Siddipet District Latest News
-
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
● సమస్య ఉన్నవారెవరూ అధైర్యపడొద్దు ● కలెక్టర్ మనుచౌదరిదుబ్బాక: ‘భూ సమస్యలు ఉన్నవారు అధైర్యపడొద్దు.. భూ భారతి చట్టంతో అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారం లభిస్తుంది’ అని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అప్పనపల్లిలో భూ భారతి అవగాహన సదస్సును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులో అర్జీలు పెట్టుకోవాలన్నారు. అధికారులకు మీ సమస్య వివరిస్తే సమస్యను పరిష్కారం చేస్తారన్నారు. జిల్లాలో ఈ నెల 20 వరకు జరిగే సదస్సుల్లో భూ సమస్య ఉన్న వారు పాల్గోనాలన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యలు ఒపిగ్గా విన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి.. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలనే చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వైద్య విభాగాల రూంలను, సంబంధిత వైద్య పరికరాలను పరిశీలించారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్కారు ఆస్పత్రుల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయని, సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్, ఆయా విభాగాల డాక్టర్లు తదితరులు ఉన్నారు. -
డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వనజ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): డీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా మంద వనజ నియమితులైనట్లు డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ మంగళవారం తెలిపారు. మంద వనజకు జిల్లా ఉపాధ్యక్షురాలుతో పాటుగా, జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాలకు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయంప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని టీపీసీసీ నాయకుడు బొమ్మల యాదగిరి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ కలీమొద్దీన్తో కలిసి మాట్లాడారు. మంత్రి వర్గ కూర్పులో బహుజనులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వర్గంలో సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకులకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేశారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని కులాలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు రాజు, పయ్యావుల ఎల్లం, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ యాదవ విద్యార్థులకు 12న పురస్కారాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉత్తమ ప్రతిభ కనబర్చిన యాదవ విద్యార్థులకు ఈ నెల 12న ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యాదవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ అధ్యక్షుడు బైరి రాములులతో కలిసి ఆయన మాట్లాడారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హరీశ్రావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర నాథ్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నారన్నారు. పురుషుల పొదుపు సంఘం మహాసభహుస్నాబాద్రూరల్: పొట్లపల్లి పురుషుల పొదుపు సంఘం మహాసభ మంగళవారం నిర్వహించారు. సీడీఎఫ్ ధర్మకర్త అరుణ మాట్లాడుతూ 11 సంవత్సరాల కిందట ప్రారంభమైన పొదుపు సంఘం సభ్యులు ప్రతి నెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తున్నారని చెప్పారు. సంఘంలో 395 మంది సభ్యులతో రూ.58 లక్షల వరకు చేరినట్లు చెప్పారు. గ్రామంలోని రైతులు, వ్యవసాయ కూలీలకు సంఘంలో ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.లక్ష వరకు అప్పు ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల బంగారు భవిష్యత్తే ముఖ్యం
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● కలెక్టరేట్లో అధికారిక దత్తత సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురి దంపతులకు చిన్నారులను అదనపు కలెక్టర్ మంగళవారం అధికారికంగా దత్తత అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలని బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లల బంగారు భవిషత్కు బాటలు వేసే పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలోని శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని, అదే విధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎ.లక్ష్మీకాంత్ రెడ్డి, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, శిశు గృహ సోషల్ వర్కర్ రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.నాణ్యమైన వస్తువులే సరఫరా చేయాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు సరఫరా చేసే వస్తువుల విషయంలో నాణ్యమైన వస్తువులనే సరఫరా చేయాలని, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందించనున్న వస్తువుల టెండర్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మటన్, చికెన్, ఇతర అహార వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గడువుదాటిన వస్తువులు టెండర్దారులు వసతి గృహాలకు సరఫరా చేయరాదని, ఒక వేళ చేసినా వసతి గృహ నిర్వాహకులు తిప్పి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టెండర్దారులు పాల్గొన్నారు. -
ఫలించిన పోరాటం
ఎస్టీ జాబితాలోకి నక్కల కులస్తులుఆనందంగా ఉంది మా కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు లేక చాలా నష్టోయాం. రిజర్వేషన్లు లేకపోవడంతో మా పిల్లలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకు తమ కులాన్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చడం ఆనందంగా ఉంది. మాకు అండగా నిలిచిన సామాజిక సమరసత వేదికకు రుణపడి ఉంటాం. – తుమ్మల రాజు,చిన్న ముత్యంపేట అన్ని రంగాల్లో రిజర్వేషన్లు నక్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న జనాభాకు న్యాయం జరిగింది. ఇకనుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులమయ్యాం. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటాం. – కాలియ యాదగిరి, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తరతరాలుగా సంచార జీవనం సాగిస్తున్న నక్కల (పిట్టల) కులస్తుల ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ప్రభుత్వం నక్కల కులస్తులను తాజాగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చింది. ఇక నుంచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందనున్నాయి. అడవులు, గ్రామశివారుల్లో దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్లదీస్తున్న వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటూ సామాజిక సమరసత వేదిక నేతృత్వంలో ఎనిమిదేళ్లుగా ఉద్యమించారు. వీరి న్యాయమైన సమస్యను గుర్తించి ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నక్కల కులస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – దుబ్బాక 95 శాతం నిరక్షరాస్యత నక్కల(పిట్టల) కులస్తులు అడువులు, చెలకల్లో ఉంటూ పిట్టలు పట్టుకోవడం, మామిడి, చింత, వెలగ చెట్లను గుత్తకు పట్టుకొని వాటి కాయలను అమ్ముకుంటూ తరాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కులసర్టిఫికెట్ లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. 95 శాతానికి పైగా ఈ కులస్తులు నిరక్షరాస్యులే కావడం శోచనీయం. రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు.. నక్కల కులస్తులను ఎస్టీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు, జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొగుట మండలం చిన్నముత్యంపేట, దుబ్బాక తో పాటు మండలంలోని చిట్టాపూర్, నర్సాయపల్లి, దమ్మక్కపల్లి, రాఘవాపూర్, మందపల్లి, ధర్మారం, బస్వాపూర్, సలాక్పూర్ తదితర 12 గ్రామాల్లో 600 వరకు నక్కల జాతి కులస్తులు ఉన్నరు. ఇందులో చిన్నముత్యంపేటలో 80 కిపైగా నక్కల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సామాజిక సమరసత వేదిక అండతో.. నక్కల కులస్తుల దర్భుర పరిస్థితులను చూసి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్జీ చలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపై అధ్యయనం చేశారు. నక్కల కులస్తుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే సంకల్పంతో ఏమిదేళ్లుగా పోరాటం చేశారు. పిట్టల వారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను కలిసి ఎన్నో వినతిపత్రాలు అందజేశారు. వీరి పరిస్థితిని కేంద్ర మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లారు.అంతేకాకుండా గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి వీరి దుర్భరపరిస్థితిని వివరించి, వినతి పత్రం అందించారు. ఎట్టకేలకు వీరి పోరాటం సఫలీకృతం కావడంతో నక్కల కులస్తుల్లో సంతోషం నెలకొంది.సుదీర్ఘ పోరాటంతోనే.. నక్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. ఎస్టీలుగా గుర్తించడంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘపోరాటం చేసి ఫలితాన్ని అందుకున్నాం. పోరాటంలో సహకరించిన గవర్నర్, కలెక్టర్ మను చౌదరికి ధన్యవాదాలు. – అప్పల ప్రసాద్ జీ, కన్వీనర్ రాష్ట్ర సామాజిక సమరసత వేదిక ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి ఇప్పటి వరకు కుల సర్టిఫికెట్లు లేక సంక్షేమ పథకాలకు దూరం చిన్నముత్యంపేటలో కులస్తులకు సర్టిఫికెట్లు జారీకుల ధ్రువీకరణ పత్రాలు జారీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తొగుట మండలం చిన్నముత్యంపేటను రెవెన్యూ అధికారులు సందర్శించి పూర్వ పరాలను విచారించారు. తహసీల్దార్ శ్రీకాంత్ తన కార్యాలయంలో నక్కల కులస్తులకు పదిరోజుల క్రితం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలను పొందుతారు. -
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఘుమఘుమలు
‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ వారోత్సవాలుమిరుదొడ్డి(దుబ్బాక): ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీలు ఘుమ ఘుమలాడాయి. మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి మండలాల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం వారోత్సవాలను ఉత్సాహంగా ప్రారంభించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎగ్ బిర్యానీ’లను ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి తయారు చేయనున్నారు. వారానికి రెండు సార్లు అందించనున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభమైన వారోత్సవాలను దుబ్బాక ఐసీడీఎస్ సూపర్వైజర్లు రేణుక, విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాలల్లో అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, పున్నమ్మ, రేణుక, రేణమ్మ, విజయలక్ష్మి, బుజ్జమ్మ, నర్సమ్మ, విజయరత్న, అనిత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లోనే చేర్పించండి
తొగుట(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. బండారుపల్లి మదిర మెట్టు, పెద్ద మాసాన్పల్లి గ్రామాల్లో ఆదివారం జరిగిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద మాసాన్పల్లిలో డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. నిష్టాతులైన ఉపాధ్యాయులచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరుగుతోందన్నారు. విద్యార్థులకు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేట్ మోజులో పడి తల్లిదండ్రులు తమ రెక్కల కష్టాన్ని వృథాచేసుకోవద్దని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. అంతకు ముందు పాఠశాలల కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యం పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత డీఈఓ శ్రీనివాస్రెడ్డి -
లాభసాటి సాగుపై దృష్టి సారించండి
హుస్నాబాద్: రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ, పంట మార్పిడిలు చేస్తూ లాభాల వైపు పయనించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో మూడు రోజుల పాటు జరిగిన రైతు మహోత్సవ ముంగిపు సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ముంగింపు కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు తాను రావాల్సి ఉండేదని, కేబినెట్ విస్తరణ కారణంగా రాలేకపోయామన్నారు. రైతు మహోత్సవంలో చెప్పిన అంశాలను క్షేత్ర స్ధాయిలో పాటించి వ్యవసాయాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి సూచించారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. పంటల ఉత్పత్తిని పెంచుకోవాలి రైతు మహోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుంచి వచ్చిన రైతులు మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీ, వివిధ మార్పుల గురించి క్లుప్తంగా తెలుసుకున్నారని తెలిపారు. చేపలు, గేదెలు, ఆవులు, కోళ్ళ వ్యర్థాలతో పంటల ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వరి పంటలోకి మళ్లించడం ద్వారా 30 శాతం అధికంగా దిగుబడి పెరుగుతుందన్నారు. అరటి సాగులో మొక్కలను దగ్గర దగ్గర నాటాలన్నారు. మొక్కల కొమ్మలు ఒకటి కొకటి తాకడం వల్ల తేమ బయటకు పోకుండా అందులోనే స్టోరేజి అయి దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు. ఈ పద్ధతి మహారాష్ట్రలోని జలగామ్ జిల్లా రైతులు పాటిస్తూ దేశంలోనే 13 శాతం, ప్రపంచంలోనే 2 శాతం అరటిని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. వాతావరణానికి అనుగుణంగా కొంచెం ఆలోచిస్తే ఎంతో లాభాలు పొందవచ్చని అక్కడి రైతులు నిరూపించారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్, ఇతర ప్రైవేట్ రంగాల నుంచి ప్రతినిధులు భాగస్వామ్యం అయినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ను వివిధ శాఖల అధికారులు, రైతులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. నూతన పద్ధతులు అవలంబించాలి కలెక్టర్ మనుచౌదరి ఫోన్ ద్వారా మంత్రి పొన్నం సందేశం -
డొక్కలు చిక్కి .. బొక్కలు తేలి
నాచగిరీశా.. నీ చెంతనే గోవుల గోస● అల్లాడుతున్న ‘ఆలమంద’ ● కాపరికి స్వీపర్ బాధ్యతలు.. గోశాల దాటని ఆవులు ● ఎవరూ పట్టించుకోని దైన్యంవర్గల్(గజ్వేల్): గోమాతలు బక్కచిక్కుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్నాయి. సరైన తిండి లేదన్నట్లు బొక్కలు తేలాయి. సంరక్షణకు ప్రత్యేకంగా కాపరి, రూ.10 లక్షల విలువైన చక్కని గోశాల, యేడాదికి దాదాపు రూ. 2 లక్ష విలువైన పశుగ్రాసం, ఎకరాలకొద్ది ఆలయ భూములు, తదితర సంరక్షణ సౌకర్యాలున్న నాచగిరిలో ‘బక్కచిక్కి, డొక్కలు తేలిన ఆవులు’ గోసంరక్షణ తీరును అభాసుపాల్జేస్తున్నాయి. నిర్వహణ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోనే రెండో యాదాద్రిగా నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ప్రసిద్ధిపొందింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు గో పూజ, గోదానం, కోడె మొక్కు ద్వారా స్వామివారికి ఆవులు, కోడెలను సమర్పిస్తుంటారు. ఈ విధంగా నాచగిరి స్వామివారికి సమర్పించిన ఆవులు, కోడెలు, వాటికి పుట్టినవి కలిపి 26 ఉన్నాయి. అందులో 18 ఆవులు, 2 కోడెలు, 6 లేగలున్నాయి. రూ.10 లక్షలతో విశాలమైన గోశాల నాచగిరి క్షేత్రంలో ఆలమంద సంరక్షణ, గోపూజకు వీలుగా హైదరాబాద్కు చెందిన కందుకూరి వీరేశం అనే దాత రూ.10 లక్షల పైచిలుకు నిధులు వెచ్చించి విశాలమైన గోశాలను నిర్మింపజేశారు. మరోవైపు పశువుల సంరక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు నెలకు రూ.32,407 వేతనం పొందుతున్న స్వీపర్ను ప్రత్యేకంగా పశువుల కాపరిగా ఆలయ ఈఓ నియమించారు. ఉదయం, సాయంత్రం పశువులను బయటకు మేతకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాపరిదే. పశువులు మాత్రం గోశాల దాటడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే తనకు అదనంగా స్వీపర్ బాధ్యతలు కూడా చెబుతున్నారని సదరు పశువుల కాపరి బాల్రాజు పేర్కొంటున్నాడు. దీంతో పశువులు గోశాలకే పరిమితమై గ్రాసం కోసం అలమటించడం సాధారణంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. భూములున్నా.. పశుగ్రాసం కొనుగోలు నాచగిరి ఆలయానికి నాచారం, వేలూరు, అనంతగిరిపల్లి, తున్కిఖాల్సా, మీనాజీపేట, అల్లాపూర్, యావాపూర్, రామారం తదితర గ్రామాలలో సాగు భూములున్నాయి. వీటిని లీజు ప్రాతిపదికన రైతులకు ఇచ్చారు. వీటి ద్వారానే కాకుండా, దాతల ద్వారా పశుగ్రాసం పొందే అవకాశముంది. గత సంవత్సరం 2024–25 లెక్కల ప్రకారం 12 నెలల కాలంలో పశువుల కోసం రూ. 2,37,750 పశుగ్రాసాన్ని కొనుగోలు చేశారు. వీటిని సరిగ్గా వినియోగిస్తే పశువులు పరిపుష్ఠిగా, ఆరోగ్యవంతంగా ఉంటాయని, కానీ ఇందుకు భిన్నంగా బొక్కలు తేలి, బక్కచిక్కి కనపడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గోశాలలో బక్కచిక్కి, బొక్కలు తేలిన గోవుజాగ్రత్తలు తీసుకుంటున్నాం నాచగిరి క్షేత్రంలోని గోశాలలో 26 వరకు ఆవులు, కోడెలు, దూడెలున్నాయి. ఆలయ పశుగణం సంరక్షణకు ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాం. పశువుల కాపరి కేవలం పశువుల రక్షణకే పరిమితం చేస్తూ ఆదేశించాం. అతనికి ఎలాంటి అదనపు బాధ్యతలు లేవు. నిరంతరం పశు సంరక్షణలోనే ఉండాలని, ఉదయం, సాయంత్రం మేతకోసం తీసుకెళ్లాలని నిర్దేశించాం. – విజయరామారావు, నాచగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
తొగుట(దుబ్బాక): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం మండలంలోని పెద్ద మాసాన్పల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రంతో పాటు నాయకులను ఎంపీ సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. ముత్యాల పోచమ్మ ఉత్సవాల్లో.. దుబ్బాక: దైవనామస్మరణతోనే సుఖసంతోషాలతో ఉంటామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. దుబ్బాక పట్టణంలో బాబు జగ్జీవన్రామ్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న ముత్యాల పోచమ్మ ఉత్సవాల్లో ఆదివారం ఎంపీ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్,సంఘం నాయకులు పాల్గొన్నారు. జాతీయ యోగా జడ్జిగా సంధ్య ప్రశాంత్నగర్(సిద్దిపేట): పంజాబ్లో నిర్వహించిన నేషనల్ జడ్జి ట్రైనింగ్లో జిల్లా కేంద్రానికి చెందిన తోట సంధ్య పాల్గొని అర్హత సాధించినట్లు యోగాసన భారత్ ప్రధాన కార్యదర్శి జయదీప్ ఆర్య ఆదివారం తెలిపారు. జాతీయ యోగా జడ్జిగా పూర్తి చేసుకున్న తోటసంధ్యను రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్, జిల్లా అధ్యక్షుడు తోట అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. డీబీఎఫ్ జిల్లా కార్యదర్శిగా వేణు గజ్వేల్: పట్టణానికి చెందిన బ్యాగరి వేణు డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సిద్దిపేటలో జరిగిన డీబీఎఫ్ మహాసభల్లో వేణు ఎన్నికను ఖరారు చేశారు. తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడంపై ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఇతర నాయకులకు వేణు కృతజ్ఞతలు తెలిపారు. -
మృగశిర మురిపెం
చేపల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట ● అధిక ధరలకు విక్రయందుబ్బాక: జిల్లాలో మృగశిర కార్తె సందడి నెలకొంది. చేపలకు డిమాండ్ పెరిగింది. మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలు తింటే ఏడాదంతా ఆస్తమా ఇతర శ్వాసకోశ వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం. దీంతో ఆదివారం చేపలు కొనేందుకు మార్కెట్లలో ప్రజలు బారులు తీరారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో చేపల కొనుగోళ్లతో సందడి కనిపించింది. ప్రజలు ఇష్టపడే కొర్రమీను అంతంత మాత్రమే రావడంతో వచ్చిన కొన్నింటిని ధర ఎక్కువైనా పోటీపడి కొనుగోలు చేశారు. కొర్రమీనులకు రూ.600 నుంచి రూ. 800 వరకు ధర పలికింది. బంగారుతీగలు, రవ్వ, బొచ్చ, గురిజలు, జెల్లలతో పాటు పలు రకాల చేపలను కొన్నారు. మిగతా రోజుల్లో రూ.100 ఉన్న చేపలు మృగశిర సందర్భంగా రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించారు. జిల్లాలో 90 శాతం పైగా చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో చేపలు పుష్కలంగా పెరిగాయి. అయినా మృగశిర రోజు డిమాండ్ పెరగడంతో అధిక ధరలకు విక్రయించారు. -
విద్యాధరి, నాచగిరిలో.. భక్తుల కిటకిట
వర్గల్ విద్యాసరస్వతి, నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతిమాత సన్నిధిలో పెద్దసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీ స్సులు పొందారు. మరోవైపు నాచగిరి క్షేత్రంలో స్వాతి నక్షత్ర మహోత్సవ వేడుకలు జరిగాయి. సుదర్శన హోమం నిర్వహించారు. – వర్గల్(గజ్వేల్)మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులుకొమురవెల్లి మల్లన్న కేత్రం ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వేకువ జామునుంచే మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు బారులుతీరారు. దర్శనం అనంతరం గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు నెలకొల్పనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ భారత్ మిషన్– గ్రామీణ్ కింద రూ. 61.28కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం వాటా 40శాతం ఉండనుంది. ఈ నిధులకు వివిధ టార్గెట్లను నిర్ణయించారు. ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో డీఆర్డీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. – సాక్షి, సిద్దిపేట● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 జీపీలకు రూ.61కోట్లు ● 11 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు మంజూరు ● ఓడీఎఫ్ దిశగా నూతన పంచాయతీలు పల్లెల్లో తొలిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు 11 మంజూరు చేశారు. ఒక్కోదానికి రూ.64లక్షల చొప్పున రూ.7.04కోట్లను కేటాయించారు. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వివిధ రకాల వస్తువులను తయారు చేయనున్నారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్, రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం కానీ, ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం చేయనున్నారు. కాలుష్యంను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 19వేల మరుగుదొడ్లు మంజూరు ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.12వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు 19,806 వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.23.76 కోట్లను మంజూరు చేశారు. పర్యాటక ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు అవసరమైన చోట్ల 53 శానిటేషన్ కాంప్లెక్స్లను రూ.1.59కోట్లతో నిర్మించనున్నారు. ● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు ఉమ్మడి మెదక్ జిల్లాకు 53 కేటాయించారు. ఒక్కోదానికి రూ.3లక్షల నిధులు మంజూరు చేశారు. ఇందులో నిధులు ఎస్బీఎం నుంచి 70శాతం, 15వ ఆర్థిక సంఘం నిధులు 30శాతం మంజూరు చేయనున్నారు. 50 నూతన పంచాయతీల్లో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,633 గ్రామ పంచాయతీలలో నూతనంగా 50 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. నూతనంగా మెదక్లో 24, సంగారెడ్డిలో 11, సిద్దిపేటలో 15 గ్రామ పంచాయతీలను బహిరంగ మలమూత్రవిసర్జన రహిత గ్రామాలుగా తయారు చేయడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు.పల్లెల్లో రీసైక్లింగ్జిల్లాల వారీగా చేపట్టే పనులు యూనిట్లు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మొత్తం నిధులు వ్యక్తిగత మరుగుదొడ్లు 1,200 15,606 3,000 రూ. 23.76కోట్లు ఇంకుడు గుంతలు 5,744 7,390 5,931 రూ. 12.39కోట్లు సామూహిక ఇంకుడు గుంతలు 898 1,091 876 రూ. 15.70కోట్లు సిగ్రిగేషన్ షెడ్లు 24 11 15 రూ. 80లక్షలు మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వేస్ట్ 03 04 04 రూ. 7.04కోట్లు పారిశుద్ధ్య సమూహాలు 15 19 19 రూ. 1.59కోట్లుప్రతిపాదనలు రూపొందిస్తున్నాం ఎస్బీఎంలో మంజూరైన నిధులకు టార్గెట్కు అనుగుణంగా గ్రామాల వారీగా ప్రతిపాదనలు తెప్పిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంపికలు కాగానే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తాం. ఆగస్టులోగా పనులు పూర్తి అయ్యేలా ముందుకు సాగుతున్నాం. అలాగే కొత్తగా ఏర్పాటైన గ్రామాలను ఓడీఎఫ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం. –జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట -
● మృగశిర కార్తె ఆరంభం నుంచే విక్రయాల సందడి ● ఆస్తమా, ఉబ్బసం వ్యాధులు దరిచేరవని ప్రజల నమ్మకం
పుల్కల్(అందోల్): మృగశిర కార్తె ఆరంభం రోజే చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు రావని చాలామంది నమ్ముతుంటారు. ఆదివారం మృగశిర ప్రారంభం కావడంతో చేపలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఇక జిల్లాలో సింగూరు చేపకున్న డిమాండ్ అయితే చెప్పనవసరం లేదు. పసందుగా చేప.... జిల్లాలో ఉన్న ఏకై క భారీ నీటిపారుదల సింగూరు బహుళార్థసాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజలకు, జంట నగరాల ప్రజలకు తాగునీటిని, స్థానికంగా సాగునీటిని అందిస్తుంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మత్స్యకారులకు ఉపాధిని కల్పించి వారి జీవితాల్లో సిరులు పూయిస్తుంది. ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకుని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగూరు డ్యాంలో పెరిగే చేపలు రుచికరంగా ఉంటాయని చేప ప్రియులు చెబుతుంటారు. ఇక్కడ పెరిగిన చేపలు హైదారాబాద్తోపాటు, జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ఇష్టంగా తింటారు. ప్రాజెక్టుకు వచ్చిన పర్యాటకులు చాలామంది చేపలు కొని తీసుకెళ్తారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వమే చేప పిల్లల విడుదల... సింగూరు భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వమే చేప పిల్లలను విడుదల చేస్తుంది. ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలను, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. దీంతో ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు చాలామంది చేపల వృత్తిని ఎన్నుకుని ఉపాధి పొందుతున్నారు. జోరుగా విక్రయాలు మత్స్యకారులు పట్టిన చేపలను కొందరు వ్యాపారులు ఆటోల్లో తరలించి సమీప పట్టణాల్లో విక్రయిస్తారు. స్థానికులు మాత్రం అక్కడే ప్రాజెక్టు సమీపంలో షెడ్లు వేసుకుని విక్రయాలు చేపడతారు. మృగశిర నాడు ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయాలు చేపడతారు. ప్రస్తుతం డ్యాంలో 18 టీఎంసీల వరకు నీరు ఉండటంతో చేపల సంపద వృద్ధి చెందుతుంది. ప్రతీ ఊళ్లో విక్రయాలు గ్రామాల్లో చెరువుల్ని మత్స్యకారులకే ప్రభుత్వం అప్పగించి, చేప పిల్లలు సరఫరా చేయడంతో ఊరూరా చేపల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో జీవించే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. సాధారణ చేపలు కిలో రూ.150 కాగా కొర్రమీను లాంటి రకాలు కిలో రూ.350కు విక్రయిస్తారు. మృగశిర నాడు మాత్రం రెట్టింపు ధరలతో విక్రయిస్తారు.చేపలు పట్టడమే జీవనాధారం సింగూరు డ్యాంలో చేపలు పట్టి వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి చేపల వేట ప్రధాన జీవనాధారం. ప్రభుత్వం మత్స్యకారులకు లైసెన్స్లు ఇచ్చి పలు ప్రోత్సాహకాలిస్తుంది. పట్టిన చేపల్లో కొన్ని స్థానికంగా విక్రయించి మిగతావి వ్యాపారులకు హోల్సేల్ ధరలకు సరఫరా చేస్తాం. –టేకు లక్ష్మణ్ (మత్స్యకారుడు,సింగూరు) మార్కెట్ ఏర్పాటు చేయాలి ప్రాజెక్టులో మత్స్యకారులు మూడు దశాబ్దాలుగా చేపలు పట్టి ఉపాధి పొందుతున్నారు. చేపల మార్కెట్ లేక మత్స్యకారులు దళారులకు సరఫరా చేస్తున్నారు. స్థానికంగా చేపల మార్కెట్ ఏర్పాటుచేయాలి. మత్స్యశాఖకు పట్టున్న సింగూరులో మార్కెట్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. –నందికంటి శ్రీనివాస్ (సింగూరు మత్స్యకార సంక్షేమ సంఘం, అధ్యక్షుడు) -
