Social Media News
-
సోషల్ మీడియాను షేక్ చేసి.. ఇదేందిది అనిపించిన వంటకాలు!
2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదిలో కొన్ని వింత ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఎవరూ ఎప్పుడూ చూడని వంటకాలు కూడా కనిపించి అందరికీ కంగుతినిపించాయి. అవి వైరల్గా మారి కొందరికి నవ్వు తెప్పించగా, మరికొదరికి అసహ్యం కలిగించాయి. మరికొందరైతే ఇలాంటి వంటకాలు కూడా ఉంటాయా అని తెగ ఆశ్చర్యపోయారు. మరి 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ వంటకాలేమిటో ఇప్పుడు చూద్దాం.చాక్లెట్ పాస్తాఇన్స్టాగ్రామ్లో ఇటాలియన్ పాస్తాకు కొత్త ట్విస్ట్ ఇస్తూ, నూతన వంటకం ప్రత్యక్షమయ్యింది. దీనిని కోకో పౌడర్, స్నికర్స్ చాక్లెట్, పాలను మిక్స్ చేసి తయారు చేశారు. ఈ స్నికర్స్ పాస్తా రిసిపీని చూసి జనాలు షాక్ అయ్యారు.చాక్లెట్ గ్రీన్ పీస్ఇన్స్టాగ్రామ్లో ఫుడ్మేకేస్కల్హ్యాపీ అనే పేజీలో చాక్లెట్ కొత్తగా, ఎప్పుడూ చూడని గ్రీన్ పీస్ రెసిపీ దర్శనమిచ్చింది. ఇందులో ఆ ఫుడ్ బ్లాగర్ ఒక చాక్లెట్ను మైక్రోవేవ్ బౌల్లో ఉంచిన తర్వాత, దానికి బఠానీలను జోడించి, కొన్ని నిమిషాలు మైక్రోవేవ్లో ఉంచి, తరువాత ఆనందంగా తిన్నాడు.మటన్ కీమా కేక్ఇప్పటి వరకు మీరు చాక్లెట్, పైనాపిల్, బటర్స్కాచ్ వంటి కేక్లను తినే ఉంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బేకర్.. మటన్ కీమా కేక్ని తయారు చేశారు. ఇందుకోసం మటన్ మిన్స్ను తయారు చేశాడు. దానిని స్పాంజ్ కేక్పై స్ప్రెడ్ చేసి, దానిని అలంకరించేందుకు ఫ్రెష్క్రీమ్తో పాటు మటన్ మిన్స్ను ఉంచి రెడ్ చిల్లీ, కొత్తిమీరతో అలంకరించాడు. దీనిని చూసినవారంతా ఇదేందిది అనుకుంటూ తెగ ఆశ్చర్యపోయారు.గుడ్డు హల్వాసోషల్ మీడియాలో హల్చల్ చేసిన కోడిగుడ్డు హల్వాను చూసిన జనానికి మతిపోయింది. ఈ రెసిపీలో ఒక గిన్నెలో గుడ్లు గిలక్కొట్టి, దానిలో చక్కెర, పాలపొడి వేసి, దానిని ఎలక్ట్రిక్ బ్లెండర్ వేసి మెత్తగా చేశారు. తరువాత దానిని ఒక గిన్నెలోకి తీసుకుని, స్టవ్పై పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి సన్నని మంటపై ఉడికించారు.గులాబ్ జామున్ చాట్చాట్- గులాబ్ జామూన్.. ఈ రెండు విభిన్న వంటకాలు ఒకటి తీపి వంటకం. మరొకటి స్పైసీ వంటకం. అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గులాబ్ జామూన్ చాట్ తయారు చేశాడు. దానిపై పెరుగు, చింతపండు చట్నీ వేసి వినియోగదారునికి అందించాడు. దీనిని చూసి నెటిజన్లకు దిమ్మతిరిగిపోయింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది: కుటుంబ సభ్యులు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం: Govardhanreddy
-
YS Jagan: గోరుముద్ద అటకెక్కింది...అమ్మ ఒడి గాలికెగిరింది
-
YSRCP సోషల్ మీడియా సైన్యానికి అంబటి భరోసా
-
తాడేపల్లిలో నాగిరెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
సోషల్ మీడియా కార్యకర్తలకు YSRCP ໑໐໕ జగన్ కీలక ఆదేశాలు
-
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో? ఏది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఊహించలేము. కొన్నిసార్లు ఎవరైనా నేలమీదున్న వాటిని నింగిలోకి పంపినట్లుగా.. ఒక వ్యక్తి తన తెలివితేటలనుపయోగించి.. ఇటుకలతో ఒక కొత్త కూలర్ను తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోకతప్పదు. ఇక అదేంటో చూసేయండి..ఇన్స్టాగ్రామ్లో @sharpfactmind ఖాతా నుండి తరచుగా ఆశ్చర్యకరమైన వీడియోలు వస్తూంటాయి. ఇటీవల ఒక వ్యక్తి ఇటుకలు, సిమెంటు ఉపయోగించి కూలర్ ని తయారుచేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అతను 1000 ఇటుకలు, 5 బస్తాల సిమెంటు, ఇసుకనుపయోగించి దీనిని తయారు చేశాడు. ఆ కూలర్ పెట్టుబడితో కొత్తకూలర్ ని ఖరీదు చేయగలిగినా.. పెద్ద వింతేం ఉండదనో, ఏమో! మరి ఇలా ఆలోచించాడు.ఈ కూలర్ను 1000 ఇటుకలతో చిన్న చిన్న సందులుగా వదిలి, దానిపై నీటి పైపులను అమర్చాడు. కరెంటు లేకపోయినా చల్లగాలిని గదులకు అందించడమే దీని స్పెషల్. కూలర్ లోపలి భాగం మొత్తం సిమెంట్తో కూడి ఉంది. దీంతో లోపలి నీరు ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 300 లీటర్ల నీటి సామార్థ్యాన్ని దీని ట్యాంక్ భరించగలిగేలా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చేస్తే.. మూడు రోజుల వరకు నీటితో నింపాల్సిన అవసరం లేదు. కూలర్ పై భాగాన ఫ్యాన్ను అమర్చి, లోపల ఒక చిన్న పంపును సెట్ చేశాడు. ఈ పైపు కూలర్ అంతటా నీటిని వ్యాప్తి చేస్తుంది. ఇటుక తడిస్తే ఇక రోజంతా దాని నుండి చల్లగాలే వస్తుంది. వింత ఆలోచనతో కూడిన ఈ కూలర్ని చూసి అందరూ ఆశ్చర్యపోకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోను 28 లక్షలకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Sharp Fact Mind (@sharpfactmind) -
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్ను కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ దరాబ్జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
'లంచం అడిగిన ఆర్ఐ..' సోషల్ మీడియాలో వాయిస్ వైరల్!
ఖమ్మం: వ్యవసాయ క్షేత్రంలో బోరు బావి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయడానికి దమ్మపేట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు చేసిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మండలంలోని మందలపల్లికి చెందిన మడిపల్లి వెంకటేశ్వరరావు మల్లారంలోని మట్టా ధనదుర్గకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో పాత బోరు బావి ఉండగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు ఆర్ఐ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్ఐకు ఇరవై రోజుల కిందట వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు అంత డబ్బు ఇవ్వలేనని బదులివ్వగా రూ.6 వేలైనా ఇవ్వాలని సూచించాడు. ఇదంతా ఫోన్లో రికార్డు చేయడంతోపాటు వీడియో చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం ఆర్ఐ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఆడియో, వీడియోలు తొలగించాలని కోరాడు. ఈ విషయమై ఆర్ఐని వివరణ కోరగా వాయిస్ రికార్డు చేస్తారని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందంటూ బదులివ్వడం గమనార్హం. ఇక తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ మాట్లాడుతూ ఆర్ఐ డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసిందని, రైతు నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇవి చదవండి: వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక! -
అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్బీఐ
రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్బీఐ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది. -
‘ట్రోలింగ్’ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు. పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్ మీడి యా టీమ్లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్లు, కొందరు నేతలను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
'స్మార్ట్గా సోషల్ వార్..' రాజకీయ పార్టీల ప్రచారం..!
సాక్షి, నిజామాబాద్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్మార్ట్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ప్రజల నుంచి సైతం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ఆసక్తి కనిపించడం విశేషం. దీంతో గతానికి భిన్నంగా విచ్చలవిడిగా కరపత్రాలు పంచడం, ప్రెస్మీట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు తగ్గించారు. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ అపరిమితంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం, మండలం, గ్రామం, వార్డుల వారీగా, కులాలు, సంఘాల వారీగా, యువజన సంఘాల పేరిట ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి మరీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులను ఉపయోగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం చేసినా ఆయా ప్రచారం అన్ని గ్రూపుల్లో వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఫేస్బుక్ లైవ్లు, యూట్యూబ్ లైవ్లు సైతం పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం చేస్తూనే స్థానిక అంశాలనూ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. కరపత్రాలను పరిమిత సంఖ్యలో ముద్రించి, వాటిని పీడీఎఫ్ ఫైల్ తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీగా వైరల్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్లకు సైతం మరింత ప్రాధాన్యత పెరగడం గమనార్హం. వ్యక్తుల వాట్సాప్ స్టేటస్లను బట్టి సదరు వ్యక్తి ఆలోచనలను అంచనా వేసుకుంటూ అందుకు అనుగుణంగా అలాంటి వ్యక్తులను కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 'కొందరు యువకులు మాత్రం జిల్లాలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైఫల్యాలు, అపరిష్కృత సమస్యలు, పోటీ పరీక్షల విషయమై ప్రభుత్వం వైఫల్యాలు, పేపర్ లీక్లు తదితర అంశాలను వైరల్ చేస్తుండగా, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల నందిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ధ్వంసమైన రోడ్ల గురించి ఎమ్మెల్యేను విమర్శిస్తూ సైటెరికల్గా చేసిన వీడియో వైరల్ అయింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో అధికార పార్టీ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆర్మూర్కు చెందిన యువకులు చేసిన వీడియోలు బాగా వైరల్అయ్యాయి. ఇలా సోషల్ వార్ మరింత విస్తరిస్తోంది.' -
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
ఆయనకు ‘కొంటె’ భార్య కావాలి.. ఇమ్రాన్ఖాన్కు నాలుగో భార్యనవుతా..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ యూకేకు చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ప్రపోజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయనకు నాలుగో భార్యనవుతానని చెప్పిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో యూకేకు చెందిన జియా ఖాన్ అనే టిక్టాకర్ ఈ ప్రతిపాదన చేసింది. ‘‘ఆయన ముందు జెమీమాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఓ జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఓ సంప్రదాయబద్ధమైన మహిళను వివాహమాడారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో కొంటె భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాలుగో భార్యగా ఉండాలనుకుంటున్నా. ఇందుకోసం బుష్రా బీబీతో బంధాన్ని తెంచడానికైనా నేను సిద్ధమే. ఆయన వయసు 70 ఏళ్లు. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన ఇమ్రాన్ ఖాన్ ’’ అంటూ ఆ వీడియోలో జియా ఖాన్ కొంటెగా చెప్పింది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయంగా కేసులు, అరెస్టులతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు కొత్త అభిమాని లభించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే.. -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆర్థిక కష్టాలతో ట్విటర్ను గట్టెక్కించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ నుంచి ట్విటర్ బాస్గా మస్క్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నాటి నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు సుమారు 500 కంపెనీలు ట్విటర్కు ఇచ్చే యాడ్స్ను నిలిపివేసినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ఆఫీస్ 1,36,250 డాలర్ల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. శాలరీ పెంచాలని డిమాండ్ చేసిన పారిశుధ్య కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆఫీస్ను శుభ్రం చేయకపోవడంతో వాష్ రూమ్ల నుంచి వెదజల్లుతున్న కంపు భరించలేమంటూ ట్విటర్ ఉద్యోగులు వాపోయినట్లు న్యూయార్స్ టైమ్స్ హైలెట్ చేసింది ఈ తరుణంలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు. తాజాగా, ట్విటర్ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ట్విటర్లో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తుంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ యాడ్స్ ఇకపై కనిపించవు. ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ ఆదాయం పెరగవచ్చనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. -
బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt — ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022 -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
లక్కీ ఫెలో.. అనకొండ దాడిలో జస్ట్ మిస్ అయ్యాడు
పామును చూస్తేనే ఒక్కసారిగి భయాందోళనకు గురవుతుంటాము. అలాంటిది ఏకంగా భారీ అనకొండ నుంచి ప్రాణాలకు కాపాడుకోవడమంటే మాములు విషయం కాదు. కాగా, ఓ వ్యక్తి అదృష్టవశాత్తు అనకొండ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. బ్రెజిల్కు చెందిన గైడ్ జోవో సెవెరినో(38).. అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా తృటిలో తప్పించుకున్నాడు. కాగా, జోవో సెరియన్.. అరగుయా నదిలో పర్యాటకుల బృందంతో విహారయాత్రలో ఉన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సెవెరినోకు నదిలోని నీటిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడంతో సరదాగా వీడియో తీశాడు. అదే సమయంలో అదును చూసి అనకొండ అతడిపై దాడి చేసే క్రమంలో కాటు వేసింది. ఈ క్రమంలో తృటిలో పాము నుంచి అతను తప్పించుకున్నారు. దీంతో పడవలో ఉన్న ప్రయాణీకులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక, గ్రీన్ అనకొండ.. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. కాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగ గ్రీన్ అనకొండ కంటే.. ఆడ అనకొండలు చాలా పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా ఇవి.. చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. View this post on Instagram A post shared by João Severino (@lavaginha_) ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
అర్ధరాత్రి వైన్స్ వద్ద ఉద్రిక్తత.. మహిళలపై దాడి
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. ఫుల్ ఫైర్లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया। दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO — Siddharthan (@siddharthanbjp) June 24, 2022 ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు -
బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా?
