర్తీ చేస్తామని చెప్పినా.. తర్వాత రెన్యువల్ చేసుకుంటూ వెళ్తారు. దీంతో పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కార్పొరేట్ కార్యాలయం అధికారి ఒకరు.. తమవారి కోసం ఒక పోస్టును అట్టిపెట్టుకోగా... మిగిలిన మూడు పోస్టులను జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సొంతం చేసుకున్నారు. ఒక్కో పోస్టునూ రూ.10 లక్షల కు విక్రయించినట్లు భోగట్టా. తనకు తెలియకుండా.. తన నియోజకవర్గంలో ఎలా పోస్టులను నియమిస్తారని మరో ప్రజా ప్రతినిధి అభ్యంతరం చెప్పడంతో.. ఎవరికీ పోస్టింగులు ఇవ్వకుండా ఆగిపోయింది. ఇదే విషయమై.. గత నెల 25న ‘సాక్షి’ లో ఎల్ఎంసీ పోస్టు.. రూ.10 లక్షలు శీర్షికన కథనం ప్రచురితమైంది. టెండర్ పిలవకుండానే నియామకాలు గుట్టుగా చేసిన విషయాన్ని బయట పెట్టడంతో విద్యుత్ శాఖాధికారులు ‘కవరింగ్’కు సిద్ధమయ్యారు. తాజాగా స్కిల్డ్ (69), సెమీ స్కిల్డ్ (4), అన్ స్కిల్డ్(7) కింద పోస్టులను భర్తీ చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. ఇందులోనే నాలుగు ఎల్ఎంసీ పోస్టులు ఉండడం గమనార్హం. అయిపోయిన పోస్టులకు మళ్లీ ఇప్పుడు టెండర్ పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇక షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు.. ప్రస్తుతం విడుదల చేసిన టెండర్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటి పైనా ప్రజా ప్రతినిధుల కన్ను పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో పోస్టుకు పెద్ద ఎత్తున ‘డిమాండ్’ పలుకుతోంది. రేషన్ డీలర్లు, అంగన్వాడీ పోస్టులను అంగట్లో పెట్టి విక్రయించిన మాదిరి.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు లకూ రేట్ ఫిక్స్ చేసేశారు. చాలామంది నిరుద్యోగులు అడిగినంత ముట్టజెప్పేందుకు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. రోస్టర్ ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తే కొందరికై నా న్యాయం జరిగే అవకాశం ఉంది. సాక్షి కథనంతో మేల్కొన్న విద్యుత్ శాఖ ఇప్పటికే సదరు పోస్టులు విక్రయించేసినట్లు ఆరోపణలు -
పసుపు సాగుకు సమయమిదే..!
● జిల్లాలో వెయ్యి ఎకరాల వరకు సాగు ● విత్తనశుద్ధి తప్పనిసరి ● విత్తన ఆదా ముఖ్యం ● నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలిసీతంపేట: జిల్లాలో నాణ్యమైన పసుపు దిగుబడికి సీతంపేట ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడ పండిన పసుపునకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పసుపు పంట సాగులో ఉండగా సీతంపేట ఏజెన్సీలోనే కొండ పోడు వ్యవసాయంలో 650 ఎకరాల్లో సాగవుతుంది. గిరిజనులు ప్రతీ ఏటా సాగును పెంచుతున్నారు. ఈ క్రమంలో పసుపు సాగుకు ఈ నెలలోనే అనువైన సమయమని హర్టీకల్చర్, వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే పసుపు బంగారమే అవుతుందంటున్నారు. పసుపు పంట సాగు దశలో ప్రధానంగా విత్తన ఎంపిక కీలకమైంది. ఈ విత్తనాన్ని ఎన్నుకునేటప్పుడు తెగళ్లు, చీడపీడలు లేని నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకోవాలి. ఖరీదైన పంటలను సీజన్లో సమయానికి వేయకపోతే దుంపపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజేన్సీలో ఆధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోను పసుపు సాగు చేస్తారు. దీని సాగుకు ఈ నెల చివరి వరకు సరైన ఆదును సమయం. జూలై నెలలో పసుపు సాగు చేస్తే బాగా దిగుబడి తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎంత విత్తనం వేయాలంటే.. విత్తనం ఎకరానికి కాడి రకం సాధారణంగా ఏజెన్సీలో 6 పుట్లు (పుట్టి 300 కిలోలు) 1800 కిలోలు వేస్తారు. కొంత మంది రైతులు 5 పుట్లు కూడా విత్తనంగా వేస్తారు. ఆయా పరిస్థితులను బట్టి విత్తనంగా వేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పద్ధతులు ఆమలులో ఉన్నాయి. విత్తనంలో కనుపు వద్ద విరిచి చిన్న ముక్కలుగా చేసుకుని విత్తనంగా వేసుకోవచ్చు. దీంతో విత్తనం ఆదా కావడంతో పాటు రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది. పసుపు పంట సాగుకు బలమైన నేలలు శ్రేష్టమైనవి. నల్ల, బంక నేలల్లో పసుపు సాగు చేయవచ్చు. గరప, చౌడు నేలలు పనికిరావు. విత్తనశుధ్ధి తప్పనిసరి విత్తనాన్ని పొలంలో నాటే ముందు లీటరు నీటిలో మూడు గ్రాముల కార్బండిజమ్ లేదా డైథేన్ ఎం–45ను కలిపిన ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. విత్తనం ఉంటైనా, కోమ్మైన 40 నిమిషాలు ఈ ద్రావణంలో నానబెట్టాలి. విత్తనాన్ని డ్రమ్ము నుంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టాక ఆ తర్వాత విత్తనం పూడ్చాలి. శిలీంధ్ర నాశని వల్ల వచ్చే తెగుళ్ల నివారణకు మూడు మిల్లీలీటర్ల డైమిథోయేట్ ద్రావణంలో ట్రెకోడెర్మావిరిడి పొడి 3 గ్రాములు కలిపి విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్లను చాలా వరకు నివారించవచ్చు.నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలి పసుపు విత్తనాన్ని మూడు రకాల పద్ధతుల్లో నాటుకోవచ్చు. ఇందులో ఎత్తుమడుల పద్ధతి, సమతల పద్ధతి, బోదే పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో మీటరు వెడల్పు కలిగిన కయ్యల్లో 30 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన బోదెలు ఉండేలా చుసుకోవాలి. అదే విత్తన ఉంటను 15 సెంటీమీటర్ల ఎడమతో పూడ్చుకోవాలి. పసుపు పంటకు సోకే తెగుళ్లలో దుంప కుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు వేరు వ్యవత్థ ద్వారా వ్యాపిస్తాయి. విత్తన శుద్ధి చేయకుండా కొమ్మలను ఉంటలను పూడ్చకూడదు. పొలంలోని మురుగు నీరు బయటకు వెళ్లిపోయేలా చేసుకోవాలి. మొక్కల చుట్టూ నీరు నిల్వ లేకుండా చేయాలి. పొటాష్ ఎరువులను సక్రమంగా వేయకపోవడం వల్ల ఇవి వ్యాప్తిస్తాయి. దీనికి మూల కారణం విత్తన శుద్ధి తప్పక చేయాలి. జాగ్రత్తలు పాటించాలి పసుపు పంటకు అధికంగా ఎరువుల వినియోగించకూడదు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దుక్కి దున్నే సమయంలో ఎకరాకు 3 బస్తాల సూపర్ పాస్ఫేట్, 200 కిలోల వేప పిండి, 25 కిలోల పొటాష్ను వేయాలి. ఆ తర్వాత విత్తనం పూడ్చిన 40 రోజులకు ఒక బస్తా యూరియా వేయాలి. మూడవ విడత 80 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్, 200 కిలోల వేప పిండి వేసుకోవాలి. నాలుగో విడత 120 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా శాసీ్త్రయ పద్ధతిలో ఎరువులను వేయడం వల్ల ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ఆకులను మల్చ్గా ఉపయోగించాలి పంట విత్తిన వెంటనే హెక్టార్కు 12–15 టన్నుల పచ్చని ఆకులను మల్చ్గా ఉపయోగించాలి. కలుపు తీయడం,భూమిని పైకెత్తి, నాటి న 40–90 రోజుల తర్వాత హెక్టార్కు 7.5 టన్నుల చొప్పున మల్చింగ్ పునరావృతం చేయాలి. పసుపును రైజోముల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఒక ఎకరం భూమిలో నాటడానికి వెయ్యి కిలోల రైజోముల విత్తన రేటు అవసరం. – పి.జయశ్రీ, ఉద్యానవనశాఖ అధికారి, సీతంపేట -
88 గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలి : పీవో
సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని 88 గిరిజన గ్రామాల్లో కుటుంబ సర్వే చేయాలని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. వివిధ మండలాలకు చెందిన మండల స్థాయి అధికారులతో శుక్రవారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తప్పుల సవరణ, భూమి పట్టాలు ఉన్నాయా లేదా, ఉంటే కరెక్షన్ ఏమైనా చేయాలా?, కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువపత్రం వంటివి తీసుకోవాల్సినవి పెండింగ్లో ఉన్నాయనేది సర్వే చేయాలన్నారు. ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, వారి జీవన విధానం తదితర వివరాల సర్వే ఈ నెల 13వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు అన్ని శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లో క్యాంపయిన్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
పార్వతీపురం రూరల్: మనిషి శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు యోగా దోహదపడుతుందని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. మండలంలోని నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుమారు 500 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాల్లో సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు, ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉద్యోగ ప్రయాణంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కనీసం రోజులో 15 నిమిషాలైనా యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రంగనాథం, అప్పారావు, శ్రీనివాసరావు, ఏఆర్ ఆర్ఐలు రాంబాబు, నాయుడు, శ్రీనివాసరావు, రూరల్ సీఐ గోవిందరావు, సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు, యోగా గురువులు, శిక్షకులు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. యోగాంధ్రలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ -
మెరుగైన వైద్యం అందించండి