బంగారు భవిష్యత్తుకుప్రభుత్వ బడుల్లో చేర్పించండి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి సిద్దిపేటరూరల్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బుస్సాపూర్లో నిర్వహించిన బడిబాటలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. వారానికి 3 సార్లు గ్రుడ్లతో కూడిన పౌష్టికాహారం, ఉదయం సమయాల్లో రాగిజావ అందించడమే కాకుండా విశాలమైన ఆటస్థలం, సైన్స్, కంప్యూటర్ల్యాబ్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంఈఓ రాజిరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి సిద్దిపేట ఎడ్యుకేషన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆఫ్ మారథాన్ రన్నింగ్ పోటీల వాల్ పోస్టర్ను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం నడకతో పాటు రన్నింగ్ చేయాలని సూచించారు. రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్నింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ 5కె, 10కె, 21కె (ఆఫ్ మారథాన్) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9885886368 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు.మాజీ దళ నాయకుడు మృతి కొండపాక(గజ్వేల్): పీపుల్స్వార్ గిరాయి పల్లి మాజీ దళ నాయకుడు కోటగల్ల పోశయ్య(66) ఎలియాస్ రాజన్న శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. మర్పడ్గ మధిర నాగిరెడ్డిపల్లికి చెందిన పోశయ్య 40 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యునిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1987లో దళ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో మూడేళ్ల పాటు పని చేశారు. తరువాత హైదరాబాద్లో కొరియర్గా పని చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురై పోలీసులకు లొంగిపోయారు. దళ నాయకుడిగా పని చేసిన రోజుల్లో భూస్వాముల, పెత్తందారుల ఆగడాలపై, ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం చేశారు. -
సేద్యంలో రైతే శాస్త్రవేత్త
హుస్నాబాద్: వ్యవసాయ సేద్యంలో రైతే పెద్ద శాస్త్రవేత్త అని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండ రెడ్డి మాట్లాడుతూ ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి తెచ్చి రైతుల ఇక్కట్లను దూరం చేస్తున్నారన్నారు. అలాగే నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయన్నారు. త్వరలో రైతుకు విత్తన హక్కు కల్పించే విధంగా విత్తన చట్టం తీసుకువచ్చేందుకు కమిటీలు వేశామని తెలిపారు. పసుపు రైతులు యాంత్రీకరణ దిశగా ఆలోచించాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలు వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. రైతుకు కులం, మతం లేదని అందరి వాడని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు. భూ పరీక్ష చేసుకొని అనుకూలమైన పంటలు వేయాలని సూచించారు. మంచి విత్తనాలు అందిస్తాం సీడ్ కార్పొరేషన్ ద్వారా మేలైన విత్తనాలు అందిస్తున్నామని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ కంపెనీల ప్రచారాలకు మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని, అయినా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. పంట మార్పిడి చేసి దిగుబడి సాధించుకోవాలన్నారు. యంత్ర పరికరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. త్వరలో ఆదర్శ రైతు వ్యవస్థ,విత్తన చట్టం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిసద్వినియోగం చేసుకోండి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకురావడానికే రైతు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఎవరైనా ఈఎంఐ కింద రుణాలు పొంది యంత్రాలు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భవానీ రెడ్డి, కేవీఎన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముందస్తు పత్తి విత్తు
భారీ వర్షాల కోసం ఎదురుచూపు ● నైరుతి రాకతో పదిహేను రోజుల నుంచే విత్తన ప్రక్రియ ● సాగు అంచనా 1.11లక్షల ఎకరాలు ● అంతా నల్లరేగడి భూముల్లోనే.. ● మద్దతు ధర పెంపుతో పెరగనున్నసాగు విస్తీర్ణం జిల్లాలో పత్తి విత్తనాలు ముందస్తుగా వేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. నైరుతి రాకతో పదిహేను రోజుల నుంచే నల్లరేగడి భూముల్లో పత్తి విత్తన ప్రక్రియ జోరందుకుంది. నిజానికి ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి భారీ వర్షం కురవకపోయినా, నల్ల రేగడి భూములు బెట్టను తట్టుకునే అవకాశమున్నందువల్ల ఈ భూముల్లో మొదటగా పత్తిని విత్తుకుంటున్నారు. సహజంగా ఏటా ఇదే జరుగుతుండగా, ఈసారి ఈ పరిస్థితి మరింతగా ఊపందుకుంది. కొన్ని రోజులుగా వర్షాలు ముఖం చాటేయంతో తాము వేసిన విత్తనం మొలుస్తుందో లేదోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 5.50లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇందులోభాగంగానే పత్తి 1.11లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తుందని భావిస్తున్నారు. గతేడాది 1.04లక్షల ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చిన ఈ పంట ఈసారి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అంచనా విస్తీర్ణంలో ఇప్పటికే సుమారుగా 30శాతానికిపైగా అంటే 35వేల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చిందని అంచనా. ఇంకా విస్తారంగా వానలు కురవలేదు. నైరుతి రావడంతో మే మూడో వారం నుంచే పత్తి విత్తనాలు వేస్తున్నారు. ప్రత్యేకించి నల్లరేగడి భూముల్లో విత్తనాలు జోరుగా వేస్తున్నారు. వర్షాలు కాస్తా లేటయినా భూములు బెట్టను తట్టుకునే అవకాశమున్నందువల్ల పత్తి విత్తన ప్రక్రియ జోరుగా సాగుతోంది. మద్దతు ధర పెంపుతో.. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈసారి పత్తికి మద్దతు ధర రూ.8,110ను ప్రకటించింది. ఇందులో మీడియం స్టేపుల్కు రూ.7,710, లాంగ్ స్టేపుల్కు రూ.8,110ధరగా నిర్ణయించిన సంగతి తెల్సిందే. గతేడాదితో పొలిస్తే రూ.580 అదనం. దీంతో రైతులు పత్తివైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అనావృష్టి ఏర్పడే సందర్భంలో బెట్ట పరిస్థితులను తట్టుకునే విత్తన రకాలు పత్తిలో ఎక్కువగా అందుబాటులోకి రావడం వల్ల కూడా రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తిని సాగు చేస్తే పెట్టుబడులు పోనూ ఎంతో కొంత మిగులుబాటు ఉంటుందని భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. రైతులు తొందరపడొద్దు భూమిలో సమృద్ధిగా పదును వచ్చిన తర్వాతే పత్తి విత్తనాలు వేసుకోవడం మంచిది. లేనిపక్షంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు ఇప్పటికై నా తొందరపడకుండా భారీ వర్షాలు వచ్చాకే విత్తనం వేసుకోవాలి. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారిభక్తిశ్రద్ధలతో బక్రీద్ వానల కోసం.. జిల్లాలో మే నెలకు సంబంధించి 23.1మి.మీల సాధారణ వర్షపాతానికి 138.9మి.మీల వర్షపాతం నమోదయ్యింది. జూన్ నెలలో 95.9మి.మీల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు కేవలం 3.3మి.మీల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. మే రెండు, మూడో వారాల్లో కురిసిన వర్షాలకు రైతులు పత్తి విత్తనాలను వేయడం ప్రారంభించారు. విత్తనాలు వేసిన తర్వాత పది రోజులగాకుపైగా వర్షాలు ముఖం చాటేయడంతో, వేసిన విత్తనం మొలుస్తుందో లేదోనని రైతుల్లో కలవరం మొదలైంది. భారీ వర్షాలు కురుస్తేనే రైతుల దిగులుకు తెరపడే అవకాశం ఉంది. -
మానవ అక్రమ రవాణాను అరికడదాం
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): మానవుల అక్రమ రవాణాను అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్ ఆన్ చైల్డ్ సేఫ్టీ సెక్యూరిటీ పేరుతో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ రోజూ ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల పేరుతో విదేశాలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రతి మహిళ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి రక్షించాలన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ 29 ఏళ్లుగా డాక్టర్ సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 29,200 మంది బాలికలు, యువతులు, మహిళలను కాపాడి పునరావాసం కల్పించారన్నారు. అనంతరం కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టడంలో అందరు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి గ్రామాలలో కమ్యూనిటీ విజిటింగ్ గ్రూప్లను ఏర్పాటు చేయడంతో అందరూ అప్రమతంగా ఉంటారన్నారు. అక్రమ రవాణాకు గురైన వారు పిల్లలు శ్రమ, లైంగిక దోపిడీకి గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ ఉపాధ్యాయులు
జిల్లాలో నేటి నుంచి బడిబాట ● ఈ నెల 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు ● సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం ● గతేడాది 8,042 మంది చేరిక ● ఈసారి మరింత పెంచేలా కార్యాచరణ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సర్కారు బడులను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెల 19 వర కు కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్య క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు. గత ఏడాది బడిబా ట ద్వారా 8,042 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఈసారి ఈ సంఖ్యను మరింతగా పెంచేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి బడిబాట నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బడిబాటపై అవగాహన ర్యాలీ, బడీడు పిల్లలను గుర్తించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల జాబితాను సిద్ధం చేసి, గ్రామ విద్యార్థి రిజిస్టర్లో నమోదు చేస్తారు. అలాగే అంగన్వాడీ, ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించనున్నారు. వీరిని భవిత కేంద్రాలు, ప్రత్యేక వనరుల కేంద్రాలలో పేర్లను నమోదు చేయనున్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యాక.. ఈ నెల 12న నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పాఠశాలను సుందరంగా అలంకరించనున్నారు. అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకా లు, నోట్బుక్స్, యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. గతేడాది పాఠశాల హాజరు, విద్యా ప్రదర్శ న, సహపాఠ్య, సహాయ కార్యక్రమాలు, క్రీడలు మొదలైన వాటిలో మంచి ప్రదర్శన చూపిన విద్యా ర్థులకు బహుమతులు అందించనున్నారు. సామూహిక అక్షరాభ్యాసాలు నూతనంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఈ నెల 13న సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు. అదేవిధంగా మిగతా విద్యార్థులకు క్రీడా పోటీలు, క్విజ్ పోటీలు, నైపుణ్య పరీక్షలు, చిత్రలేఖనం, నాటకాలు నిర్వహిస్తారు. డిజిటల్ విద్యాభ్యాసం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, కిచెన్ గార్డెన్, బాలసభ నిర్వహణ, పాఠశాల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.విద్యార్థుల సంఖ్య పెంచుతాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రతి ఏటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు, ఏఐ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. – రంగనాథ్, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి, సిద్దిపేటబాలికలకు కూడా.. బాలురే కాకుండా బాలికలకు కూడా సమానంగా విద్యను అందించే విధంగా రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాలికలకు మార్గదర్శకత, ఇతర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వివిధ రంగాల్లో రాణిస్తున్న బాలికలు, మహిళలను సన్మానించనున్నారు. -
ప్లాస్టిక్ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టి అవగాహన కల్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జంతుశాస్త్ర విభాగం ఇన్చార్జి హేమలత మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్ మాట్లాడుతూ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అని నినదిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాలన్నారు. అలాగే సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, మన సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. – సిద్దిపేట జోన్/సిద్దిపేటఎడ్యుకేషన్/ప్రశాంత్నగర్(సిద్దిపేట) నేను సైతం.. ఊరిలో ఎవరికి అడ్డుగా ఉందనో.. లేక మరే కారణంతోనో పెద్ద రావిచెట్టు కొమ్మలన్నీ నరికేసి మోడు చేశారు. కొమ్మలన్నీ ఎండిపోయినా.. మొదలు సగానికి పైగా నరికినా.. ఆచెట్టు మాత్రం పర్యావరణానికి నేను సైతం అంటూ చిగురించింది ఇలా.. నంగునూరు మండలం రాజగోపాలపేటలో సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
రైతు మహోత్సవంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ మనుచౌదరి ● కిసాన్ మేళా ఏర్పాట్ల పరిశీలన ● నేటి నుంచి షురూ.. హుస్నాబాద్: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడులు, రాబడిని సాధించేలా మెలకువలను తెలుసుకోవడానికి రైతు మహోత్సవంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపు నిచ్చారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించే కిసాన్ మేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుంచి రైతులు వస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం, సాంకేతికతతో కూడిన వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఆయిల్పామ్ పంటలు ఎలా పండించాలో వర్క్షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులే కాకుండా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాలల నుంచి ప్రొఫెసర్లు, వ్యవసాయ సంబంధిత కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అధికారులందరూ భాగస్వాములు అవుతారని తెలిపారు. నూతన సాంకేతికతపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వం సిద్ధం కిసాన్ మేళాకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలిపారు. వీరితో పాటుగా ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బియ్యం పంపిణీలో ఇబ్బందుల తలెత్తొద్దు హుస్నాబాద్రూరల్: వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పేదలకు మూడు నెలల రేషన్ బియ్యం ఇకేసారి ఇస్తోందని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. గురువారం మహ్మదాపూర్లో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. అలాగే రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని జూన్ నెలలోనే ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్కు సూచించారు. -
మల్లన్నా.. కోడెలకు దిక్కెవరు?
కొమురవెల్లి ఆలయంలో గోశాల లేక అవస్థలు ● మూడేళ్లలో 100 కోడెలను అందజేసిన భక్తులు ● చేసేదిలేక ప్రైవేట్కు 81 కోడెలు ● తాత్కాలిక షెడ్లో 15 పశువుల సంరక్షణ ● ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలంటున్న భక్తులు తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఎక్కువగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు, కల్యాణోత్సవంతో మొక్కులు తీర్చుకుంటారు. అలాగే కొందరు కోడెలను సమర్పిస్తుంటారు. అయితే వీటి సంరక్షణ ఆలయ నిర్వాహకులకు కష్టంగా మారుతోంది. ఇందుకు కారణం ప్రత్యేక గోశాల లేకపోవడమే. – సాక్షి, సిద్దిపేట తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కొమురవెల్లికి భక్తులు భారీగా తరలివస్తారు. దేవుడి మొక్కుల కింద కోడెలను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. అలాగే కొందరు కోడెలు కడతామని మొక్కుతారు. దేవాలయానికి రూ.200 చెల్లించి టోకెన్ తీసుకుని అక్కడే ఉన్న కోడెను గుడికి సమీపంలో కట్టేస్తారు. ట్రస్ట్కు కోడెలు కోడెల నిర్వహణ భారంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. కోడెలను ప్రైవేట్ గోశాలకు ఇస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెలను నిర్వహణ చేయకపోతే ఎలా అని అంటున్నారు. దేవాలయానికి గత మూడేళ్లలో 100 కోడెలు భక్తులు సమర్పిస్తే వాటిలో 81 కోడెలు ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగించడం గమనార్హం. నాలుగు కోడెలు మృతిచెందాయి. దేవాలయ సమీపంలోని తాత్కాలిక షెడ్లో 15 కోడెలను సంరక్షిస్తున్నారు. వేములవాడలో కోడెలు మృతిచెందుతుండటంతో కొమురవెల్లిలో ఎలా ఉన్నాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు షెడ్లో నిర్వహణ దేవాలయం సమీపంలోని ఒక షెడ్లో కోడెలను సంరక్షిస్తున్నారు. తక్కువ స్థలంలో షెడ్ ఉండటంతో కొన్నింటినే ఉంచుతున్నారు. దేవాలయానికి ప్రతీ ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఆ స్థలాల్లో కొంత భాగం గోశాల నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయ సమీపంలో గోపూజ చేసుకునేందుకు మండపం ఏర్పాటు చేయాలన్న విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటకై నా దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక గోశాలను నిర్మించాలని, కోడెలను ప్రైవేటుకు అప్పగించకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. అనుమతి కోరుతాం దేవాలయాలనికి సంబంధించిన ఎకరం భూమిలో గోశాల ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అనుమతి కోసం ఉన్నతాధికారులకు లేఖ రాస్తాం. అనుమతి రాగానే నిర్మాణం ప్రారంభిస్తాం. తోట బావి లేదంటే, కమాన్ దగ్గర, లేక మెయిన్ రోడ్ దగ్గర స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కోడెలను సంరక్షిస్తున్నాం. –అన్నపూర్ణ, ఈఓ, కొమురవెల్లి దేవాలయం . కోడెల వివరాలిలా.. సంవత్సరం వచ్చిన గోవులు ట్రస్ట్కు ఇచ్చినవి చనిపోయినవి 2023 16 – – 2024 54 61 03 4 జూన్ 2025 30 20 01 -
రైతు మహోత్సవానికి రారండీ..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025రేపటి నుంచి హుస్నాబాద్లో కిసాన్ మేళా● వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ ఏర్పాట్లు ● ఆధునిక వ్యవసాయ పరికరాలు, విత్తనాలపై అవగాహన ● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● హాజరు కానున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్, పొంగులేటి, కొండా సురేఖ ● వేలాదిగా తరలిరానున్న రైతులుసద్వినియోగం చేసుకోండి మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారిహుస్నాబాద్: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను హుస్నాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హాజరుకానున్నారు. 108 స్టాళ్లు.. కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫెస్టిసైడ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్పామ్, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అలాగే అభ్యుదయ రైతుల సక్సెస్ స్టోరీలను వివరించనున్నారు. 10వేల మంది రైతుల తరలింపు కిసాన్ మేళా కార్యక్రమానికి జిల్లా నుంచి 10 వేల మంది రైతులను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. 6న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి, 7న సిద్దిపేట, చేర్యాల డివిజన్ల నుంచి, 8న దుబ్బాక, గజ్వేల్, ములుగు డివిజన్ల నుంచి రైతులను కిసాన్ మేళాకు తరలించనున్నారు. -
అక్రమాలకు ఐదేళ్లు.. రికవరీకి ఎన్నాళ్లు?
పట్టణ సమైక్యలో రూ.17 లక్షలు గోల్మాల్ ● 2021లోనే అవకతవకలు గుర్తింపు ● నేటికీ జప్తు చేయని అధికారులు ● నష్టపోతున్న మహిళా సంఘ సభ్యులు పట్టణ సమైక్యలో అవకతవకలు జరిగినా డబ్బులు రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. ఐదేళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళా సంఘ సభ్యులు నష్టపోవాల్సి వస్తోంది. సిద్దిపేట పట్టణంలో మెప్మాలో పని చేస్తున్న అధికారుల హస్తంతోనే అక్రమాలు జరగడంతో రికవరీ కాకుండా చూస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి డబ్బులు రికవరీ చేయాలని బాధితులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 2,150 మహిళా సంఘాలుండగా 23,250 మంది సభ్యులున్నారు. కో ఆపరేటివ్ యాక్ట్ ద్వారా 64 స్లమ్ లెవల్ ఫెడరేషన్(ఎస్ఎల్ఎఫ్) మహిళా సమైక్యలు ఏర్పాటు చేసి రిజిస్టర్ చేశారు. ఈ స్లమ్ సమైక్యలు అన్నింటిని కలిపి మహిళా సంఘాలు టౌన్ లెవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. దీనిలో ప్రతీ సభ్యురాలు నెలకు రూ.10 చొప్పున జమ చేశారు. ఇలా జమ అయిన డబ్బులను అప్పుగా ఇస్తుంటారు. ప్రతీ ఏడాది ఉన్నతాధికారులు అడిట్ నిర్వహిస్తారు. 2021లో అవకతవకలు పొదుపు డబ్బులతో అంతర్గత అప్పులను అధ్యక్షురాలు, కోశాధికారి, ప్రధానకార్యదర్శి ఆమోదంతో ఇస్తుంటారు. అప్పుడు ఉన్న అధ్యక్షురాలు, ఇటీవల సరెండర్ అయిన టీఎంసీ ఇద్దరు కలిసి అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఎవరికి సంబంధం లేకుండా మెప్మా సిబ్బంది, మహిళలకు చెక్కులను అందజేశారు. అప్పట్లో ఆరోపణలు రావడంతో అప్పుడు ఉన్న సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆదేశిస్తే జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో 2018–19, 2019–20, 2020–21లలో మూడు సంవత్సరాలు ఆడిట్ చేశారు. దీంతో దాదాపు రూ.17లక్షల వరకు సంఘం సభ్యులు కానీ వారికి చెక్ల రూపంలో డబ్బులు ఇచ్చినట్లు తేలింది. టీఎంసీ పాత్రతో.. 2021లో జరిగిన అవకతవకల్లో టీఎంసీ పాత్ర ఉండటంతో రికవరీ చేయకుండా చూశారని విశ్వసనీయ సమాచారం. ఇటీవల సిద్దిపేట మున్సిపాలిటీ టీఎంసీ (టౌన్ మిషన్ కో ఆర్డినేటర్) సంఘ సభ్యుల తొలగింపుల్లో అక్రమాలకు పాల్పడటంతో మెప్మా డైరెక్టర్కు అదనపు కలెక్టర్ సరెండర్ చేశారు. ఇప్పటికైనా టీఎల్ఎఫ్లో జరిగిన గోల్మాల్ నిగ్గు తేలాలంటే మెప్మా డైరెక్టర్, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి డబ్బులను రికవరీ చేయాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. -
పూర్తి హక్కులు పొందేందుకే భూభారతి
● కలెక్టర్ మనుచౌదరి ● ఖమ్మంపల్లిలో రెవెన్యూ సదస్సు కొండపాక(గజ్వేల్): భూములపై రైతులు పూర్తి హక్కులు పొందేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. కొండపాక మండలం ఖమ్మంపల్లిలో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలో అనర్హులకు అవకాశం కల్పించారని, పంపిణీ చేయగా మిగిలిన 19 ఇళ్లను అర్హులకు దక్కేలా చూడాలని పలువురు కలెక్టర్ను కోరారు. ఖమ్మంపల్లి పంచాయతీని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని, ఖమ్మంపల్లి నుంచి ఎన్సాన్పల్లి మీదుగా సిద్దిపేటకు వెళ్లేందుకు ఏళ్ల కిందట వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ప్రయాణానికి ఆటంకంగా మారిందని, అనుకూలంగా మార్చాలని, గోదావరీ నదీ జలాలతో చెర్వు నిండేలా చూడాలంటూ కలెక్టర్కు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చూడటం కోసమే భూ భారతి చట్టాన్ని అమలు చేసిందన్నారు. ఈనెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తుల్లో వచ్చిన భూ సమస్యల అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యాక్రమంలో ఆర్డీఓ చంద్ర కళ, తహసీల్దార్ శ్యాం, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
సిద్దిపేటరూరల్: పర్యావరణ పరిరక్షణపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ పోస్టర్ను బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భావితరాలకు మంచి గాలి, నీరు, నేలను అందించే వారమవుతామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ ఆర్సీపురం సహాయ పర్యావరణ శాస్త్రవేత్త టి. రవీందర్ పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
● అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం ● సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ● గజ్వేల్లో సీపీఐ మహాసభలు గజ్వేల్: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. బుధవారం స్థానిక కోలాఅభిరామ్ గార్డెన్స్లో మండల స్థాయి 17వ మహాసభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంద పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడితుల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై, మేధావులపై ఉప చట్టాలను ప్రయోగించి జైళ్లల్లో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇందులోభాగంగానే ‘ఆపరేషన్ కగార్’ను అమలుచేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహాసభల్లో సీపీఐ గజ్వేల్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
జీతం.. మహాప్రభో
● వేతనాల కోసం కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరీక్షణ ● నాలుగు నెలలుగా అందక వెతలు చేర్యాల(సిద్దిపేట): వారంతా 2008 డీఎస్సీలో అర్హత సాధించారు. కానీ పోస్టింగ్ రావడంలో ఆలస్యమైంది. 16 ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకుంది. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుంది కనుక ఆర్థిక భరోసా ఉంటుందని నమ్మిన ఆ ఉపాధ్యాయులు ఉద్యోగంలో చేరారు. అయితే చేరి నాలుగు నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరారు. విద్యాశాఖ అధికారులు వారిని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. కానీ విద్యా సంవత్సరం చివరి రోజునే ఆ ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసింది విద్యాశాఖ. టెర్మినేషన్లో చొరవ చూపిన విద్యాశాఖ అదికారులు, ప్రభుత్వం వేతనాల చెల్లింపు విషయంలో మాత్రం జాప్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంకో వారం రోజుల్లో బడులు తెరుస్తారు. ఇప్పటికైనా పాత జీతాలు చెల్లిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. పోషణ కష్టంగా ఉంది పదహారేళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో ఆశతో ఉద్యోగంలో చేరాం. కానీ నాల్గు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. టెర్మినేట్ చేసి వేతనాలు ఇవ్వకపోయినా నిబద్దతతో ఇటీవల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలి. –పోతుగంటి శ్రావణ్కుమార్,ఎంపీపీఎస్, కాశగుడిసెలు వేతనాలివ్వాలి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో చేరాను. కానీ నాలుగు నెలలు గడిచినా వేతనాలు ఇవ్వలేదు. మమ్ములను మాత్రం ఏప్రిల్ 23న టెర్మినేట్ చేశారు. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను టెర్మినేట్ చేసిన మూడు రోజుల్లో విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకుని వేతనాలు చెల్లించాలి. –కె.రమాదేవి, ఎంపీయూపీఎస్, వల్లంపట్ల పెండింగ్లో ఉన్నాయి 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. ఆర్థిక శాఖ పరిధిలో ఫైలు ఉంది. త్వరలో వస్తాయి. – శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కోర్టు ఆవరణలో ఆమె పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పరిరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, మురళీ మోహన్, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీబెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రాథమిక ఆస్పత్రిని బుధవారం సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వసతులను, ల్యాబ్, గదులను పరిశీలించారు. ఓపీ, పేషంట్ల వివరాలు తెలుసుకున్నారు. పదవీ విరమణ పొందిన తాత్కాలిక ఉద్యోగి లచ్చవ్వను ఈ సందర్బంగా సన్మానించారు. కార్యక్రమంలో డిప్యుటీ డీఎంహెచ్ఓ ఆనంద్, వైద్యాధికారి మాధురి, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. -
● ఎంట్రెన్స్కు నోటిఫికేషన్ విడుదల ● జూలై 29 వరకు దరఖాస్తుల స్వీకరణ ● డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష
నవోదయ పిలుస్తోంది వర్గల్(గజ్వేల్): జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష కోసం జూలై 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం ఐదవ తరగతి చదువుతూ ఉండాలని, తల్లిదండ్రులు ఉమ్మడి మెదక్ జిల్లా నివాసులై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థి 2014 మే1– 2016 జూలై31 మధ్య జన్మించి ఉండాలని వివరించారు. ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం, ఫొటోతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు. వివరాల కోసం https//navodaya.gov.in సందర్శించాలన్నారు. -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ మనుచౌదరిసిద్దిపేటఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అంతేకాక త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికిరణ్, డిప్యూటీ తహసీల్దార్ ఉదయశ్రీ, ఆర్ఐ బాలయ్య, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం మండలంలోని చిట్యాల, శభాష్గూడెం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయన్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులలో స్వీకరించి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరించనున్నామన్నారు. మొదటి రోజు చిట్యాలలో 91, శభాష్గూడెంలో 21 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్నాయక్, ఆర్ఐ రాజెందర్రెడ్డి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దూల్మిట్ట మండల కేంద్రంలో.. మద్దూరు(హుస్నాబాద్): గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం దూల్మిట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్సింగ్ సర్వేనంబర్లు, సాదాబైనామాలు, పీఓటీ, తదితర సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే సలాఖపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 40 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ రహీం తెలిపారు. కార్యక్రమంలో దూల్మిట్ట తహసీల్దార్ మదుసూధన్ తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫాం అందేనా?