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఈజీగా టోల్ పేమెంట్ చేయోచ్చు. అయితే ఇప్పుడీ ఫాస్టాగ్ పేమెంట్ విషయంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్ను..ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు. దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అని ఆ వాచ్ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure. pic.twitter.com/BmXhq07HrS — Paytm (@Paytm) June 25, 2022 ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్, ఆ బాలుడిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్ వాచ్తో ఫాస్టాగ్ ద్వారా డ్రైవర్లు, యజమానుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారని ఆరోపిస్తాడు. ఫాస్టాగ్ అనేది ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ సర్వీస్. దీంతో కారు డ్రైవర్లు లేదా, యజమానులు టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ పేమెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. టోల్ గేట్ల వద్ద కారు ముందు అద్దానికి దగ్గరలో అంటించిన స్కానర్పై ట్యాప్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో సదరు ఫాస్టాగ్ అకౌంట్లో నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఇప్పుడీ బాలుడు కూడా ఆ స్కానర్పై వాచ్తో ట్యాప్ చేశాడని, అలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అయితే ఇది నిజమా? కాదా? అని ప్రశ్నిస్తూ ఐఏఎస్ అధికారి అవానిష్ శరాణ్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా..ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్న పేటీఎం ఆ వీడియోపై స్పందించింది. స్పందించిన పేటీఎం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం(ఎన్ఈటీసీ)..ఫాస్టాగ్ చెల్లింపులు చాలా సురక్షితం. ఫాస్టాగ్ లావా దేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్లు మాత్రమే స్కాన్ చేసుకోవచ్చు. మినహాయించి ఎవరు చేసినా ఆ బార్ కోడ్లు స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది. -
చైనాలో మరో అద్భుతం.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్
Giant Sinkhole in China.. ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిని కనుగొనే ప్రయత్నంలో అద్భుతాలను చూసి ఆశ్యర్యపోతుంటాం. ఇలాంటివి నిజంగానే ఉంటాయా అని షాక్ అవుతుంటాం. తాజాగా చైనాలో మరో అద్బుతం జరిగింది. భూమిలోపల దట్టమైన పురాతన అడవిని అన్వేషకులు ఇటీవల కనుగొన్నారు. ఈ అడవి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి.. చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ ప్రాంతంలో ఒక భారీ సింక్ హోల్ బయటపడింది. అందులో అద్భుతమైన పురాతన అటవీ ప్రాంతం కూడా ఉన్నట్టు అన్వేషకులు గుర్తించారు. మే 6వ తేదీన లేయ్ కౌంటీలోని సింక్హోల్ గుహను వారు కనుగొన్నారు. ఈ సింక్హోల్ అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. దీని లోపలి ప్రాంతం మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్హోల్ పైవరకూ ఉన్నాయి. సింక్హోల్ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పు, 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. దానిలో చెట్లు 131 అడుగుల ఎత్తులో ఉన్నాయని తెలిపారు. కాగా, తాజాగా కనుగొన్న దానితో కలిసి చైనాలో గుర్తించిన సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్హోల్లో ఇదే పెద్దది అని అన్వేషకులు చెబుతున్నారు. ఈ సందర్బంగా గ్వాంగ్జీ అన్వేషణ బృందానికి నాయకత్వం వహించిన చెన్ లిక్సిన్ మాట్లాడుతూ.. సింక్హోల్లో ఉన్న పురాతన చెట్లు దాదాపు 40 మీటర్ల ఎత్తు (131 అడుగులు), దట్టంగా అళ్లుకుని ఉన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని లేదా వర్ణించని జాతులు ఇందులో కనిపించే అవకాశం ఉందన్నారు. పరిశోధకులు సింక్హోల్ దిగువకు చేరుకోవడానికి చాలా గంటలు కాలినడక ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. మరోవైపు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం అందమైన కార్ట్స్ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్తుంటారు. 30th giant karst sinkhole discovered in south China's Guangxi pic.twitter.com/52ZxFnyuWF — CGTN (@CGTNOfficial) May 11, 2022 -
పెళ్లి వేడుకలో వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు.. వీడియో వైరల్
లక్నో: ప్రతీరోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ● A #video has surfaced in which a bride can be seen slapping the groom in #Hamirpur ● As per reports, the groom was in a drunken state that's why the bride took this step pic.twitter.com/C5Cg5zjQSj — Taaza TV (@taazatv) April 18, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట్విట్టర్ యూజర్ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇది చదవండి: ఏపీలో టూరిస్ట్ స్పాట్గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్ కాలంలో ఎంతో ఫేమస్ -
ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి షాకైన శశి.. తరువాత ‘ఇదే నిజం’ అంటూ..
కాలేజీ కి బయల్దేరుతూ ఫోన్ తీసుకొని, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు చూస్తోంది శశి (పేరు మార్చడమైనది). సోషల్ మీడియాలో ‘ఒకబ్బాయి కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు’ అని ట్యాగ్లైన్తో ఉన్న వీడియో చూసి షాకయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తనే. ఆ వీడియోను ఇంట్లో అమ్మనాన్నలు చూశారు. వారికి అసలు విషయం తెలియజేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రితం రోజు రాత్రి షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరేసరికి పది దాటింది. హడావిడిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న శశికి రోడ్డు పక్కన ఓ అబ్బాయి అమ్మాయితో గొడవపడటం చూసింది. ముందు ‘నాకెందుకులే’ అనుకుంది. కానీ, అక్కడ అమ్మాయి సమస్య అనేసరికి ఉండలేక వారి దగ్గరకెళ్లింది. అబ్బాయి ఆ అమ్మాయిపై చేయి చేసుకోవడంతో శశి ఆ అబ్బాయిని కొట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కోప్పడి, తను ఇంటికి వచ్చేసింది. ఎవరు వీడియో తీశారో కానీ, అమ్మాయిలిద్దరూ గొడవపడుతున్న సన్నివేశం, పక్కన అబ్బాయి ఉండటంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపైన రకరకాల కామెంట్లు. తట్టుకోలేకపోయింది శశి. అయితే, మధ్యాహ్నానికి ఈ అమ్మాయి పరువు తీస్తున్నారు ‘ఇదే నిజం’ అంటూ వచ్చిన మరో వీడియో చూసి ఊపిరి పీల్చుకుంది. శశి పరువు తీసేలా ప్రవర్తించిన వ్యక్తి పోస్ట్కి నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో అంతా నిజం అనదగినవి ఏమీ లేవు. సోషల్ మీడియాలో ఉన్న రిపుటేషన్ బట్టి జీవితాలు మారిపోతున్న రోజులివి. ప్రెగ్నెన్సీ, బ్రేకప్స్, విడాకులు, న్యూ రిలేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్.. అన్నీ సోషల్ మీడియాలో ఉంటున్నాయి. వీటికి మంచి, చెడు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు సంబంధించినవైతే ఇక లెక్కే ఉండవు. కొన్ని వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవి ఉంటే సంస్థల వైపు మరోవిధంగా ఉంటున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఏ వస్తువు కొనాలన్నా, ఏ రెస్టారెంట్కు వెళ్లాలన్నా.. వాటికి సంబంధించిన మంచి–చెడులను కామెంట్స్, రివ్యూల రూపంలో పెట్టేస్తున్నారు. పుకార్లు, అబద్దాలు, చెడు సమీక్షలు.. రకరకాల పోస్ట్ల్లో కనిపిస్తే.. ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో ఉండేవారికి తప్పక తెలుసుండాలి. ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది? ►ఆన్లైన్లో వచ్చిన రకరకాల వార్తాకథనాలు సరైనవే అని నమ్ముతుంటారు. ఇవి, ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలకు, సంస్థలకు సంబంధించినవి ఉంటాయి. ►ఇతరులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో లీక్ చేయడం. బ్లాగుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం. ►కస్టమర్ల రివ్యూల ఆధారంగా వినియోగదారులకు మార్గదర్శకం చేసే రివ్యూ సైట్లు. ►గాసిప్లను వ్యాప్తి చేయడం, పబ్లిక్ వ్యక్తులను విమర్శించడం వంటివి. లిజనింగ్ టూల్స్ తప్పనిసరి.. మనకు సంబంధించిన మంచి చెడులను తీసుకొని, మనకు ఇన్ఫార్మ్ చేస్తుంటాయి లిజనింగ్టూల్స్. ప్రతి ఒక్కరూ తమ సోషల్ నెట్వర్క్లలో సానుకూల కామెంట్లు, రివ్యూలను ఆశించే పోస్ట్లు పెడుతుంటారు. దీనికి ప్రతికూల అభిప్రాయం వస్తే సోషల్ మీడియాలో మీ కీర్తి దెబ్బతింటుంది. సంస్థలు అయితే తమ వ్యాపారంలో నష్టాన్ని చూడాల్సి రావచ్చు. తమ బ్రాండ్ లేదా తమ వ్యక్తిత్వం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోషల్ లిజనింగ్, మానిటరింగ్ సాధనాలు వాడటం చాలా ముఖ్యం. కొన్ని ప్రముఖ సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్ సైట్స్ ఇవి. ► https://www.falcon.io/ ► https://wwww.brand24.com/ ► https://www.digimind.com/ ► https://youscan.io/ ► https://brandmentions.com/ ► https://buzzsumo.com/ షెడ్యూలింగ్ టూల్స్ కంటెంట్ ముందుగా సిద్ధం చేసిపెట్టుకొని, సమయానుకూలంగా పోస్ట్ అవ్వాలని ఆప్షన్ పెట్టుకుంటే దానికి అనుగుణంగా పోస్ట్ చేస్తుంది ఈ యాప్. ఇవి మీ సోషల్ మీడియా ఖాతాల మొత్తం నిర్వహణలో సహాయపడతాయి. సరైన కంటెంట్ను సృష్టించడానికి, నిజమైన కనెక్షన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ► https://sproutsocial.com/ ► https://coschedule.com/ ► https://feedly.com/ ► https://www.airtable.com/ ► https://planable.io/ ► https://skedsocial.com/ ఆన్లైన్లో మంచి పేరు సంపాదించుకోవాలంటే సరైన కంటెంట్ను పోస్ట్ చేయాలి. లైక్లు, ఫాలోవర్లకు బదులు రివ్యూలపై దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా వచ్చే ఫీడ్బ్యాక్లపై దృష్టిపెట్టాలి. మన ప్రతిష్టను ప్రభావితం చేసే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్, షెడ్యూలింగ్ టూల్స్ తప్పక ఉపయోగించాలి. ఆఫ్లైన్లో ఎలాంటి ప్రతిష్టను కోరుకుంటారో, ఆన్లైన్లోనూ అలాంటి రిప్యుటేషన్ ను పొందాలనుకోవడం ముఖ్యం. -
జూనియర్ సమంత వెనకున్న ఆ హీరో ఎవరో తెలుసా !
జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాతో తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టి స్టార్గా ఎదిగింది. ఆ తర్వాత హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేకాకుండా ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ అవడమే కాకుండా ఆమెకు 'బోల్డ్ బ్యూటీ' అనే పేరును తెచ్చిపెట్టింది. తాను చేసే పోస్ట్లకు యాప్ట్ అయ్యేలా ట్యాగ్లైన్ రాస్తూ కూడా రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల కూడా 'మీ కళ్లల్లోనే వేడి ఉంది' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్లే కాకుండా అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్తూ ఉంటుంది అషు. ఇటీవల వెకేషన్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన అషు 'మేడమ్ టూసాడ్స్' మ్యూజియంను సందర్శించింది. ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ మైనపు బొమ్మతో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ 'సారీ అలియా భట్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ వీరే..