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వైద్యులకు సూచించారు. కురుపాం సీహెచ్సీను ఆమె శుక్రవారం రాత్రి పరిశీలించారు. తల్లీ పిల్లల వార్డులో ఒకే బెడ్పై జనరల్ పేషెంట్స్ ఇద్దరు, ముగ్గురికి వైద్యసేవలు అందించడంపై స్పందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తే రోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓపీ ఎంత నమోదవుతుంది, కేసుల తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200డీపీవోలో పోలీస్ వెల్ఫేర్ డే విజయనగరం క్రైమ్: పోలీసు శాఖలో పలు హోదాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ డీపీవోలో పోలీసు వెల్ఫేర్ డేను శుక్రవారం నిర్వహించారు. సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నా రు. సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి బ్బంది వినతులు పరిశీలించిన ఎస్పీ త్వరితగతి న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాన ని సిబ్బంది, అధికారులకు భరోసా ఇచ్చారు. బొబ్బిలి విద్యార్థులకు జాతీయ పతకాలు బొబ్బిలి: ఒడిశాలోని కటక్ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మే 30 నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి క్రీడాకారులు జాతీయ పతకాలు సాధించినట్టు కోచ్ సుధాకర్యాదవ్ తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో బొబ్బిలికి చెందిన 17 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీలలో గెలుపొందారన్నారు. బంగారు పతకాలు ముగ్గురికి, కాంస్య పతకాలు 9 మందికి, వెండి పతకాలు ఐదుగురికి లభించాయన్నారు. వీరిలో జ్ఞానదీపక్ తన ప్రత్యర్థిపై రెండు రౌండ్లలోనూ 16–0, 13–0 స్కోర్లతో గొప్ప విజయం సాధించినట్టు చెప్పారు. జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే బేబీ నాయన, డీఎస్పీ జి.భవ్యా రెడ్డి అభినందించినట్టు చెప్పారు. తేనేటీగల దాడిలో పలువురికి గాయాలు రేగిడి: మండల పరిధి కొమెర వెంకటాపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారులుపై తేనేటీగలు శుక్రవారం దాడి చేశాయి. కాలువల్లో పనులు చేస్తుండగా తుప్పులకు ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో వేతనదారులు పరుగులు తీశారు. అప్పటికే పలువురి వేతనదారులు తీవ్రంగా గాయపడడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రేగిడి రమణ 108కు సమాచారం అందించారు. రేగిడి, పాలకొండ 108 సిబ్బంది రెండు వాహనాల ద్వారా గ్రామానికి చేరుకుని దాడిలో గాయపడిన బట్న జగన్నాథం, ఇందిరాపు రత్నాలమ్మ, వెంపటాపు సూర్యనారాయణ, బట్న రాజేష్, అరసవిల్లి గౌరమ్మ, అరసవల్లి దుర్గారావులతో పాటు మరి కొందరిని ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, పైలెట్ జి.నారాయణరావు, వెంకటరమణలు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలో రెండు చోట్ల చోరీ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో కొత్తవలస ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న శ్రీరంగ మోటార్ మహేంద్ర ట్రాక్టర్ షోరూం, శ్రీ వాసవీ లారీ యూనియన్ కార్యాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్టు పట్టణ ఎస్ఐ జగదీష్నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ చోరీ ఘటనలో ట్రాక్టర్ షోరూంలో రూ.80వేల నగదు అపహరించినట్టు తెలిపారు. దుండగలు ముందు లారీ యూనియన్ కార్యాలయంలో చోరీకి పాల్పడినట్టు అక్కడ ఏమీ లేకపోవడంతో పక్కనే ఉన్న ట్రాక్టర్ షోరూంలోకి వెనుక భాగం నుంచి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు పేర్కొన్నారు. బాధితుడు బోటు గంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నామని, చోరీకి పాల్పడిన ఇద్దరు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. -
పిడుగుపాటుకు గురై మహిళ మృతి
తెర్లాం: పిడుగు పాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం విజయరాంపురం ఉరఫ్ బూరిపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. విజయరాంపురం గ్రామానికి చెందిన పూడివలస వెంకటమ్మ(40) పిడుగు పాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో వెంకటమ్మ పశువులకు దాణా పెట్టేందుకు పశువులశాలకు వెళ్లింది. ఆ సమయంలో పెద్ద శబ్ధంతో పిడుగు పశువుల శాల పక్కనే పడడంతో పశువుల శాలలో ఉన్న వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త రామిశెట్టి, ఇద్దరు వివాహితులైన కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కామేశ్వరికి గతంలో వివాహం జరగగా, 10 రోజుల క్రితమే చిన్న కుమార్తె గౌరీశ్వరికి వివాహమైంది. అంతవరకు ఇంట్లో ఉండి పశువులకు దాణా పెట్టి వస్తానని చెప్పి పశువుల శాలకు వెళ్లిన వెంకటమ్మ పిడుగుపాటుకు గురై మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తహసీల్దార్ హేమంత్కుమార్కు గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు సమాచారం ఇవ్వగా వెంటనే తహసీల్దార్ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని, మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. తెర్లాం ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహానికి శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. పాము కాటుకు గురై వ్యక్తి..