తొమ్మిది రోజుల్లో స్కూల్స్ పునఃప్రారంభం ● ఇటీవలే వచ్చిన వస్త్రం ● జిల్లాకు 3.45 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ● ఇప్పటి వరకు చేరింది 1.75లక్షల మీటర్లే ● త్వరగా అందించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు సరిగ్గా తొమ్మిది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులందరూ ఒకే యూనిఫాం ధరించడం వల్ల మరింత క్రమశిక్షణ అలవడుతుందన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా ప్రభుత్వం ఏకరూప దుస్తులను అందజేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే దుస్తులు పాఠశాలలకు చేరాలి. ప్రారంభమైన రోజునే విద్యార్థులకు అందించాలి. అయితే ఇటీవలే వస్త్రం వచ్చింది. దీంతో పాఠశాలల ప్రారంభం రోజే అందించడం గగనమే. – సాక్షి, సిద్దిపేట జిల్లాలోని 941 ప్రభుత్వ పాఠశాలల్లో 78,643 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో బాలురు 37,178, బాలికలు 41,465 ఉన్నారు. 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4, 5వ తరగతుల వారికి స్కర్ట్ ఇవ్వనున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రెస్, పైన కోట్. బాలురకు ప్యాంట్, షర్టుల అందించనున్నారు. ఈ ఏడాది సైతం యూనిఫాంలు కుట్టించే బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించారు. ఒక్కో జతకు రూ.75లను ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో 1,230 మహిళా సంఘాలచే కుట్టిస్తున్నారు. 78 వేల మంది విద్యార్థులు.. 78,643 మంది విద్యార్థులకు యూనిఫాంల కోసం 3,45,552 మీటర్ల వస్త్రం అవసరం. ఇప్పటి వరకు మొదటి జతకు సంబంధించి జిల్లాకు 1,72,776 మీటర్ల క్లాత్ వచ్చింది. ఏప్రిల్ 17న ప్యాంట్, బాటమ్ క్లాత్ రాగా, మే 18న షర్టు క్లాత్ వచ్చింది. ఈ క్లాత్ను మండలాల వారీగా వేరు చేసి మే 22వ తేదీ వరకు అందించారు. ఇప్పటికే ప్యాంట్, నెక్కర్, బాటమ్లు కుట్టడం చివరి దశకు వచ్చింది. షర్టులు ఇటీవలనే కుట్టడం ప్రారంభించారు. ప్రారంభం రోజున కలర్ డ్రెస్సేనా? విద్యార్థులందరికీ యూనిఫాంలు కుట్టి ఇవ్వాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. షర్టు క్లాత్ జిల్లాకు ఇటీవలే రావడంతో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజున కలర్ డ్రెస్తోనే హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికై నా డీఆర్డీఏ, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వేగంగా కుట్టే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాం ఇవ్వా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సకాలంలోనే అందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంలు ఈ నెల 5వ తేదీ వరకు అందించాలని టార్గెట్ పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. షర్ట్ క్లాత్ కొంత ఆలస్యంగా వచ్చింది. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాశాఖకు యూనిఫాంలు అందించేందుకు కృషి చేస్తాం. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట మళ్లీ పాత కొలతలే.. విద్యార్థుల వారీగా కొలతలు తీసుకుని వారికి అనుగుణంగా స్కూల్ యూనిఫాంలు కుట్టించాలన్న లక్ష్యంతో స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. కానీ ఈ సారి సైతం తరగతుల వారీగా సైజులు కుడుతున్నారు. ఇలా కుట్టడం వలన కొందరి విద్యార్థులకు వదులుగా, మరికొందరికి టైట్గా ఉంటుండంతో మళ్లీ టైలర్ దగ్గర సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో మళ్లీ టైలర్కు రూ.100 నుంచి రూ.200 తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తోంది. -
నూతనోత్సాహంతో పనిచేయండి
● పోలీసు కమిషనర్ అనురాధ ● ‘ఉత్తమ’ పోలీసులకు అభినందనలు సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పతకాలు పొందిన పొలీస్ సిబ్బంది, అధికారులు ఇదే స్ఫూర్తితో నూతనోత్సాహంతో పనిచేయాలని పోలీసు కమిషనర్ అనురాధ సూచించారు. అవార్డులు పొందిన చేర్యాల సీఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మిస్బావుద్దిన్, మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ దుర్గ, ట్రాఫిక్ ఎస్ఐ రఘులు మర్యాదపూర్వకంగా మంగళవారం సీపీని కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ అనురాధ వారిని అభినందించి, సన్మానించారు. సీపీ మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాల రవాణా, కొనుగోళ్లపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలన్నారు. -
క్రీడలపై యువత దృష్టి సారించాలి
జిల్లా క్రీడాశాఖాధికారి వెంకటనర్సయ్య సిద్దిపేటజోన్: మైదానాలకు యువత రావాలని, అప్పుడే ఉజ్వల భవిష్యత్తు మీ సొంతం అవుతుందని జిల్లా క్రీడల, యువజన శాఖ అధికారి వెంకట నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ ఫుట్బాల్ గ్రౌండ్లో ఇన్విటేషన్ కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా లాంటి మాధ్యమాలకు యువత దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ ఆటకు మంచి డిమాండ్ ఉందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని సూచించారు. అందరి సహకారంతో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో జిల్లాకు మంచి పేరు తెచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు. ఆటల్లో గెలుపు ఓటములను సహజంగా స్వీకరించాలని, క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. అంతకుముందు కామారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, వర్కొల్, రాంరెడ్డి ప్రాంతజట్ల సభ్యులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో కోచ్ అక్బర్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధి సాజిద్, తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయండి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యాపారానికి తెర లేపాయన్నారు. ముందస్తు అడ్మిషన్లు తీసుకోవడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని అన్నారు. ఒక్క పాఠశాలకు పర్మిషన్ తీసుకొని నాలుగైదు చోట్ల బ్రాంచ్లుగా ఏర్పాటు చేసి నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల దోపిడీపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అడ్మిషన్లు పెంచేలా విద్యాధికారులు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను ఆపకుంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, జిల్లా నాయకులు జక్కుల అనిరుద్ , సిద్ధుల సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేటలో బంద్ ప్రశాంతం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వహిందుపరిషత్ మెదక్ సహ కార్యదర్శి గ్యాదరి రాజారాంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్డు, లాల్కమాన్, గాంధీ చౌరస్తా, తదితర ప్రధాన వ్యాపార సముదాయాల ప్రాంతాలు బోసిపోయాయి. సిద్దిపేట సీపీ అనురాధ క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బంద్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంటే అత్యవసర సమయంలో డయల్ 100, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8712667100 కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. వెంటనే సంబంధిత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏది నిజం ఏది అబద్దం ముందుగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బందోబస్తులో ఏసీపీ రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏడు చెక్పోస్ట్లు.. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏడు చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి చౌరస్తాలోని చెక్పోస్ట్ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంగధాంపల్లి చౌరస్తా, సిద్దిపేట రూరల్ పీఎస్ చౌరస్తా, అనంతసాగర్, అక్బర్ పేట భూంపల్లి చౌరస్తా, అనభేరి చెక్పోస్ట్ హుస్నాబాద్, గుర్జకుంట క్రాస్ రోడ్, వంటిమామిడి చౌరస్తాల వద్ద పోలీస్, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో చెక్పోస్ట్లను నిర్వహిస్తున్నామన్నారు. -
త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీలో కష్టపడిన వారిని గుర్తిస్తూ త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అంతకు ముందు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని మీకు అండగా ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, లక్ష్మి, బొమ్మల యాదగిరి, కలీమొద్దిన్, ఎల్లం యాదవ్, ఆనంద్, గోపీకృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
మొదటిరోజే సర్వర్ డౌన్
దుబ్బాక: సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రోజే ఇబ్బందులు తలెత్తాయి. సర్వర్ డౌన్తో స్లాట్ బుకింగ్ కాకపోవడంతో గంటల తరబడి క్రయవిక్రయ దారులు అవస్థలకు గురయ్యారు. జిల్లాలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్లో ఉన్నాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద తొలివిడతలోనే ఏప్రిల్ 10 నుంచి సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, గజ్వేల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్బకింగ్ ప్రక్రియ అమలు చేస్తున్నారు. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తొలిరోజునే సర్వర్ డౌన్తో పాటు కొత్తగా ప్రక్రియ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది తలెత్తింది. కేవలం 70 డాక్యుమెంట్లే.. స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజున జిల్లాలోని ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం 70 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం శోచనీయం. ఇది వరకే స్లాట్ బుకింగ్ ప్రారంభమైన సిద్దిపేట అర్బన్, రూరల్, గజ్వేల్ కార్యాలయాల్లో కొంత వరకు డాక్యుమెంట్లు కాగా, చేర్యాలలో ఒక్కటి కూడా కాకపోగా దుబ్బాకలో కేవలం 3, హుస్నాబాద్లో 5 మాత్రమే అయ్యాయి. స్లాట్ బుకింగ్కు అడ్డంకి రిజిస్ట్రేషన్లకు తప్పనితిప్పలు3 డాక్యుమెంట్లు చేశాం.. సా్లట్ బుకింగ్ విధానం ప్రారంభమైన రోజు 3 డాక్యుమెంట్లు చేశాం. గిఫ్ట్ డీడీతో పాటు 2 మార్టిగేజ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. స్లాట్లు బుకింగ్ చేసుకొని రావడంతో వచ్చిన వారికి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్టేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చాం. క్రయ విక్రయదారులే అన్ని వివరాలతో స్లాట్ బుకింగ్ చేసుకొని రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభ తరం అవుతోంది. – సుగుణశ్రీ, దుబ్బాక సబ్ రిజిస్ట్రార్ -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
హాజరుకానున్న 1,169 మంది విద్యార్థులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 1,169 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లాలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సిద్దిపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్దిపేట, తెలంగాణ మోడల్ స్కూల్ గజ్వేల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ప్రజ్ఞాపూర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.30గంటల వరకు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో 65వ ర్యాంకు కొమురవెల్లి(సిద్దిపేట): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో మండలంలోని అయినాపూర్ విద్యార్థి 65వ ర్యాంకు సాధించారు. గ్రామానికి చెందిన తాళ్లపల్లి పాండురంగం కుమారుడు తాళ్లపల్లి వెంకటేశ్ జేఈఈ అడ్వాన్స్లో సత్తా చాటారు. అంతే కాకుండా గత నెల 11న విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్లోనూ 22వ ర్యాంకు సాధించారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు అతనిని అభినందించారు. రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా లక్ష్మణ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన క్రిస్టోఫర్ స్థానంలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ను ఇన్చార్జిగా నియమిస్తూ కమిషనర్ ఉత్తరులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రవాణాశాఖ పరంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. మల్లన్న సాగర్ను సందర్శించిన ఏసీపీ తొగుట(దుబ్బాక): మండలంలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ను గజ్వేల్ ఏసీపీ నర్సింహు లు సోమవారం సందర్శించారు. పంప్హౌస్, రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, సాగునీరు, తాగునీటి వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని డీఈ చెన్ను శ్రీనివాస్ ఏసీపీకి వివరించారు. అంతకు ముందు లింగాపూర్ శివారు లోని వైష్ణవి కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన ఎక్స్ఫ్లోజీవ్ (డిటోనెటర్లు భద్రపరిచే) గోదాంను ఏసీపీ పరిశీలించారు. గోదాంకు సంబంధించిన అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాములో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. గోదాం వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో తొగుట ఎస్ఐ రవికాంత్రావు పాల్గొన్నారు. దుద్దెడలో తనిఖీలుకొండపాక(గజ్వేల్): దుద్దెడ శివారులోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, పాన్ షాపుల్లో సోమవారం రాత్రి నార్కోటిక్ డాగ్తో తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలతో కూడిన చాక్లెట్స్ రవాణా, విక్రయాలు జరగకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. -
స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం
దుబ్బాకటౌన్: మున్సిపాలిటీలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి తెలిపారు. వానాకాలంలోఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని 100 రోజుల్లో 50 కార్యక్రమాల నిర్వహణ అనే బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టామన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రణాళికలో భాగంగా సోమవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల గుండా స్వచ్ఛత, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి అంశాలపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజు ‘ఒక చర్య– ఒక మార్పు’ అనే నినాదంతో పారిశుద్ధ్యం పనులు నిర్వమిస్తామన్నారు. ప్రతి వార్డులోని కాలనీలో, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో, రహదారుల్లో, మురుగు కాల్వల వద్ద బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమృత మిత్ర 2.0 ద్వారా ఇంటింటికీ తాగునీరు, వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇళ్ల ఆవరణలో, పార్కులు, చెరువు కట్టలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, సంరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి దుబ్బాకలో అవగాహన ర్యాలీ -
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
సిద్దిపేటరూరల్: భూభారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇక జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన, విచారణ చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. భూ యజమానులు, రైతులు వారి భూ రికార్డుల్లో తప్పులు, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం, విస్తీర్ణం సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుంది. జిల్లాలో మొత్తంగా 499 గ్రామపంచాయతీలు ఉండగా 386 రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు కొనసాగనున్నాయి. ప్రజల వద్దకే.. ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న క్రమంలో ప్రజల వద్దకే దరఖాస్తు పత్రాలు అందించనుంది. ఈ మేరకు భూ సమస్యలకు సంబంధించిన బాధితులు దరఖాస్తు పత్రాన్ని తీసుకుని అందులో పూర్తి వివరాలను నింపి అధికారులకు అందజేయాలి. సాధారణ పద్ధతి మాదిరిగా ఎలాంటి తెల్లపేపర్పై దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులకు సమస్యను వివరించి దరఖాస్తు పత్రంలో వివరాలు నమోదు చేసి అందించాలి. తీరనున్న ఇబ్బందులు.. ధరణి, భూ సంబంధిత సమస్యలతో ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు పెట్టుకుంటున్న వారికి రెవెన్యూ సదస్సులు కొంత మేర ఊరట కల్పించనున్నాయి. అధికారులు గ్రామానికి వస్తున్న క్రమంలో ప్రజలు కలెక్టరేట్కు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్ళేందుకు ఆస్కారం లేదు. భూ సమస్యలు ఈ రెవెన్యూ సదస్సులోనైనా పరిష్కారం అవుతాయో ? లేదో? వేచి చూడాల్సిందే.సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మంగా భూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. మండలాల వారీగా ప్రత్యేకాధికారులు, కేటాయించిన తేదీల్లో సదస్సులను నిర్వహిస్తారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు అర్జీలను అందించి పరిష్కరించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. – అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అబ్దుల్ హమీద్ 20వ తేదీ వరకు నిర్వహణ 386 గ్రామాల్లో కార్యక్రమాలుజిల్లా వివరాలు ఇలా.. మండలాలు: 25 గ్రామ పంచాయతీలు: 499 రెవెన్యూ గ్రామాలు: 386 భూ పట్టాధారులు: 3,54,739 పార్ట్ బీలో నమోదైన ఖాతాల సంఖ్య: 5,522 -
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతిరెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా అమలు పరచకపోవడం సరికాదన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేద విద్యార్థులకు 25శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్, బాలనర్సు, స్వామి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట(హుస్నాబాద్): ఇటీవల ఉపాధి హామీ పనులు చేస్తుండగా మరణించిన బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం మృతుల కుటుంబ సభ్యులు కరీంనగర్లో బండి సంజయ్ని కలిసి తమ గోడును విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ.రెండు లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, గోవర్ధనగిరి మాజీ సర్పంచ్ రాములు, మండల అధ్యక్షుడు రామంచ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘వాలీబాల్’ ఎంపికలు సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం అధికారులు ఆదివారం ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. స్ధానిక స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2025–26 క్రీడా సంవత్సర శిక్షణ కోసం అర్హులైన వారికి ఎంపిక చేపట్టారు. వివిధ జిల్లాలోని 94మంది బాలురు, 31మంది బాలికలు హాజరయ్యారు. హైదరాబాద్ క్రీడా సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో సెలెక్షన్స్ జరిగాయి. ఎంపికై న వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లపై దాడులు సరికాదు గజ్వేల్రూరల్: ఫొటో గ్రాఫర్లపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని గజ్వేల్ మండల ఫొటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. మేడిపల్లిలో జరిగిన ఓ వేడుకల్లో ఫొటోగ్రాఫర్పై దాడి చేయడం దారుణమన్నారు. ఈమేరకు ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు, గృహ ప్రవేశాలు, ప్రీవెడ్డింగ్, సాంగ్స్ షూట్, వివాహాల వంటి శుభ కార్యక్రమాల్లో ఫొటోగ్రఫీ ఎంతో ముఖ్యమైనదని, ఈ వృత్తినే నమ్ముకొని ఎంతోమంది జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల ఫోటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేవంత్కు మాటలెక్కువ చేతలు తక్కువ
వర్గల్(గజ్వేల్): రేవంత్ సర్కార్కు మాటలెక్కువ, చేతలు తక్కువ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రోడ్లకు గుంతలు పడితే తట్టెడు మన్నుపోసే పరిస్థితిలేదని, కొత్తవి ఏం రాలేదని, పాత పథకాలకు కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లివస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన తున్కిమక్తలోని చాకలి కనకయ్య కుటుంబాన్ని ఆదివారం కలిశారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేలూరు వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షురాలు సంతోషతో కలసి భార్య, పిల్లలను పరామర్శించారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరపున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. కనకయ్య మృతి బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామని, ఇళ్లు నిర్మింపజేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు అబద్ధపు మాటలతో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వానాకాలం రైతుబంధు పడనేలేదన్నారు. ఇచ్చింది కొసరంత, చెప్పేది కొండంత అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులలో టార్చ్లైట్లు పెట్టుకుని ఆపరేషన్ చేస్తున్న దుస్థితి దాపురించిందని, ఆసుపత్రుల్లో మందులు, సూదులు లేవని, జెనరేటర్లకు డీజిల్ కరువైందన్నారు. రూ.30 కోట్లతో గజ్వేల్లో వంద పడకల మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి ప్రారంభిస్తే, దానిని వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగరాజు, మాదాసు శ్రీనివాస్, బాలూ యాదవ్, వెంకటేష్గౌడ్, కృష్ణారెడ్డి, రమేష్గౌడ్, భీంరెడ్డి, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లకు గుంతలు పడితే తట్టెడు మన్ను పోస్తలేరు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తున్కిమక్తలో మృతుడి కుటుంబీకుల పరామర్శ -
వేడుకలు సరే.. ఆటలు ఎట్లా?
క్రికెట్ స్టేడియంలో అవతరణ సంబరాలుప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ అద్దెకు ఇచ్చి.. క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తుండటంతో క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ వేడుకలైనా సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తుంటారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కళాశాల గ్రౌండ్ను అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరికీ అందుబాటులో మరో మైదానం లేకపోవడంతో క్రికెట్ స్టేడియాన్ని జిల్లా యంత్రాంగం ఎంచుకుంది. స్టేడియంలో వేడుకలు నిర్వహించనుండటంతో క్రికెట్ పిచ్, పచ్చటి గడ్డి పాడవుతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే బాధ్యతతో మళ్లీ పూర్వ స్థితికి స్టేడియాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట● కళాశాల గ్రౌండ్ అద్దెకు.. యాజమాన్యం వింత పోకడ ● వేడుకలతో పిచ్ పాడవుతుందని క్రీడాకారుల ఆవేదన ● పూర్వ స్థితికి తీసుకురావాలంటూ వేడుకోలు -
ఉత్తమ సేవలకు గుర్తింపు
సిద్దిపేటకమాన్/చేర్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలను పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు అధికారులు పొందారు. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ మిస్బావుద్ద్దిన్, చేర్యాల సీఐ శ్రీను, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏబీ దుర్గ, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రఘుకు సేవా పతకాలు దక్కాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ పోలీస్ శాఖ లో అంకితభావంతో, నీతి నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని తెలిపారు. ఉత్తమ సేవా పతకాలు అందుకున్న అధికారులు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.నలుగురు పోలీసులకు పతకాలు -
అక్రమార్కులపై పీడీ యాక్ట్
సిద్దిపేట కమాన్: నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేస్తే సహించేదిలేదని, వారిపై పీడీ యాక్ట్ విధిస్తామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తన ప్యాకెట్ మీద తేదీ సరిచూసుకొని కొనాలని, అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె రైతులుకు సూచించారు. విత్తన, ఎరువుల గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేసి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పటిష్టమైన బందోబస్తు.. జిల్లాలో టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ అనురాధ పేర్కొన్నారు. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద163 సెక్షన్ అమలు చేసినట్టు తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలతో మోసం చేస్తే సహించం పోలీసు కమిషనర్ అనురాధ -
రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలి
హుస్నాబాద్: రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సీపీఎం నియోజకవర్గ నాయకుడు శివరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో అట్టడుగున ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువతి, యువకులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా అర్హులైన యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వర్తింపజేసి యూనిట్లను మంజూరు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు గుగులోతు రాజు నాయక్, భూక్య భాస్కర్, రాజు ఉన్నారు. -
నకిలీ విత్తనాలపై నిఘా..
సిద్దిపేట కమాన్: నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేసినట్లు టూ టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. శుక్రవారం పలు సీడ్స్, ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టాక్, బిల్ బుక్, తదితర రికార్డులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులు, విత్తనాలు కొనేసమయంలో బిల్లు, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే 100 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇళ్లు
ఆయిల్పామ్తో అధిక లాభాలు హుస్నాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాలలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనా గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. మరో రెండు నెలల్లో రెండో విడతగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వచ్చే నెల 9వ తేదీలోగా ముగ్గు పోసి ఇల్లు వేగంగా కట్టుకొని గృహ ప్రవేశం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఫ్రీ ఇసుక ట్రాక్టర్ కూపన్లు ఇస్తామన్నారు. డబ్బులు లేకపోతే మహిళా సంఘం నుంచి రూ.లక్ష రుణం ఇప్పిస్తాని తెలిపారు. గత పదేళ్లలో నియోజకవర్గంలో 1,420 ఇళ్లు మంజూరైతే కేవలం 240 ఇళ్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, 150 పడకల ఆస్పత్రి నిర్మాణం, ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోహెడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌద రి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ రామూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. కోహెడలో 392 మందికి.. కోహెడ(హుస్నాబాద్): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక రైతు వేదికలో 392 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు మహిళా సంఘాల నుంచి మరో రూ.లక్ష రుణం ఇస్తున్నట్లు చెప్పారు. జూన్ 9 లోపు మంచి ముహూర్తాలు ఉన్నాయని.. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని సూచించారు. అలాగే పోరెడ్డిపల్లిలో 91 ఇళ్లు పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేశామన్నారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఇందిరమ్మ నమూనా ఇల్లును ప్రారంభించారు.హుస్నాబాద్రూరల్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని, నాలుగేళ్లు కష్టపడితే 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పోతారం(ఎస్)లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 12,335 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ ప్రాంతం భూములు అనుకూలంగా ఉంటాయని 5 ఎకరాలపై బడిన రైతులు సాగుకు ముందుకు రావాలన్నారు. అంతర పంటలను సైతం సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయిల్పామ్ పంటను అకాల వర్షాలు, వడగళ్ల నష్టం చేయవని చెప్పారు. నర్మెట్టలోనే పరిశ్రమ ప్రారంభానికి సిద్ధం చేశామన్నారు. రైతులకు రవాణా భారం లేకుండా హుస్నాబాద్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించి పైసా ఖర్చు లేకుండా ఫ్యాక్టరీకి తరలిస్తామన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు రెండో లైన్ డ్రిప్పు ఏర్పాటులో సబ్సిడీకి కృషి చేస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తీరుతామని, కొందరు కావాలని ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారని మంత్రి తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ సమస్యలను అధిక మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకం నిబంధనల మేరకే ఇల్లు నిర్మించుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
మూల్యాంకనంలో నిర్లక్ష్యం తగదు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మూల్యాంకనంలో నిర్లక్ష్యం తగదని, తప్పులు చేస్తే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ భీమ్సింగ్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మూల్యాంకన కేంద్రం అధికారి రవీందర్రెడ్డితో కలిసి అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గత మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లను క్యాంపు అధికారుల దృష్టికి తెచ్చామని, అవి పునారావృతం కాకుండా చూసుకోవాలన్నారు. మూల్యాంకన కేంద్రం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని, హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి అంశాన్ని గమనిస్తున్నట్లు చెప్పారు. అధ్యాపకులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విద్యార్థుల జవాబు పత్రాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మదింపు చేయాలని సూచించారు. క్యాంపు అధికారి, డీఐఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి సిద్దిపేట మూల్యాంకన కేంద్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నేటినుంచి రెండో విడత.. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రెండో విడత మూల్యాంకనం శనివారం నుంచి ప్రారంభం అవుతుందని, క్యాంపు అధికారి, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల అధ్యాపకులు మూల్యాంకన కేంద్రంలో ఉదయం 10గంటల లోగా రిపోర్టు చేయాలన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలలోని ప్రభుత్వ, అనుబంధ, ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా రిపోర్టు చేయాలన్నారు. రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరపాట్లు పునరావృతం కావద్దు తప్పులు చేస్తే చర్యలు ఇంటర్ బోర్డు అబ్జర్వర్ భీమ్సింగ్ -
విద్యార్థులు హిందీలోనూ రాణించాలి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు హిందీలోనూ రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటుగా నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి శుక్రవారం డీఈఓ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ హిందీ భాష అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ి హిందీ భాషోపాధ్యాయుల్లో సామర్థ్య నిర్మాణం కోసం కృషి చేసిన శిక్షణ శిబిరం నిర్వహకులను డీఈఓ అభినందించారు. అనంతరం శిక్షణ అందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ మనోహర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తిరుపతిరెడ్డి, డీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు పెంపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిఫ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జూన్ 30 వరకు పెంచినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కవిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే.. బెస్ట్ అవైలెబుల్ స్కూల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన విద్యార్థులు జూన్ 1 నుంచి జూన్ 16 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు చేయాలన్నారు. జూన్ 20న ఉదయం 11గంటలకు జిల్లా కలెక్టర్ట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: రపభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట ప్రచారజాత శుక్రవారం గజ్వేల్కు చేరుకుంది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు జరిగిన ప్రచార జాత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని అన్నారు. టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతులున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా చొరవ చూపాలన్నారు. -
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం
సిద్దిపేటజోన్: రాబోయేది వర్షాకాలమని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ పనుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా యూజీడీ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పట్టణంలో యూజీడీ లీకేజ్ సమస్యలు రావొద్దన్నారు. పట్టణ ప్రజలు దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఫాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పట్టణంలో ఆరుబయట చెత్త వేయకుండా చూడాలని, అందుకు సంబంధించిన నిఘా పటిష్టంగా అమలు పరచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగాలని, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. పట్టణంలో చెట్లను ఇష్టానుసారంగా నరికివేయకుండా, కేవలం ట్రిమ్మింగ్ చేసేలా చేయాలన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందికి ఆదేశాలివ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. అంతకుముందు పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సురేఖ, జిల్లా మంత్రి ప్రభాకర్ ను ఆహ్వానించాలని సూచించారు. కప్పల కుంట చెరువు మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎజెండాలోని 13 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. యూజీడీపై పర్యవేక్షణ అవసరం అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి సేవలందించాలి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల -
యోగమెప్పుడు?
మల్లన్నా.. డిజిటల్సాంకేతికతకు దూరంగా కొమురవెల్లి ఆలయం●ఆన్లైన్ చెల్లింపులు లేక భక్తుల అవస్థలు ●ఏటా కోటి మంది దర్శనం ●స్వామి వారి వార్షిక ఆదాయం రూ. 20 కోట్లపైనే.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. స్వామి వారిని ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. ఆలయానికి సుమారు రూ.20 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతున్నా సాంకేతికతకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సేవలు అమలు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతతో పాటు భక్తులు సులువుగా సేవలను పొందేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు.. వసతి గదులు, దర్శనం, నిత్యకల్యాణం, రుద్రాభిషేకం, అర్చన, పట్నం వేయడం, తలనీలాలు, ఒడిబియ్యం, బోనం తదితర ఆర్జిత సేవల కోసం రుసుం చెల్లించి టికెట్లు తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా లేకపోతే పది పదిహేను నిమిషాలలో టికెట్లు లభిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాల్సి వస్తోంది. స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు పట్నాలు, బోనాల టికెట్లను ఆలయం విక్రయిస్తోంది. భక్తుల్లో అసహనం.. భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడే నిత్యాన్నసత్రానికి, కాటేజీల నిర్మాణాలకు విరాళాలు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఆన్లైన్ సేవలు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడానికి ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మూడేళ్ల క్రితమే హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరాలయం, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో కూడా సాంకేతికత సాయంతో డిజిటల్ హుండీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం సాంకేతికతలో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. -
నిధులున్నా కాల్వ పనులు చేపట్టరా..?