Top 7 Social Media Stars In 2021: కరోనా మహమ్మారి రాకతో లాక్డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థియేటర్లన్ని మూతపడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నామని డీలా పడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా, ఓటీటీలపై పడ్డారు సినీ ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియా, ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. భారీ సినిమాలు రాకపోవడంతో యూట్యూబ్, ఓటీటీల్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోయింది. అయితే ఈ ఏడాది వెబ్ సిరీస్ల హవా కొనసాగింది. దీంతో యూట్యూబ్, ఓటీటీ సంస్థలకు కాసుల వర్షం కురిసింది. అలాగే కరోనా పుణ్యమా అని వెబ్ సిరీస్ ద్వారా పరిచమయైన చిన్న చిన్న నటులు తెగ క్రేజ్ సంపాందించుకున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా.. 1. షణ్ముఖ్ జస్వంత్ (సూర్య) సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్. ప్రస్తుతం బిగ్బాస్ రియాల్టీ షో 5వ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2. మౌనిక రెడ్డి (సూర్య) సూర్య వెబ్ సిరీస్తో అనేక అభిమానులను సంపాదించుకుంది మౌనిక రెడ్డి. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య వెబ్ సిరీస్తో అత్యంత పాపులారిటీ సంపాందించుకుంది మౌనిక రెడ్డి. 3. అనన్య (30 వెడ్స్ 21) సోషల్ మీడియాలో అత్యధికంగా క్రేజ్ సంపాదించుకుంది అనన్య. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన నటనతో, ఎక్స్ప్రెషన్స్తో అనన్య కుర్రాళ్ల రాకుమారిగా మారిపోయింది. 30 ఏళ్ల బ్యాచిలర్కు 21 ఏళ్ల అమ్మాయికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనేదే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్తో అబ్బాయిలకు క్రష్గా మారింది అనన్య. 4. చైతన్య రావు (30 వెడ్స్ 21) 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు. నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్తో సూపర్ హిట్ అందుకున్నాడు చైతన్య. 5. సిరి హనుమంతు రామ్ లీలా, గంధరగోళం, లాక్డౌన్ లవ్ వంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ సిరి హనుమంతు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు బిగ్బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్గా రాణిస్తోంది. 6. శ్రీహాన్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్. వీరిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్లలో నటించారు. 7. అనిల్ గీలా (మై విలేజ్ షో) మై విలేజ్ షోతో ప్రేక్షకులకు చేరువైన మరో నటుడు అనిల్ గీలా. మంచి ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే యూట్యూబ్లోని తన సత్తా చాటాడు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానెల్ నిర్వహిస్తున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించాడు అనిల్. -
ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్బుక్పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ పెట్టిన చిచ్చు ఫేస్ బుక్ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్బుక్ పేరు సైతం మార్చే దిశగా జుకర్ బెర్గ్ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే యోచనలో ఉందని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్బుక్ జరిమానా కట్టాల్సి ఉంటుందనే అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్ ఫోరమ్ సైట్ రెడ్డిట్తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్లను నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్మాన్ మాట్లాడుతూ..ఫేస్బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!
Facebook Name Change Says Verge: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్బుక్ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్సైట్లో వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్లను తదితర ఫేస్బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్నెస్ ఉంటుందని జుకర్బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ అధినేత ఉక్కిరి బిక్కిరి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్బెర్గ్ ఫేస్బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. ఫేస్బుక్ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్బుక్ పేరు మారిస్తే..ఫేస్బుక్కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. వాట్ నెక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్బుక్, వర్క్ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్లను ఫేస్బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్ -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్లో సెన్వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
ఐఫోన్ లవర్స్కు శుభవార్త
ఐఫోన్ లవర్స్కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియో భయానకం కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 169 మంది అమెరికన్ల ఎయిర్లిఫ్ట్ అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బారన్ హోటల్లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్ చేసి మరీ తీసుకువెళ్లారు. విమానాశ్రయం దగ్గరకు రావొద్దు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. Now - Another morning, another gunshot with struggle for escape. Kabul international airport. pic.twitter.com/eScU7ERM5V — Muslim Shirzad (@MuslimShirzad) August 19, 2021 -
రద్దు చేసిన సెక్షన్ కింద కేసులా?
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా కేసులు నమోదు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సెక్షన్ను రద్దు చేస్తూ 2015 మార్చి 24న శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఉద్ఘాటించింది. 66ఏ సెక్షన్ కింద కేసులు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ), హైకోర్టులకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా సమాధానం ఇవ్వాలంది. పీయూసీఎల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. పోలీసు శాఖ రాష్ట్రాల పరిధిలోని అంశమైనా ఈ కేసులో రాష్ట్రాలు, యూటీలనూ ప్రతివాదులుగా చేర్చడమే సరైన మార్గమని అభిప్రాయపడింది. సెక్షన్ 66ఏ సమగ్రమైన ఉత్తర్వు జారీ చేస్తామని, తద్వారా ఈ వ్యవహారంపై వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ సందర్భంగా పీయూసీఎల్ తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసు, న్యాయ శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. పీయూసీఎల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. సెక్షన్ 66ఏను సవాలు చేస్తూ తొలుత మహారాష్ట్రకు చెందిన న్యాయ విద్యార్థి శ్రేయా సింఘాల్ 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సెక్షన్ను 2015లో కోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ రాష్ట్రాల్లో ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి. అభ్యంతరకరమైన, సమాజంలో అశాంతిని సృష్టించే అవకాశం ఉన్న సందేశాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు సెక్షన్ 66ఏను చేర్చారు. ఇలాంటి సందేశాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు రుజువైతే దోషికి మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. సెక్షన్ 66ఏ కింద దేశవ్యాప్తంగా పోలీసులు వేలాది కేసులు నమోదు చేశారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఎలుకలను నంజుకుతిన్న రెండు తలల పాము
పాములు ఏ రకం అయినా కావొచ్చు. ఏ జాతికి చెందినదైనా ఉండొచ్చు. దానిపై మనుషులకు ఉండేది ఒకే ఫీలింగ్. అదే భయం. పామంటే ఉండే వణుకు మనల్ని ఎన్నటికీ వీడదు. పాముల్లో రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా రెండు తలల పాముకు చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీయరాలేదు కానీ..రెండు తలలు కలిగిన ఓ పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని ఒక్కో నోటితో ఒక్కో దాన్ని ఎంచక్కా లాగించేసింది. దీనికి సంబంధించిన వీడియోను జంతువుల సాహసం కోసం ప్రపంచాన్ని పర్యటిస్తున్న వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో రెండు తలలున్న బెన్ అండ్ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.! View this post on Instagram A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv) -
ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’!
కాన్బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్బుక్ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమ ప్లాట్ఫామ్స్పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్బుక్ కూడా పేర్కొంది. -
రక్తపు వరద : యుగాంతం? వైరల్
జకార్తా : ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ‘నెత్తుటి వర్షం..యుగాంతం’ అంటూ సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది. ఈ వరద బీభత్సానికి సంబంధించి వేలాది ఫోటోలు, వీడియోలు ట్విటర్లో హల్చల్ చేశాయి. ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇండోనేషియా గ్రామమైన జెంగ్గోట్లో భారీవర్షాలతో శనివారం వరదలు సంభవించాయి. దీంతో సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆందోళనకు దారి తీసింది. ఈ గందరగోళ వాతావరణం నేపథ్యంలో పెకలొంగన్ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ఎర్రరంగు వరద బాతిక్ డై కారణంగా వచ్చిందని, ఆందోళన అవసరం లేదని విపత్తు నివారణ అధికారి డిమాస్ అర్గా యుధా ప్రకటించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండోనేషియాలోని పెకలోంగన్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బాతిక్ ఫాబ్రిక్ అనే పెయింట్ తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ నదులు వేర్వేరు రంగులను సంతరించుకోవడం మామూలే. గత నెలలో వరద సమయంలో నగరానికి ఉత్తరాన ఉన్న మరో గ్రామాన్ని ప్రకాశవంతమైన ఆకుపచ్చ నీరు చుట్టిముట్టింది. pic.twitter.com/TjtpJIjUKN — Raja Purwa (@Raj4Purwa) February 6, 2021 -
ఫేక్ న్యూస్ : సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ను, మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా మీడియా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలంటూ గతంలో దాఖలైన పిల్తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేసింది. -
కొడుకుతో మహేష్.. మనవడితో బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బీబీ3 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్యకు జోడిగా సయేషా సైగల్ నటించనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య సమయం చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో గడుపుతుంటారు. ఈ క్రమంలో బాలయ్య తన ముద్దుల మనవడు ఆర్యవీర్తో సరదాగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో ఫోటోకు ఫోజిచ్చారు. చదవండి: బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల Adorable pic of NataSimha #NandamuriBalakrishna with his grandson #Aryaveer pic.twitter.com/GJArAZZsFQ — BARaju (@baraju_SuperHit) November 11, 2020 సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్కు వెళ్లాడు. ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచి టూర్కు చెందిన ప్రతి ఫోటోను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం సూపర్స్టార్ తన కొడుకు గౌతమ్తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం.. కానీ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం, కారణం కూడా అవసరం లేదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ అభిమానులు ఆకర్షిస్తోంది. చదవండి: విహార యాత్రకు మహేష్ బాబు ఫ్యామిలీ It's a lot more difficult to hug him now ❤️❤️❤️ Never needed a reason or a perfect time. 🤗🤗#TravelDiaries #ItsActionsThatMatter pic.twitter.com/g6JrYfih4d — Mahesh Babu (@urstrulyMahesh) November 11, 2020 చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత అక్కినేని. ప్రస్తుతం సినిమలు తగ్గించిన సామ్ పలు బిజినెస్లతో తన జోరును కొనసాగిస్తున్నారు. సినిమాలు, బిజినెస్, ఫిట్నెస్.. ఇలా అన్నింటిలోనూ చాలా కేరింగ్గా ఉంటున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫిట్నెస్ వీడియోను చూస్తే మీరే వారెవ్వా అంటారు. ఇంటి ముందు గ్రాస్లో ట్రైనర్ సమక్షంలోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సామ్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. చదవండి: బిగ్బాస్: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా View this post on Instagram May all beings everywhere be happy and free ,and may the thoughts ,words , and actions of my own life contribute in some way to that happiness and to that freedom for all. #day2ofplantbasedtransformation with @krishna__vikas Breaking the myth that one cannot enhance their performance, build lean muscle etc on a plant based diet... Let’s do this 💚 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Nov 9, 2020 at 8:24pm PST నవంబర్ 10న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో క్రిష్కు బర్త్డే విషెస్ తెలిపారు నటుడు పవన్ కల్యాణ్. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్లో పవన్ కల్యాణ్ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. కాగా క్రిష్. పవన్ కళ్యాణ్తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోహినూర్ నేపథ్యంలో సాగే చారిత్రాత్మక కథ అయిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ను తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి చేశారు. హీరో నాగచైతన్య విసిరిన ఈ ఛాలెంజ్ను స్వీకరించిన రకుల్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం తమ అభిమానులు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేశారు. Late but finally accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge Thank you @chay_akkineni for nominating me .so I have Planted 3 saplings. Further I want to nominate not actors but all my fans to plant 3 trees each and tag me to continue the chain. pic.twitter.com/QFdsRKWcji — Rakul Singh (@Rakulpreet) November 11, 2020 -
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరో సోషల్ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్సెన్స్. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్ మీడియాని వాడొద్దు. ‘లాంగ్ లివ్ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్గా ఉన్నారు’. జెంటిల్మెన్ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్మెన్ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు'
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్ ఆమె బుధవారం రోజున మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని సీఐడీ ఎస్పీ సరిత హెచ్చరించారు. చదవండి: బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు -
చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
డిస్పూర్: జనాదరణ పొందిన అస్సామీ ప్రేమ పాట ‘ఈ హాహీ బాల్ లాగే’ పాటను ఓ చిన్నారిపాడుతుంటే, మరో బాలుడు డ్రమ్స్ వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలుడు సొంతంగా తయారు చేసుకున్న డ్రమ్సెట్తో వాయిస్తుంటే, బాలిక తన మృధువైన స్వరంతో పాటను పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రూపాలి ప్రణమిత ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అమ్మాయి పాటకు తగ్గా, సరైన బీట్స్తో బాలుడు మ్యూజిక్తో అదరగొట్టాడు. ఇక బాలుడు డ్రమ్సెట్ కోసం వినియోగించిన అట్టపెట్టెలు, అరటి చెట్టు కొమ్మలు, మెటల్ ట్రేలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన సమయం నుంచి నాలుగున్నర లక్షల మంది వీక్షించగా, 1800లకు పైగా కామెంట్లు రావడం విశేషం. పిల్లల సంగీత కచేరీ అద్భుతమని వారిద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?
కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఏదైనా వినూత్న విషయం కంట పడితే చాలు.. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈయన పెట్టే ప్రతి పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. కరోనాను అధిగమించేందుకు ఇటీవల పలు సూచనలు చేసిన ఆయన తాజాగా వాట్సాప్ వండర్ బాక్స్ పేరుతో మరో పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ అవులవుతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఇంటి నుంచి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారి వేషాధారణకు సంబంధించిన ఓ ఫన్నీ మీమ్ను ట్విటర్లో షేర్ చేశారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్) ‘ఇది నా వాట్సాప్ వండర్ బాక్స్ నుంచి వచ్చింది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో ఇంటి నుంచి ఆఫీస్ పనులు చేసేపటప్పుడు వీడియో కాల్లో నేను చొక్కా, లుంగీని ధరించేవాడిని. ఎందుకంటే ఆ సమయంలో నిలబడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత కూడా లుంగీ కట్టుకోవాలని నా సహచరులు నాకు సూచిస్తారేమో..’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవ్వడంతో నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. అంతపెద్ద కార్పొరేట్ దిగ్గజం లుంగీ ధరించడంపై షాక్కు గురవుతున్నారు. ‘ఓ మై గాడ్.. మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా’ అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ('శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ ఇవ్వండి') On a lighter note, this is from my #whatsappwonderbox. And I have a confession to make:On some Video Calls from home, I DID wear a lungi under my shirt. Didn’t have to stand up at any point during the meetings, but I suspect my colleagues may ask me to do so after this tweet! pic.twitter.com/e1IElefNaa — anand mahindra (@anandmahindra) April 5, 2020 -
టీడీపీ కుట్ర; ఇదీ.. అసలు కథ
ఈ క్లిప్పింగ్లో రాయి పట్టుకుని వెళుతున్న యువకుడి పేరు ఎన్ సద్దాం. పుంగనూరుకు చెందిన ఈ వ్యక్తి సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తరఫున 21, 22 వార్డులకు పోటీ చేస్తున్న వారికి మద్దతుగా నామినేషన్ సెంటర్కు వచ్చారు. నామినేషన్ సెంటర్లో అప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉండడం, వారు వచ్చిన తర్వాత వెళ్లాలని అధికారులు సూచించడంతో సద్దాం అడ్డుతగిలారు. వారు వచ్చేంత వరకూ మేమెందుకు వేచి ఉండాలంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసేందుకు రాయితో వెళుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఎల్లో మీడియా అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లు చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నా అడ్డుకునే వారు లేరని ఫోకస్ చేసింది. ఈ క్లిప్పింగ్లో ఉన్న వ్యక్తి పేరు కె.పద్మనాభం అలియాస్ పప్పురాయల్. టీడీపీ వర్గీయుడిగా, రౌడీషీటర్గా తిరుపతి నగరవాసులకు సుపరిచితుడు. సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉండగా అమెకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లడిస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు, బ్యానర్లు సైతం వేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను దూషించారని ‘బరితెగింపు’ పేరుతో టీడీపీ నేత మన్నెం శ్రీనివాసులపై వైఎస్సార్సీపీ నేత దాడి చేసినట్లు ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. వాస్తవానికి పప్పురాయల్, మన్నెం శ్రీనివాసులు ఇరువురు చిన్ననాటి స్నేహితులు. ఇప్పటికీ కలిసిమెలిసే ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేను దూషించారంటూ, మన్నెం శ్రీనివాసులపై దాడి చేశారంటూ వండివార్చింది. పప్పుయాదవ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఈ రెండు క్లిప్పింగ్స్ పరిశీలిస్తే ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ, ఎల్లో మీడియా ఎలా కుట్ర చేసిందో ఇట్టే అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వార్తలను తమకు అనుకూలంగా వండి వార్చాయి. వాటినే ఎన్నికల అధికారి పరిగణనలోకి స్వీకరించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్ష చర్యలు చేపట్టారని పలువురు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్ నారాయణగుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డితో పాటు పలువురు అధికారుల బదిలీల నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రోజుకొక దుష్ప్రచారం ‘తస్కరించు.. తిరస్కరించు.. బహిష్కరించు.. మూడంచెల కుట్ర’ ప్రజాస్వామ్యానికి పునాది రాయి.. ఇలా రోజుకొక వార్త వండివార్చడం. వాటినే సుమోటోగా రాష్ట్ర ఎన్నికల అధికారి స్వీకరించడం వెనుక కుట్రకోణం బహిర్గతమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప వివాదాలు సర్వసాధారణం. ఎన్నికలు వాయిదా పడాలనే టీడీపీ సంకల్పానికి ఎల్లో మీడియా అండగా నిలిచింది. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. జిల్లావ్యాప్తంగా దౌర్జన్యకర ఘటనలు తీవ్రంగా ఉన్నట్లు ఫోకస్ చేసింది. (ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?!) ప్రజాభిమానం లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. అందుకు కారణం గడిచిన ఐదేళ్లలో నియంతృత్వం రాజ్యమేలడం, ఓ వర్గం వారినే సంక్షేమ పథకాలకు అర్హులుగా ఎంపిక చేయడం, రాష్ట్రాభివృద్ధి లేకపోగా టీడీపీ కార్యకర్తల ఉన్నతికి మాత్రమే పనిచేయడం లాంటవని పలువురు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం హోదాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి 6నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ వర్తింపజేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 59 శాతం సీట్లు కేటాయించాలని రిజర్వేషన్ రూపొందించారు. 50 శాతానికి మించి సీట్లు ఇవ్వరాదంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డితో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో కేసు వేయించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్సీపీ టికెట్ల కేటాయింపులో 34 శాతం బీసీలకు దక్కేలా చర్యలు చేపట్టింది. స్క్రీన్ప్లే, డైరెక్షన్ టీడీపీయే కరోనా వైరస్ స్వైన్ప్లూ, యబోలా, సార్స్ వైరస్ కంటే ప్రమాదకరమైంది కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాలో 2శాతం కూడా మరణాలు లేవని, యబోలా వైరస్ వల్ల 30శాతం మరణాలు తలెత్తాయని వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకారిగా ప్రచారం చేస్తూ దాని ఆధారంగానే ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తెలుగుదేశం పార్టీయేనని పలువురు వెల్లడిస్తున్నారు. మార్చిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి దాదాపు రూ.5వేల కోట్లు లభించే అవకాశం ఉంది. ఆ నిధులు రాకుండా ఉండాలనే కుట్రను తెలుగుదేశం పన్నిందని పలువురు మేధావులు భావిస్తున్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాలు వాయిదా వేయడం తదితర నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. (చదవండి: ఆరువారాల కుట్ర!) -
నయా హెయిర్ స్టైల్.. 40 మిలియన్ల వ్యూస్
కురులపైనా శ్రద్ధ కేవలం అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి అబ్బాయిలు కూడా జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. ఉన్న కొంచెం జుట్టు అయినా రకరకాలుగా సోకులు పడుతుంటారు. జుట్టును అటు వేసి.. ఇటు వేసి.. సగం కత్తిరించి వివిధ స్టైల్లో తిప్పుతుంటారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది ఇంకేదో కొత్తదనం కావాలి అని అనుకుంటారు. అలా అనుకునే వారి కోసమే ఓ హెయిర్ స్టైల్ నిపుణుడు వెరైటీగా ట్రై చేశాడు. తన దగ్గరికి వచ్చన ఓ కస్టమర్కు జుట్టును స్టైల్ చేయడానికి మంటను ఉపయోగించాడు. జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్గా క్రాఫ్ చేశాడు. అయితే కస్టమర్కు మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను మొదటగా టిక్టాక్లో నవంబర్లో ప్రకాశ్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇండియాలోనే జరిగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనిని టిక్టాక్లో 30 మిలియన్ల మంది వీక్షించగా.. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ షేర్ చేస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూశారు. కాగా దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ఒక్కసారైనా ఇలాంటి హెయిర్ స్టైయిల్ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇంట్లో ఇలాంటివి చేయకండంటూ కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. This is an origin story for a hairstyle like mine.pic.twitter.com/gBKrhr1AQH — 𝙹𝚘𝚜𝚑 𝙶𝚛𝚞𝚋𝚋𝚜 (@JoshuaGrubbsPhD) January 27, 2020 -
భయానకం: అలలు అతడిని లాక్కెళ్లాయి!
బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్ శాంటా క్రజ్ ఫేస్బుక్’ పేజీ నిర్వాహకులు షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
ఆ బాలుడి సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ దివ్యాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. సంకల్ప బలంతో.. మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! ‘అతడి ఆట చూసి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్ను ఇష్టపడేవారు.. ఇష్టం లేనివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది’ అంటూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు అతడి ఆటకు హాట్సాఫ్ చెప్తున్నారు. కాళ్లను నేలపై ఈడ్చుకుంటూ మరో చేతితో బ్యాట్ పట్టుకొని పరిగెత్తడం చూస్తే నిరాశలో ఉన్నవారికి, వైకల్యంతో బాధపడతున్న ఎంతో మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆ పోస్ట్ నాది కాదు: టీనా దాబీ
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. 'ఐఏఎస్ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్మేట్ అయిన కశ్మిరీ ఐఏఎస్ అథర్ ఖాన్ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్లోని భిల్వారాలో పోస్టింగ్ లభించింది. కాగా టీనా భర్త అథర్ సివిల్ సర్వీసెస్లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి -
కండోమ్ వాడండి.. రేప్లను అంగీకరించండి!
దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్ శ్రావణ్ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్బుక్ అకౌంట్లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు. అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. -
బిల్గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్గేట్స్ తండ్రి వుడ్కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్గేట్స్ ఒక రెస్టారెంట్కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
రణుమొండాల్ 2.O వచ్చేసింది!
ముంబై: సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్ ‘ఏక్ ప్యార్కా నగ్మా హై’ అనే ఎవర్గ్రీన్ పాటతో ఒక్కసారిగా రాత్రికిరాత్రే స్టార్ సింగర్గా మారారు. రైల్వే స్టేషల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను రణు పాడుకుంటు ఉండగా ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. అది చూసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు ‘హిమేశ్ రెష్మియా’ రణుకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రణు మొండాల్ ఎన్నో పాటలకు కాంట్రాక్టులను దక్కించుకొవడంతో పాటు పలు షోలకు అతిథిగా కూడా హాజరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఆ ఏడుగురి మాట అటుంచింతే.. ప్రస్తుతానికి రణు మొండాల్ను పోలిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌహతికి చెందిన ఓ మహిళా.. రణు పాడిన 'తేరి మేరి కహానీ' అనే సూపర్హిట్ పాటను ఆమె పాడడంతో వీడియో వైరల్గా మారింది. ఆ మహిళా అచ్చం రణుమొండాల్ను పోలి ఉండటంతో పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఫన్నీగా రణు మొండాల్ 2 అని అభివర్ణిస్తున్నారు. కాని కొందరు మాత్రం డూప్లికేట్ సింగర్ అని, ఈమెను కూడా స్టార్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram #RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on Nov 22, 2019 at 6:23am PST ఇటీవల రణు ముఖానికి మితిమీరిన మేకప్ వేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. రణును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు నకిలీ ఫోటో సృష్టించారని తెలియడంతో నెటిజన్లు నాలిక కరచుకున్నారు. -
నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే
'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా' అంటూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ, హైదారాబాదీ సానియా మీర్జా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన కుమారుడు ఇజ్హాన్ మొదటి పుట్టినరోజు కావడంతో.. సానియా ఇన్స్టాగ్రామ్ను వేదికగా చేసుకుని సంవత్సరం క్రితం నాటి తన కుమారుని ఫోటోను జతచేశారు. View this post on Instagram Exactly one year since you came into this world and became our world .. you smiled the first day you were born and continue to spread smiles everywhere you go .. my truest,purest most amazing boy .. I LOVE YOU and I promise to be by your side until my last breath .. Happy Birthday my little angel 👼🏽 I pray Allah gives you everything you work towards and desire and continue to grow into the most loving and gentle boy that you already are .. InshaAllah .. Thank you for choosing us my little Izhaan ❤️ #HappybirthdayIzhaan A post shared by Sania Mirza (@mirzasaniar) on Oct 29, 2019 at 11:25pm PDT 'నువ్వు ఈ ప్రపంచానికి వచ్చి, నా ప్రపంచంగా మారి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. నీవు పుట్టినప్పుడు ఎలా చిరునవ్వు చిందించావో.. అలానే నువ్వు వెళ్లిన ప్రతిచోటా నవ్వులు పంచుతావని కోరుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటానని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా చిన్ని తండ్రి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు కోరుకునే, చేసే ప్రతి పనిలో నీకు అల్లాహ్ దయ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇజాన్' అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. సానియా చేసిన పోస్టుకు స్పందించిన బాలీవుడ్ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా ఇజ్హాన్కు బర్త్డే విషెస్ చెప్పారు. -
డేటా... దూకుడు!