తెర్లాం: పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం సింగిరెడ్డివలస పంచాయతీ బొంగుపేట గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు శుక్రవారం తెలిపిన వివరాలు.. బొంగుపేట గ్రామానికి చెందిన ఏగిరెడ్డి లక్ష్మునాయుడు(59) పాము కాటుకు గురై మృతి చెందాడు. బుధవారం రాత్రి కళ్లానికి వెళ్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు లక్ష్మునాయుడుకి సత్యవతి, వివాహితులైన పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ఆసుపత్రిలో శవ పంచనామా చేసి అక్కడే పోస్టుమార్టం చేయించారు. జ్వరంతో వ్యక్తి..సీతంపేట: మండలంలోని జగతపల్లి గ్రామానికి చెందిన సవర ఆనందరావు (26) అనే గిరిజనుడు జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆయాసంతో బాధపడుతూ పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనందరావు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ప్రైవేటు ఆసుపత్రికి శుక్రవారం ఉదయం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మేఘన, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం దాటి పరసపాడు గ్రామ సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చినమేరంగి గ్రామానికి చెందిన ముదిలి దినేష్(26) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... దినేష్ తన భార్య దివ్యతో బయటకు వెళ్లి వస్తానని గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో పల్సర్ బైక్పై బయలుదేరాడు. పరసపాడు సమీపంలో ముందు టేకు కర్రలతో వెళ్తున్న నాటుబండిని ఢీకొని పడిపోయాడు. స్థానికులు 108లో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దినేష్కు భార్య దివ్య, మూడేళ్ల కుమార్తె దీక్షితశ్రీ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.అనీష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా టేకు కర్రలతో వెళ్తున్న బండికి వెనుక భాగాన ప్రమాద సూచిక ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణంపాలకొండ రూరల్: కుటుంబ పోషణకు రైతు వారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సన్నకారు రైతు పొలం నుంచి ఇంటిబాట పడుతున్న క్రమంలో విధి వక్రించింది. రోడ్డు దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహన రూపంలో మృత్యువు కబలించింది. ఎస్ఐ కె.ప్రయోగమూర్తి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం గ్రామానికి చెందిన గర్భాన లక్ష్ముం(62) ఉపాధి పనులతో పాటు పొలం పనులు పూర్తి చేసుకుని శుక్రవారం సాయంత్రం ఇంటికి వస్తున్నా రు. గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొండ నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వె ళ్తున్న యాకుల రఘు తన వాహనంతో లక్ష్ముంను ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుడిని స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్ముం మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న భార్య అన్నపూర్ణ, ముగ్గరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
తూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం
భోగాపురం: మండలంలోని తూడెం గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తూడెం గ్రామానికి చెందిన నీలాపు ఆదమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పూరింటిలో ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ కావడంతో ఆదమ్మ గమనించలేదు. వంట చేసేందుకు స్టౌ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.2 లక్షలకు పైబడి నగదు, విలువైన వస్తువులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు గాలి రాజారెడ్డి రూ.5వేల నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. రెవెన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
తాలాడలో ఏనుగుల విధ్వంసం
భామిని: భామిని మండలం తాలాడలో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. ఆరుగాలం శ్రమించి సాగుచేసి చేతికొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతు కుటుంబం గగ్గోలు పెడుతోంది. రైతు ఆర్. కాంతారావు మొక్కజొన్న పొత్తులను నూర్పిడిచేసి 55 బస్తాల గింజలను కళ్లాంలో నిల్వచేశాడు. వాటిలో 27 బస్తాల గింజలను ఏనుగుల గుంపు శుక్రవారం నాశనం చేశాయి. చెల్లాచెదురుగా విసిరేయడంతో రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. సర్పంచ్ వై.ప్రభావతి, వైఎస్సార్సీపీ నాయకుడు ఎరుకుమజ్జి పాపినాయుడు కళ్లాంకు చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగులు నష్టపరిచిన పంటను పరిశీలించి ఆదుకోవాలని కోరారు. ఐలమ్మ తోటలో నాలుగు ఏనుగులు తిష్టవేయడంతో భయాందోళన చెందుతున్నారు. 27 బస్తాల మొక్కజొన్న గింజలు ధ్వంసం గగ్గోలు పెడుతున్న రైతు కుటుంబం -