సీపీఐ నేత చాడ అక్కన్నపేట(హుస్నాబాద్): రేగొండలోని గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఎడమ కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం కాల్వ నిర్మాణానికి రూ.437 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంతవరకు కాల్వ నిర్మాణ పనులు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తయి కాల్వను నిర్మించకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నర్సింగ్ తండా, మల్చేరువు తండాలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం అదనపు కలెక్టర్ గరిమా ఆదేశం సిద్దిపేటరూరల్: పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదులను శుభ్రంగా చేసి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ జూనియర్ కళాశాలలోని ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా గరీమా మాట్లాడుతూ.. యూనిఫాంలు ఆలస్యం కాకుండా విద్యార్థులకు అందించేలా చూడాలన్నారు. అల్పాహారం, భోజనం ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అందించాలని చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఎక్కడ విద్యుత్, ఇతర రిపేర్లు లేకుండా చూసుకోవాలని, అదనంగా అవసరమైన వాటి నివేదిక అందించాలని కోరారు. అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో హార్వెస్టింగ్ పిట్, బోర్ వెల్ రీచార్జీ, రెయిన్ వాటర్ రీచార్జీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాలయాల, సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు. మినీ స్టేడియానికి కరువైన పర్యవేక్షణ హుస్నాబాద్: క్రీడాకారుల కోసం నిర్మించిన మినీ స్టేడియంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జున్రెడ్డి అన్నారు. మినీ స్టేడియంలో క్రీడలు ఆడుకునేందుకు సరైన సౌకర్యం లేక గడ్డి పెరిగి పోయిందన్నారు. అలాగే ఇండోర్ స్టేడియం కిటికీలు, షటిల్ కోర్టులోని చెక్క మ్యాట్ పగిలి పోయిందన్నారు. మరమ్మతులు చేపట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరాడు. -
రైతుకు మద్దతు
● ఎంఎస్పీ పెంపుతో పలు పంటల సాగుపై ప్రభావం ● కొద్ది కాలంగా తగ్గుతున్నపప్పు, నూనె పంటల సాగు ● జిల్లాలో పప్పుధాన్యాలు, నూనె పంటల విస్తీర్ణం అధికం ● పత్తి పెరుగుదలతో వాటిపై ప్రభావం కేంద్ర ప్రభుత్వం కొన్ని కనీస మద్దతు ధర పెంచడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దికాలంగా జిల్లాలో పత్తి సాగు ప్రభావంతో పప్పుధాన్యాలు, నూనె పంటల సాగు విస్తీర్ణం కొన్నేళ్లుగా తగ్గిపోతున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన ఎంఎస్పీ పెంపు నిర్ణయం ఈపంటలు సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహపడనుంది. నారాయణఖేడ్: కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందిస్తూ 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని రైతులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా పప్పుదినుసుల సాగుకు ఈ పెంపు ఉపయుక్తంగా మారనుంది. జిల్లాలో ఆయా రకాల పంటలసాగు విస్తీర్ణాలపై ఈ ధర పెంపు ప్రభావం చూపనుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పత్తిపంటను సాగు చేస్తున్నారు. ఏటికేడు పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ పంట విస్తీర్ణం పెంపు ఇతర పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిండిగింజలపై అధిక ప్రభావమే చూపింది. గతేడాది ఖరీఫ్లో 1,42,634.92 హెక్టార్లలో పత్తిపంటను సాగు చేయగా ఈ ఏడాది 1.43,817.81హెక్టార్లలో సాగు జరగనుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదేవిధంగా వరి గతేడాది 60,792.41హెక్టార్లలో సాగు కాగా ఈసారి 59,424.7హెక్టార్లుగా నిర్ధారించారు. గతేడాది కంది పంట 31,218.77 హెక్టార్లు సాగుచేయగా ప్రస్తుతం 32,044.53హెక్టార్లుగా అంచనా వేశారు. వీటితోపాటు ఇతర నూనె, ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా పప్పు దినుసులు, నూనె గింజల సాగు జరుగుతుండగా సంగారెడ్డి నియోజకవర్గంలో మోస్తారుగా పప్పు దినుసులు వేస్తారు. ఏడెనిమిదేళ్లుగా పప్పుదినుసులు సాగు గణనీయంగా పడిపోతూ పత్తిపంట సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. నూనెగింజలు, జొన్న తదితర పంటలపై కూడా పత్తిపంట పెంపు ప్రభావం భారీగానే ఉంది. వరిపై ప్రభావం చూపనుందా మద్దతు ధర పెంపులో భాగంగా కేంద్రం పత్తి పంటకు కూడా ధరను పెంచింది. పత్తికి ధర పెరుగుదల వరి పంటపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పత్తి పంట నీటి తడులు తక్కువగా అవసరం కాగా వరితో పొలిస్తే పత్తి పంటకు పెట్టుబడులు కూడా కొంత తక్కువగా ఉండనున్నాయి. బీటీ రకాల పత్తి పంటలు కావడంవల్ల దిగుబడులు పెరగడం, పంట కోత సమయాల్లో ధర అధికంగా లభించగలదనే భావన రైతుల్లో ఉంది. నూనె, పప్పు ధాన్యాల సాగు పెంపుకోసం నూనె గింజలు, పప్పుధాన్యాలు, పోషక తృణధాన్యాల పంటలను ప్రొత్సహించనున్నట్లు కేంద్రం తెలిపింది. కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటల విస్తర్ణంతోపాటు తృణధాన్యాల సాగు కాస్త పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి పప్పుధాన్యాలు, నూనె గింజల పెంపును అధికంగా రైతులు చేపట్టేలా ప్రొత్సహించనున్నట్లు చెబుతున్నారు. గతేడాది మద్దతు ధరకంటే బయటి మార్కెట్లో కంది, పెసర, మినుము ధరలు అధికంగా ఉన్నాయి. నాలుగైదేళ్లుగా ఈ పప్పు ధాన్యాల ధరలు బయటి మార్కెట్లోనే అధికంగా ఉంటున్నాయి. ఈ పంటలకు కేంద్రం తాజాగా మద్దతు ధర పెంచిన నేపథ్యంలో వీటి సాగు కూడా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్పీ పెంపు, జిల్లాలో పలు ప్రధాన పంటల సాగు విస్తీర్ణం పంట 2024– 25 2025– 26 పెంపు రూ.సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) పత్తి మీడియం 7,121 7,710 589పత్తి పొడుగు పంజ 7,521 8,110 589 1,43,817.81 వరి కామన్ 2,300 2,369 69 59,424.7 కంది 7,550 8,000 450 32,044.53 పెసర 8,682 8,768 86 57,49.39 మినుము 7,400 7,800 400 3,465.59 జొన్న 3,371 3,699 328 237.25 సోయాబీన్ 4,892 5,328 436 29,817.81 పొద్దుతిరుగుడు 7,280 7,721 441 8.3 నువ్వులు 9,267 9,846 579 18.62 -
పక్కాగా మూల్యాంకనం
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కచ్చితంగా, తప్పులు లేకుండా చేయాలని స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు అధికారి, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు బోర్డు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో కంటే భిన్నంగా ఈ సారి రెండు బోర్డులకు ఒక చీఫ్ ఎగ్జామినర్ను నియామకం చేసినట్లు తెలిపారు. సీఈలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏఈలు వాల్యు చేసిన పేపర్లను సీఈలు, ఎస్ఈలు ర్యాండమ్గా వాల్యు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఐదు కంటే ఎక్కువ మార్కుల వేరియేషన్ వస్తే చర్యలు ఉంటాయన్నారు. మూల్యాంకనంలో తప్పులు చేస్తే పెనాల్టీలు, షోకాజ్లు, రికవరీలు ఉంటాయన్నారు. మూల్యాంకన ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలతో పాటు ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని సూచించారు. చీఫ్ కోడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏసీఓ జనరల్–1 సత్యనారాయణరెడ్డి, ఏసీఓ జనరల్–2 మంజుల, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్(ఎస్ఈ) శశిధర్రెడ్డి తదితరులు మూల్యాంకనంలో గతంలో జరిగిన పొరపాట్లపై సమీక్షించి, ప్రస్తుతం అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను అందించారు. తప్పులు చేస్తే చర్యలు తప్పవు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి -
సర్వేయర్లొస్తున్నారు..!
జిల్లా వ్యాప్తంగా 352 మంది దరఖాస్తు ● మొదటి బ్యాచ్కు 175 మంది ఎంపిక ● 50 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ ● ఇక కచ్చితమైన మ్యాప్ల రూపకల్పన సాక్షి, సిద్దిపేట: భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రాబోతున్నారు. ఈ మధ్య కాలంలో కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి భూమి కొలతకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. వాటిని పరిష్కరించేందుకు అన్ని మండలాలకు సర్వేయర్లు లేకపోవడంతో సమస్య రోజురోజుకు సమస్య జటిలంగా మారుతోంది. ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చింది. అందులో భాగంగా సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమించాలని నిర్ణయించింది. భూ సమస్యలే ఎక్కువ ప్రస్తుతం ఉన్న భూముల సర్వే నిజాం కాలం నాటివి. దాంతో చాలా వరకు హద్దులు తెలియక నిత్యం ఎక్కడో చోట భూ పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 26 మండలాలకు 16 మందే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. ఒక్కో సర్వేయర్కు రెండు నుంచి మూడు మండలాలు కేటాయించడంతో సమయం సరిపోవడం లేదు. దీంతో జిల్లాలో సర్వే కోసం 3 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు తక్కువగా ఉండటంతో భూ సమస్యలు పరిష్కరించడం కష్టంగా మారుతోంది. దీంతో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. కచ్చితమైన మ్యాప్లు సాంకేతికంగా ఎన్ని మార్పులు వచ్చినా ఈ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. మారుతున్న సాంకేతిక ఆధారంగా కచ్చితమైన మ్యాప్ను రూపొందించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ విధానాన్ని అమలు చేయడం ద్వారా భవిష్యత్లో భూములకు సంబంధించిన వివాదాలు తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉంటాయని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. ఆ భూమికి సంబంధించిన మ్యాప్ ఉండటం లేదు. కాగా లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్ కంటే ముందే భూమికి సంబంధించిన పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ప్రభుత్వ సర్వేయర్లు వాటిని పరిశీలించిన తర్వాత ఆమోదిస్తారు. ఇక మీదట భూములు రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో సర్వే హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తరువాతే చేపట్టనున్నారు. కొత్తగా సర్వేయర్లు వస్తే గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. 50 రోజుల పాటు శిక్షణ జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు డ్రాఫ్ట్మెన్ సివిల్, డిప్లొమా, బీటెక్ సివిల్, ఇంటర్లో 60శాతం మార్కులతో గణితం సబ్జెక్ట్ పూర్తయిన వారిని నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ శిక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలి విడతలో 175 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించారు. ఇవి 50 రోజుల పాటు కొనసాగనుంది. ఏడుగురు సర్వేయర్లు, ఒక రిటైర్డ్ సర్వేయర్తో శిక్షణ ఇప్పిస్తున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐలకు చెందిన అధ్యాపకులచే కొంత థియరీ చెప్పిస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. టిప్పన్ ప్లాటింగ్, క్షేత్రస్థాయి విషయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం పరీక్షను నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ధ్రువపత్రాలను అందించనున్నారు. శిక్షణ కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా 352 మంది ల్యాండ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేశారు. అందులో మొదటి బ్యాచ్కు 175 మందిని ఎంపిక చేశాం. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాం. ఏడుగురు సర్వేయర్లను, ఒక రిటైర్డ్ సర్వేయర్తో శిక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులకు మెటీరియల్ను అందజేశాం. – వినయ్ కుమార్, ఏడీ, ల్యాండ్ సర్వే -
ఆదరణను చూసి ఓర్వలేకే..
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదంమాట్లాడుతున్న కలెక్టర్ మిక్కిలినేనిసిద్దిపేటరూరల్: నకిలీ విత్తనాలు, ఎరువుల సరఫరా జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రైతులు సాగుపై దృష్టి సారించారన్నారు. ఎక్కువ దిగుబడి ఆశను చూపూతూ దళారులు, వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయ త్నం చేస్తారని, ఆ విధంగా జరగకుండా జిల్లాలో టాస్క్ఫోర్సు కమిటీలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. మండల స్థాయిలో డీలర్లతో సమావేశాలు నిర్వహించాలని, లైసెన్సు డీలర్ల వద్దే విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోకి బయటి నుంచి విత్తనాలు, ఎరువులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఏడిఏలు, పొలీస్ అధికారులు పాల్గొన్నారు. 4న హుస్నాబాద్లో కిసాన్మేళా హుస్నాబాద్లో జూన్ 4వ తేదీ నుంచి కిసాన్ మేళా జరుగుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లో కిసాన్ మేళా ఏర్పాట్లపై సమీక్షించారు. మేళాలో దాదాపు 130 స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, అధికారులను బృందాలుగా నియమించనున్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అన్ని మండలాల రైతులు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చూడాలని, అవసరమైతే బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. భోజనం, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, మార్కెట్ కమిటీలో శానిటేషన్ పనులు చేపట్టడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. చేర్యాల(సిద్దిపేట): తెలంగాణలో ప్రజా పాలన నడుస్తోందని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల, మద్దూ రు, కొమురవెళ్లి, దూల్మిట్ట మండలాల్లోని గ్రా మాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లా డుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో యువజన నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, నాయకులు జీవన్రెడ్డి, ఆగంరెడ్డి, మల్లేశం, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్, మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ జాతిపితగా కొండాను ప్రకటించాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రకటించాలని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన పద్మశాలి సమాజ సమావేశానికి పాల్గొన్నారు. అనంతరం బాపూజీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సమాజం జిల్లా నాయకులు ముదిగొండ శ్రీనివాస్, కాముని రాజేశం, బాలరాజు, ప్రసాద్, భిక్షపతి, శ్రీహరి, గుండు రవితేజ, నాగరాజు, శ్రీనివాస్, జలజ, సునీత, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు అవసరమైతే ఆకస్మిక తనిఖీలు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి విపక్షాల దుష్ప్రచారంపై ఎంపీ చామల ధ్వజం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆకునూరులో భవనం ప్రారంభం మండల పరిధిలోని ఆకునూరులో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఎంపీ చామల ప్రారంభించారు. అలాగే కురుమ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి పాల్గొన్నారు. -
కొండపోచమ్మ బాగుంది
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను బుధవారం కోల్ ఇండియా ఉద్యోగుల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం, అమలు చేసిన సాంకేతికత, ప్రాజెక్టు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఏఈఏలు శ్రీనివాస్, శుశాంత్.. బృందం సభ్యులకు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరును, ప్రస్తుతం రైతుల పంట పొలాలకు కాల్వల ద్వారా నీటిని ఏ విధంగా వదులుతున్నామనే విషయాలను వారికి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం బాగుందని వారు కితాబిచ్చారు.కోల్ ఇండియా ఉద్యోగుల బృందం కితాబు -
పంట నష్ట పరిహారం నిధులు విడుదల
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం నిధులు విడుదల అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. జిల్లాలో 4,913 మంది రైతులకు గాను రూ.6.141 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే మే నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదికలు అందించామని, వీటి నిధులు వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పారదర్శంగా ఎంపిక జరగాలిసిద్దిపేటరూరల్: ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. నిరుద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా ఉండాలన్నారు. పథకం అమలు తీరుపై పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీఆర్ఓ నాగరాజమ్మ, మైనార్టి, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. భూ సమస్యలను పరిష్కారించాలిఅడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ హుస్నాబాద్రూరల్: ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం పరిధిలో రైతుల సమస్యలను పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అక్కన్నపేట మండల భూ రికార్డుల ప్రక్షాళనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పారు. వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే ప్రభుత్వం జూన్ 2 తర్వాత పైల్ ప్రాజెక్టు మండలాల మాదిరిగానే మిగితా మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో రామ్మూర్తి, అక్కన్నపేట తహసీల్దార్ అనంత్రెడ్డి, రుక్మిణి రెడ్డి తదితరులు ఉన్నారు. రుతుచక్ర పరిశుభ్రతపై అవగాహన: దేవకీదేవిసిద్దిపేటరూరల్: రుతుచక్ర పరిశుభ్రతపై జిల్లా వ్యాప్తంగా 58 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక మహిళా గ్రామసభలు నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి బుధవారం తెలిపారు. దాదాపుగా 15వేల 758 మంది మహిళలకు రుతుచక్ర పరిశుభ్రతపై తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు వంటివాటిపై సంపూర్ణ అవగాహన కల్పించామన్నారు. అనంతరం 250 గిరిజన మహిళలకు మెన్స్ట్రువల్ కప్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ వలీ దుబ్బాక: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్ధికంగా కృంగిపోతున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ వలీ అహ్మద్ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ప్రచార జాత బుధవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల సంఖ్యను పెంచేందుకు తమ సంఘం కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని 26 మండలాల్లో ‘బడి మనదే ఊరు మనదే అన్న’ఉద్దేశంతో ఈ ప్రచార జాత నిర్వహించామని చెప్పారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు యాదగిరి, వెంకటకిరణ్, కృష్ణ, రాంచంద్రం, నర్సింలు, యాదగిరి తదితరులు ఉన్నారు. -
ప్రతి గింజను కొంటాం
తొగుట(దుబ్బాక): రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంకా పది రోజుల పాటు వరి కోతలు కొనసా గుతాయని రైతులు వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా వచ్చాయని, రైతులు అధైర్యపడొద్దని ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, డీపీఎం కర్ణాకర్, ఏవో మోహన్, ఏపీఎం శ్రీనివాస్, ఎఈవో నాగార్జున పాల్గొన్నారు. వనమహోత్సవానికి సన్నద్ధం కావాలి సిద్దిపేటరూరల్: పచ్చని ప్రకృతి ఆస్తిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా మోడల్ ప్లానిటేషన్ కొరకు అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీడీలు, పంచాయతీ కార్యదర్శులతో మొక్కలు నాటే కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పొతారెడ్డిపేట నుంచి హుస్నాబాద్ వరకు, దుద్దెడ ఎక్స్ రోడ్డు నుంచి వీరన్నపేట వరకు గల నేషనల్ హైవేను ఆనుకొని రొడ్డుకు ఇరువైపుల రెండు వరుసలలో మొక్కలు నాటడానికి నేటి నుంచే పనులు ప్రారంభించాలని సూచించారు. జూన్ 5న వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, వైర్ల కింద మొక్కలు నాటకుండా జాగ్రత్త పడాలన్నారు. రోడ్డు మార్గంలో రకరకాల మొక్కలు కాకుండా ఒకే విధమైన పెద్ద మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, నేషనల్ హైవే అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. రైతులు అధైర్య పడొద్దు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ -
సేంద్రియ ఎరువుకే సై
చిన్నకోడూరు(సిద్దిపేట): గతంలో మాదిరిగా పంట ఎదుగుదలకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువులను వాడేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎరువు వాడకం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, భూసారినికి ఎలాంటి హాని ఉండదని ఎక్కువ పెట్టుబడి పెట్టి పశువుల ఎరువును పంట చేనులో చల్లుతున్నారు. పంటలకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి వాడొద్దంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు ఈ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టారు. చాలామంది పశువుల ఎరువును వాడడం మూలంగా ప్రస్తుతం దీని ధర ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.13 వేలకు పైబడి పలుకుతుంది. పశువుల ఎరువుతో లాభాలు గతంలో వ్యవసాయ దారులు ప్రత్యేకంగా పశువుల పేడను ఒక చోట నిల్వ ఉంచేవారు. ఏడాది తరువాత ఆ పశువుల పేడ సేంద్రియ ఎరువుగా మారేది. దీన్నే పంట పొలాల్లో వేయడం వల్ల సత్ఫలితాలు సాధించేవారు. అన్ని నేలలకు పశువుల పేడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎరువు ద్వారా వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. నేలలో నీటి నిల్వ సామర్ాధ్యన్ని కూడా పెంచుతుంది. మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉండేలా ఈ ఎరువు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పశువుల ఎరువులను ఒక్కసారి వాడితే 2 నుంచి 3 పంటలకు భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆసక్తి చూపుతున్న రైతులు ఖర్చు పెరిగినా .. పంట దిగుబడి వస్తుందని ఆశ ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.13 వేలుఈ ఎరువుతో మేలు రైతులు అందుబాటులో ఉంటే పశువుల ఎరువును ప్రతి ఒక్కరూ వాడవచ్చు. ఏ నేలకై నా ఈ ఎరువు ఎంతో లాభం. గతంలో ఈ ఎరువులనే వాడేవారు. ఈ ఎరువులతో పండించిన పంటల దిగుబడి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల ఎరువుతో ఎంతో మేలు జరుగుతుంది. – జయంత్ కుమార్, ఏఓ -
పుస్తకాలొచ్చాయోచ్..
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు పుస్తకాలొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాలు బుధవారం ఆర్టీసీ కార్గో బస్సులో రానే వచ్చాయి. వాటిని పాఠశాల సిబ్బంది ఒక దగ్గరకు చేర్చారు. గతంలో ప్రైవేట్ వాహనాలలో పుస్తకాలు వచ్చేవని, అవి తక్కువగా ఉండేవని పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు. ఇప్పుడు కార్గో బస్సులో రావడం బాగుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సకాలంలో పుస్తకాలు రావడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
లక్ష్యం.. రూ 45.31కోట్లు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మార్కెట్ల ఆదాయం రూ.45.31కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, లైసెన్స్లు, చెక్ పోస్టులు, మార్కెట్ కాంప్లెక్స్ల ద్వారా ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2023–24 సంవత్సరానికి రూ 27.18 కోట్లు, 2024–25కు రూ. 33.94 కోట్లు ఆదాయం రాగా 2025–26కు రూ.45.31 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో మార్కెట్ ఆదాయం సైతం పెంచారు. గతేడాదితో పోల్చితే దాదాపు రూ.11కోట్ల ఆదాయం పెంచాలని నిర్ణయించారు. సిద్దిపేట మార్కెట్ కమిటీకి 2023–24 కంటే 2024–25లో ఆదాయం తగ్గినప్పటికీ ఈసారి అధిగమించాలని నిర్ణయించారు. చేర్యాల మార్కెట్కు 2023–24 కంటే 2024–25లో ఆదాయం అధికంగా రావడంతో 2025–26కు లక్ష్యం పెంచారు. ప్రస్తుతం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని మార్కెట్ శాఖ అధికారులు భావిస్తున్నారు.సిద్దిపేట మార్కెట్ కార్యాలయంమార్కెట్ల ఆదాయం మార్కెట్ 2025–26(లక్ష్యం) 2024–25 2023–24(రూ .లక్షల్లో)సిద్దిపేట రూ. 519.0 రూ.361.04 రూ 366.24 చిన్నకోడూరు రూ.251.90 రూ.187.12 రూ 162.77 నంగనూరు రూ.149.90 రూ.127.51 రూ 80.41 తొగుట రూ.125.50 రూ.70.06 రూ 35.08 దౌల్తాబాద్ రూ.212.80 రూ.150.05 రూ 86.89 కొండపాక రూ.245.60 రూ.138.29 రూ 73.00 మిరుదొడ్డి రూ.207.40 రూ.141.92 రూ 58.27 దుబ్బాక రూ.290.90 రూ.195.70 రూ 195.43 బెజ్జంకి రూ.308.60 రూ.269.61 రూ 267.54 హుస్నాబాద్ రూ.530.60 రూ.456.57 రూ 403.47 కోహెడ రూ.235.60 రూ.121.37 రూ 112.12 గజ్వేల్ రూ.499.70 రూ.481.23 రూ 346.73 చేర్యాల రూ.703.70 రూ.481.04 రూ 357.84 ఒంటిమామిడి రూ.250.60 రూ.212.76 రూ 173.06●ఆదాయాలకు అనుగుణంగా లక్ష్యాలు జిల్లాలో ఉన్న మార్కెట్ల ఆదాయాలకు అనుగుణంగా 2025–26 సంవత్సరానికి లక్ష్యాలు విధించాం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి సైతం వంద శాతం లక్ష్యం చేరుకునేందుకు మార్కెట్ కార్యదర్శులు కృషి చేయాలి. – నాగరాజు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, సిద్దిపేటఆదాయం సమకూరుతుందిలా.. మార్కెట్ యార్డులకు రైతులు తీసుకొని వచ్చిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల చేపట్టే లావాదేవీల ఆధారంగా మార్కెట్ యార్డుకు ఫీజు చెల్లిస్తారు. పంట ఉత్పత్తుల కొనుగోలు చేసే రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పత్తి మిల్లులు, ఇతర ఏజెన్సీలు సైతం ఫీజు చెల్లిస్తారు. పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చెక్ పోస్టుల వద్ద సంబంధిత యార్డులకు ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం తరపున సీసీఐ, మార్కెఫెడ్, నాఫెడ్ ఇతర సంస్థలు యార్డుల్లో పంట ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంటాయి. ఇలా వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జరుపుతున్న పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలపై ఫీజును వసూలు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటాయి. మార్కెట్ల ఆదాయానికి కార్యాచరణ ప్రణాళిక జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు గతేడాది కంటే రూ.11కోట్ల ఆదాయం పెరిగే అవకాశం -
వానరా.. మా బాధలు కనరా..!