ఉదయాన్నే లేస్తూ ఓ సెల్పీ.. వెంటనే దానిని ఫేస్బుక్, వాట్సాప్ల్లో పోస్టింగ్.. కొత్త సాంగ్ వచ్చిందా.. కొత్త స్టెప్పులు నేర్చుకుని వెంటనే టిక్టాక్లో డాన్సింగ్.. ఈసారి నా డబ్స్మాష్ వీడియో యూట్యూబ్లో ఎలాగైనా సరే వైరల్ అవ్వాల్సిందే.. ఇవీ భారతీయుల ఆలోచనలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలో డేటా వినియోగిస్తున్న వారిలో మనమే టాప్లో ఉండేంతలా. ఇదే విషయాన్ని మొబైల్ యాప్స్ల రేటింగ్లను నిర్ధారించే ‘సెన్సర్ టవర్ డేటా’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద మార్కెట్ మన దేశమే. అందుకు సోషల్ మీడియా ఏమీ తీసి పోదు. అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్ఫోన్ ధర లు, ఇంటర్నెట్ డేటా ప్యాకేజీల వల్ల సోషల్ మీడియా వాడకంలో పట్టణాలు, పల్లెల్లోనూ అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ఎంత లా అంటే ప్రపంచ సోషల్మీడియా వాడకంలో మనదే 40% భాగస్వామ్యం ఉండేంతలా. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త యాప్లు వచ్చిన ఇండియాలో వాటికి కొత్త వినియోగదారులు పుట్టుకొస్తూనే ఉన్నారు. టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లకు సంబంధించి ఇండియన్ల వినియోగం అసాధా రణ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్లను తలదన్ని మనదేశం అగ్రస్థానం దక్కించుకుంది. టిక్టాక్.. కొంతకాలంగా టిక్టాక్ సృష్టిస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. యువత, టీనేజీ, పిల్లలు, వృద్ధులు అంతా దీన్ని తెగవాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ యాప్ను అధికం(44 శాతం)గా మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక్క సెప్టెంబర్లోనే 6 కోట్ల మంది ఈ యాప్ను కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్ క్రేజ్ ఎంతగా ఉందో. మార్చిలో టిక్టాక్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది డౌన్లోడ్ చేయగా అందులో 8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. 15 సెకన్లకు ఓ కొత్త వీడియో ఇందులో అప్లోడ్ అవుతోంది. ప్రధాన సోషల్ మీడియా యాప్లైన ఫేస్బుక్, వాట్సాప్లకు ఇది తీవ్ర పోటీనిస్తోంది. వినియోగంలో భారత్ టాప్ప్లేస్లో ఉండగా.. అమెరికా, టర్కీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరికొన్ని విశేషాలు ►టిక్టాక్లో 41 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారే. ►యూజర్లలో 56 శాతం పురుషులు,44 శాతం మహిళలు. ►ప్రతీరోజు సగటు వినియోగదారుడు గడుపుతున్న సమయం 52 నిమిషాలు. ►90 శాతం వినియోగదారులు రోజుకు ఒక్కసారైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు. ►ఇంతవరకూ టిక్టాక్ చూసిన వారి సంఖ్య సరాసరిగా 100 కోట్లు. ఫేస్బుక్.. ఫేస్బుక్ యూజర్లు ఇండియా 24.1 కోట్లు అమెరికా 24 కోట్లు ఇండోనేషియా 13 కోట్ల ఫేస్బుక్ విషయానికి వస్తే.. గత నెలలో ఇండియన్లు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ల్లో ఇది రెండోస్థానంలో నిలిచింది. ఈ సెప్టెంబర్లో ఇండియాలో కొత్తగా 5 కోట్ల మంది ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న 100 శాతంలో భారత్ భాగస్వామ్యం 23 శాతంగా నమోదైంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న యాప్ల్లో ఫేస్బుక్ కూడా ఒకటి. ఎన్ని యాప్లొచ్చినా దీనికి ఉండే ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. ఫేస్బుక్కి అగ్రరాజ్యం అమెరికాలో 24 కోట్ల మంది యూజర్లు ఉండగా.. భారత్లో మాత్రం 24.1 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఫేస్బుక్ యూజర్ల పెరుగుదల భారత్లో 12 శాతంగా నమోదైంది. యూట్యూబ్ యూజర్లు అమెరికా50 కోట్లు ఇండియా 24 కోట్లు జపాన్12 కోట్లు యూట్యూబ్కు సైతం.. ఇండియాలో ఆదరణ పెరుగు తున్న వాటిలో యూట్యూబ్ కూడా ముందువరసలో ఉంది. మన దేశంలో 26.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 1,200 చానళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రై బర్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 2 చానళ్లకు మాత్రమే 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేది. కాలక్రమంలో ఈ చానళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిలో 95 శాతం ప్రాంతీయ భాషలకు చెందినవి కావడం గమనార్హం. నీల్సన్ సర్వే ప్రకారం.. అధికంగా ఆదరణ ఉన్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్, ఇతర విద్యా సంబంధమైన కంటెంట్ ఉంది. -
టిక్టాక్తో యువతకు ఐసిస్ వల
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్టాక్ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్టాక్ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టు గుర్తించిన టిక్టాక్ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసేందుకు టిక్టాక్ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్టాక్ ప్రకటించింది. ఐసిస్ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. అయితే అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్లోనూ టిక్టాక్ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్టాక్ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్ ట్యాగ్లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్టాక్ వినియోగదారులు ఉన్నారు. -
రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్
ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్బాయ్ కెన్నెత్ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో.. 'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్ అండ్ మిసెస్ ఉన్న మగ్లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్బాల్ క్యాప్లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె ఫ్యాన్స్.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మ్యారేజ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్ఫ్రెండ్ మ్యారెజ్ లైసెన్స్ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం. View this post on Instagram 👰🏽🤵🏽😢🙏🏽🎀 Onika Tanya Maraj-Petty 10•21•19 A post shared by Barbie (@nickiminaj) on Oct 21, 2019 at 8:22pm PDT -
ఫేక్ వెడ్డింగ్ కార్డ్పై అలియా స్పందన
-
వైరలవుతున్న అలియా, రణ్బీర్ వెడ్డింగ్ కార్డు!
ముంబై: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ జనవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వెడ్డింగ్ కార్డు చక్కర్లు కొడుతోంది. గత కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న అలియాను.. వివాహం, వెడ్డింగ్ కార్డుపై వస్తున్న వార్తలను గురించి అడగ్గా 'ఆమె సిగ్గుపడుతూ.. నేను ఏమి చెప్పాలి? పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదంటూ తల అడ్డంగా ఊపింది.' దీంతో వీరి వివాహం జనవరి 22న జోధ్పూర్లోని ఉమేద్ భవన్ ప్యాలెస్లో జరగనుందని వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. వివాహ ఆహ్వాన పత్రికను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న తప్పులు కొట్టొచిన్నట్లు కనిపిస్తున్నాయి. అలియా భట్ తండ్రి పేరు వాస్తవానికి మహేష్ భట్ అయితే, ఆహ్వాన పత్రికలో మాత్రం ముఖేష్ భట్ అని తప్పుగా ఉంది. అంతేకాక అలియా భట్ పేరుతో పాటు తేదిలో కూడా అక్షర దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అలియా చిరునవ్వుతో కొట్టి పారేయడంతో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని తేలింది. -
ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?
వినికిడి లోపం గల ఓ తండ్రి తన కుమార్తెతో సైగలతో సంభాషిస్తున్న వీడియోను అమెరికా మాజీ బాస్కెట్బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ ట్విటర్లో తాజాగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్గా మారింది. వినికిడి లోపం గల ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన చిన్నారితో సైగలతో మాట్లాడే మాటాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు భాష లేకపపోతే ఏంటి? తండ్రి తనపై కురిపిస్తున్న ఆత్మీయ స్పర్శ, ప్రేమ చాలు అనేలా.. ఆ చిన్నారి చూస్తున్న చూపులు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX — Rex Chapman🏇🏼 (@RexChapman) October 18, 2019 వినికిడి లోపం ఉన్న ఆ తండ్రి అప్పుడే పుట్టిన తన బిడ్డతో సైగలతో మాట్లాడుతుంటే.. ఆ పాపాయి తదేకంగా నువ్వు చెప్పే ప్రతీది తనకు అర్థమవుతోంది అన్నట్లు చూస్తోంది. కుమార్తెపై ఈ మూగ తండ్రి కురిపిస్తున్న ప్రేమను చూసిన ప్రతి ఒక్కరికి నిమిషం పాటు.. నోట మాట రాదంటే నమ్మండి. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆ తండ్రి సైగలకు అర్థాన్ని వెతికే పనిలో పడ్డారు. సంకేత భాషను అర్థం చేసుకున్న కొద్దిమంది నెటిజన్లు.. ఆ తండ్రి తన చిన్నారితో.. ‘హేయ్ నేను మీ డాడీని. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు ఆకుపచ్చ రంగులో అద్భుతంగా ఉన్నాయి. నీ అందమైన చిరునవ్వు బావుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెచ్చని దుప్పటిలో ఉన్న ఓ చిన్నదానా..! నేను నిన్ను ప్రేమిస్తున్నానే..' అంటున్నాడని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'ప్రేమ అన్ని భాషలను మించిపోయింది' అని మరోక నెటిజన్ పేర్కొన్నాడు. -
కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్స్టాగ్రామ్లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్తో తెర మీద కనిపించనున్నాడు. -
ప్రధానికి అమూల్ డూడుల్ శుభాకాంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పాల ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉన్న అమూల్ సంస్థ కూడా ప్రధాని మోదీకి ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే అందరిలాగే అమూల్ కూడా ఏదో ‘హ్యాపీ బర్థ్ డే మోదీ జీ’ అంటూ ట్వీటర్లో పోస్ట్ చేసుంటారులే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!. అవునండి మీరే చూడండి మరి.. మోదీ కార్టూన్ బొమ్మల డుడూల్ వీడియోను ప్రత్యేకంగా తయారు చేసి పోస్ట్ చేసింది. ‘గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాపన్తో పోస్ట్ చేసి అందరికన్నా భిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి ‘అమూల్ అంటే బ్రాండ్ కాదు.. భారత్ ఎమోషన్’ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియోలో మోదీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం నుంచి ఆయన పర్యటించిన అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు విదేశి పర్యటించిప ఫోటోలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో వైట్ హౌజ్ బయట సమావేశం అయిన ఫొటోతో పాటు, ఇటీవల చంద్రయాన్-2 విఫలం నేపథ్యంలో ఇస్రో చీఫ్ కె. శివన్ను ఓదారుస్తూ ఆయనను హత్తుకున్న యానిమేటెట్ ఫోటో ఈ వీడియోలో చివరలో కనిపిస్తాయి. #Amul wishes the Hon. PM Shri Narendra Modi @narendramodi a very happy 69th birthday! #happybirthdaynarendramodi pic.twitter.com/E039hOXwlT — Amul.coop (@Amul_Coop) September 16, 2019 -
సిలిండర్తో నటుడి వింత చేష్టలు!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో, కండల వీరుడు విద్యుత్ జమాల్ ఫుల్ సిలిండర్తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్ సిలిండర్తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. విద్యుత్ జమాల్ నటుడిగా మాత్రమే కాక, మార్షల్ ఆర్టిస్ట్గా, స్టంట్స్మాన్గా బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక్షన్ సీన్స్కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్ అవార్డులు వరించాయి. అయితే జమాల్ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్ సిలిండర్తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU — Vidyut Jammwal (@VidyutJammwal) September 5, 2019 వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్ బుక్ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్ విసురుతున్నారు. Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK — Bhrustrated (@AnupamUncl) September 5, 2019 -
కుంబీపాకం.. కోడి రక్తం..
ఆవిడెందుకు అలా మొహం పెట్టింది అని అడక్కండి.. ఎందుకంటే.. బతికున్న బురద చేపని తినమంటే.. మీరైనా అలాగే మొహం పెడతారు... అప్పుడే అయిపోలేదు.. వేడివేడి కోడి రక్తం ఇంకా వెయిటింగ్లో ఉంది.. చైనాలోని గ్వియ్జోలో ఉన్న ఓ సేల్స్ కంపెనీ టార్గెట్స్ పూర్తి చేయని ఉద్యోగులకు విధించిన శిక్ష ఇది.. ఇలా దాదాపు పాతిక మందికి ‘అపరిచితుడు’ సినిమాలోని కుంబీపాకం టైపు శిక్షలను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. అటు అధికారులూ ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.. ఇంతకీ దీనిపై వివరణ ఇచ్చిన కంపెనీ ప్రతినిధి ఏమంటాడో తెలుసా? వీళ్లంతా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట.. అంతేనా.. భవిష్యత్తులో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇది ప్రేరణగా ఉంటుందని సెలవిచ్చాడు.. ఇలాంటోడ్ని ఏం చేయాలంటారు?? -
వైరల్ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఓ వ్యక్తి కాలిపై తన కాలును పెట్టి ఉన్న పిక్ను పోస్ట్చేసింది. అయితే తాను చేసే ప్రతీ పోస్ట్కు ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం ఫోటోను మాత్రమే షేర్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్కు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతనెవరు? అంటూ ప్రశ్నించసాగారు. అతను ప్రేమికుడా? అంటూ అడిగిన నెటిజన్లకు.. స్నేహితుడంటూ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్పై సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్ చేసింది. -
కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!
గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్ మీడియాలో పలు పోస్ట్లు పెట్టి వార్తల్లో నిలిచారు నటి సమీరా రెడ్డి. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో మాతృత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని స్వీకరించాలని సమీరా రెడ్డి తన భావాలను వ్యక్తపరచడంతో చాలా మంది భారత మహిళలకు ఆమె ఓ ప్రేరణగా మారారు. ఈ నెల ప్రారంభంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా, తన కుమార్తెకు 'నైరా' అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకుంటూ.. 'మా గారాలపట్టి నైరాను వర్డే కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాం' అని పేర్కొన్నారు. 'నైరా' అనేది సరస్వతి దేవి పేరని ఆమె తెలిపారు. అంతేకాకుండా హీబ్రూలో 'మొక్క' అని అర్థం వస్తుందని, అమెరికన్ మూలంలో ‘నైట్ బోర్డర్‘ అనే అర్థం కూడా ఉందని ఆమె తెలిపారు. దీంతో ఈ అరుదైన పేరుకి వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. సమీరా షేర్ చేసిన పోస్ట్కు స్పందించిన ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, అనితా డోంగ్రే పేరు చాలా బావుందని ప్రశంసించారు. తన భర్త అక్షయ్ వర్దే, తాను ఓ కుమార్తెను కోరుకున్నామని అనుకున్నట్లే కుమార్తె జన్మించడంతో సంతోషంగా ఉందని గతంలో సమీరా రెడ్డి ఓ పోస్ట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. -
మొసలిని మింగిన కొండచిలువ!
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్! అనకుండ ఉండలేరు. కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్ గెలుపు సాధించింది. ఆలివ్ పైథాన్ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్ లైఫ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్లు వచ్చాయి. -
ఆగస్టులో అపరిమిత సెక్స్ ఫెస్టివల్
న్యూయార్క్ : ‘కామి కాలేనివాడు మోక్షగామి కాలేడు’ అన్న భారతీయ వివాదాస్పద సాధువు రజనీష్ సూత్రాన్ని ఆచరించాలనుకున్నారేమోగానీ ‘వంద మంది అమ్మాయిలతో అపరిమిత సెక్స్ ’ అంటూ నిర్వహకులు ఇస్తున్న పిలుపు నేడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్ ఐలాండ్’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్ ఆరువేల డాలర్లు. నాలుగు రోజులపాటు ఈ సెక్స్ వేడుకల్లో టెక్కెట్లు కొనుక్కొని వచ్చే పురుష పుంగవులు ప్రతి రోజు ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్ అండ్ ఫ్రెండ్లీ వెకేషన్’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. విషయం తెలిసే కాబోలు, సెక్స్ వేడుకల రోజుల్లో దాడులు నిర్వహిస్తామని, డ్రగ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ‘అమెరికాస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్తోని విదేశీ పర్యాటకులు దొరికినట్లయితే వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని వలసదారుల కేంద్రానికి తరలించి వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అంతేకాదు, సెక్స్కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినా అసలు వేడుకలే జరగకుండా అడ్డుకుంటామని అమెరికా పోలీసులు కూడా నిర్వాహకులను హెచ్చరించారు. 18 ఏళ్ల ప్రాయంలోని వారిని సెక్స్కు అనుమతిస్తే కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అమెరికాలో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. మొదటి సెక్స్ ఫెస్టివల్ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ‘ఆర్గ్ హాలీడే’ అనే పొర్న్ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్కు కట్టుబడి ఉంటారని తెలిపారు. -
అందరినీ సంతృప్తి పరచలేను!
సినిమా: అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని నటి రకుల్ ప్రీత్సింగ్ అంటోంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా, ఇటీవల ఈ జాణకు హిట్స్ కరువయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో సూర్యతో జతకట్టిన ఎన్జీకే చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రకుల్కు పూర్తిగా నిరాశనే మిగిల్సింది. కోలీవుడ్లో దేవ్ చిత్రం తరువాత ఈమె చవిచూసిన రెండవ అపజయం ఎన్జీకే. ఇక తెలుగులోనూ అర్జెంట్గా ఆ బ్యూటీకి ఒక హిట్ కావాలి. అయితే ప్రస్తుతం నాగార్జునతో మన్మథుడు–2 చిత్రంలో నటిస్తోంది. ఈమెకు ఆశాదీపం ఆ చిత్రమే. ఇకపోతే కోలీవుడ్లో విజయ్ సరసన నటించి అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని అవకాశాల కోసం రకుల్ప్రీత్సింగ్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. అందులో భాగంగా గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాకు విడుదల చేస్తూ చర్చల్లో నానుతోంది. తన అవకాశాల మాటెలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి. కొందరు అభిమానులను ఆ ఫొటోలు ఎంజాయ్మెంట్ను ఇస్తున్నా, మరి కొందరి విమర్శలను రకుల్ప్రీత్సింగ్ ఎదుర్కోకతప్పడం లేదు. అయితే విమర్శలు ఎప్పుడూ రుచించవు. వాటి గురించి రకుల్ప్రీత్సింగ్ కూడా విరుచుకుపడుతోంది. ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లోని కొందరు పనీ పాటా లేని వారు ఉంటారని అంది. అలాంటి వారికి ఇంకొకరిని విమర్శించడమే పని అని విరుచుకు పడింది. అయినా తన తల్లిదండ్రులు, స్నేహితుల అభిప్రాయాలనే తాను గౌరవిస్తానని ఇతరుల గురించి పట్టించుకోవలసిని అవసరం తనకు లేదని అంది. అంతే కాకుండా అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదనీ రకుల్ప్రీత్సింగ్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఉత్తరాది భామ కథా ఈ అమ్మడికి ఆ పాటి టెక్ ఉండటం సహజమే. -
వైరల్ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్
అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్ మూవీ ఫలితం ఎలాగున్నా బీటౌన్లో జాన్వీ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది. జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు ఊరికే ఉంటారా? లైక్లు, కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్
-
సియాచిన్లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019 -
ఇలా జరగడం లైఫ్లో మొదటిసారి : స్నేహా ఉల్లాల్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్, సింహా చిత్రాలతో ఫేమస్ అయిన స్నేహా ఉల్లాల్.. వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్తో స్నేహా ఉల్లాల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. తాను మొదటిసారిగా ఆసుపత్రిలో చేరారని, ఇలా జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. View this post on Instagram So i was hospitalised for the first time in my life.I had a very high fever that wasn’t dying down despite multiple treatments.It was scary.BUT. After a while of terrible health , im finally a lil better.I have been asked to rest it out as much as possible.So thats going to be boring.But i have my Netflix and a bunch of very caring #foreverkindofpeople with me to keep me going.Cant wait to get back to work. I wish you all good health. A post shared by Sneha Ullal (@snehaullal) on Jun 2, 2019 at 4:46am PDT -
ఐష్పై ఒబెరాయ్ ట్వీట్.. సోనమ్ ఫైర్
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన షేర్ చేసిన మీమ్ పెడర్థాలకు దారితీసింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ను కించపరిచే విధంగా ఉన్న ఆ మీమ్పై యావత్ భారతం మండిపడుతోంది. మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఒబెరాయ్ ప్రవర్తించాడని దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ ఒబెరాయ్ చేసిన తప్పు ఏంటంటే.. ఒకప్పటి గర్ల్ఫ్రెండ్ అయిన ఐశ్వర్య వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్ను షేర్ చేయడం. ఆమె బాయ్ఫ్రెండ్స్ను ప్రస్తావిస్తూ.. చాలా జుగుప్సాకరంగా రూపొందించిన ఆ మీమ్ను ట్వీట్ చేయడం.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్గా.. తనతో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఎగ్జిట్ పోల్గా.. అభిషేక్ బచ్చన్, తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫొటోను రిజల్ట్గా పేర్కొంటూ ఏ మాత్రం సోయి లేకుండా ట్వీట్ చేశాడు. పైగా వెటకారంగా ‘హహహ.. క్రియేటివ్.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒబెరాయ్ ఒళ్లు మరిచి ట్వీట్ చేశాడని మండిపడుతున్నారు. చాలా అమర్యాదకంగా ప్రవర్తించాడని, వెంటనే ఆ ట్వీట్ను తొలగించాలని కామెంట్ చేస్తున్నారు. నరేంద్రమోదీ సినిమాలో మోదీ పాత్ర చేసినంత మాత్రానా.. ప్రధానని ఫీలవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ బుద్ది చెబుతున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఒబెరాయ్ చర్యను తప్పుబట్టారు. చాలా అసహ్యంగా ఉందని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్పై కేసు నమోదు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ లో ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. Haha! 👍 creative! No politics here....just life 🙏😃 Credits : @pavansingh1985 pic.twitter.com/1rPbbXZU8T — Vivek Anand Oberoi (@vivekoberoi) 20 May 2019 -
వ్యక్తీకరణ
‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని. స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతా బెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. మాధవ్ శింగరాజు ప్రియాంక చోప్రా, ప్రియాంక గాంధీ.. వీళ్లలా ప్రియాంక శర్మ పెద్ద పేరున్న వ్యక్తి కాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక ‘మీమ్’ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, షేర్ చేసిందన్న ఆరోపణపై ఈ నెల పదవ తేదీన దాస్నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాక కానీ.. ప్రియాంక శర్మ అనే ఒకరు బీజేపీ యువ మోర్చాలో కార్యకర్తగా ఉన్నారన్న సంగతి దేశానికి తెలియరాలేదు. మే ఆరున న్యూయార్క్లో జరిగిన ‘మెట్ గాలా’ ఫ్యాషన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విచిత్ర వేషధారణలో కనిపించారు. ఆ వేషాన్ని ప్రియాంక శర్మ మమతకు వేసి, ఆ ఫొటోను నెట్లో పెట్టడమే పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి కారణం. ఆమెను తక్షణం బెయిలు మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు గత మంగళవారం ఆదేశించింది. ఆ సందర్భంలోనే కోర్టు ఒక వ్యాఖ్య కూడా చేసింది. మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకూడదని. అంతేకాదు, మమతకు క్షమాపణ చెప్పాలని కూడా ప్రియాంక శర్మకు ఆదేశించింది. అయితే తనేం క్షమాపణ చెప్పబోవడం లేదని జైలు నుంచి బయటికి వచ్చీరాగానే పెట్టిన ప్రెస్ మీట్లో ప్రియాంక ప్రకటించారు! మొత్తం ఐదు రోజులు జైల్లో ఉన్నారు ప్రియాంక. ఈ ఐదు రోజులూ జైలు అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని, కనీసం తాగడానికి కూడా నీళ్లివ్వకుండా ప్రతిరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారనీ ఆరోపించారు. అయితే ఇదంతా కూడా ప్రియాంక కోరి తెచ్చుకున్నదే.ఏదైనా ఒక సామాజిక మార్పును ఆశించిగానీ, ప్రజల్లో ఏదైనా ఒక ప్రగతిశీల ఆలోచనను రేకెత్తించేందుకు గానీ మమత ఫొటోను ఆమె మార్ఫింగ్ చేయలేదు. రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా కించపరచడానికి.. ఏమీ తోచక చేసిన పని మాత్రమే అది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ఈ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! స్త్రీని స్త్రీ పరిహసించడంలో అసాధారణత ఏమీ లేదనుకున్నా.. మమత సాధారణమైన వ్యక్తేం కాదు. పోరాట పటిమగల రాజనీతిజ్ఞురాలు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేయడం పిల్ల చేష్ట కూడా కాదు. పని లేని చేష్ట.మమతను సాటి మహిళగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ప్రియాంక శర్మ చూసినప్పటికీ.. ప్రియాంకను బీజేపీ యూత్ లీడర్లా కాకుండా సాటి మహిళగా మమత చూశారని.. 2012 నాటి పాత కేసునొకదాన్ని గుర్తు చేసుకుంటే.. పోలిక తెలుస్తుంది. అదీ ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ కేసే. మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది.. ఆమెను, రైల్వే మంత్రి ముకుల్ రాయ్ని, మాజీ రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీలను కలిపి కార్టూన్గా వేసి, ఆ కార్టూన్ని ఈ–మెయిల్గా పార్వర్డ్ చేసిన జాదవ్పూర్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర పైన, ఆ ఈ–మెయిల్ను అందుకున్న సుబ్రతాసేన్ గుప్తా అనే ఆయనపైన రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పరువునష్టం కేసు. ఇంకోటి ఒక స్త్రీ శీలప్రతిష్టకు భంగం కలిగించిన కేసు. ఈ రెండు కేసులూ ఇప్పటికీ నడుస్తున్నాయి! బెయిల్ మీద ఉన్న మహాపాత్ర నేటికీ విచారణకు హాజరవుతున్నారు. సుబ్రతా సేన్గుప్తా గతవారమే తన 79 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రియాంక శర్మ పోస్ట్ చేసిన మీమ్తో పోలిస్తే, అప్పట్లో మహాపాత్ర ఫార్వర్డ్ చేసిన కార్టూన్ ఎంతో అర్థవంతమైనది. శుభ్రమైన ఒక పొలిటికల్ సెటైర్. అయినప్పటికీ ‘గౌరవనీయులపై చేసిన ఆక్షేపణీయమైన వ్యాఖ్య’గా పరిగణించి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రైల్వే మంత్రిగా ఉన్న దినేశ్ని తప్పించి, ఆ పదవిని మమత.. ముకుల్కి ఇప్పించారని మహాపాత్ర కార్టూన్ వేశారు. మమత ముకుల్తో అంటున్నట్లుగా ఉన్న ఆ కార్టూన్లోని కామెంట్లను 1974 నాటి సత్యజిత్ రే మిస్టరీ మూవీ ‘సోనా కెల్లా’లోని డైలాగులతో మహాపాత్ర సంకేతపరిచారు. ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ప్రియాంక విషయంలో మమత మరీ అంతగా గట్టిగా ఉండకపోవచ్చు.సెటైర్కి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ప్రభుత్వం ఒకలా స్పందిస్తుంది. తీవ్రవాదులు ఒకలా స్పందిస్తారు. అసలు ఏ విధంగానూ స్పందించకుండా ఇగ్నోర్ చేసేవారూ ఉంటారు. గత ఏడాది ఆరంభంలో కశ్మీర్లో జరిగిన ఒక అత్యాచార ఘటనతో లింక్ చేస్తూ సీతమ్మవారిని సీన్లోకి తెచ్చి ఆమె చేత రామభక్తులపై కామెంట్ చేయించిన కార్టూన్ ఒకటి హైదరాబాద్ నుంచి ఫేస్బుక్లో పోస్ట్ అయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. జైల్లో పడేయడం కన్నా పెద్ద శిక్ష ఇగ్నోర్ చేసి పడేయడం. ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకునేవారు ఒక్క హైదరాబాద్లోనే, ఒక్క బెంగుళూరులోనే, ఒక్క పశ్చిమబెంగాల్లోనే ఉండరు. ఫ్రాన్స్లోనూ ఉంటారు. అక్కడొక పెద్ద గుంపే ఉంది. ఆ గుంపు ఒక పత్రికనే నడుపుతోంది. ఆ పత్రిక పేరు ‘చార్లీ హెబ్డో’. వ్యంగ్య రచనల వారపత్రిక.గవర్నమెంటు మీద కార్టూన్లు వేసినన్నాళ్లూ ఏమీ కాలేదు కానీ.. ఒక మతం మీద సెటైర్లు వేసినందుకు ఆ పత్రిక ముఖ్య సంపాదకుడిని, ముగ్గురు కార్టూనిస్టులను పత్రికా కార్యాలయంలోకి వెళ్లి మరీ కాల్చి చంపారు తీవ్రవాదులు.2015లో జరిగింది ఈ ఘటన. ప్రజల్లో ఇస్లాం ఫోబియాను కలిగించే విధంగా ఫ్రెంచ్ రచయిత మిషెల్ వెల్బెక్ రాసిన వివాదాస్పద వ్యంగ్య నవల ‘సబ్మిషన్’ (ఆ ఘటనకు రెండ్రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చింది) లోని అంశాలపై వెల్బెక్ని సమర్థిస్తూ సెటైర్లు ఉన్నాయి.ఆ సెటైర్లే తీవ్రవాదులకు ఆగ్రహం తెప్పించాయి.‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని.స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతాబెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. జైల్లో తననెంతో మానసిక క్షోభకు గురిచేశారని అంటున్న ప్రియాంకకు.. తన చేష్ట ద్వారా మమతను అభిమానించేవాళ్లను తను ఎంతటి క్షోభకు గురి చేసి ఉంటుందోనన్న ఆలోచన వచ్చి ఉంటుందా? కేసు జూలైకి వాయిదా పడింది. ఆలోపు వస్తుందేమో మరి.. ఆలోచన! ప్రియాంక శర్మ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ప్రియాంక శర్మ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! -
చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో మావోయిస్టు కార్యక్రమాల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారం వివాదాస్పదమవుతోంది. ‘నక్సలైట్ కార్యకలాపాలపై శాతవాహన యూనివర్సిటీలో పోలీసుల ఆరా’శీర్షికన రాసిన లేఖ సోమవారం ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ‘నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్’పేరిట ఈ లేఖ వాట్సాప్ గ్రూపుల్లో మీడియాతో పాటు విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల ఫోన్లలో చక్కర్లు కొట్టింది. అయితే మీడియా గ్రూపులకు స్వయంగా పోలీసుశాఖ పంపించడం గమనార్హం. దీంతో పోలీస్ శాఖ తరఫున అధికారికంగా నక్సలైట్ బాధితులు లేఖ విడుదల చేసినట్లు భావించారు. దీనిపై పోలీసు శాఖ అధికారులను ‘సాక్షి’సంప్రదించగా, యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో వచ్చిన పోస్టును సమాచారం కోసం షేర్ చేశామే తప్ప, అధికారికంగా కాదని వెల్లడించారు. కాగా సాయంత్రం ఇదే సంఘం తరఫున వచ్చిన మరో పోస్టును గ్రూపులో కాకుండా విడిగా జర్నలిస్టులకు పోస్టు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యాలుగా టీవీవీ అనుకూల విద్యార్థులు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించిన ఫొటోను, విడుదల చేసిన పోస్టర్ను పంపించారు. టీవీవీ, ప్రొఫెసర్కు వ్యతిరేకంగా పోస్టు నిషేధిత మావోయిస్టు తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంఘంలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొరివి సూర్యుడు, కరికె మహేశ్, దొగ్గల రాజు అనే టీవీవీ నాయకులు మరికొందరితో కలసి ఇటీవల ఛత్తీస్గఢ్ వెళ్లి మావోయిస్టు చంద్రన్నను కలసి తీవ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని ఆరోపించారు. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరుతో విద్యార్థులను ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రవాదులను కలిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయిస్తున్నట్లు ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసే విద్యార్థి సంఘాల్లో చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వాట్సాప్ లేఖను పోలీస్ శాఖ మీడియా గ్రూపుల్లో పంపించింది. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా యూనివర్సిటీలో మావోయిస్టు అనుకూల విద్యార్థి సంఘం కార్యకలాపాలు సాగిస్తుందని ఓ వైపు మీడియా, పోలీసు, ప్రొఫెసర్, విద్యార్థుల గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతున్న సమయంలో మధ్యాహ్నం ఏబీవీపీ విద్యార్థి సంఘం స్పందించింది. యూనివర్సిటీ పరిపాలన విభాగంలోకి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ విద్యార్థి వేదికకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించారు. రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. తీవ్రవాద కార్యకలాపాలు లేవు యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్సిటీలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలు సాగడం లేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు విద్యార్థి సంఘాల తీరులోనే తెలంగాణ విద్యార్థి వేదిక అనేది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అది నిషేధిత సంఘమో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం స్టడీ టూర్ కింద యూనివర్సిటీ నుంచి అధికారికంగానే భద్రాచలం వెళ్లినట్లు తెలిపా రు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతతోపాటు ఇతర స్టాఫ్ కూడా ఉందని, తనకు భద్రాచలం అనే చెప్పారని, ఛత్తీస్గఢ్ వెళ్లారో లేదో తెలియదని అన్నారు. పెంచల శ్రీనివాస్ అనే కాంట్రాక్టు లెక్చరర్ లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక ఇచ్చారని, వీసీ పరిధిలో ఉందని చెప్పారు. వాట్సాప్ పోస్టులో ఉన్నవన్నీ తప్పులేనని అంగీకరించారు. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థే: మరో ప్రకటన సోమవారం ఉదయమే తెలంగాణ విద్యార్థి వేదిక లక్ష్యంగా కరీంనగర్ నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో వాట్సాప్ పోస్టు రాగా, మధ్యాహ్నం మూడు గంటలకు మరో ప్రకటన వెలువడింది. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు ఇవి కావా? అంటూ కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, వరవరరావుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున మే 17న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్ను, శాతవాహన యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. వీటిని కూడా పోలీస్ పీఆర్ఓ జర్నలిస్టులకు తన ఫోన్ ద్వారా పంపించడం గమనార్హం. -
బొద్దింకలతో కొత్త చాలెంజ్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్నే ఏలుతోంది.. ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అయిపోతారో తెలియదు.. ఏ అంశం వైరల్ అవుతుందో తెలియదు.. అదంతా సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుంది. అదీ సోషల్ మీడియా మహిమ. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్.. ఇలా చాలా చాలెంజ్లు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అయిపోయాయి. ఇప్పుడేమో తాజాగా మరో చాలెంజ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బొద్దింక తెలుసు కదా.. దాన్ని ముఖంపై పెట్టుకుని సెల్ఫీ దిగి దాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేయాలి. బొద్దింకను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.. అలాంటిది ముఖంపై వేసుకుని ఫొటో దిగడమా.. వాక్ అనుకోకండి. అదే మరి చాలెంజ్ అంటే.. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే.. గత నెలలో మయన్మార్కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు పెద్ద బొద్దింకను ముఖం మీద పెట్టుకుని ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టాడు. అంతే ఒక్కరోజులో ఈ పోస్ట్ను దాదాపు 20 వేల మంది షేర్ చేశారు. ఇక అప్పటినుంచి మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాల్లో బొద్దింకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా అమెరికన్ జాతికి చెందిన బొద్దింకలను వాడుతున్నారు. ఈ బొద్దింకలను ఆగ్నేయాసియా దేశాల్లో ఇంట్లో పెంచుకుంటుంటారు. చూడాలి ఇంకా ఎలాంటి చాలెంజ్లను మనం చూడాల్సి వస్తుందో! -
ఎడారిలో బందీ
అల్గునూర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ బాట పట్టిన కరీంనగర్ వాసి ఒకరు దేశం కాని దేశంలో బందీగామారి నరకయాతన అనుభవిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య ఏజెంట్ చేసిన మోసం.. యజమాని (కఫిల్) కర్కశత్వంతో సౌదీలో బందీ అయ్యాడు. వీరయ్యకు భార్య, ఇద్దరు కుమా రులున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడం తో భార్య, బిడ్డలను వదిలి గల్ఫ్ వెళ్లాడు. రెండేళ్లుగా యజమాని చెప్పిన పనులు చేస్తున్నాడు. అయితే.. ఇటీవల వీరయ్య తల్లి చనిపోయింది. దీంతో ఊరికి వెళ్తానని బతిమాలుకున్నా షేక్ పంపించలేదు సరికదా వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు తన ఆవేదనను.. అక్కడ పడుతున్నకష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. ఉపాధి నిమిత్తం గతంలో ఖతార్ వెళ్లిన వీరయ్య.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. తర్వాత కూడా సొంతూల్లో పనేమీ దొరక్కపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం మళ్లీ గల్ఫ్ ఏజెంట్ యాదగిరి ద్వారా చిగురుమామిడికి చెందిన తిరుపతితో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. వ్యవసాయం అని చెప్పిన ఏజెంట్ వీరయ్య, తిరుపతి గల్ఫ్ వెళ్లేందుకు చిగురుమామిడి మండలం ఓగులాపూర్కు చెందిన ఏజెంట్ యాదగిరిని సంప్రదించారు. దీంతో ఆయన పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. సౌదీ అరేబియాలో ఖర్జూర తోట లు చూసుకోవాలని తెలిపాడు. దీనికి అంగీకరించిన వీరిద్దరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం తనతోపాటు ఇద్దరినీ సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడకి వెళ్లిన తర్వాత షేక్ ఇద్దరినీ అబుదాబికీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖాకా ప్రాంతంలో సుమా రు వంద ఒంటెలకు కాపలా ఉండాలని, వాటి బాగోగులు చూసుకోవాలని ఆదేశించారు. ఇందుకు నెలకు రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. లక్షన్నర అప్పు చేసి సౌదీ వెళ్లిన ఇద్దరూ ఇండియాకు తిరిగి రాలేక షేక్ చెప్పిన పనికి అంగీకరించారు. రెండేళ్లుగా ఒంటెల బాగోగులు చూసుకుంటున్నారు. షేక్ ఎప్పుడు టిఫి న్ పంపిస్తే అప్పుడే తింటుండేవారు. ఎంత కష్టమైనా వీసా గడువు ముగిసేవరకు పని చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ కూడా బాగానే ఉంటున్నామని చెప్పేవారు. తల్లికి కొరివిపెట్టేందుకు రాలేక.. వీరయ్య తల్లి వీరమ్మ 45 రోజుల క్రితం స్వగ్రామం మక్తపల్లిలో చనిపోయింది. కుటుంబసభ్యులు ఫోన్ లో వీరయ్యకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని వీరయ్య తన షేక్కు వెళ్లి చెప్పాడు. తన తల్లికి తలకొరివి పెట్టాలని, ఇండియా పంపించాలని వేడుకున్నాడు. షేక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నా డు. దీంతో వీరయ్య తల్లి కోసం ఇండియా వెళ్లాలని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వీసా గడువు కూడా దగ్గర పడుతుందని తెలిపాడు. తనను షేక్ ఇంటికి పంపించడంలేదని తన ఆవేదనను ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీరయ్య వస్తాడని కుటుంబ సభ్యులు రెండు రోజులు వీరమ్మకు అంత్యక్రియలు నిర్వహించకుం డా ఎదురు చూశారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు షేక్ను పిలిపించి ఇండియా పంపాలని సూచించారు. పది రోజుల్లో పంపిస్తానని ఆ షేక్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఒంటె చనిపోయిందని దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే వీరయ్య కాపలా ఉండేచోట ఓ ఒంటె చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న షేక్ వీరయ్యపై దాడి చేశాడు. ఒంటె నిర్లక్ష్యంతోనే చనిపోయిందని పళ్లు రాలిపోయేంతలా తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని కూడా వీరయ్య తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను ఇండియా పంపేందుకు షేక్ అంగీకరించడంలేదని, ఒంటె చనిపోతే తనపై దాడి చేశాడని అం దులో తెలిపాడు. వీరయ్య సెల్ఫీ వీడియో విషయం తెలవడంతో ఆగ్రహించిన షేక్ వెంటనే వీరయ్య సెల్ఫోన్ లాక్కున్నాడు. ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. దీంతో నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా వీరయ్య మాట్లాడడంలేదు. ఈ క్రమంలో వీరయ్య గతంలో సోషల్ మీడియాలో చేసిన సెల్ఫీ వీడియో పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వీరయ్యను కాపాడాలంటూ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరయ్య వీడియో చూసిన పలువురు దానిని షేర్ చేయడంతో ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. అధికారులు వీరయ్య కుటుంబం గురించి తెలుసుకుని కొడుకు హరీశ్కు ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్యను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు బాధితుడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. వీరయ్యనుంచి స్పందన రాలేదు. కాగా.. వీరయ్య ఆచూకీ కనుక్కునేందుకు సహకరించాలని సౌదీలోని ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మా నాన్నను తీసుకురండి.. ప్లీజ్! మా నాన్న ఏజెంట్ను నమ్మి సౌదీఅరేబియా వెళ్లాడు. వీసా గడువు కూడా రెండేళ్లే. గడువు ముగిసి ఇప్పటికే నెల రోజులైంది. అయినా ఇండియాకు పంపేందుకు షేక్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తిరుపతి ఫోన్ నుంచి మాకు ఫోన్ చేసి చెప్పాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా నాన్నను ఎలాగైనా ఇండియాకు క్షేమంగా తీసుకురావాలి. నెల రోజులుగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎలా ఉన్నాడో తెలియదు. రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. – హరీశ్, వీరయ్య కొడుకు, మక్తపల్లి -
మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక..