వీరఘట్టం హైస్కూల్ ముస్తాబు
వజ్రోత్సవ సంబరానికి.. వీరఘట్టం: వజ్రోత్సవ సంబరాలకు వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబవుతోంది. 1950లో స్థాపించిన ఈ పాఠశాల ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 75 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. దేశవిదేశాల్లో వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. తమ ఉన్నతికి అక్షర పునాది వేసిన పాఠశాల ఒడిలో మిత్రులు, గురువులను కలిసేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 8న ఆదివారం వజ్రో త్సవ వేడుకల నిర్వహణకు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, ఆఫీస్ సిబ్బంది సుమారు 300 మందిని సత్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1950లో ఇక్కడ హైస్కూల్ స్థాపించడానికి 5 ఎకరాల స్థలం (ప్రస్తుత విలువ రూ.30 కోట్లు) ఉచితంగా అందజేసిన కత్తులకవిటి గ్రామానికి చెందిన దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఆయన మనవడు, ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి రౌతు సురేష్కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డైమండ్ జూబ్లీలో తమ బాల్య మిత్రులను కలుసుకునేందుకు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసేందుకు అమెరికా, లండన్, బ్యాంకాక్, సింగపూర్ తదితర దేశాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు రానుండడంతో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. 1969లో రిలీవ్ అయిన మొదటి పదో తరగతి బ్యాచ్తో పాటు 2020లో రిలీవైన టెన్త్ బ్యాచ్ వరకు 52 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్టు పూర్వ విద్యార్థి బెహరా ప్రసాద్ తెలిపారు. ఇవే పార్కింగ్ స్థలాలు.... వజ్రోత్సవ వేడుకలకు కార్లు ఇతర వాహనాలపై వచ్చే వారు తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు, హైస్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో లేదా, బాలికల పాఠశాల పక్కనే ఉన్న లే–అవుట్లలో పార్కింగ్ చేసుకోవాలని ఎస్ఐ జి.కళాధర్ సూచించారు. ఆయన వజ్రోత్సవ వేడుకల ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలను శుక్రవారం పరిశీలించారు. వజ్రోత్సవ పండగ ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగేలా చూసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎన్నాళ్లో వేచిన సమయం.. ఈ నెల 8న చదువులమ్మ ఒడిలో సాగనున్న వజ్రోత్సవ పండగ తరలివస్తున్న 52 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్ స్థాపించి 75 ఏళ్లు పూర్తి విదేశాల నుంచి ఒకొక్కరికిగా చేరుకుంటున్న విద్యార్థులు హైస్కూల్కు 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చినదాత రౌతు చిన్నంనాయుడు విగ్రహ ప్రతిష్టకు సన్నాహాలు వజ్రోత్సవ వేడుకల కోసం ఎన్నాళ్లో వేచిన సమయం ఈ నెల 8న రానుండడంతో ప్రతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను విడివిడిగా సత్కరించేందుకు ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. వారితో గ్రూప్ ఫొటోలు దిగేందుకు ప్రత్యేకంగా కెమెరామెన్లను బుక్చేసుకున్నారు. తమ బ్యాచ్ వారు ఒకరిని ఒకరు గుర్తు పట్టేందుకు ప్రత్యేక కలర్ కోడింగ్ ఉన్న దుస్తులు కూడా ధరించనున్నారు. 14 ఏళ్ల వయస్సులో పదో తరగతిలోని క్లాసు రూమ్లో చేసిన అల్లర్లు, స్నేహితులతో తిరిగిన పాఠశాల ప్రాంగణం, వీరఘట్టం పరిసర ప్రాంతాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు రానుండడంతో వీరందరికీ స్వాగతం పలికేందుకు ఉత్సవ కమిటీ సర్వం సిద్ధం చేస్తోంది. హైస్కూల్లో పండగ వాతావరణం వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు వారం రోజులుగా జరుగుతుండడంతో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన, బదిలీపై వెళ్లినపోయిన ఉపాధ్యాయులందరికీ పూర్వ విద్యార్థులు ఆహ్వాన పత్రికలు పంపించారు. అలాగే అన్ని బ్యాచ్ల నుంచి సుమారు 1500 మందల మంది పూర్వవిద్యార్థులు వస్తున్నట్లు సమాచారం. ఉత్సవ నిర్వహణకు తమవంతు సహాయంగా సుమారు రూ.12 లక్షలకు పైగా విరాళాలను ఇచ్చారు. ఉదయం టిఫన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ను అందరికీ అందించేందుకు ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న పూర్వ విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. -