మిరుదొడ్డి మండల పరిధిలో కోతి మూకలు కలవర పెడుతున్నాయి. గుంపులు గంపులుగా రోడ్లపై సంచరిస్తుండటంతో జనాల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వాటిని దాటి వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఏమాత్రం ఏమరు పాటుతో వెళ్లినా అటకాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చేతిలో ఏది ఉంటే అది అదిరించి బెదిరించి ఎత్తుకెళ్లడానికి కూడా వెనుకాడటం లేదని మహిళలు వాపోతున్నారు. మిరుదొడ్డిలో విచ్చలవిడిగా సంచరిస్తున్న కోతుల గుంపును ‘సాక్షి’కెమెరా క్లిక్ మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక): -
కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
● ఎమ్మెల్యే హరీష్ రావు ● పద్మశాలి పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీసిద్దిపేటజోన్: స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన సొంత డబ్బులు రూ.5 లక్షలు వెచ్చించి 50 కుట్టు మిషన్లను పద్మశాలి పేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసి మాట్లాడారు. పద్మశాలీలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలీలు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. సిద్దిపేట గొల్లభామ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్, ప్రతినిధులు శ్రీనివాస్, విజయ, మల్లేశం పాల్గొన్నారు. -
మనం బుక్ ఆఫ్ రికార్డులో చోటు
దుబ్బాకరూరల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆర్మీ, ఎస్ఎస్జీడీకి ప్రిపేర్ అవుతున్నారు. ‘సైనిక వాట్సాప్’ గ్రూప్ ద్వారా 8వేల మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. సైనిక గ్రూప్కు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన అరిగె లోకేష్ ఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అరిగె లోకేష్ మాట్లాడుతూ 2020లో ఈ గ్రూప్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్మీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచింతగా బుక్స్, షూస్ అందిస్తున్నామన్నారు. దీంట్లో ఇప్పటి వరకు 175 మంది ఆర్మీ, ఎస్ఎస్జీడీకి ఎంపికయ్యారని, ఇటీవల జిల్లా నుంచి ఆర్మీకి ఆరుగురు అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. సేవలను గుర్తించిన మనం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మనం బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేశారని పేర్కొన్నారు. వచ్చే నెల 11న హైదరాబాద్లో జరిగే త్యాగరాయ గానసభలో డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
కలెక్టర్ మను చౌదరిగజ్వేల్రూరల్: వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. మండల పరిధిలోని సింగాటంలోగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం రాగానే వెంటనే ధాన్యం కొనుగోళ్లను చేపట్టడంతో పాటు ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. కాగా ఇప్పటి వరకు 12,342 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు చేసి వడ్డెపల్లిలోని శివసాయి బాలాజీ మిల్లో దిగుమతి చేసినట్లు సెంటర్ ఇన్చార్జ్లు కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్ఆర్య, డీఎం ప్రవీణ్, అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ పండుగ
కొత్తగా 10 వేల కార్డులు.. లక్ష యూనిట్లు ● ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్లో 8.85 లక్షల కార్డులు.. మేలో 8.96 లక్షలు ● జూన్ 1 నుంచి మూడు నెలల బియ్యం ఒకేసారి ● 57,243 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు సాక్షి, సిద్దిపేట: రేషన్ కార్డుల్లో పేర్లు, చేర్పులు, మార్పులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ.. ఉన్న కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఇటీవల నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రారంభించడంతో ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 10వేల కొత్త రేషన్ కార్డులు, లక్ష మంది పేర్లు నమోదయ్యాయి. జూన్లో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంను 1 నుంచి 30వ తేదీ వరకు ఒకేసారి పంపిణీ చేయనున్నారు. పాత కార్డులతో పాటు కొత్త రేషన్ కార్డు దారులకు సైతం వచ్చే నెలలో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యంను లబ్ధిదారులకు అందించనున్నారు. పెరిగిన 10 వేల కార్డులు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, రెండు నెలల క్రితం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత మోక్షం లభించడంతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను తహసీల్దార్, సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏప్రిల్లో 8,85,861 రేషన్ కార్డులుండగా మే నెలలో 8,96,718కు చేరాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,857 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్లో 28,50,964 యూనిట్లుండగా మే నెలలో 29,60,707 అయ్యాయి. అంటే 1,09,743 యూనిట్లు పెరిగాయి. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం వచ్చే నెల 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ జరగనుంది. రేషన్ షాప్లకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం చేరుతున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు మంజూరైన రేషన్ కార్డులకు జూన్ నుంచి బియ్యం పంపిణీ జరగనుంది. –తనూజ, డీఎస్వో, సిద్దిపేటరేషన్ కార్డుల వివరాలు.. జిల్లా మార్చి ఏప్రిల్ మే సిద్దిపేట 2,91,327 2,92,889 2,98,985 సంగారెడ్డి 3,78,728 3,78,694 3,81,017 మెదక్ 2,13,828 2,14,278 2,16,716 -
బ్రహ్మోత్సవాలకు సీపీకి ఆహ్వానం
సిద్దిపేటకమాన్: పట్టణంలోని శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి 46వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కార్యవర్గ సభ్యులు, అర్చకులు మహేష్ సీపీ అనురాధను ఆమె కార్యాలయంలో కలిసి మంగళవారం తీర్థ ప్రసాదాలు, ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అర్చకులు మహేష్ పాల్గొన్నారు. చేర్యాల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయండిఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణంను వెంటనే పూర్తి చేసి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో చాలా సార్లు చేర్యాల ఆస్పత్రి గురించి మాట్లాడానని, అవసరమైన నిధులు అందచేస్తే పేదలకు మంచి వైద్యం అందుతుందని కోరానన్నారు. అలాగే దేవాదుల నాలుగు మోటర్లు ఆన్ చేసి తపాసుపల్లి రిజర్వాయర్ నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. రమాబాయి త్యాగం ఆదర్శం హుస్నాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయన భార్య రమాబాయి ఎంతో త్యాగం చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పేర్కొన్నారు. మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమాబాయి త్యాగాన్ని నేటితరం ఆదర్శఽంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయన్న, దళిత సంఘాల నాయకులు రవీందర్, సంపత్ కుమార్, సుధాకర్, హరికిషన్, అఽశోక్, వెంకటస్వామి పాల్గొన్నారు. అర్హులందరికీ పథకాలు అందించాలిసీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి చేర్యాల(సిద్దిపేట): అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం కనకయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార కాంగ్రెస్ వారి కార్యకర్తలనే ఎంపిక చేస్తున్నారన్నారు. అలా కాకుండా గ్రామంలో అర్హులైన నిరుపేదలను గుర్తించి పథకాలు వర్తింపజేయాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల లిస్టు సిద్ధం చేయాలని, లేని పక్షంలో అర్హులను ఏకం చేసి పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు సత్తిరెడ్డి, వెంకట్మావో, అరుణ్, శ్రీనివాస్, కరీం, తిరుపతి, సంపత్ పాల్గొన్నారు. -
కొట్టుకుపోయిన చెక్డ్యాం ర్యాంపు
తొగుట(దుబ్బాక): మండల పరిధిలోని లింగంపేట శివారు కూడవెల్లి వాగులో చెక్డ్యాం ర్యాంపు కొట్టుకుపోయింది. దీంతో చెక్డ్యాంకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ర్యాంపు కొంతభాగం కొట్టుకుపోయింది. గుర్తించిన గ్రామ రైతులు నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వచ్చి చెక్డ్యాంను పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడాది గడిచినా సమస్యను పరిష్కరించలేదని రైతులు వాపోతున్నారు. ఈ యాసంగిలో వరి పంటను కాపాడేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని అధికారులు వదిలారు. ఈ క్రమంలో వరద ఉధృతికి చెక్డ్యాం ర్యాంపు పూర్తిగా కొట్టుకుపోయింది. వర్షాకాలంలో వాగు ప్రవహించే అవకాశం ఉంది. వరద ఉధృతంగా ప్రవహించే క్రమంలో చెక్డ్యాం కొట్టుకుపోతుందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వందల ఎకరాల్లో నష్టం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు చెక్డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉపాధిలో అక్రమాలకు చెక్
ఐదుగురు సభ్యులతో వీఎంసీ కమిటీల ఏర్పాటు ● ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ● అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు ● సామాజిక తనిఖీ సభల్లో గుర్తించి రికవరీ సిద్దిపేటరూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పనులు, కూలీల చెల్లింపులు, కొలతల వంటి పనులపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు గ్రామాల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. పనుల పర్యవేక్షణ తోపాటు అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ (వీఎంసీ)కి పూర్తిస్థాయిలో అధికారాలు కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్య లు తీసుకునేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల నియామకానికి నిబంధనలు జిల్లాలోని 490 గ్రామపంచాయతీల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రతీ గ్రామపంచాయతీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల్లో అంగన్వాడీ టీచర్, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామైక్య సంఘం సభ్యురాలు, ఈజీఎస్ సభ్యులు ఉంటారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు నివేదికలు పంపించారు. ఈ కమిటీలు దాదాపు ఆరు నెలల పాటు పనిచేయనున్నట్లు ప్రతిపాదనలు అందాయి. కమిటీ విధులు.. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతీ వారంలో ఒక్క సారైన ఉపాధిహామీ పనులను పర్యవేక్షించే బాధ్య త ఉంటుంది. పనుల కల్పన, కూలీల చెల్లింపు, సౌకర్యాలు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో కూలీలతో చర్చించాల్సి ఉంటుంది. పనుల్లో నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, చేపట్టిన పనులపై నివేదికలు అందజేయడం కమిటీల బాధ్యత. ప్రతి ఏటా జరిగే సామాజిక తనిఖీ సభల్లో అవినీతిని గుర్తించి వాటిని రికవరీ చేయడంలో కీలకంగా కమిటీలు వ్యవహరిస్తాయి. అవకతవకలు జరిగిన వెంటనే కమిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.జిల్లాలో జాబ్కార్డులు, కూలీల వివరాలు మొత్తం కార్డులు 1 లక్షా 97 వేలు యాక్టివ్ జాబ్కార్డులు 1లక్షా 24 వేలు మొత్తం కూలీలు 3 లక్షల 95 వేలు యాక్టివ్ కూలీలు 2 లక్షల 8 వేలు వీఎంసీ కమిటీలు 490 వీఎంసీ కమిటీలోని సభ్యులు 2,493 గరిష్ట వేతనం 307 సగటు వేతనం 251.99 నేటికి 18లక్షల 61వేల పనిదినాలు రోజువారి కూలీలు 40వేలు నేటికి చెల్లించిన వేతనం: 49 కోట్ల 24లక్షలుజవాబుదారీగా ఉంటుంది జిల్లాలోని 490 గ్రామ పంచాయతీల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం పనుల్లో అవకతవకలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ సభ్యులకు అప్పగించాం. పనులు పారదర్శకంగా నిర్వహించడంతో పాటు జవాబుదారీగా ఉండేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి. – జయదేవ్ఆర్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
కరోనా పట్ల ఆందోళన వద్దు
ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్దుబ్బాక: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్సింగ్ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న కరోనా లక్షణాలు గతంలో మాదిరిగానే ఉన్నా వ్యాధి ప్రభావం అంతగా లేదన్నారు. కోవిడ్ మహమ్మారి రాకుండా ప్రజలు ముందుజాగ్రత్తగా మాస్కులతో పాటు శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. లక్షణాలు ఉంటే ప్రజలు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి రావాలన్నారు. ప్రజలు ముందుగా భయం వీడి ధైర్యంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
ముదిరాజ్లను గ్రూప్ ఏలో చేర్చాల్సిందే
● లేదంటే మహనీయుల సాక్షిగా పోరాటం ● మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ నంగునూరు(సిద్దిపేట): ముదిరాజ్ కులాన్ని బీసీ డి నుంచి గ్రూప్ ఏలోకి మార్చాలని, లేదంటే పోరాటం చేస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేద ముదిరాజ్ కులస్తులకు సంక్షే పథకాలు అందడంలేదన్నారు. మండల పరిధి పాలమాకులలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను సోమవారం ఎమ్మెల్యే హరీశ్రావుతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మోటార్ సైకిళ్లు, ఆటోలు, బండ్లు, పడవలు, వలల కోసం ఆర్థిక సహాయం కేసీఆర్ అందజేశారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడంలేదన్నారు. మొదటి మేయర్గా ఎన్నికై న కృష్ణస్వామి సంక్షేమ పథకాల కోసం కృషి చేస్తే, పండుగ సాయన్న భూమి కోసం పోరాటం చేశాడని తెలిపారు. చేప పిల్లలను వదలాలి ముదిరాజ్ సోదరులకు ఉపాధి కల్పిస్తున్న చేప పిల్లల పెంపకానికి ప్రభుత్వం నిధులు కేటాయించి టెండర్లు పిలవాలని ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను అమలు చేయాలన్నారు. కృష్ణస్వామి, సాయన్న జాతి కోసం, కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం అమరుడై చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కావద్దు
● తక్షణం పరిష్కరించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశాలుసిద్దిపేటరూరల్: ప్రజలు ఇచ్చే అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులు అందించిన అర్జీలను పరిశీలించి సత్వర న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ 73 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా అధికారులు పాల్గొన్నారు. మా భూమిని మాకు ఇప్పించండి.. మా భూమిని మాకు ఇప్పించాలని సిద్దిపేట పట్టణానికి చెందిన ఎన్. పద్మ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్సేటి కోచింగ్సెంటర్ కోసం గతంలో తమ పేరు మీద ఉన్న 242 గజాల భూమిని 2021లో తీసుకున్నారన్నారు. దానికి బదులుగా టెలికాంనగర్లో 200 గజాల భూమి ఇస్తానని చెప్పి సర్టిఫికెట్ అందించి, హద్దులు చూపించారన్నారు. కానీ అప్పటికే అక్కడ పొజిషన్లో ఉన్న వ్యక్తి అడ్డుకుంటున్నారన్నారు. కలెక్టర్ స్పందించి తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. u -
భూ కొలతల సమస్యలు తీర్చేందుకే..
సిద్దిపేటఎడ్యుకేషన్: భూ కొలతల సమస్యలు పరిష్కరించేందుకే లైసెన్సు సర్వేయర్లను నియమిస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో లైసెన్సు సర్వేయర్లుగా ఎంపికై న వారికి ల్యాండ్ సర్వే రికార్డ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్ల సేవల అవసరం అన్నారు. ప్రస్తుతం సర్వేయర్ల కొరత ఉన్నందున అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి రెండు నెలలు శిక్షణ ఇప్పించి లైసెన్స్ సర్వేయర్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. భూ కొలతల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండడం వల్ల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి అధిక దరఖాస్తులు భూ సంబంధించినవే వస్తున్నాయన్నారు. మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూమి కొలతల విధానాలను, భూమి కొలతల్లో వాడే పరికరాల ఉపయోగాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలన్నారు. ఫీల్డ్లో ప్రాక్టికల్స్ చేసి నైపుణ్యం గల సర్వేయర్లుగా సిద్ధం కావాలన్నారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వారికి సర్వే మెటీరియల్ కిట్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, ఏడీ ల్యాండ్ సర్వే వినయ్ కుమార్ పాల్గొన్నారు. u -
సీపీని కలిసిన గజ్వేల్ ఏసీపీ
గజ్వేల్రూరల్: ఏసీపీగా బదిలీపై వచ్చిన కె.నర్సింహులు సోమవారం సిద్దిపేటలో సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటంతో పాటు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిరోధంపై దృష్టి సారించాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే.. గజ్వేల్ ఏసీపీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన పురుషోత్తంరెడ్డికి సిబ్బంది వీడ్కోలు పలికారు. బాల సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): బాల సాహిత్య సమ్మేళనంలో సిద్దిపేటకు చెందిన కవులు పురస్కారాలు అందుకున్నారని బాల సాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పెందోట వెంకటేశ్వర్లు, ఎన్నవెల్లి రాజమౌళీలకు నిర్వహకులు పురస్కారాలు అందించారన్నారు. పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘చెప్తే సగం ఇవ్వాలి’ అనే పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారన్నారు. మల్బరీ సాగుకు ప్రోత్సాహం పట్టుపరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): మల్బరీ, పట్టు పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం ఇటిక్యాలలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 403 కుటుంబాలు మల్బరీ సాగు చేపడుతున్నాయని, ప్రతి నెలా రూ.50 వేల నుంచి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని వివరించారు. జిల్లాలో 1,127 ఎకరాల్లో మల్బరీ సాగు అవుతోందన్నారు. మల్బరీ తోటలో ఉత్పత్తి చేసి పట్టు గూళ్ల ద్వారా ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. మల్బరీ సాగు చేసే రైతులకు రాయితీ ఉందని, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం, మిగతా వారికి 50 శాతం రాయితీ అవకాశం ఉందన్నారు. ఈ అవకాశానని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టు పరిశ్రమ ఏఓ మల్లేశం, కార్యదర్శి రేఖ, రైతులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ గజ్వేల్: నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఏడీఏ బాబునాయక్ హెచ్చరించారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని పలు విత్తనాలు, ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రతి దుకాణంలో ధరల పట్టిక అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు విధిగా రశీదు ఇచ్చి అందులో రైతుల సంతకం తీసుకోవాలన్నారు. నిబంధనలను పాటించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. సీపీ అనురాధకు మొక్కను అందిస్తున్న గజ్వేల్ ఏసీపీ నర్సింహులు -
‘సాగు’దామా.. వద్దా!
రోళ్లు పగిలే కార్తెలో వర్షాలు ● ముందస్తుగానే రుతుపవనాలు ● ఇప్పటికే 106మి.మీ. వర్షపాతం నమోదు ● విత్తనాలు విత్తడంపై రైతుల మీమాంస ● తొందర పడొద్దని వ్యవసాయఅధికారుల సూచన నారాయణఖేడ్: ‘రోహిణి కార్తెలో ఎండ వేడిమితో రోళ్లు పగులుతాయి’అనేది నానుడి. వేసవి కాలం చివరి అంకంలో విపరీతమైన ఉక్కపోత, వేడిమితో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఈ సమయంలో రైతులు వేసవి దుక్కులను జోరుగా చేపడుతారు. దుక్కులు సిద్ధం చేసుకున్నాక.. మృగశిర కార్తె (మిర్గం) వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తారు. కానీ ఈసారి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ‘తొందరపడి కోయిలా ముందే కూసింది’అన్న చందంగా ముందస్తుగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా ఇప్పటికే వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు, అధికార వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలకు కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తే పనులు చేపడుతుండగా.. ముందస్తుగా విత్తనాలు వేస్తే వేసవి ఎండలు కాచిన పక్షంలో విత్తనాలు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తాలని చెబుతున్నారు. 106మి.మీ వర్షపాతం నమోదు ఈ వేసవిలో అకాల వర్షాలు బాగానే కురిశాయి. అవీ 19.1 మి.మీ మేరనే కురుస్తాయని అధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ సంగారెడ్డి జిల్లాలో 106 మి.మీ వర్షపాతం ఇప్పటికే నమోదైంది. వాస్తవానికి వర్షాకాలం జూన్లో ప్రారంభం కాగా జూలైలోసాధారణ వర్షపాతం 120మి.మీ కురియాలి. అంటే వేసవిలోనే దాదాపు అదే స్థాయిలో వర్షపాతం నమోదైందన్న మాట. 14 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా కొండాపూర్, చౌటకూర్ మండలాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రోళ్లు పగిలే కార్తె.. రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 7 వరకు విపరీతమైన ఎండలుంటాయి. అయితే.. ఈసారి ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం పూర్తిగా చల్లబడింది. వేసవిలో రైతులు వేసవి దుక్కులు దున్నడం వల్ల భూమిలోపల ఉండే క్రిమి, కీటకాలు, వాటి గుడ్లు బయటికి వచ్చి నశించే అవకాశం ఉంది. దున్నడంతో భూమి సైతం పొరలుగా ఏర్పడి గాలి (ఆక్సిజన్) మార్పు జరుగుతుంది. తద్వారా మృగశిరలో కురిసిన వర్షాలకు భూమి బాగా తడిసి వేసిన విత్తనాలు బాగా మొలకెత్తి విత్తనం వేర్లు దెబ్బతినకుండా భూమి లోపలికి వెళ్లే ఆస్కారం ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో..ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా. దీనికి తోడు రావాల్సిన నైరుతి ముందే కూసింది. సహజంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈసారి మే మధ్యస్తంలోనే పలకరించింది. జూన్ 24నాటికే కేరళను రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం సాగు చేసేవారు వాతావరణ మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని బాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
రిజిస్ట్రార్ ప్రత్యేక పూజలు
బెజ్జంకి(సిద్దిపేట): వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రిజిస్ట్రార్ ఎన్రాంకుమార్ ఆదివారం బెజ్జంకి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆలయ పూజారి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు తిరుమలరావు, భాస్కర్, ఎస్ఓలు శ్రీనివాస్రావు, ప్రవీణ్, ఏఎస్ఓ నరేందర్, న్యాయవాది పురం ప్రవీణ్, ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ పాల్గొన్నారు. దళితబంధు దళారులపై చర్యలు తీసుకోండి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ కొమురవెల్లి(సిద్దిపేట): దళితబంధు పేరుతో గత ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్నగర్లో దళితబంధు పథకం కోసం బీఆర్ఎస్ నాయకునికి డబ్బులు ఇచ్చి మోసపోయిన దాసరి హరిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం కోసం 2022లో హరిబాబు వద్ద మాజీ ఎంపీపీ భర్త కిషన్, అతని డ్రైవర్లు రూ.1,50,000 వసూలు చేశారన్నారు. డబ్బులను పలు మార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని అన్నారు. ఇదే విషయమై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించి అతనికి డబ్బులను ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల క్యార్యదర్శి కుడిక్యాల బాలమోహన్, నంగి కనకయ్య, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నాలా పూడికతీతసిద్దిపేటజోన్: లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. ఆదివారం కోమటిచెరువు శివారులో నాలా పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలో వరద నీటి వల్ల సమస్యలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి డీఈఓ అభినందన గజ్వేల్: ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థుల కోసం ‘సులభంగా తెలుగు నేర్చుకోవడం ఎలా?’ అనే పుస్తకాన్ని రచించిన మండలం మక్తమాసాన్పల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పి.నర్సింహులును డీఈఓ శ్రీనివాస్రెడ్డి అభినందించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణలో నర్సింహులు పుస్తకం గురించి డీఈఓకు వివరించారు. కొత్తగా తెలుగు నేర్చుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతోందని డీఈఓ అన్నారు. -
బెట్టింగ్లతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): బెట్టింగ్ల జోలికి వెళ్లి తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని టూ టౌన్ సీఐ ఉపేందర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీలో ఆదివారం పోలీసు కళాబృందం కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రంలో పాల్గొన్న ఉపేందర్ మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న యువతీయువకులను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు విధిగా నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియజేయవద్దని కోరారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. అలాగే మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సామాజిక రుగ్మతల గురించి కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, నాటకం, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. టూటౌన్ సీఐ ఉపేందర్ -
కొనుగోల్మాల్
తూకంలో నిలువుదోపిడీ ● మర్రిముచ్చాల ఐకేపీ నిర్వాహకుల మాయాజాలం ● 40 కిలోల బస్తాకు కిలో ధాన్యం అదనం ● పట్టించుకోని అధికారులు ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భిక్షపతి. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన ఇతను 295 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో రెండు రోజుల క్రితం విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాంటాలో 40 కిలోల బస్తాకు కిలో అదనంగా వచ్చేలా సెట్ చేయడంతో చాలా వరకు నష్టపోయారు. సుమారు 3 క్వింటాళ్ల ధాన్యం విక్రయించడంతో రూ.7 వేల వరకు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు, కేంద్రం నిర్వాహకులు కుమ్మకై ్క రైతులను దోచుకుంటున్నారు. 40కిలోల బస్తాకు కిలో ధాన్యం అదనంగా తూకం వస్తోంది. సాంకేతికతను ఆధారం చేసుకుని ఎలక్ట్రానిక్ కాంటాలను సెట్చేయడం గమనార్హం. ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులను యథేచ్ఛగా దగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో యాసంగి సీజన్ ధాన్యం సేకరించేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 8వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఐకేపీ నిర్వాహకులు.. మిల్లర్లతో కుమ్మకై ్క నయా మోసానికి తెరలేపారు. కొనుగోలు కేంద్రంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంటాలను 40 కిలోలకు కిలో అదనంగా వచ్చేలా సెట్ చేశారు. ఐకేపీ కాంటా డిస్ప్లేలో 40 కిలోలు మాత్రమే చూపిస్తోంది. అనుమానంతో ఆదే ధాన్యం బస్తాను ప్రైవేటు కాంటాపై చూస్తే 41 కిలోలు చూపించడం గమనార్హం. రైతులు ఆదివారం తూనికరాళ్లతో కాంటాను చెక్ చేశారు. కాంటాలపై 20కిలోల తూనిక రాయిని ఉంచగా 19.500 గ్రాములుగా చూపించింది. గమనించిన రైతులు నిర్వాహకురాలిని నిలదీశారు. దీంతో నిర్వాహకురాలు స్పందిస్తూ.. కాంటాలు చెడిపోయాయని, వాటిని వాడకూడదని ఇటీవల హుస్నాబాద్కు చెందిన మెకానిక్ అఫ్జల్ తెలిపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా.. ఈ సీజన్కు ఈ కాంటాలే వాడండని సూచించారన్నారు. వచ్చే సీజన్ నాటికి కొత్త కాంటాలను కొనుగోలు చేస్తామని చెప్పినట్లు చెప్పారు.వీఓఏను తొలగించాం మర్రిముచ్చాలలో తూకంలో దగా జరిగినట్టుగా రైతులు తెలిపారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాం. మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు న్యాయం చేస్తాం. సెంటర్ నిర్వాహకురాలు వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) వందనను తొలగించాం. –శ్రీనివాస్ రెడ్డి ఏపీఎం ఐకేిపీక్వింటాలుకు రెండున్నర కిలోలు నష్టంఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేయడంతో క్వింటాలుకు రెండున్నర కిలోల ధాన్యం నష్టపోతున్నారు. ఒక్క శనివారం రోజే రైతులు నుంచి సేకరించిన ధాన్యం బస్తాలు 903 కాగా మద్దూరులోని ఓ రైస్ మిల్లుకు పంపిన ట్రాక్ షీట్లో మాత్రం 914గా రాసి పంపారు. రైతుల ప్రాథమిక విచారణలో 11 బస్తాలు అదనంగా రాసినట్లు తేలింది. ఈ లెక్కన కొనుగోళ్లు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతమేర ధాన్యం అక్రమాలకు గురైందోనని రైతులు చెబుతున్నారు. ఈ మోసం ఒక్క మర్రిముచ్చాలలోనేనా? లేక మండల వ్యాప్తంగా కొనసాగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
హైవే నిర్మాణం.. చెట్లు మాయం
రామాయంపేట(మెదక్): మెదక్– రామాయంపేట మధ్య 20 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో ఏళ్ల క్రితం నాటిన చెట్లు ఉండేవి. ఈదారిలో ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది. ప్రయాణికులు తమ వాహనాలను నిలుపుకొని చెట్లనీడలో సేద దీరేవారు. ఈక్రమంలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి మూడేళ్ల క్రితం కేంద్రం రూ. 882 కోట్లు మంజూరు చేసింది. పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రోడ్డు పక్కన ఏళ్ల క్రితం నాటిన పెద్ద పెద్ద చెట్లను నిర్మాణంలో భాగంగా తొలగించారు. కూకటివేళ్లతో సహా పెకిలించి మరోచోట నాటడానికి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. రామాయంపేట మండల పరి ధిలోని అటవీప్రాంతంలో నాలుగున్నర కిలోమీటర్లు తప్పించి, ఇతర చోట్ల చెట్ల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. అనుమతులు వస్తే అటవీ ప్రాంతంలో చెట్లను కూ డా పూర్తిస్థాయిలో తొలగించి పనులు ప్రారంభిస్తామని జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట, సిద్దిపేట మధ్య రోడ్డు పక్కన చెట్లను నరికివేయగా రహదారి బోసిపోయింది. అటవీ ప్రాంతంలో పరుచుకున్న పచ్చదనం సైతం త్వరలో కనుమరుగు కానుందని పర్యావరణ ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. -
విత్తన కల్తీలకు పాల్పడితే చర్యలు
● జిల్లా టాస్క్ఫోర్స్ బృందం హెచ్చరిక ● ములుగు, వర్గల్ మండలాల్లోఆకస్మిక తనిఖీలుములుగు(గజ్వేల్)/వర్గల్(గజ్వేల్): కంపెనీలు లాభాపేక్షతో విత్తన కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం ములుగు వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని ములుగు, వర్గల్ మండలాల్లో పలు విత్తన ఉత్పత్తి కంపెనీలను జిల్లా వ్యవసాయాధికారి రాధిక, దుబ్బాక ఏడీఏ మల్లయ్య, టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య బృందం ఆకస్మిక తనిఖీ చేశారు. ములుగులోని మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి పూర్ణ అగ్రి సీడ్స్, మణికంఠ ట్రేడర్స్ రిటైల్ అవుట్లెట్, వర్గల్ మండలం గౌరారంలోని క్రిస్టల్క్రాఫ్ట్ ప్రొటెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను వారు సందర్శించారు. అక్కడ మూల విత్తనం, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి, వాటి శుద్ధీకరణ, నాణ్యత పరీక్షలు, వాటి లాట్ నంబర్లు, నాణ్యత ప్రమాణాలు, ఎక్స్పైరీ తేదీలు, పాకెట్ మీద ధృవీకరణ వివరాలు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిందని, దీంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోందన్నారు. కంపెనీలు కల్తీలకు పాల్పడకుండా నాణ్యతాయుత విత్తనాలు అందజేయాలన్నారు. కల్తీలకు పాల్పడితే ఉపేక్షించబోమని వారు స్పష్టం చేశారు. వారి వెంట వర్గల్, మర్కూక్ ఏఓలు శేషశయన, వసంత్కుమార్ ఉన్నారు. -
ఎన్నాళ్లీ ముప్పు
ముంచెత్తిన ముంపు..రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు, దుకాణాల్లోకి చేరిన నీరు● మురికి కాలువల అస్తవ్యస్తమే కారణం ● పూర్తికాని డ్రైనేజీ కనెక్టివిటి పనులు ● కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంహుస్నాబాద్: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చేపట్టిన మురికి కాలువల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. వర్షం వచ్చిందంటే చాలు కాలువలు పొంగిపొర్లి దుకాణాలను ముంచెత్తుతున్నాయి. హుస్నాబాద్ పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరద నీరంతా ఇళ్లు, దుకాణాల్లోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వర్షం ఎప్పుడొచ్చినా ఇళ్లల్లోకి వరద చేరడం పరిపాటిగా మారింది. పట్టణంలోని మెయిన్ రోడ్లో మురికి కాలువల నిర్మాణ పనులు దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతునే ఉన్నాయి. పాత డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వరద నీరంతా దుకాణాలు, ఇళ్లల్లోకి చేరాయి. దీంతో రాత్రంతా ప్రజలు జాగారం ఉన్న పరిస్థితి నెలకొంది.డ్రైనేజీ పనుల్లో జాప్యం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పోతారం (ఎస్) నుంచి పట్టణ శివారులోని చైతన్య స్కూల్ వరకు డ్రైనేజీ పనులు చేపట్టారు. అనబేరి, మల్లెచెట్టు, అంబేడ్కర్ చౌరస్తాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటి పనులు ప్రారంభించలేదు. దీంతో ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయాయి. అలాగే కాలువల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే దారి లేక రహదారులు, ఇళ్లను ముంచెత్తుతోంది. దీంతో దుర్వాసన వస్తోంది. రహదారి విస్తరణ పనుల్లో కొందరు ఇళ్లకు సెట్బ్యాక్ చేయకపోవడంతో మురికి కాలువలు నిర్మించలేకపోతున్నారు. వర్షం వచ్చినప్పుడే మున్సిపల్ సిబ్బంది జేసీబీల సాయంతో చెత్తను తొలగిస్తున్న దుస్థితి నెలకొంది.లోతట్టు ప్రాంతాలు జలమయం వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. మురికి కాలువలు, రహదారులు ఎత్తు పెరగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటిని పట్టణంలోకి రాకుండా మళ్లించాలని స్థానికులు కోరుతున్నా.. అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మునిగినప్పుడే స్థానిక నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు వచ్చి ఓదార్పు యాత్రలు చేపడుతున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్నేళ్లుగా ప్రజలు వరద మంపును ఎదుర్కొంటున్నా పాలకులకు పట్టకపోవడం గమనార్హం. -
మిస్ ఫొటోజెనిక్ విజేతకు సత్కారం
సిద్దిపేటరూరల్: తెలంగాణ మిస్ ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలిచిన తుమ్మల ఆర్తిని కలెక్టర్ మనుచౌదరి సన్మానించారు. అక్బర్పేట్–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈ యువతి నగరంలో జరిగిన మిస్ తెలంగాణ పోటీల్లో ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలవడంతో కలెక్టర్ శుక్రవారం శాలువతో సత్కరించి బహుమతి అందజేశారు. భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రతిభను చాటాలంటూ కలెక్టర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. సీపీ అభినందన సిద్దిపేటకమాన్: మిస్ ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలిచిన తుమ్మల ఆర్తిని సీపీ అనురాధ అభినందించారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆమెను సత్కరించారు. -
ఇందిరమ్మ ఇళ్లు
శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025నిమ్జ్ నిర్వాసితులకుసభావేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులుమహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి జోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పెట్రోల్ బంక్ల నిర్వహణ కూడా వారే నిర్వహించబోతున్నారని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికే భూభారతి మంత్రి దామోదర రాజనర్సింహ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వి మ ర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రూ. 250 కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారానికి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాలిచ్చే ప్రత్యేక బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్లో భూములు కోల్పోతున్న 5,612 నిర్వాసిత కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి హామీనిచ్చారు. ఈ నిర్వాసితులకు పట్టాలు అందించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అప్పగిస్తున్నానన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.494 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రేవంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 2014 తర్వాత మెదక్ జిల్లాతో పాటు, నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిమ్జ్ నిర్వాసితుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని, వెంటనే అధికారులను పిలిచి నిర్వాసితులకు న్యాయం చేసేలా నష్టపరిహారం పెంచాలని ఆదేశించామన్నారు. జంట నగరాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించిన రేవంత్రెడ్డి వీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. చెరుకు రైతుల సమస్య పరిష్కరిస్తాం జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన పదెకరాల భూమిని నిమ్జ్లో కేటాయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక్కడ పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ ఇదే నిమ్జ్లో తన యూనిట్ స్థాపన పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి 450 ఎకరాలు భూమిని కేటాయించామన్నారు. జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అండర్ పాస్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఆదర్శనీయుడు బసవేశ్వరుడు గౌతమ బుద్ధుని తర్వాత బసవేశ్వరుడు ఆదర్శనీయుడని సీఎం పేర్కొన్నారు. ఆ రోజుల్లో అనుభవ మండపాలను ఏర్పాటు చేసి అన్ని సామాజికవర్గాల ప్రజలకు న్యాయం జరగేలా చేసిన విశ్వగురువు బసవేశ్వరుడన్నారు. అప్పటి అనుభవ మండపాల మాదిరిగానే ఇప్పుడు అసెంబ్లీ.. పార్లమెంట్లను నిర్వహించుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై త్వరలో సమీక్ష జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను పరిష్కరించి ఈ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని ఎన్నికలయ్యాక అందర్నీ కలుపుకుని పోతామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 150 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. న్యూస్రీల్ కో–ఆపరేటివ్ సెక్టార్లో చక్కెర పరిశ్రమ త్వరలో హుందాయ్ కార్ల పరిశ్రమ పనులు ప్రారంభం సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిఇందిరమ్మకు మెదక్తోవిడదీయలేని అనుబంధం.. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తన చివరి శ్వాస వదిలేవరకు మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ భాగారెడ్డి, ఈశ్వరీబాయిలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. గీతారెడ్డి హయాంలోనే జహీరాబాద్కు నిమ్జ్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు ప్రాంతంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, నిమ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినవేనని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామన్నారు. -
ఆయిల్పామ్ సాగు లక్ష్యం సాధించాలి
● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ● ఆయిల్ ఫెడ్, వ్యవసాయ శాఖఅధికారులతో సమీక్ష సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, జిల్లాకు కేటాయించిన 6,500ఎకరాల సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఆయిల్ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే దిశగా ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. అలాగే రూ.300 కోట్లతో నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సైతం త్వరలో పూర్తి అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతుల ఇంటికి వెళ్లి ఆయిల్పామ్ సాగు వల్ల కలిగే లాభాలు తెలిపి చైతన్యం చేయాలన్నారు. ఇదివరకే సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతులను కలిసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్పామ్ వైపు మళ్లించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో సాగు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ముందుగా ఉద్యాన శాఖ అధికారి జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన సాగు వివరాలను తెలిపారు. ప్రస్తుతం 12,339 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుందన్నారు. అలాగే 2025–26కు గాను 6,500ఎకరాల లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు 1,612 ఎకరాలు 456 మంది రైతులను గుర్తించామన్నారు. 209మంది రైతుల నుంచి 661.5 ఎకరాల డిడి కలెక్షన్ చేయించడం జరిగిందన్నారు. సమావేశంలో టీజీ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ(ప్లాంటేషన్) కిరణ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవాభావంతో పనిచేయండి
ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: నూతనంగా ఎన్నుకున్న పాలకవర్గ సభ్యులు సేవాభావంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల ఎన్నికైన శ్రీకృష్ణ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ నూతన పాలకవర్గ సభ్యులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని హరీశ్రావు అభినందించి సన్మానించారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా నాయకులు శ్రీహరి యాదవ్, ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలూ.. ఎలా ఉన్నారు? బాల సదనంలో కమిషన్ సభ్యురాలు సిద్దిపేటజోన్: ‘పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? ఇబ్బందులు ఉన్నాయా? అంటూ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు వందన ఆరా తీశారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడారు. అందుతున్న సేవలు, సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల వేళ ఏమి నేర్చుకున్నారని అడిగారు. సెలవుల్లో ఎదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శిశు కేంద్రాన్ని సందర్శించారు. వంటగది, పిల్లల గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం బాల సదనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, షీ టీం, భరోసా, చైల్డ్ లైన్, విభాగాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధ్యతాయుతంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మీకాంతరెడ్డి, బాలల సంరక్షణ అధికారి రాము, బాల సదనం ఇన్చార్జి మమత, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సీపీని కలిసిన ఏసీపీ సిద్దిపేటకమాన్: నూతన ఏసీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన రవీందర్రెడ్డి పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను మర్యాద పూర్వకంగా శుక్రవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా విజబుల్ పోలిసింగ్పై దృష్టి సారించాలని సూచించారు. ఉచిత వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం చేర్యాల(సిద్దిపేట): ఉచిత వృత్తి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోలోజు నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో 2017 నుంచి చదివిన పూర్వ విద్యార్థుల్లో ఎలాంటి ఉద్యోగం పొందని వారికి ఉన్నతి సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వృత్తి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాటిచెట్ల నరికివేతపై ఫిర్యాదు మద్దూరు(హుస్నాబాద్): ఎలాంటి అనుమతి లేకుండా తాటిచెట్లను నరికివేసిన రైతుపై గౌడ కులస్తులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని బైరాన్పల్లికి చెందిన భూర భిక్షపతి తన వ్యవసాయ భూమిలో ఉన్న తాటిచెట్లను ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. ఫిర్యాదు మేరకు ఎకై ్సజ్ పోలీసులు ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘ఉపాధి’పై అలసత్వం తగదు
● డీఆర్డీఏ ఏపీడీ బాలకృష్ణ ● పనులపై సామాజిక తనిఖీ వర్గల్(గజ్వేల్): ఉపాధిహామీ పథకం అమలులో అలసత్వం తగదని, నిర్వహణలో లోపాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీఆర్డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలకృష్ణ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం వర్గల్ రైతువేదికలో 16వ విడత ఉపాధిహామీ పథకం పనులపై ఆయన సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం నివేదికలను గ్రామాల వారీగా సమీక్షించారు. వివిధ పనులలో పొరపాట్లను తనిఖీ బృందం సభ్యులు ఏపీడీ దృష్టికి తెచ్చారు. అందుకు బాధ్యులైన ఉపాధి సిబ్బంది నుంచి రూ.7,400 రికవరీ చేయాలని ఏపీడీ ఆదేశించారు. రూ.7వేలు జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏపీడీ శివాజీ, శ్రీనివాస్గౌడ్, అంబుడ్స్మెన్ ఆరిఫ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సంతోష్రెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, ఎస్ఆర్పీ పాండురంగం, ఎంపీఓ ఖలీమ్, ఏపీఓ జనార్దన్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్అసిస్టెంట్లు హాజరయ్యారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయండి
నెలాఖరులోగా పెండింగ్ సీఎంఆర్ అందించండి రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: మిల్లర్లు ఈ నెలాఖరులోగా పెండింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అందించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఖరీఫ్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ బాకీ ఉన్న మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు 1,91,769 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీ ఇవ్వాల్సి ఉండగా.. 1,17,549 మెట్రిక్ టన్నులే డెలివరీ చేశారన్నారు. ఇంకా 74,221 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉందన్నారు. గడువులోపు సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్, డీసీఎస్ఓ ఇన్చార్జి సాయి, రవి, ఇతర సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. గజ్వేల్: ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం గజ్వేల్ మండలం జాలిగామలో వడ్ల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. ఈ సందర్భంగా జాలిగామ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోగా, లారీలు తెప్పించి లోడ్ చేయించి పంపించారు. తడిసిన ధాన్యాన్ని సైతం మిల్లులకు రవాణా చేయాలన్నారు. ఆ తర్వాత గజ్వేల్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ డీఏం ప్రవీణ్, గజ్వేల్ తహసీల్దార్ శ్రావన్కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్వెస్లీ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ -
● పార్టీ బలోపేతానికి కమిటీలు ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: రాబోయే ‘స్థానిక’ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో బుధ వారం రాత్రి సంస్థాగత సన్నాహక సమావేశం నిర్వహించారు. పరిశీలకుడిగా మల్లాది పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పట్టణ కమిటీతో పాటు అనుబంధ సంఘాల కమిటీలు వేసుకోవాలన్నారు. కమిటీలను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అనే పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఇప్పటికే పట్టణంలో ప్రతి వార్డుకు రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. రూ.18 కోట్లతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం స్ధల పరిశీలన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు ఉన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. అక్కన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాఅక్కన్నపేట(హుస్నాబాద్): మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. హుస్నాబాద్ నుంచి వయా అక్కన్నపేట, జనగామ హైవే నాలుగు లేన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 1,240 ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 443 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. కానీ మేము మొదటి దశలోనే 3,500 ఇళ్లు ఇస్తున్నామన్నారు. అలాగే మరో మూడు నెలల్లో 3వేల ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యకర్తలందరూ గ్రామాల్లో ఐక్యంగా ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న కుడి, ఎడమ కాలువల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. -
దైవ సన్నిధిలో అందరం సమానమే
● చిన్ననాటి నుంచే పిల్లల్లో సంస్కృతి నేర్పించాలి ● తీర్థ గోష్టిలో త్రిదండి చినజీయర్ స్వామి ● ఘనంగా కొనసాగుతున్న ఆలయ స్వర్ణోత్సవాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): దైవ సన్నిధిలో ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థగోష్టి, రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ చిన్నపిల్లలను క్రమశిక్షణతో పాటు, మన సంస్కృతి అలవడే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. చిన్నారులను ఆలయాలకు తీసుకురావడం, దైవిక కార్యక్రమాలలో పాల్గొనేలా చేయాలన్నారు. హరీశ్రావు ఆధ్వర్యంలో సిద్దిపేట మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దామన్నారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ జీవితంలో ఎన్ని పదవులు వరించినా, డబ్బులు సంపాదించిన దొరకని మానసిక ప్రశాంతత దైవ సన్నిధిలో దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం దైవ చింతనకు కేటాయించాలన్నారు. దానాలకు, ధార్మిక కార్యక్రమాలకు సిద్దిపేట వాసులే ముందు వరుసలో ఉంటారన్నారు. ఆలయ స్వర్ణోత్సవాల వేళ సిద్దిపేట పట్టణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణతో జిల్లా కేంద్రం మార్మోగింది. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● పరీక్షలు రాయనున్న 9,531 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రథమ సంవత్సరం 5,654, ద్వితీయ సంవత్సరం 3,877 మందితో మొత్తం 9,531 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనున్నాయి. -
తగ్గిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గాయి. 2020లో 541 మంది చిన్నారులు మృతి చెందితే అందులో మగవాళ్లు 285, ఆడవాళ్లు 256 మంది ఉన్నారు. 2021లో 427 మంది చిన్నారులు మృతి చెందగా అందులో మగ వారు 234, ఆడ శిశువులు 193 మంది ఉన్నారు. రెండేళ్లలో ఆడ శిశువులు తక్కువగానే మృతి చెందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు. 2021లో శిశు మరణాలు జిల్లా మగ ఆడ మొత్తం మెదక్ 148 119 267 సిద్దిపేట 20 19 39 సంగారెడ్డి 66 55 121 -
డిగ్రీ పరీక్షలకు చివరి అవకాశం
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీ చదివి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. 2000 నుంచి 2015 సంవత్సరం వరకు డిగ్రీ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు బ్యాక్లాగ్ పేపర్లు పాస్ అయ్యేందుకు చివరి అవకాశంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాడమిక్ సెనెట్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పరీక్షలు 2015–16 విద్యా సంవత్సరం నాటి పాత సిలబస్ (పథకం) ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు జూన్ 17లోగా చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత కళాశాలలో సంప్రదించాలన్నారు. సర్కారు బడులను బలోపేతం చేద్దాం డీఈఓ శ్రీనివాస్రెడ్డి మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచుతూ బలోపేతం చేయాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించి బోధనలో నైపుణ్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, దూల్మిట్ట మండల విద్యాశాఖ అధికారులు వరదరాజు,మీనాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పాఠ్యపుస్తకాల విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రస్తుత విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు విక్రయదారులకు కావాల్సిన పాఠ్య పుస్తకాల ఇండెంట్తో, రూ.1000 బ్యాంకు డీడీని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బి.వివేక్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచేందుకు ప్రతిపాదనలు పంపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కళాశాలలు తప్పుడు ఆడిట్ లెక్కలు చూపిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పరశురాం, అనీష్, భాను ప్రసాద్, అభినయ, కార్తీక్, గణేష్ , అఖిల్, పవన్, విఘ్నేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాలపన్నుపై అవగాహన సిద్దిపేటరూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పన్నులపై సిద్దిపేట, మెదక్ జిల్లాల సహకార సంఘాల సభ్యులతో ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.రాకేశ్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను గూర్చి వివరించారు. అంతకుముందు జిల్లా ఆదాయపు పన్ను శాఖ అధికారి రమణారావు ఆదాయపు పన్ను దాఖలు విధానం గురించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జాయింట్ కమిషనర్ రాకేశ్.. కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డీసీఓ నాగేశ్వర్రావు, డీజీఎం విశ్వేశ్వర్, ఏజీఎం చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెప్మా అక్రమాలపై విచారణ ముమ్మరం
త్వరలోనే నివేదిక అందజేస్తాం: ఆడిట్ అధికారి వెల్లడి గజ్వేల్రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా రుణాల అక్రమాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 15న విచారణ చేపట్టిన జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెండో విడత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదు మహిళా సంఘాల గ్రూపు సభ్యులను పిలిపించుకొని విచారణ జరిపారు. సభ్యుల పేరిట రూ. 2లక్షల రుణాలు ఇప్పించి, తిరిగి అదే సభ్యుల నుంచి మెప్మా అధికారితో పాటు ఓ ఆర్పీ డ్రా చేయించుకొని తీసుకున్నట్లు బయటపడింది. అంతేగాకుండా మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బులను సైతం వీరు వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. జిల్లా ఆడిట్ అధికారి.. మహిళా సభ్యురాళ్ల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి జయశ్రీ మాట్లాడుతూ ఈనెల 15న మొదటిసారి 3 గ్రూపుల్లో విచారణ చేపట్టామన్నారు. తాజాగా మరో 5 మహిళా గ్రూపుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని పొదుపు డబ్బులను సైతం మెప్మా అధికారితో పాటు సిబ్బంది తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఆయా మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలను అదనపు కలెక్టర్కు నివేదిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, ఆడిట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తం హుస్నాబాద్రూరల్: గ్రామీణ మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ లీడర్ సదయ్య సూచించారు. పోతారం(ఎస్) గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపుల గురించి ధైర్యంగా పోలీసులకు చెబితే సత్వరం న్యాయం జరుగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నేరస్తులకు శిక్ష పడేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, ప్రశాంతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. గోవిందుడి కల్యాణం
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025హాజరైన చినజీయర్ స్వామి ● గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా కేంద్రం భక్తుల జయజయధ్వానాల మధ్య గోవిందుడి కల్యాణం అత్యంత కమనీయంగా సాగింది. జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ ఆవరణలో పద్మావతి భూనీళా సమేత శ్రీనివాసుల కల్యాణాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రఘునందన్రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. సాయంత్రం వేళ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీనారాయణ ఆరాధన కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భజనలు, భక్తిగీతాలు ఆలపించారు. దీంతో జిల్లా కేంద్రం గోవిందా నామస్మరణతో మార్మోగింది. నేడు రథోత్సవం... మోహినిపుర వేంకటేశ్వర ఆలయ స్వర్ణోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం తీర్థ గోష్టి జరుగనుంది. అనంతరం సుదర్శన నారసింహ ఇష్టి, సాయంత్రం పట్టణ పురవీధుల్లో శ్రీవారి రథోత్సవం నిర్వహిస్తారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) న్యూస్రీల్ -
రుతు పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● మెన్స్ట్రువల్ కప్స్తో ఎంతో మేలు ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హుస్నాబాద్: మెన్స్ట్రువల్ కప్స్ వాడటం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉంటారని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. పట్టణంలోని తిరుమల గార్డెన్లో పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఋతు ప్రేమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గరీమా అగర్వాల్ హాజరై మాట్లాడారు. మహిళలు నెలసరి క్రమంలో ఉపయోగించే ప్యాడ్స్ వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ప్యాడ్స్తో పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. మెన్స్ట్రువల్ కప్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదదన్నారు. ఒక కప్పు పదేళ్ల వరకు పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా 1000 కప్పులను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీపీఓ దేవకి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, మెడికల్ ఆఫీసర్ మైమూన్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్ నళిని దేవి, మెప్మా ఏడీఎంఎస్ సంతోషి, ఆర్పీలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. -
త్వరలోనే భూ సమస్యలు కొలిక్కి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హుస్నాబాద్: భూ భారతి చట్టం ద్వారా ఆగస్టు 15లోగా వీలైనంత వరకు భూ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం ఘనపూర్లో భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి మంగళవారం మంత్రి పొంగులేటి హెలికాప్టర్ ద్వారా పట్టణంలోని మినీ స్టేడియంలో గల హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి ఘన స్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్తో కలిసి రోడ్డు మార్గం ద్వారా ఘనపూర్కు మంత్రి శ్రీనివాస్రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే సర్వేయర్లను నియమిస్తామని, వారికి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి 8 మంది తగ్గకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ లబ్ధిదారులను ప్రకటిస్తాం మొదటి దశ 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే ప్రకటించామని, ఈ నెలాఖరు లోపు లబ్ధిదారులను ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు అదనంగా అక్కడే ఉండే గిరిజనుల సంఖ్య మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. -
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కరిద్దాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● సిద్దిపేట కోర్టులో పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ అధికారులతో సమావేశం సిద్దిపేటకమాన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ అధికారులతో న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. జూన్ 9నుంచి 14వరకు స్పెషల్ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్కాంబ్లే, సంతోష్కుమార్, తరణి, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘటాభిషేకం.. చక్రతీర్థం
వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం వర్గల్(గజ్వేల్): ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన వర్గల్ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘటాభిషేకం, చక్రతీర్థంతో ముగిశాయి. ఘటాభిషేకంలో భాగంగా అర్చ కులు ఆలయ మండపంలో వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను అధిష్ఠించారు. 21 కలశాలు స్థాపన చేసి పూజలు చేశారు. గర్భగుడిలో మూలవిరాట్టులకు ఘట కలశాభిషేకం నిర్వహించారు. దేవతామూర్తులను పట్టు వస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో కమనీయంగా అలంకరించారు. వసంతోత్సవం అనంతరం ఆలయ కోనేరులో చక్రతీర్థం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు సిద్దిపేటకమాన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 22నుంచి 29వ తేదీ వరకు 27 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు జరగనున్న సమయంలో ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రజలు గూమిగూడి ఉండకూడదని తెలిపారు. కేంద్రాలకు సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి వేసి ఉంచాలన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరంగా రన్ సిద్దిపేటజోన్: భవిష్యత్తులో యుద్ధ వాతావరణం ఏర్పడితే యువత యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో సైన్యానికి మద్దతుగా తిరంగా రన్ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ విధుల్లో కొనసాగింది. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన దేశ సైనికుల త్యాగం గొప్పదని కొనియాడారు. సైనికులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాపురెడ్డి, నారాయణరెడ్డి, జీవన్, లింగారెడ్డి, రాజిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, రవి, అశోక్, వీరన్న, జగదీశ్, శ్రీనివాస్, పండరి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్గల్ ఆలయాలు
ఎంపీలు ఈటల, రఘునందన్రావు వర్గల్(గజ్వేల్): విశేష భక్తజనాదరణతో వర్గల్ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావుతో కలిసి వర్గల్ విద్యాధరి క్షేత్రం సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు మహదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈటల మాట్లాడుతూ వేణుగోపాలస్వామి ఆలయం, విద్యాధరి క్షేత్రాలతో తనకు ముప్పై సంవత్సరాల అనుబంధముందన్నారు. రెండో బాసరగా రూపుదిద్దుకుంటున్న ఇక్కడి సరస్వతి క్షేత్రం లక్షలాది చిన్నారుల జ్ఞాన ప్రదాయినిగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ అధ్యక్షుడు బాల్రెడ్డి తదితరులున్నారు. నేటి యువతకుస్ఫూర్తి ‘పుచ్చలపల్లి’ గజ్వేల్రూరల్: నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన పుచ్చలపల్లి సుందరయ్య నేటి యువతకు స్ఫూర్తి అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం గజ్వేల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పనిచేసిన పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్పై వెళ్ళారని, చిన్ననాటి నుంచి అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నిర్మాతగా అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి, ఐలయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లోపు డివిజన్ ప్రకటించాల్సిందేచేర్యాల జేఏసీ నాయకుల డిమాండ్ చేర్యాల(సిద్దిపేట): త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికల్లోపు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లిగారి యాదగిరి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తొమ్మిదేళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. దీంతో ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్రెడ్డి, కొమ్ము నర్సింగరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పుర్మ ఆగంరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈరి భూమయ్య, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. 28న అథ్లెటిక్స్ ఎంపికలు సిద్దిపేటజోన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28న సెలక్షన్ ప్రక్రియ ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక స్టేడియం మైదానంలో అండర్ 8, 10, 12 సంవత్సరాల బాలబాలికల ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికై న వారికి ప్రశంసాపత్రాలు, ఉత్తమ ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 27లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటకమాన్: తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కింద బ్లడ్ శాంపిల్స్ సేకరణకు ఐదు అద్దె వాహనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 21 నుంచి 28వ తేదీ వరకు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ మనుచౌదరి ● ప్రజావాణిలో 69 దరఖాస్తులు సిద్దిపేట రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయి. గుడి స్థలం ఆక్రమించారు గుడి స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్కు చెందిన వెంకట్ స్వామి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని వీర బ్రహ్మం దేవాలయానికి చెందిన భూమిని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్కు దారి కోసం కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయాలి.. ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని హుస్నాబాద్ పరిధి పోట్లపల్లికి చెందిన లచ్చవ్వ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు రావాల్సిన ఉమ్మడి ఆస్తిని తన పెద్ద కుమారుడు ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. -
మనమెంతభద్రం!
గుల్జార్హౌస్ అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తత అవసరం జిల్లాలో ఆస్పత్రులు, వ్యాపార సంస్థల నిర్వహణ అస్తవ్యస్తం పట్టించుకోని మున్సిపాలిటీలు, అగ్నిమాపక అధికారులు సాక్షి, సిద్దిపేట: హైదరాబాద్లోని చార్మినార్ గుల్జార్ హౌస్లో అగ్నిప్రమాదం ఘటన జిల్లాకు హెచ్చరికలాంటిది. ఈ ఘటనలో 17 మంది చనిపోయిన విషయం విదితమే. జిల్లా విషయానికి వస్తే.. ఏప్రిల్ 2న కొండపాక మండలం మార్పడగ గ్రామంలో ఓ కుటుంబం తాళం వేసి ఊరికి వెళ్లింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో చుట్టు పక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్కు సమచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.15లక్షల నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అధికారులు తెలిపారు. తక్షణం మేల్కోవాలి.. ఈ ఘటనలు చూసైనా జిల్లా వాసులు, మున్సిపాలిటీలు, వ్యాపార సంస్థలు, ఆస్పత్రుల యజమానులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రంలో ఇరుకిరుకు భవనాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణం చర్యలు చేపట్టే అవకాశం లేకుండా ఉంది. అడిగేవారు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల, వ్యాపార సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పట్టణాల్లో విద్యుత్ స్తంభాల పై విద్యుత్ వైర్లు గజిబిజిగా ఉంటున్నాయి. ఇటు మున్సిపాలిటీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. అప్రమత్తం చేస్తున్నాం జల్లాలోని ఆస్పత్రులు, అపార్ట్మెంట్, షాపింగ్ మాల్లలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాం. ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒక సారి అవగాహన కల్పిస్తున్నాం. పైర్ నింబంధనలు పాటించాలి. – గుండయ్య, స్టేషన్ ఫైర్ అధికారి, సిద్దిపేట -
సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025● ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి ● ఈ నెల 22 నుంచి పరీక్షలు ప్రారంభం ● జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డిసిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణకు విధుల్లో పాల్గొననున్న అధికారులకు సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. సీఎస్, డీఓలు ప్రశ్న పత్రాలు సరిపడా ఉన్నాయో లేదా సరి చూసుకోవాలన్నారు. ఆదివారం సైతం పరీక్షలు ఉన్నందున చీఫ్ సూపరిండెంట్లు(సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారు(డీఓ)లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతిరోజు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాలను పోలీస్స్టేషన్లలో భద్రపరచాలన్నారు. మరుసటి రోజు పరీక్షా పత్రాలతోపాటు జవాబు పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేయాలని సూచించారు. పరీక్షాకేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మంచి నీటి విషయంలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకమైన దృష్టి సారించాలని సూచించారు. పరీక్షల కమిటీ సభ్యురాలు జ్యోతి, దేవయ్యలు పరీక్షల నిర్వహణకు అవసరమైన సలహాలు, సూచనలను అందించారు. కార్యక్రమంలో పరీక్షా కేంద్రాల సీఎస్, డీఓలతో పాటు కస్టోడియన్లు పాల్గొన్నారు. న్యూస్రీల్ -
మళ్లీ దంచికొట్టిన వాన
దుబ్బాకలో వర్ష బీభత్సం ● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● కూలిన ఇళ్లు, గుడిసెలు ● నేల వాలిన భారీ వృక్షాలు దుబ్బాక/దుబ్బాకటౌన్: ఉరుములు.. మెరుపులు.. గాలివానతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతులను మళ్లీ వణికించింది. సుమారు 2 గంటలకుపైగా వాన దంచికొట్టడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాశులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాయాతన పడ్డారు. దుబ్బాక మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరుసగా 3 రోజులుగా వాన కురవడంతో రైతన్నను కునుకులేకుండా చేసింది. ధాన్యం అంతా చేతికిరాకుండా పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మళ్లీ వాన పడితే మొలకలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తల్లడిల్లిన పిట్టల వాడ రాత్రి ఒక్కసారిగా గాలి వాన రావడంతో దుబ్బాక పట్టణం 16 వార్డులో పిట్టల వాడలోని ఏడు గుడిసెలు కూలిపోయాయి. రాత్రంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ధర్మాజీపేటలో జనగామ చంద్రయ్య ఇంటిపై భారీ వేప చెట్టు కూకటి వేళ్లతో విరిగి పడడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో నిత్యావరసర సరకులు, టీవీ, తదితర వస్తువులు దెబ్బతిన్నాయని బాధితులు వాపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ ఇల్లు సైతం పాక్షికంగా కూలింది. మరోవైపు చెట్లు విద్యుత్ వైర్లపై పడటంతో స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పట్టణంలో అంధకారం నెలకొంది. విద్యుత్ అధికారులు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
పలువురు డీఎస్పీల బదిలీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కూడా బదిలీలు జరిగాయి. ● జహీరాబాద్ డీఎస్పీ కె.రామ్మోహన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న బి.సైదాను జహీరాబాద్ డీఎస్పీగా నియమించింది. ● పటాన్చెరు డీఎస్పీ పి.రవీందర్రెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్రూంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎస్.ప్రభాకర్కు పటాన్చెరు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని సైదాబాద్ ఏసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూం ఏసీపీగా ఉన్న జే.నరేందర్గౌడ్కు తూప్రాన్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ● సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీఎస్పీగా పనిచేస్తున్న పురుషోత్తంరెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్న కె.నర్సింలుకు గజ్వేల్ డీఎస్పీగా నియమితులయ్యారు. ● సిద్దిపేట ఏసీపీ జి.మధును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రవీందర్రెడ్డి నియమించారు. ● సిద్దిపేట డీసీఆర్బీ ఏసీపీ శంకర్రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా నియమించారు. ● హుస్నాబాద్ డీఎస్పీ వి.సతీష్కు జీడీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎస్.సదానందంను నియమించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. -
కార్యాలయంలో వినియోగిస్తున్నాం
మా కార్యాలయంలో రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తున్నాం. సాధారణ వైట్ పేపర్ మాదిరిగానే ఉన్నాయి. పర్యావరణ రక్షణలో మేము సైతం పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ఈ పేపర్ను వినియోగిస్తున్నాం. అందరూ వినియోగిస్తే బాగుంటుంది. – జయదేవ్, డీఆర్డీఓ, సిద్దిపేట చెట్లను రక్షించవచ్చు కాగితాలను కలప గుజ్జు నుంచి తయారు చేస్తారు. ఇందుకు చెట్లను పెంచి కట్ చేస్తుంటారు. పేపర్లను రీసైక్లింగ్ చేయడంతో చెట్లను రక్షించిన వాళ్లం అవుతాం. టన్ను రీసైక్లింగ్ పేపర్లను వినియోగించడం వల్ల 24 చెట్లను కాపాడిన వాళ్లం అవుతాం. మిస్ వరల్డ్ పోటీలలో రీసైక్లింగ్ పేపర్ బుక్లెట్లను వినియోగిస్తున్నారు. –అక్షయ్ దేశ్పాండే, స్విచ్ ఎకో సంస్థ -
● భక్తజన సంద్రం.. కొమురవెల్లి క్షేత్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేకపూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అలాగే కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టి పూజలు చేశారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
● అయిల్పామ్ టార్గెట్ 6,500 ఎకరాలు ● కొత్త సాగుతో విస్తీర్ణం 19 వేల ఎకరాలకు చేరుకునే అవకాశం ● నర్మెట్ట ఫ్యాక్టరీలో త్వరలో క్రషింగ్ ● ఉత్పత్తులు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఆయిల్పామ్ లక్ష్యం ఈసారి ప్రతిష్టాత్మకంగా మారింది. నర్మెట్ట ఫ్యాక్టరీలో త్వరలోనే క్రషింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాగు లక్ష్యం పెరిగింది. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అందుకు తగ్గట్టు ఉత్పత్తులను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాగును కొత్తగా 6,500ఎకరాల్లో పెంచడానికి కార్యాచరణ సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే 12,500 ఎకరాలకుపైగా సాగులోకి రాగా, కొత్త చేపట్టబోతున్న సాగుతో మొత్తం విస్తీర్ణం19వేల ఎకరాలకుపైగా పెంచాలనే లక్ష్యంతో సంబంధిత యంత్రాంగం ముందుకు సాగుతోంది. గజ్వేల్: జిల్లాలో ఆయిల్పామ్ ఫలాలు ప్రారంభమయ్యాయి. 2021–22లో ప్రారంభమైన సాగు ప్రస్తు తం 12,500ఎకరాలకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే 600టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. నర్మెట్ట ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ ప్రారంభం కాకపోవడంతో.. ఆశ్వరావుపేటలోని ఫ్యాక్టరీకి ఇక్కడి ఉత్పత్తులను తరలిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ కూడా ప్రాసెసింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఉత్పత్తులను పెంచడానికి అధికార యంత్రాంగం సాగు లక్ష్యాన్ని పెంచింది. ఈ సీజన్లో 6,500ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా చూడాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి మూస పద్ధతుల్లో సాగు కొనసాగడం వల్ల రైతులకు వ్యవసాయం పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్పామ్ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఆయిల్పామ్ సాగు పట్ల ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, సాధారణ రైతులకు 80శాతం సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నారు. మొక్కలతోపాటు ఆయిల్పామ్ తోటల యాజమాన్యానికి అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. ఆయిల్పామ్ గెలల తరలింపుత్వరలోనే క్రషింగ్ ఆయిల్పామ్ పండించిన రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి నర్మెటలో రూ.300కోట్లతో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఇక్కడ క్రషింగ్ను ప్రారంభించి జిల్లా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో గంటకు 30టన్నుల ఆయిల్పామ్ క్రషింగ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రాబోవు రోజుల్లో దీని సామర్థ్యం పెరగనున్నట్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సిద్దిపేటతోపాటు ఈ ప్యాక్టరీ వల్ల ప్రయోజనం పొందే జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లోనూ సాగు పెంపుపై ఫోకస్ పెట్టారు.రైతులను చైతన్యపరుస్తున్నాం జిల్లాలో ఈసారి ఆయిల్పామ్ సాగు లక్ష్యం 6,500 ఎకరాలను సాధించడానికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తాం. ఫ్యాక్టరీలో త్వరలోనే క్రషింగ్ ప్రారంభంకానుండటంతో రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు తీరుతాయి. టన్నుకు రూ.20వేల వరకు ధర పొందే అవకాశం ఉంది. లాభాలిచ్చే ఈ పంట వైపు మళ్లాలని రైతులను చైతన్యపరుస్తున్నాం. – సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
పర్యావరణ హితమే..