సౌర విద్యుత్తో బహుళ ప్రయోజనాలు
పార్వతీపురం టౌన్: ప్రతిఒక్కరూ సౌర విద్యుత్ను వినియోగించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుపై మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. 3 కేవీ యూనిట్ ఏర్పాటుతో ఎక్కువలోడ్ విద్యుత్ను వినియోగించుకోవచ్చన్నారు. రూ.1.20 లక్షలు చెల్లించిన వెంటనే సంబంధిత ఏజెన్సీ సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రూ.80 వేలు రాయితీ వస్తుందని, మొత్తం రూ.2 లక్షలు యూనిట్ ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సౌర విద్యుత్ను తమ గృహాల్లో ఏర్పాటు చేసి స్ఫూర్తిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్వతీపురం విద్యుత్శాఖ డివిజన్లో ఇప్పటి వరకు 147 యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేశారని, సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. అనంతరం పార్వతీపురం పట్టణంలో ఎస్ఎన్ఎం కాలనీలో పీఎం సూర్యఘర్ లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. కృష్ణమూర్తి అనే లబ్ధిదారుని ఇంటి వద్ద నమోదు కార్యక్రమాన్ని స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు. 9న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాక పార్వతీపురం టౌన్: రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పార్వతీపురం పట్టణంలో సత్కరిస్తారని, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో చర్చించారు. కృష్ణారాయపురానికి ఏనుగులు సీతానగరం: గరుగుబిల్లి మండలం బురద వెంకటాపురం నుంచి సీతానగరం మండలంలోని సుమిత్రాపురం మీదుగా కృష్ణారాయపురం గ్రామానికి ఏనుగులు చేరుకున్నాయి. రామకోనేరు, శివాలయ ప్రాంతాల్లో శుక్రవారం సంచరించాయి. గ్రామంలోని అగ్రహారం వీధిలోకి ఏనుగులు రావడంతో గ్రామస్తులు పరుగుతీశారు. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై బూర్జ పొలాల్లోకి మళ్లించారు. వ్యవసాయరంగంపై చిన్నచూపు రేగిడి: కూటమి ప్రభుత్వం వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. రేగిడికి శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకు రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు అందకపోవడం దారుణమన్నారు. రైతు సేవా కేంద్రాలకు నేటికీ విత్తనాలు రాకపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకునే దుస్థితి నెలకుందన్నారు. చెరకు, మొక్కజొన్న పంటలకు ఎరువులు అందజేసే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్, రబీ సీజన్లు గడిచిపోయాయి.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చిన అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి రైతన్నకు అందలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందేవని తెలిపారు. ఆయన వెంట బీసీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీటీసీ, సర్పంచ్లు సురేష్, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
మొక్కలతో వాతావరణంలో సమతుల్యం
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ110 శ్రీ190 శ్రీ200విజయనగరం లీగల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టిక్తో ముప్పు అనే నినాదంతో ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బబిత అన్నారు. ఈ మేరకు ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఆమె గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 70 మైక్రాన్ల కన్నా ఎక్కువ పరిమాణంతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు వాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అందువల్ల ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా స్టీల్గ్లాసులు, స్టీల్ బాటిల్స్, కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. మొక్కలు ఎక్కువగా నాటడం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు జడ్జి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జడ్జి ఎన్.పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, మొబైల్ కోర్టు జడ్జి బుజ్జి, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.