రీసైక్లింగ్ పేపర్లను ఒక టన్ను వినియోగించడం వల్ల ఇరవై నాలుగు చెట్లను రక్షించ గలుగుతాం. అలాగే నీళ్లు, విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. చెట్టు కాండం నుంచి గుజ్జును చేసి దాని నుంచి కాగితాన్ని తయారు చేస్తారు. ఇలా తొలిసారిగా వచ్చిన కాగితాన్ని ఐదుసార్లు రీసైక్లింగ్ చేసే వీలుంది. ఇలా దాదాపు 100 చెట్లను నరకకుండా రక్షించవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రీసైక్లింగ్ పేపర్ను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. -
కాగితం.. కొంగొత్తగా
రీ సైక్లింగ్తో తిరిగి వినియోగం ● ప్రయోగాత్మకంగా సిద్దిపేట డీఆర్డీఏలో అమలు ● మిస్ వరల్డ్ పోటీల బుక్లెట్లకూ ఈ పేపరే.. ● పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు ప్రింటెడ్ పేపర్ అవసరాలు తీరిన తర్వాత పడేస్తుంటాం.. చెత్త వ్యర్థాలు పెరిగిపోతుంటాయి.. అలాంటి వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వైట్ పేపర్గా తయారు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) కార్యాలయంలో రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తూ పర్యావరణ హితంగా నిలుస్తున్నారు. అలాగే హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల బుక్లెట్ల కోసం రీసైక్లింగ్ పేపర్ను వినియోగిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: రీసైక్లింగ్ కాగితం అచ్చం సాధారణ పేపర్ మాదిరిగానే ఉంటుంది. సాధారణ కాగితాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారో అలాగే వినియోగించవచ్చు. ప్రస్తుతం ఏ4 సైజు పేపర్లను సరఫరా చేస్తున్నారు. వీటిని బెండల్ (వెయ్యి) ఏ4సైజు పేపర్లు రూ. 250 నుంచి రూ.270 వరకు విక్రయిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మొత్తం ఇవే పేపర్లను వినియో గిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు సైతం రీసైక్లింగ్ పేపర్లతో తయారు చేసిన నోట్బుక్లనే వినియోగిస్తుండటం విశేషం. -
రంగనాయక సాగర్కు హైకోర్టు న్యాయమూర్తి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధా ఆదివారం మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల అతిథి గృహానికి విశ్రాంతి కోసం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన న్యాయయూర్తి శ్రీసుధా తిరుగు ప్రయాణంలో రంగనాయక సాగర్ అతిథి గృహంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గురించి కాసేపు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీఓ సదానందం, ఏసీపీ మధు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 23న జహీరాబాద్కు ముఖ్యమంత్రి రాక!సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్ లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదగిరి వర్గల్(గజ్వేల్): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన దుండిగల్ యాదగిరి నియమితులయ్యారు. మండలంలో సీఆర్పీగా పనిచేస్తున్న యాదగిరి ప్రస్తుతం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకం చేసినట్లు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్ల ఐక్యత, అభివృద్ధి కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు. వ్రత శోభితం.. భక్తజన సందోహంవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు, వారాంతపు సెలవు కలిసి రావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, నృసింహుని కల్యాణం, నిజాభిషేకాలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తరించారు. క్షేత్రంలో 20 సత్యనారాయణ వ్రతాలు, 16 కల్యాణాలు, 10 అభిషేకాలు జరిగినట్లు ఆలయ పర్యవేక్షకులు సుధాకర్గౌడ్ తెలిపారు. -
సంగారెడ్డి వాసికి ప్రధాని మోదీ అభినందనలు
జహీరాబాద్: భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లావాసి పట్లోళ్ల లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. కోహీర్ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల లక్ష్మీకాంత్రెడ్డి నాలుగేళ్ల క్రితం భారత వైమానిక దళంలో చేరి ప్రస్తుతం ఫ్లైట్ లెఫ్టినెంట్ ర్యాంక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్తో జరిగిన అప్రకటిత యుద్ధం నేపథ్యంలో మిగ్ యుద్ధ విమానం, గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శనచక్ర ఎస్–400ను ధ్వంసం చేశామని పాక్ చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపించేందుకు ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లి దాని ఎదుటే నిల్చుని ప్రసంగించారు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న లక్ష్మికాంత్రెడ్డిని ప్రధాని మోదీతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా భారత జవాన్లనుద్దేశించి ‘మీ మెరుపు వేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసిందని, భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగి పోయార’ని ప్రధాని అభినందించారు. ప్రధానితో కరచాలనం చేసి, అభినందనలు పొందడం తమకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని లక్ష్మీకాంత్రెడ్డి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పేర్కొన్నారు. -
డ్రై డే పాటిద్దాం
పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ సిద్దిపేటకమాన్: ప్రతి శుక్ర, మంగళవారాల్లో డ్రై డే పాటించాలని పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో వైద్య సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వినియోగంలో లేని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సు
ిసిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో త్వరలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఓయూ వైస్ చాన్స్లర్ మొలుగురం కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓయూ పీజీ కళాశాలను ఓయూ బృందం పతినిధులు సందర్శించారు. కళాశాలలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఓయూ ప్రతినిధుల బృందం కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఓయూ పీజీ కళాశాలలోని సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెందర్ కుమార్ నాయక్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, మౌలికసదుపాయాల డైరెక్టర్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి, యూనివర్సిటీ పీజీ (ఓయూ) కళాశాల సమన్వయకర్త డాక్టర్ రవినాథ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మొలుగురం కుమార్ -
నాణ్యమైన విద్యను అందిద్దాం
పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిద్దామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం, ఏఐ శిక్షణ తరగతులు, స్కూల్ యూనిపామ్ల తయారీ, ఉపాధ్యాయ శిక్షణ తరగతులను, కేజీబీవీ సమ్మర్ క్యాంప్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి యూనిపామ్లు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమ్మర్ క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు తమ బోధనను మరింత మెరుగుపర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు దోహదపడుతాయన్నారు. కార్యక్రమాలలో జిల్లా కమ్యూనిటిటీ మోబిలైజింగ్ అధికారి రంగనాథ్, శిక్షణ తరగతుల నిర్వహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
తనిఖీలు సరే.. రికవరీ ఏదీ?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రతీ ఏటా ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలను వెల్లడిస్తారు. కానీ బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడం లేదు. 2018 నుంచి 2025 మార్చి వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో రూ.6.71కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కానీ రికవరీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. దీంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ●● మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉపాధిహామీ పథకంలో రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహించారు. జనవరి 9న మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీలో లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. పని జరగకపోయినా పని జరిగినట్లు రికార్డుల్లో పొందుపర్చడం, మస్టర్లో సంతకాలు లేకుండా చెల్లింపులు చేయడం, తక్కువ పనికి ఎక్కువ చెల్లింపులు జరిగినట్లు తనిఖీ బృందం నిర్ధారించింది. కానీ రికవరీ జాడలేదు. ● మిరుదొడ్డి మండలంలో మార్చి 17న ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. 2024–25లో రూ.2.03,463 అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నా రికవరీ కాలేదు. సాక్షి, సిద్దిపేట: గ్రామీణ పేదలకు పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీ పనులలో భాగంగా గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తీయడం, కల్లాల నిర్మాణం చేపడుతున్నారు. పనుల్లో పారదర్శకత పాటించేందుకు సామాజిక తనిఖీ విధానాన్ని తీసుకవచ్చారు. ఏ స్థాయిలో అవినీతి జరిగినా ప్రజావేదికలో తెలిపోనుంది. పనుల్లో నాణ్యత లేకపోయినా అడిగేవారు కరవయ్యారు. అవకతకలు గుర్తిస్తున్నా మార్పు కనిపించడం లేదు.ఈ పథకంలో ఎక్కువగా కాంట్రాక్ట్ సిబ్బంది ఉండటంతోనే నిధుల దుర్వినియోగం ఆగడం లేదు. రూ.5.36 కోట్లు పెండింగ్ జిల్లా వ్యాప్తంగా 1.97లక్షల జాబ్ కార్డులుండగా 3.94 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తుంటారు. 2018– 25 వరకు 38,722 పనుల్లో జరిగిన అవకతవకల్లో రూ.6,71,42,134 అక్రమార్కులు సొంతానికి వాడుకున్నట్లు తనిఖీల ద్వారా బయటపడింది. వీటిలో ఇప్పటి వరకు కేవలం రూ.1,34,86,250 మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5,36,55,884 రికవరీ పెండింగ్లో ఉంది. సామాజిక తనిఖీలపై పెట్టిన దృష్టి మండల స్థాయి అధికారులు రికవరీపై పెట్టకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికవరీ లేకపోవడంతో ఉత్తుత్తి సామాజిక తనిఖీలుగానే మిగిలిపోతున్నాయి. నో ఫీల్డ్ విజిట్.. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్లు చేయకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. కూలీలు పనులు చేయకున్నా... చేసినట్లు రికార్డు చేస్తున్నారు. అంతేకాకుండా పనులు ఎక్కడ చేస్తున్నారనేది అధికారులకు తెలియడం లేదు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపడతాం ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. వాటిలో తేలిన అవకతవకలను బహిర్గతం చేస్తున్నాం. గోల్మాల్ జరిగిన డబ్బులను రివకరీ కోసం ప్రత్యేక డ్రైవ్ను త్వరలో ఏర్పాటు చేస్తాం. రెండు నుంచి మూడు నెలల్లో దాదాపు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. –జయదేవ్, డీఆర్డీఓ ఉపాధిలో అక్రమాలు వెలుగు చూస్తున్నా చర్యలు అంతంతే 2018–25 వరకు 38వేల పనుల్లో అవకతవకలు రూ.6.71 కోట్ల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారణ అయినా ఇప్పటి వరకు రూ.1.34కోట్లే స్వాధీనం ఇంకా పెండింగ్లోనే రూ.5.36కోట్లు -
విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి
సిద్దిపేటరూరల్: ‘విద్యాభివృద్ధే లక్ష్యం కావాలి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా కృషి చేయాలి. విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలి అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 16, 17వ ఎంపీ నిధుల ద్వారా మంజూరై పూర్తికాని పనులు, నిధుల వివరాలను అందించాలన్నారు. తొగుట మండలంలో ఇరిగేషన్ కాలువల తవ్వకం వల్ల వచ్చిన మట్టి, రాళ్లను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుంతో ఇవ్వాలన్నారు. ఎన్సాన్పల్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామన్నారు. దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులతో సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ కల్పించాలన్నారు. దుబ్బాకలో న్యాక్ వారి సహకారంతో ప్రజలు విదేశాలలో కూడా ఉపాధి పొందేలా వివిధ కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే టెన్త్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన చేయాలన్నారు.కమిషనర్ గైర్హాజర్పై ఆగ్రహం సిద్దిపేట మున్సిపాలిటీ కమిషనర్ దిశా సమావేశానికి రాకపోవడంపై ఎంపీ రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అండర్గ్రౌండ్ నిర్మాణానికి అందించిన నిధులు, పనుల వివరాలను చర్చించేందుకు కమిషనర్ రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ను సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి దిశా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ -
నేత్రపర్వం.. మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శుక్రవారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. చదువుల తల్లికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు తెల్లవారుజామున అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. సామూహిక లక్షపుష్పార్చన చేశారు. చండీ హోమం నిర్వహించారు. పలువురు చిన్నారులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేశారు. భక్తులు వేడుకలు తిలకించి తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
మూడెకరాల భూమి ఏమాయె
అక్కన్నపేట(హుస్నాబాద్): నిరుపేదలకు మూడెకరాల సాగు భూమి హామీ నేటికీ అమలు కావడంలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి అన్నారు. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో మండల మహసభ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు కోసం సీపీఐ నిరంతర అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం కాదని, గిట్టుబాటు ధరను రైతులే ప్రకటించేలా హక్కులు కల్పించాలన్నారు. ఉద్యమాలు, ఎర్రజెండాలకు కేరాఫ్ హుస్నాబాద్ నియోజకవర్గమన్నారు. ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి.. తాగు, సాగు నీరు కోసం ఎర్రజెండా నీడలో అనేక ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులని చాడ అన్నారు. కానీ నేటి పాలకులు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాలువల నిర్మాణానికి సుమారుగా రూ.431కోట్లు మంజూరైనట్లు చెప్పి ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం చేపట్టకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతానికి సాగు నీరు రాలేదని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సీపీఐ సత్తాచాటాలని, ఆదిశగా ప్రతి కార్యకర్తలు సైనికులా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు జాగిరి సత్యనారాయణ, ఎడల వనేష్, జనార్దన్, కోయ్యడ కోమురయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు నీరు రాలే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాల్సిందేహుస్నాబాద్: చట్ట సభలకు ఎన్నికై పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వాదులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండాలన్నారు. అధికారుల్లో అవినీతి పెరుకుపోయిందన్నారు. గౌరవెల్లి. గండిపెల్లి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని అనవసరంగా పెంచారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: ఇంటర్ అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం గరిమా అగర్వాల్ అధ్యక్షతన పరీక్షల నిర్వాహణపై సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 29వ తేది వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయన్నారు. సమావేశంలో రెవెన్యూ, వైద్య, మిషన్ భగీరథ, పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
రాయపోల్లో చిరుత కలకలం
దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం వడ్డేపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వరుస దాడులతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల పొలాల వద్ద రెండు కుక్కలపై దాడి చేసి చంపడంతో ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 4 నెలల వ్యవధిలో చిరుత మూడు సార్లు కనిపించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రివేళల్లో, వేకువజామున పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరిన్ని దాడులు జరగకుండా చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు. ఆచూకి కోసం.. దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో చిరుత పులి ఆచూకి కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత పులిని చూసిన రైతుల నుంచి వివరాలు సేకరించారు. కనబడిన ప్రదేశాన్ని పరిశీలించి పాద ముద్రలను పరిశీలించి చిరుత పులేనని నిర్ధారించారు. చిరుత పులి జాడ కోసం అడవిలో అనుమానిత ప్రదేశాల్లో అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కదలికలను సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఒకే చోట ఉండదు చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఎప్పుడూ ఒకే చోట ఉండదు. రైతులు రాత్రి వేళ పొలాల వద్ద ఉండవద్దు. పశువులను సైతం ఇంటి వద్దే ఉంచాలి. పశువుల మేత కోసం ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – సందీప్ కుమార్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, దుబ్బాక గ్రామ సమీప పొలాల్లో సంచారం వరుస దాడులతో ప్రజల్లో భయాందోళన జాడ కోసం చర్యలు ముమ్మరం ట్రాప్ కెమెరాల ఏర్పాటుఅధికారుల సూచనలు వ్యవసాయ పొలాలు అడవికి దగ్గరగా ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వాలి. పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయవద్దు. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి దగ్గరగా ఉన్న పాలాల్లో ఒంటరిగా తిరుగవద్దు. రాత్రి వేళ రైతులు పొలాల వద్ద ఉండవద్దు. -
మా భూములకు హక్కులు కల్పించండి
అక్కన్నపేట(హుస్నాబాద్): మా భూములకు హక్కులు కల్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. మండల పరిధిలోని నందారంలో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 930 ఎకరాల వరకు పచ్చని పంట పొలాలన్నీ సీలింగ్ భూములుగా ఉండడంతో అమ్మకాలు, కొనుగోలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడంలేదన్నారు. తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న కొహెడ మండల తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు.భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల నిరసన -
ప్రగతి బాటలో కీలక అడుగు
ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రాజెక్ట్ ప్రగతి బాటలో మరో కీలక అడుగు పడింది. ట్రిపుల్ఆర్, జాతీయ రహదారుల సమాహారం, రైల్వేలైన్ ఇతర సానుకూల అంశాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996కోట్ల వ్యయంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి కేంద్రం టెండర్లను పిలిచింది. ఇందుకోసం సుమారు 350ఎకరాల భూసేకరణ కూడా పూర్తయ్యింది. గజ్వేల్: మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు(బహుళవిధ సరుకు రవాణా సేవల సముదాయం) నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం 16 లాజిసిక్స్ పార్కులను మంజూరు చేసింది. అందులో మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో నిర్మించనున్న పార్కు ఒకటి. రూ.996కోట్ల అంచనాల వ్యయంతో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ అయిన నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎల్ఎమ్ఎల్) టెండర్లను పిలిచింది. ఈమేరకు పత్రికల్లో ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడానికి నిర్ణయించారు. వేల కోట్ల పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టుకు నేరుగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ సరుకు రవాణా, సమీకరణ, పంపిణీ లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం త్వరలోనే నిర్మించనున్న ట్రిపుల్ఆర్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మచిలీపట్నం వరకు రోడ్డు కనెక్టివిటీ అవకాశాలు ఉండటంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందడానికి అవకాశం కలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ లాజిస్టిక్ పార్కు నిర్మాణం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ జిల్లా వస్తు రవాణా రంగంలో హబ్గా మారితే.. దీనికి అనుబంధంగా మరెన్నో పరిశ్రమలకు ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ కారణంగా గజ్వేల్లో ఇప్పటికే గూడ్స్ రైళ్లు నడుస్తుండగా, ఎరువుల రేక్ పాయింట్ విజయవంతంగా నడుస్తోంది. లాజిస్టిక్ పార్కు ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనునుంది. దీని ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఎన్నో అనుకూలతలు.. ఎన్నో అనుకూలతల కారణంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి పరికిబండ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే.. ఈ ప్రాంతానికి 44వ నంబర్ ఆరువరుసల జాతీయ రహదారి, కొత్తగా నిర్మాణం కానున్న ట్రిపుల్ఆర్కు సమీపంలో ఉండటం, ఇక్కడి నుంచి హైదరాబాద్, కొత్తపల్లి రైల్వేలైన్లు అనుసంధానం కావడం, హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం కూడా చేరువలో ఉండటం కలిసి వచ్చింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కునిర్మాణానికి సన్నాహాలు పరికిబండ శివారులో350ఎకరాల భూసేకరణ రూ.996కోట్లతో టెండర్లకు ఆహ్వానం లక్షలాదిమందికి ఉపాధి కల్పనే లక్ష్యం -
సరికొత్త సాగుపై దృష్టి సారించండి
నేత్రపర్వం.. తెప్పోత్సవం మిన్నంటిన శ్రీరామ నామస్మరణతో గురువారం రాత్రి కోమటిచెరువులో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. గంగమ్మ ఒడిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా అలంకరించిన బోటులో హనుమంతుని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చెరువు అంతా తిప్పారు. అంతకుముందు రావిచెట్టు హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా కోమటిచెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులో తెప్పోత్సవం వైభోవంగా చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్రావు, పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ, మాలధారులు పెద్ద ఎత్తున పొల్గొని తరించారు. – సిద్దిపేటజోన్ ● పంట మార్పిడితోనే అధిక లాభాలు ● నేపియర్ గడ్డి సాగుతో45 రోజుల్లోనే కోత ● ఎకరం పంటకు రూ.70వేల వరకు ఆదాయం : కలెక్టర్ మనుచౌదరిఅక్కన్నపేట(హుస్నాబాద్): వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగు కాకుండా సరికొత్తగా సాగు చేసేలా ప్రతి రైతు ఆలోచించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మండల పరిధిలోని కుందనవానిపల్లిలో గురువారం ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కృషికల్ప సహకారంతో గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయన్నారు. అందులో అక్కన్నపేట మండలంలోని ప్రసిద్ధ, సహస్ర సంఘాల ద్వారా సరికొత్త పంట సాగు వైపు దృష్టిసారించామన్నారు. పంట మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కృషికల్ప సహకారంతో నేపియర్ గడ్డి సాగుకు రైతులందరూ ఆలోచించుకోవాలన్నారు. ఈ గడ్డి సాగు కేవలం 45రోజులోనే కోతకు వస్తుందన్నారు. నేపియర్ గడ్డి ఒక ఎకరంలో సాగు చేస్తే దాదాపు రూ.70వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ గడ్డితో బయోగ్యాస్ తయారు చేస్తారన్నారు. గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల్లో సుమారు 300ఎకరాల్లో ఈ గడ్డి సాగు చేసేలా రైతులు ముందుకు రావాలన్నారు. ఈ ప్రాంతంలోనే రూ.50కోట్ల వ్యయంతో బయోగ్యాస్ తయారీ కంపనీ ఏర్పాటు చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, హార్టికల్చర్ అధికారి సువర్ణ, కృషికల్ప వ్యవస్థాపకులు పాటిల్, బయోగ్యాస్ కంపెనీ సీఈఓ గుప్తా, హుస్నాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఏలేటి స్వామిరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. నాణ్యమైన ఉచిత విద్యసిద్దిపేటరూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్య అందుతోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో 6 మైనారిటీ గురుకులాలకు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, 2025– 26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో మైనార్టీ గురుకులాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రవేశం పొందాలన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ కో ఆర్డినేటర్ సుధారాణి, జిల్లాలోని మైనార్టీ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శం
ములుగు(గజ్వేల్): అంబేడ్కర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ములుగు మండలం బస్వాపూర్లో గురువారం ఎంపీ రఘునందన్ రావుతో కలసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఎంపీ రఘునందన్ రావు మట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు అంబేడ్కర్ వల్లే వచ్చాయన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అంబేడ్కర్పై పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరీ శంకర్ ముదిరాజ్, బీజెపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్గౌడ్, శ్రీనివాస్గుప్తా, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంతోనే దళితులకు హక్కులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
వారంలో సీఎం రేవంత్ పర్యటన!
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం న్యాల్కల్(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. స్థానిక ఎంపీపీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో సీఎం జహీరాబాద్కు వస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజల నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. న్యామతాబాద్, శంశల్లాపూర్, టేకూర్, హుస్సేన్ నగర్, మల్గి, కాకిజన్వాడ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. డప్పూర్, న్యామతాబాద్, వడ్డి, హద్నూర్, రుక్మాపూర్, రాంతీర్థ్ తదితర గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య గురించి విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, రాజీవ్ వికాస్ తదితర పథకాలను గూర్చి సమావేశంలో చర్చించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, డీఈఈ సుజాన్, డీపీఓ సాయిబాబా, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, ఆర్డీవో రాంరెడ్డి, ఎంపీఓ సౌజన్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
దండిగా ధాన్యం
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు ● సకాలంలోనే ఖాతాలో డబ్బులు నంగునూరు(సిద్దిపేట): గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు కేంద్రాలు కళకళ లాడుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నా ఆకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నంగునూరు మండలంలో ఐకేపీ ద్వారా ఏడు, పాలమాకుల పీఏసీఎస్ నుంచి 12, నంగునూరు పీఏసీఎస్ ఆద్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని గ్రామాల రైతులు ప్రస్తుత సీజన్లో దొడ్డు రకం వరితో పాటు సన్న వడ్లను సాగు చేశారు. వరి కోతలు ప్రారంభం కాగానే ఇప్పటి వరకు అన్ని సెంటర్లలో ఆశించిన స్థాయికి మించి ధాన్యం కొనుగోలు చేశారు.23 సెంటర్ల ద్వారా .. నెల రోజుల కిందట అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారుల ప్రారంభించారు. 23 సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 2,809 మంది రైతుల నుంచి 1,19,808 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఇందులో ఐకేపీ ద్వారా 1,130 మంది రైతుల నుంచి 41,630 క్వింటాళ్లు, పాలమాకుల పీఏసీఎస్ ద్వారా 1,127 మంది రైతుల నుంచి 54,238 క్వింటాళ్లు, నంగునూరు పీఏసీస్ ద్వారా 552 మంది రైతుల నుంచి 23,940 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పడు ట్యాబ్లో ఎంట్రి చేసి వడ్లను మిల్లుకు తరలిస్తుండడంతో సకాలంలోనే తమ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని రైతులు తెలిపారు. -
నిబంధనలు పక్కాగా పాటించాలి
కండీషన్ లేని స్కూల్ బస్సులనుసీజ్ చేస్తాం: డీటీఓ క్రిస్టోఫర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సుల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ సూచించారు. బుధవారం జిల్లా కార్యాలయంలో స్కూల్ బస్సు యజమానులు, ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల ఫిట్ నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్కూల్ యజమానులు పక్కన పెట్టాలని, రవాణా శాఖ నిబంధనల మేరకు నిర్ణీత గడువు దాటినా వాటిని స్క్రాప్ పరిధిలో చేర్చడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సు ను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కండిషన్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బస్సులో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉండేలా బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందులో అవసరమైన అత్యవసర మందులు ఉంచాలని సూచించారు. ప్రతి బస్సులో అత్యవసర ద్వారం ఉండాలన్నారు. త్వరలో స్కూల్ బస్సుల ఫిట్ నెస్, నిబంధనలపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. -
భక్తులకు ఇబ్బందులు రావొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం స్థానిక పోలీసులకు సూచించారు. బుధవారం ఆలయంలోని గంగిరేణిచెట్టు ప్రాంగణం, సాధారణ, వీవీఐపీ దర్శనం తదితర ప్రదేశాలతో పాటు కొమురవెల్లి పోలీస్స్టేషన్ను చేర్యాల సీఐ శ్రీనుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పరిసరాలలో సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జేబుదొంగలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ మమ్మురం చేయాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డుప్రమాదాల వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేస్తూ ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని అన్నారు. అనంతరం చేర్యాల మండలం గురిజకుంట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలిమద్దూరు(హుస్నాబాద్): అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందికి సూచించారు. బుధవారం మద్దూరు పోలీస్స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్లు ఏసీపీకి పూలమొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలన్నారు. అనతంరం ఏసీపీని జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపకులు కొత్తపల్లి సతీష్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ సదానందం కొమురవెల్లి మల్లన్న ఆలయ సందర్శన శాంతిభద్రతలపై సిబ్బందికి సూచనలు -
ఎల్లమ్మ తల్లి సన్నిధిలో జిల్లా జడ్జి
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం జిల్లా జడ్జి సాయి రమాదేవి, ఏసీపీ సదానందంలు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందించి వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేడు హనుమాన్ తెప్పోత్సవం సిద్దిపేటకమాన్: పట్టణంలోని కోమటిచెరువులో గురువారం హనుమాన్ తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో మాలధారులకు అన్నప్రసాదం 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నామన్నారు. దేవాలయం నుంచి శోభాయాత్రగా బయలుదేరి కోమటి చెరువు వద్ద తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్య, ట్రస్ట్ సభ్యులు నేతి కై లాసం, గ్యాదరి పరమేశ్వర్, నందిని శ్రీనివాస్, కుమ్మరికుంట రమేష్, తిప్పరాజు మధుసూదన్, చింత శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ హైదరాబాద్లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంతరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు, తల్లి లేదా తండ్రి లేని బాలికలు టెన్త్ పాసై ఉన్న వారు అర్హులన్నారు. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్ రెండో అంతస్తు, రూమ్ నంబర్ 528లో సంప్రదించాలని సూచించారు. రేపు క్రికెట్ జట్టు ఎంపిక సిద్దిపేటజోన్: అండర్ –25 విభాగంలో జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 16న నిర్వహించనున్నట్లు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జట్టును ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 31అగస్టు 2000వ సంవత్సరం తర్వాత జన్మించిన వారు జట్టు ఎంపికకు అర్హులని పేర్కొన్నారు. -
తీరుతున్న వేళ
ఏళ్ల కల..హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాలఈ ప్రాంత విద్యార్థుల ఎన్నో ఏళ్ల కల సాకారం కాబోతోంది. ఇంజనీరింగ్ విద్య చదివే విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. హుస్నాబాద్ ప్రాంతంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మాపూర్ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మంగళవారం భూమిని చదును చేసే పనులను కలెక్టర్ పరిశీలించారు. హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచే కళాశాల స్థాసనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కళాశాల నిర్మాణానికి రూ.44.12 కోట్ల నిధులు సైతం ప్రభుత్వం మంజూరు చేసింది. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి చదును చేసే పనులు ప్రారంభించారు. కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి పనులను పరిశీలించారు. జిల్లాలోనే మొదటి కళాశాల జిల్లాలోనే హుస్నాబాద్లో మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ (ఐటీ), బీటెక్ (ఈసీఈ) ప్రతి ప్రోగ్రాంలో 60 సీట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో కళాశాలలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. కళాశాల నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా హుస్నాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాల పై అంతస్తులో తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పొన్నం ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ చూపి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయించారు. కరీంనగర్కు మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్కు తరలించడంపై కరీంనగర్లోని కొందరు నేతలు అభ్యంతరం చెప్పి వివాదానికి తెర లేపారు. ఎవరు ఎమన్నా మంత్రి పొన్నం తనను గెలిపించిన హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడంలో విజయం సాధించారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి.. పొతారం (ఎస్) నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు రహదారి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.11 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇంజనీరింగ్ కళాశాలతో హుస్నాబాద్ ప్రాంతం రవాణా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నిర్మాణానికి చర్యలు ముమ్మరం 30 ఎకరాల్లో భూమి కేటాయింపు చదును చేసే పనులను పరిశీలించిన కలెక్టర్ విద్యాభివృద్ధికి కృషి హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్యాపరంగా మరింత అభివృద్ధి చేస్తా. ఇంజనీరింగ్ కళాశాలతో పేద విద్యార్థులకు ఎంతో మేలు. ఇంజనీరింగ్ విద్య కోసం పట్టణాలకు వెళ్లకుండా విద్యార్థుల ముంగిటకే కళాశాలను తెచ్చాను. భవిష్యత్లో విద్యాపరంగా మరిన్ని సదుపాయాలు కల్పిస్తా. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలి. – పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్
హుస్నాబాద్రూరల్: జిల్లెలగడ్డలో నేషనల్ అకాడమీ సెంటర్ (న్యాక్) భవనం నిర్మించేందుకు స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని సర్వే నంబర్ 265లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామీణ భవన నిర్మాణ రంగ కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి న్యాక్ భవనం ఉపయోగపడుతుందన్నారు. భూమిని న్యాక్ అధికారులకు అప్పగిస్తే భవన నిర్మాణ శంకుస్థాపనకు సిద్ధం చేస్తారన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు చూపిన స్థలంలో ఆర్అండ్బీ గెస్టు హౌస్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. హుస్నాబాద్కు 150 పడకల అస్పత్రి మంజూరు అయిందని, దీనిని పాత ఆస్పత్రి భవనాలను కూల్చి అదే స్థలంలో నిర్మించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఎల్లమ్మ చెరువు పర్యటక పనులను పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. ఎండల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులను వర్షం, గాలి దుమారం ఆగమం చేసింది. రోజుల తరబడి మార్కెట్లోనే ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కుప్పలన్నీ నీటి కాలువల్లో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కుప్పలపై కప్పిన ప్లాస్టిక్ కవర్లు సైతం కొట్టుకుపోయి ధాన్యమంతా నీటి పాలైంది. భారీ నష్టం జరగడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగు చేసేందుకు ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. అక్కెనపల్లి లోని ఆయిల్పామ్ తోటను మంగళవారం డీపీఓ దేవకీదేవి, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. 11 నెలల్లో 26 టన్నుల దిగుబడి రావడంతో రూ.4 లక్షల 60 వేల ఆదాయం వచ్చిందని రైతు నాగేంద్రం చెప్పడంతో ఆయనను అభినందించారు. మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు. నర్మేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల రికార్డులను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా చేపట్టాలని అధికారులను సూచించారు. పాలమాకుల ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. ఆమె వెంట హౌసింగ్ డిప్యూటీ ఈఈ శంకర్, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప, గీత, భాస్కర్రెడ్డి, ప్రభాకర్రావు, మౌని, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై వేణుగోపాలుడు
వర్గల్(గజ్వేల్): పురాతన వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు గర్భగుడిలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి మూల విగ్రహాలకు అభిషేకం నిర్వహించి విశేషాలంకరణ చేశారు. రాత్రి స్వామివారి గరుడోత్సవసేవ నేత్రపర్వం చేసింది. సర్వాలంకారశోభితులైన వేణుగోపాలస్వామివారు, రుక్మిణి సత్యభామ సమేతులై గరుడవాహనం అధిష్ఠించారు. పురవీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సేవలో భక్తులు పాల్గొని తరించారు. నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు -
బెజ్జంకి తహసీల్దార్గా వెంకట్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): మండల తహసీల్దార్గా వెంకట్రెడ్డి మంగళవారం బదిలీపై వచ్చారు. ఇక్కడి తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి మిరుదొడ్డి మండలానికి బదిలీ అయ్యారు. సిద్దిపేట రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకట్రెడ్డిని బెజ్జంకి బదిలీ చేశారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటీ గోపాల్, ఆర్ఐ సంతోష్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. కాళేశ్వరంతో చెరువులు నింపండి చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి నీటితో మండల పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అనంతసాగర్లోని అప్పలాయ చెరువు, లింగాయకుంట కలుపుతూ కాలువ నిర్మించాలని, దీంతో చెరువు, కుంటల్లో నీరు నిండి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అధికారులు కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా నాయకులు మడిపల్లి బాపయ్యలు పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్ నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లోమా, వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం మంగళవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట ఐదు, గజ్వేల్లో మూడు కలిపి మొత్తం ఎనమిది సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా సిద్దిపేటలో 2,606 మందికి 2,467 మంది విద్యార్థులు హాజరయ్యారు. గజ్వేల్లో 1,195 మందికి 1,129 మంది పరీక్ష రాశారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల కన్వీనర్, రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, రెండు వారాల్లో ఫలితాలు వెళ్లడి అవుతాయన్నారు. అన్ని సెంటర్ల నుంచి వచ్చిన పరీక్ష పేపర్లను సీజ్ చేసి మూల్యాంకన కేంద్రాలకు పంపించామని చెప్పారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం ములుగు(గజ్వేల్): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి, అచ్చాయిపల్లి, కొత్తూరు గ్రామాల్లో మంగళవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రెడ్డి, ప్రశాంత, వాణిశ్రీ, మధుబాబు, పల్లవి, లతీఫ్లు రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సాంకేతిక విషయాలను అవలంబిస్తూ కొత్త వంగడాలను సాగు చేయాలని సూచించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. -
పులకించిన భక్త జనం..
వైభవంగా దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవందుబ్బాక: చౌదర్పల్లిలో స్వయంభువుగా వెలిసిన పార్వతి దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిఏటా వైశాఖ పౌర్ణమిరోజున స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దుబ్బరాజంశర్మ తెలిపారు. సోమవారం రెండోరోజు ఉత్సవ మూర్తులకు స్నపన తిరువంజన కార్యక్రమం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్య కల్యాణోత్సవం అశేషంగా హాజరైన భక్తుల జయజయ ధ్యానాల మధ్య కనులపండువగా జరిగింది. మంగళవారం స్వామివారి రథోత్సవం జరుగుతుంది. -
ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా ఫుల్
●ఇప్పటికే రూ.30కోట్లకుపైగా రాబడి ●అవగాహన కొరవడటంతో కొందరు దూరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకం జిల్లాలో కాసుల వర్షం కురిపించింది. 25శాతం రాయితీ జిల్లాలో సానుకూల ఫలితాలు అందించింది. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణతో రూ.30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వ ఖాజానాలో జమ అయ్యింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినప్పటికీ మరో 70 వేల దరఖాస్తులు పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ప్రక్రియపై మరింత అవగాహన, చైతన్యం కల్పించినట్లయితే కాసులవరద పారేదే. సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో, సుడా పరిధిలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు 2020లో ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 1,01,276 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో వివిధ కారణాలతో అధికారులు 475 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ క్రమంలో 91,159 దరఖాస్తులను రివైజ్డ్ చేసి ఫీజు చెల్లింపు కోసం అనుమతించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ సానుకూల ఫలితాల కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుదారులకు 25 శాతం ఫీజులో రాయితీ ప్రకటించింది. దీంతో ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చి ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 3తో 25 శాతం రాయితీ గడువు ముగియడంతో అధికారిక లెక్కల ప్రకారం రూ.30 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. 91,159 అనుమతించిన దరఖాస్తులలో కేవలం 17,880మంది మాత్రమే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించి సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా 73,279 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించకుండా ప్రక్రియకు దూరంగా ఉన్నారు. వారందరికీ అవగాహన కల్పించి పథకం సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చైతన్యం తప్పనిసరి క్రమబద్ధీకరణ వందశాతం అమలు అయ్యేందుకు ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో స్పందన రావడం లేదు. రాయితీలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లో కొంత కదలిక వస్తోంది. క్రమబద్ధీకరణ ఉద్దేశం.. దాని ప్రయోజనం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం సమయంలో క్రమబద్ధీకరణ చేసుకోవచ్చనే ధీమాతో దరఖాస్తుదారులు ఉండడంతో ప్రక్రియ వందశాతం అమలుకు అడ్డంకిగా మారుతోంది. ప్రజల్లో చైతన్యం ద్వారానే క్రమబద్ధీకరణ లక్ష్యం అధిగమించేందుకు దోహదపడుతుందని చెప్పాలి. -
భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి
మంత్రి ఉత్తమ్కు చాడ వినతి హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 931 కుటుంబాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు, వ్యవసాయ భూములు సర్వం కోల్పోయారని, ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కన్నపేట మండలం, గుడాటిపల్లి గ్రామస్తులు పెట్టుకున్న అర్జీని సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం కావాలి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోమటిబండ సమీపంలోగల పాండవకృష్ణ ధ్యానక్షేత్రంలో గజ్వేల్ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు. బుద్దుడు సూచించిన అష్టాంగ మార్గాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం లభించిందని, సంపూర్ణ ఆరోగ్య జీవితానికి యోగాసనాలు, ధాన్యం దివ్యౌషధంలా పనిచేస్తాయన్నారు. ఈ సందర్భంగా ధ్యాన క్షేత్రం ఆవరణలోని బుద్దుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నర్సింహులు, బాల్రెడ్డి, రాజిరెడ్డి, ప్రభాకర్, సభ్యులు వేణు, ప్రశాంత్, హరి, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల డబ్బులు స్వాహా చేస్తుండ్రు సీఏల చేతివాటంపై కలెక్టర్కు మహిళల ఫిర్యాదు బెజ్జంకి(సిద్దిపేట): మహిళా సంఘాల సభ్యులకు రావాల్సిన రుణాల్లో సీఏలు చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బేగంపేటలోని వర్ధిని గ్రూపు సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి, బేగంపేటలతో పాటు పలు గ్రామాలలో మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండానే లక్షలాది రూపాయల రుణాలు సంఘం బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించిన అనంతరం సీఏలు తమ సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ ఆర్థిక నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సభ్యులు చెల్లించిన నెలసరి వాయిదా కిస్తీల డబ్బులను సైతం అకౌంట్లలో వేయకుండా సొంతానికి వాడుకుంటున్నారని తెలిపారు. ఇటీవల బేగంపేటకు చెందిన బాధిత సంఘం సభ్యులు మండల ఐకేపీ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని వాపోయారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మహిళా సంఘాల సభ్యులకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదుకొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూంల నుంచి వస్తున్న మురుగు బయటకు వెళ్లేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. అలాగే ఏడాది కాలంగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగు అంతా ఇళ్ల మధ్య నిలుస్తోందన్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోందని తెలిపారు. ఇళ్ల మధ్య ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలంటూ మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి గ్రామ చెర్వులోకి సాగు నీరు వచ్చేందుకు ఆగిపోయిన కాలువ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. గ్రామంలో వీధిలైట్లు, మంచి నీటి సరఫరా విషయాల్లో సమస్యలు తలెత్తినప్పడు కార్యదర్శిని సంప్రదించాలంటే అందుబాటులో ఉండటంలేదన్నారు. సమస్యలు పట్టించుకోని కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ వేడుకున్నారు. సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణం పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తంగా 49 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాలువపై బ్రిడ్జి నిర్మించండి చెల్లాపూర్లో కాలువపై బ్రిడ్జి నిర్మించాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టర్కు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో మిషన్ కాకతీయ కాలువ నిర్మించారని, దీంతో దారిలేక 300 మంది రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు. పశువులను తోలుకెళ్లడానికి కూడా తిప్పలు తప్పడంలేదన్నారు. వేరే దారి గుండా వెళ్లాలంటే 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకు చెప్పినా స్పందించడంలేదని వాపోయారు. కాలువపై బ్రిడ్జి నిర్మించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 49 -
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో పాఠ్యాంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. 208 ప్రాథమిక మండల స్థాయి ఉపాధ్యాయులకు స్థానిక ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో, 438 మంది గణిత, 352 మంది ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 57 స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇర్కోడ్లో, 410 మంది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేటలో, 22 మంది ఉర్దూ ఉపాధ్యాయులకు నాసర్పుర పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రెండు విడతలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో శిక్షణ పొందిన మండల రిసోర్స్ పర్సన్ లు ఈనెల 20నుంచి మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ విధిగా హాజరు కావాలి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి -
సైన్యానికి మద్దతుగా నిలుద్దాం
ఎంపీ రఘునందన్రావుదుబ్బాక: ఆపరేషన్ సిందూర్తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పహల్గామ్లో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు పాక్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి అండగా ఉందామన్నారు. పహల్గామ్ కన్నీటికి బదులు తీర్చుకున్న దేశం నంగునూరు(సిద్దిపేట): నాడు సీతమ్మ కన్నీరు పెడితే రామ, రావణ యుద్ధం జరిగితే.. నేడు పహల్గామ్లో మహిళలు కన్నీరు పెడితే పాకిస్తాన్తో యుద్ధం జరిగిందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. నర్మేటలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. -
కార్మిక, కర్షకుల పక్షపాతి సీపీఐ
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. మండల పరిధిలోని ఆకునూరులో ఆదివారం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ నిర్వహించారు. అనంతరం ఆయన జెండా ఆవిష్కరించారు. స్థానిక గౌడ కమిటీ హాలులో మండల కార్యదర్శి అందె అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ కార్మిక, కర్షకుల పక్షపాతిగా ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి పిలుపునిచ్చి దున్నేవాడికే భూమి అన్న లక్ష్యంతో సుమారు 10లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిందన్నారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమంలో సైతం కీలకపాత్ర పోషించి ఎందరో కమ్యూనిస్టు నాయకులు అమరులైన విషయం గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ జాతీయ స్థాయిలో ఒకే మాట ఒకే బాటగా నిలిచిన పార్టీ సీపీఐ అన్నారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 4 కోడ్లుగా చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను శ్రామిక వర్గం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భాస్కర్రెడ్డి, కనకయ్య, సత్తయ్య, సత్యనారాయణ, రాజు, పరమశేఖర్, పుల్లారెడ్డి, మల్లేశం, బాలరాజు, నర్సింహులు, వీరయ్య, వెంకటేష్యాదవ్, వినయ్, అశోక్, అనిల్, రాములు, సీతారాములు, యాదయ్య, మహేందర్, ప్రకాశం, భాస్కర్, మహేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలలో కీలక పాత్ర పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ -
నేత్రపర్వంగా ధ్వజారోహణం
వర్గల్(గజ్వేల్): పురాతన ప్రాశస్త్యం కలిగిన వర్గల్ వేణుగోపాలుని కోవెల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఉత్సవాలలో రెండోరోజు ఆదివారం గరుడ ధ్వజారోహణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. సకల దేవతలకు నవాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వానం చేరింది. మొదట విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద పతాకానికి రుత్వికులు షడ్రషోపచార పూజలు చేశారు. భక్తుల కరతాళ ధ్వనులు, మంగళవాయిద్యాల మధ్య గరుడ పతాకం ధ్వజస్తంభ శిఖరాగ్రానికి చేరింది. యాగశాలలో సంప్రోక్షణ జరిపి హోమం నిర్వహించారు.హ్యూమన్రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మహేందర్మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్పల్లికి చెందిన మెడిచెల్మి మహేందర్ జిల్లా హ్యూమన్రైట్స్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. నేషనల్ హ్యూమన్రైట్స్ చైర్మన్ రాజేష్కన్నా ఆచార్య నియామకపత్రాని అందించారు. మహేందర్ మాట్లాడుతూ త్వరాలో జిల్లాల్లో పర్యటించి మానవ హక్కుల గురించి అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.కట్టపై నిఘా నేత్రాలేవీ?దుబ్బాకటౌన్: పట్టణంలోని రామసముద్రం కట్ట సుందరీకరణలో భాగంగా 2019లో స్వర్గీయ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేతుల మీదుగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిఘా నేత్రాల జాడ లేకుండా పోయింది. కట్టపై చిల్డ్రన్స్ పార్కు వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టాండ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఈఏపీసెట్లో 22వ ర్యాంకుకొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఈఏపీసెట్ ఫలితాలలో మండల విద్యార్థి ఉత్తమ ర్యాంక్ సాధించారు. అయినపూర్కు చెందిన తాళ్లపల్లి పాండురంగం కుమారుడు తాళ్లపల్లి వెంకటేష్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ 22వ ర్యాంక్ సాధించారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు అతనిని అభినందించారు. -
దేవుడా.. ఎన్నాళ్లీ వెతలు
ఇన్చార్జి ఈఓలతో ఆలయాల నిర్వహణ ● సమస్యలతో భక్తులు సతమతం ● 30 పోస్టులు ఖాళీ.. గ్రూప్– 2 పైనే ఆశలు సంగారెడ్డి జోన్: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకా ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలు న్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బీ) కేటగిరీలో 12, 6(సీ) కేటగిరీలో 10, 6 (డీ) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర, మెదక్లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని కోటిలింగాల, వెంకటేశ్వర తదితర ఆలయాలున్నాయి. ఒక్కో అధికారికి పదికి పైగా బాధ్యతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓకు సుమారు 10కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నా రు. అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదా లు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది. నియామకం కానీ రెగ్యులర్ అధికారులు ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఈఓగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. -
నేడు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్
● డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ గణేశ్ సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఐఏంఏ హాల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి జనరల్ ఫిజీషియన్ వైద్యుల కాన్ఫరెన్స్ జరుగనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియా సిద్దిపేట శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ క్రాంతికుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వెనిశెట్టి గణేశ్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనరల్ ఫీజిషియన్ వైద్యులు పాల్గొంటారని తెలిపారు. చైర్ పర్సన్ డాక్టర్ పెంటాచారి అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో ఇటీవల వైద్య రంగంలో వచ్చిన మార్పులు, రీసెంట్ అప్డేట్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ పైన చర్చించడం జరుగుతుందన్నారు. సిద్దిపేటలో ఏపీఐ మొట్టమొదటి సారిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రెజరర్ డా.ఎన్ గణేశ్, జాయింట్ సెక్రటరీ డా.ఫణిందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు దౌల్తాబాద్ (దుబ్బాక ): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జయదేవ్ ఆర్య సూచించారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ గ్రామంలో గల ఐకేపీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, సీసీ సునీత, వీఏఓ కవిత కమిటీ సభ్యులు గాయత్రీ, రైతులు పాల్గొన్నారు. కలశ ప్రతిష్ట మహోత్సవం ములుగు(గజ్వేల్): మండలంలోని పాత మా మిడ్యాల మెట్టు చింత వద్ద రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవసాయ క్షేత్రంలో కొలువైన అభయాంజనేయస్వామి ఆలయ శి ఖర కలశ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో రేణుకాచౌదరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు, పూజగర్త సంస్కారం, కుంబాభిషేకం, పూర్ణాహుతి మార్జనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవంలో పాల్గొ న్న భక్తులందరికీ అన్నదానం చేశారు. 83 డ్రంకై న్ డ్రైవ్ కేసులు సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి శనివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వాహనాల తనిఖీ నిర్వహించి 83 డ్రంకై న్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 380 కేసులు నమోదు అయ్యాయన్నారు. వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్ పోలీ సు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమర జవాన్కు ఘన నివాళి
సిద్దిపేట జోన్ : భారత్–పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్ర పటానికి శనివారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. జవాన్ మురళీ నాయక్ త్యాగం వృథా కాదని, మన దేశం కచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి, జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజనర్స్, వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 108 హోమ కుండాలతో హనుమాన్ హోమం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో శనివారం 108 హోమ కుండాలతో సామూహిక నవగ్రహ హనుమాన్ హోమం, ఏకాదశ హనుమాన్ మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామి, ఎమ్మెల్యే హరీశ్రావులు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణార్థం విశ్వశాంత్యర్థం, 160వ ఆష్టోత్తర శతకండాత్మక, 108 కుండాలతో హవనం, పూర్ణాహుతి, హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. దుర్గా ప్రసాద్ స్వామి చేతుల మీదుగా ఏ కార్యక్రమం నిర్వహించిన విజయవంతం అవుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాంకాల నవీన్ కుమార్, రామకృష్ణ, వీరేశం, కై లాసం, హరి, పరమేశ్వర్, విశ్వనాథఽశర్మ, కాశీనాద్, రమేశ్, రాము, సంతోష్ కుమార్, సత్యం పాల్గొన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. ఫ్యాక్టరీని అందుబాటులోకి తేవాలి నంగునూరు(సిద్దిపేట): రిఫైనరీ పనులను త్వరగా పూర్తి చేసి జూలై నాటికి ఆయిల్పామ్ ప్యాక్టరీని అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే హరీశ్రావు అధికారులకు సూచించారు. నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఆయిల్ఫెడ్ కమిషనర్కు ఫోన్ చేసి యుద్ధ ప్రతిపాదికన రిఫైనరీ పనులను చేపట్టాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేయగా మంచి దిగుబడి వస్తోందన్నారు. కొత్త పంట అయినప్పటికీ రైతులు ముందుకు రావడంతో వారి మేలు కోసం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్రెడ్డి, సోమిరెడ్డి, సారయ్య, రమేశ్ గౌడ్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ జిమ్.. కొందరికే పరిమితం
● మున్సిపాలిటీ శివారులో ఏర్పాటు ● పక్కనే చెరువు, ప్రమాదకరంగా కాల్వ ● 19 వేల జనాభాకు ఒక్కటే జిమ్ ● వినియోగించుకోలేకపోతున్నమహిళలు, చిన్నారులు ● మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని వినతిచేర్యాల(సిద్దిపేట): పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ శివారులోని పెద్ద చెరువుకట్టపై గత పాలకవర్గం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేసింది. పట్టణానికి దూరంగా చెరువుకట్టపై ఉండటంతో అది కొంత మందికి మాత్రమే పరిమితమవుతోంది. పట్టణ పరిధిలో 12 వార్డులు ఉండగా, 19 వేల జనాభా ఉంది. కానీ పట్టణంలో ఒకే ఒక్క ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అది చెరువు కట్టపై ఏర్పాటు చేయడంతో మహిళలు, చిన్న పిల్లలు రావడానికి జంకుతున్నారు. కట్ట మీద వాకింగ్ చేసే వారికి సరిపోక వ్యాయామం చేయలేకపోతున్నామని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిమ్ పక్కనే చెరువు, కాల్వ పట్టణ శివారులోని చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో కేవలం కొంత మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. జిమ్కు ఒక పక్క చెరువు, మరో పక్క చెరువు అలుగునీరు వెళ్లేందుకు తీసిన కాల్వ, కట్ట ప్రారంభంలో మార్చురీ ఉన్నాయి. దీంతో మహిళలు, చిన్నారులు ఓపెన్ జిమ్కు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని కుడి చెరువు, పెద్దమ్మగడ్డ, శ్రీనగర్ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా వంటి ముఖ్య కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం, మున్సిపల్ అదికారులు స్పందించి పట్టణ పరిధిలో మరికొన్ని ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.