రవిబాబు, నాయమూర్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కలిసికట్టుగా నిర్మూలిద్దాం విజయనగరం: ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. మానవుల జీవన సరళిలో పర్యావరణానికి హాని చేసే వాటిని నిర్మూలించాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యం లో జరిగిన వర్క్షాప్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు నగరంలోని అంబేడ్కర్ కూడలి నుంచి జిల్లా పరిషత్ వరకు ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం అనే నినాదం తో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని, వచ్చే ఏడాది ఈ తేదీ నాటికి జిల్లా పర్యావరణంలో స్పష్టమైన మార్పు కనపడాలని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా భావించి పర్యావరణానికి ప్రాణం పోయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని, దుకాణాలపై దాడులు చేసి ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూస్తున్నామన్నారు. నగరంలో 15 వేల వరకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ అధికారి కొండలరావు మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, దీని పరిణామాలు భవిష్యత్తు వారికీ నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి దగ్గరగా మానవుడు ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఒక్కరోజే 4 లక్షల మొక్కల్ని జిల్లాలో నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తమ కంపెనీలైన ఎంఎస్ఎం ఫార్మా, శారద మెటల్, అంజన ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీల ప్రతినిధులకు కలెక్టర్ అంబేడ్కర్ ప్రశంసాపూర్వకంగా మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట రమణ, ప్రొఫెసర్ రామకృష్ణ, పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం నెల్లిమర్ల రూరల్: వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ ఏడాది జిల్లాలో నాలుగు లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ నగరవనంలో 4లక్షల మొక్కలు నాటే కార్యాక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలిసి గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటే జిల్లాలో పచ్చదనం నిండుతుందన్నారు. పర్యావరణానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని, పర్యావరణాన్ని సంరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కొండలరావు, ఇన్చార్జ్ ఆర్డీఓ సవరమ్మ, డీఎంహెచ్ఓ జీవనరాణి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత -
బొలెరోను ఢీకొట్టిన బైక్: ఒకరి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ వద్ద గురువారం బొలెరో వాహనాన్ని బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. కొండకరకాం గ్రామానికి చెందిన ప్రమోద్, చిన్నారావు, సునీల్ బుల్లెట్పై విజయనగరంలో పని చూసుకుని తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఓ బొలెరో వాహనం అకస్మాత్తుగా రోడ్పైకి వస్తుండగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ఈ ముగ్గురు బైక్తో ఢీకొట్టారు. దీంతో బైక్పై ఉన్న ముగ్గురిలో చిన్నారావు కింద పడిపోగా మిగిలిన ఇద్దరూ పక్కకు పడిపోయారు. చిన్నారావుకు మాత్రం శరీరం మధ్యబాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా గాయపడిన వ్యక్తులను తిరుమల మెడికవర్కు చికిత్స కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రొటోవేటర్ కిందపడి వ్యక్తి దుర్మరణంసీతానగరం: మండలంలోని కామందొరవలసలో గురువారం ట్రాక్టర్తో దుక్కి చేస్తున్న సమయంలో రొటోవేటర్కు ఉన్న గడ్డి తీస్తుండగా ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామన్న దొరవలస గ్రామానికి చెందిన బురిడి రామారావు(46) తన పొలంలో దుక్కిదున్నే నిమిత్తం ట్రాక్టర్ను రప్పించుకున్నాడు. ఆ ట్రాక్టర్ వెనుకనున్న రొటోవేటర్కు తగిలిన గడ్డిని తీయమని ట్రాక్టర్ డ్రైవర్ రామారావుకు సూచించడంతో రామారావు రొటొవేటర్ గడ్డి తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రొటోవేటర్కున్న బ్లేడ్లు ఆయన ఛాతీపైన బలంగా తగలడంతో కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు తిలక్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం. రాజేష్ తెలియజేశారు. మృతుడికి తల్లి, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో కొత్తవలస మండలంలోని తాడివానిపాలెం గ్రామం సమీపంలో ఈ నెల రెండవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జి.వెంకటరమణ (63) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కొత్తవలసలోని వసంత్విహార్ ప్రాంతానికి చెందిన వెంకటరమణ విశాఖపట్నంలో గల కూతురి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా తాడివానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి పక్కనే గల చెట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను 108 వాహనంలో విశాఖపట్నంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
అధ్వానంగా సాగునీటి చెరువులు..
గ్రామంలోని పంటపొలాలన్నీ సాగునీటి చెరువులపైనే ఆధారపడి ఉన్నాయి. గ్రామ ఆయకట్టుకు సుమారు ఎనిమిది సాగునీటి చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు తుప్పలు పేరుకుపోయి, మదుములు పాడై పోయి ఉన్నాయి. వ్యవసాయ పనుల సమయంలో చెరువుల నిండుగా నీరున్నా ఇంజిన్ల సహాయంతో తడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు సాగునీటి కాలువలు కూడా పూడుకుపోతున్నాయి. ఏ అధికారి వద్ద చెరువుల పరిస్థితిని చెప్పుకోవాలో తెలియడంలేదు. ఎం.వెంకటినాయుడు, రైతు, పొనుగుటివలస -
నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
కొత్తవలస: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ సింహాచలం మాట్లాడుతూ కొత్తవలస మండలంలోని వీరభద్ర పురం, దాసరివానిపాలెం గ్రామాల నుంచి ఆటోలో పీడీఎప్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల పరిధిలో మాటువేసినట్లు చెప్పారు. దాసరివాని పాలెం గ్రామానికి చెందిన సత్యవరపు వెంకటబంగార్రాజు ఆటోలో 4వందల కేజీల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు పట్టుబడిన బియ్యాన్ని సీఎస్డీటీ రామకృష్ణకు అప్పగించినట్లు వివరించారు. ముగ్గురి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారా అక్రమ తయారీ, రవాణాను నిరోధించే కార్యక్రమంలో భాగంగా గురువారం చేపట్టిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కురుపాం ఎకై ్సజ్ కార్యాలయం వద్ద విలేకరులతో సీఐ మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో స్టేట్టాస్క్ ఫోర్స్తో కలిసి దాడులు నిర్వహించగా 60 లీటర్ల సారాతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు చెప్పారు. అంతేకాకుండా గ్రామ పరిసరాల్లో పులియబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. అలాగే సారా తయారీ సామగ్రిని అమ్మిన ఓ మహళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పై ముగ్గురినీ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. గ్రామాల్లో సారా తయారీ రవాణా, అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి పార్వతీపురం రూరల్: జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన దినేష్ (26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరి ద్విచక్ర వాహనంపై పార్వతీపురం వైపు వెళ్లాడు. చింతలబెలగాం–గిజబ గ్రామాల మధ్య రహదారి పక్కన ఓ తోట సమీపంలో మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. దినేష్ మెడ, కాలిపై గాయాలు ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతుడు జలవనరుల శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతునికి భార్యతో పాటు మూడేళ్ల వయసుగల పాప ఉంది. దినేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో దినేష్ బంధువులు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాకు రెండు మోడ్రన్ డ్రోన్స్
విజయనగరం క్రైమ్: జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘా ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన రెండు టెథర్డ్ డ్రోన్స్ను రాష్ట్ర పోలీసు శాఖ జిల్లాకు మంజూరు చేసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సాధారణ డ్రోన్స్కు భిన్నంగా, ప్రత్యేక అవసరాలకు కోసం రూపొందించిన టెథర్డ్ డ్రోన్ పని తీరును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరిశీలించారు. ఒక నిర్దిష్ట ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటు చేసేందుకు టెథర్డ్ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 10గంటలపాటు గాలిలో తేలుతూ ఒక నిర్ధిష్ట ప్రదేశంలో జరిగే కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసే సామర్ధ్యం కలిగి ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ పవర్ లేదా జనరేటర్ సహాయంతో ఒక కేబుల్ ఆధారంగా డ్రోన్ పని చేస్తుందని తెలిపారు. జీపీఎస్ అవాంతరాలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ డ్రోన్ పని చేసే సామర్ధ్యంతో పాటు అదనంగా పబ్లిక్ అడ్రస్ సిస్టం, డే/నైట్ విజన్ కెమెరా, ఏఐ కెమెరాలను కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఏవీ లీలారావు, డ్రోన్ పైలట్స్ నరేష్, వెంకటేష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందల్ -
విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు
సాలూరు: వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 4న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో చేపట్టిన నిరసన ర్యాలీని ఊహకందని రీతిలో ప్రజలు విజయవంతం చేశార న్నారు. భవిష్యత్లో ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టనున్న పోరాటానికి ఇదే తరహాలో ప్రజలు సహకరించాలని రాజన్నదొర విజ్ఞప్తి చేశారు.