సాక్షి, హైదరాబాద్ : టీడీపే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గురువారం ట్విటర్ వేదికగా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణంపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఉమ పిడకలు విసురుతున్నారు. కోడెలేమో జగన్ ఎప్పటికి సీఎం కాలేరని వృద్ధాప్యం వల్ల ఏదేదో మాట్లాడుతున్నారు. మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చదువుతున్నారు. సొంత డబ్బా అలవాటే గదా. కొట్టుకోండి పోయేదేముంది.’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రసంగం విని జాతీయ పార్టీల అధ్యక్షులే కింద మీద పడి పిసుక్కుంటున్నారని, ఆయన ప్రసంగం విని ఎవరైనా ఓట్లేస్తారంటే నమ్మొచ్చా? అని ఎద్దేవా చేశారు. అది కూడా ఇంకో రాష్ట్రమైన కర్ణాటకలో వేదిక ఎక్కి ప్రసంగించాలని, ముందు మూడు నాలుగు వేల మంది గుంపుగా కనిపిస్తేనే మనవాడికి ఆ రాత్రి నిద్ర పడుతుందన్నారు. ఇంకా ఐదు వారాలు ఎలా గడవాలో ఏంటోనని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఆప్రమాణం గుర్తుందా? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా ఉంటానని ఐపీఎస్ శిక్షణ సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందా అని ఏబీ వెంకటేశ్వర్రావును ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ చంద్రబాబుకు ఊడిగం చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా?..అని నిలదీశారు. ‘ఎన్నికలంటే ఏంటి? ఎవరో డబ్బు ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు ఖర్చుచేసి గెలుస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగేది ఇలాగే గదా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదని, ఈ పెద్ద మనిషి ప్రజాస్వామ్యాన్ని ఈసీ పరిహాసం చేసిందని దేశమంతా తిరుగుతూ రంకెలు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. -
మీకు బుద్దుందా? ఇదో స్టుపిడ్ ఫొటో!
విన్నూత్నంగా ఫొటోలు దిగి.. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ‘మీకు బుద్దుందా.. ఇదో స్టుపిడ్ ఫొటో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల పిచ్చితో ప్రాణాలను పొగుట్టుకుంటారా? ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి కామన్సెన్స్ లేకుండా ప్రవర్తించారని కామెంట్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన కెల్లీ క్యాస్ట్లీ, కోడి అనే దంపతులు వినూత్న పోజ్లో ఉన్న ఫొటోను తమ ఇన్స్టాగ్రామ్లో గత మంగళవారం షేర్ చేశారు. ఇంతకీ ఆ ఆమెరికా జంట షేర్ చేసిన ఫొటో ఏంటంటే.. కొండభాగాన ఉన్నట్లున్న స్విమ్మింగ్ పూల్లో అంచున అతను నిలబడగా.. అతని చేతిలో ఆమె ఒదిగిపోయింది. అయితే ఈ ఫొటో చూడటానికి ఆకట్టుకున్నా.. వారి ప్రాణాలకు ప్రమాదకరమనే విధంగా ఉంది. ఆమె అతని చేతిలో నుంచి జారితే ప్రాణాలు గాల్లో కలిసేటట్లుంది. ఇది చూసిన నెటిజన్లకు చిరెత్తుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆ జంటపై దుమ్మెత్తిపోసారు. అయితే ఈ దంపతులు మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకునే తాము ఈ ఫొటో షూట్ చేశామన్నారు. ఆ పైబాగాన ఉన్న స్విమ్ పూల్ కింద మరో స్విమ్ పూల్ ఉందని, తమ ప్రాణాల గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram Seize the day with a beautiful view from our amazing pool. Thank you @la_la_la_lara for having a good time with us💕 #trulyubud ••••• Get special rate through our website with our promo code : TKJRIG18 thekayonjungleresort.com Resort for Adult Only ••••• The Kayon Jungle Resort Member of @pramanahotels Managed by @pramanaexperience ••• #trulykayon #kayonubud #kayonresort #kepiturestaurant #pramanahotels #natureview #naturelover #wonderfulindonesia #bestdestinationwedding #honeymoon #romantichotel #explorebali #bali #visitbali #thebaliguideline #balidaily #baligasm #balilife #ubud #thebalibible #balibible #lovetotravel #traveltheworld #wonderfulhotel A post shared by The Kayon Jungle Resort (@kayonjungleresort) on Apr 7, 2019 at 1:21am PDT -
‘సోషల్’ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తాం
లండన్: సామాజిక మాధ్యమాల్లో ప్రమాదకరమైన సమాచారం వస్తే ఆయా సంస్థల యాజమాన్యాన్ని ఇందుకు బాధ్యులుగా చేస్తామని బ్రిటన్ హెచ్చరించింది. విద్వేష నేరాలు, దూషణలకు సంబంధించి ఫేస్బుక్ సహా పలు సోషల్మీడియా సంస్థల అధినేతలతో చర్చించిన అనంతరం కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను ప్రకటించింది. ఈ తరహా యాక్షన్ ప్లాన్ను ప్రకటించడం ప్రపంచంలో ఇదే తొలిసారని బ్రిటన్ సాంస్కృతిక, మీడియా మంత్రి జెరిమీ రైట్ తెలిపారు. ఇందులో భాగంగా విద్వేష సమాచారం, ప్రమాదకరమైన వీడియోలను కంపెనీలు బాధ్యతగా తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ ప్రతిపాదనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన సోషల్మీడియా సంస్థలకు తొలుత హెచ్చరికలు జారీచేస్తామన్నారు. ఆ తర్వాత ఆయా సంస్థల్లోని సీనియర్ మేనేజర్లకు జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు. చివరగా సంబంధిత ప్లాట్ఫామ్ను దేశంలో నిషేధిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ స్వతంత్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైట్ అన్నారు. -
స్టార్.. స్టార్.. ‘ట్రోలింగ్ స్టార్’..
సాక్షి, అమరావతి : స్టార్.. స్టార్.. ‘ట్రోలింగ్ స్టార్’.. ఇంతకీ ఈ ట్రోలింగ్ స్టార్ ఎవరంటే? .. ఇంకెవరు.. చినబాబు లోకేశే..! ఎందుకంటే అందరికంటే ఎక్కువుగా సోషల్ మీడియాలో లోకేశ్ మీదే ఎక్కువ జోక్స్, సెటైర్లు పేలుతున్నాయి మరి. సోషల్ మీడియా అన్నది రెండువైపులా పదునున్న కత్తివంటిది. ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండటం ఓ రాజకీయ నేతకున్న జనాదరణకు నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీకి ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండటం ఇప్పటికే పలుసార్లు మీడియాలో వచ్చింది. ఇక తెలివితక్కువుగా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నేతలను సోషల్ మీడియా ఆటపట్టించి నవ్వులు పూయిస్తోంది. ఆ మాటలను ఎద్దేవా చేస్తూ కామెంట్లతోపాటు గ్రాఫిక్స్, కార్టూన్లు కూడా జోడిస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. దీన్నే ట్రోలింగ్ అంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియా లోకేశ్ను ‘ట్రోలింగ్ స్టార్’గా ఆటపట్టిస్తోంది. ఎందుకంటే తాజాగా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై విమర్శలు చేసే క్రమంలో మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. ‘వైఎస్ జగన్ సీఎం అయితే బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణాకు తీసుకుపోతారు’అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు పోర్టును ఎవరైనా మరో చోటకు ఎలా తీసుకువెళ్తారని అంతా నవ్వుకున్నారు. పోనీ తెలంగాణలో కూడా సముద్రం ఉంటే.. బందరు వద్ద ఏర్పాటు చేయాల్సిన పోర్టును అక్కడ కాకుండా తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజకీయ ఆరోపణ చేయొచ్చు. కానీ అసలు తెలంగాణాలో సముద్రమే లేదు. మరి బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణాకు ఎలా తీసుకువెళ్తారు..!? అది అసాధ్యం.. కానీ ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా లోకేశ్ విమర్శించి అడ్డంగా దొరికిపోయారు. నిజానిజాలతో నిమిత్తం లేకుండా.. అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాను అడ్డుకునేందుకు ఆయనపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు పన్నాగం. వైఎస్ జగన్, కేసీఆర్ ఒకటేననే అసత్య ప్రచారాన్ని పెద్దఎత్తున తీసుకువెళ్లాలని కుతంత్రం రచించారు. తన తండ్రి ఓ అసత్య ప్రచారాన్ని జోరుగా వినిపిస్తున్నారు కదా.. తాను అదే విధంగా చేయాలని భావించారు. అందుకే నిజానిజాలతో నిమిత్తం లేకుండా ‘వైఎస్జగన్ గెలిస్తే బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణకు తీసుకుపోతారు’అని విమర్శించి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. అదే తడువుగా సోషల్ మీడియా లోకేశ్ను ఓ ఆట ఆడుకుంది. దాంతో టీడీపీ శిబిరం ఒక్కసారిగా మౌనం వహించాల్సి వచ్చింది. ఈ విషయంలోనే కాదు గతంలో కూడా చాలాసార్లు లోకేశ్ ఇదే విధంగా అవగాహనలేమితో మాట్లాడి సోషల్ మీడియాకు దొరికిపోయారు. గతంలో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న సందర్భాలు. అంబేడ్కర్ జయంతిని వర్థంతి అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే తాము పరవశించామని ఆయన అనడంతో అంతా బిత్తరపోయారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా అని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తూ ఏప్రిల్ 9న జరిగే పోలింగ్లో తనకు ఓటేయాలని అనడంతో అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఎందుకంటే పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. కనీసం పోలింగ్ తేదీ ఎప్పుడో కూడా తెలీకుండా లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాలో లోకేశ్ మీద పెద్ద ఎత్తున జోకులు పేలాయి. మంగళగిరి నియోజకవర్గంలో తాను 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని లోకేశ్ చెప్పడంతో కూడా సెటైర్ల వర్షం కురిసింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఓట్లే 2.32 లక్షలు. ఆ నియోజకవర్గంలో కనీసం ఎందరు ఓటర్లున్నారో కూడా తెలుసుకోకుండానే ప్రచారం చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. దీంతో లోకేశ్కు ‘ట్రోలింగ్ స్టార్’ అని నెటిజర్లు నిక్నేమ్ పెట్టారు. లోకేశ్తో పాటు ట్రోలింగ్ స్టార్ బిరుదు కోసం పోటీపడుతున్న నేత మరొకరు ఉన్నారు... ఆయనే కేఏ పాల్... మరి ఎన్నికలు ముగిసేనాటికి లోకేశ్, కేఏ పాల్లలో ఎవరు ఎక్కువుగా తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్ స్టార్ బిరుదును దక్కించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ‘ట్రోలింగ్ స్టార్ ’ మాత్రం నిస్సందేహంగా లోకేశే.. అని నెటిజర్లు చెప్తున్నారు. – వడ్దాది శ్రీనివాస్ -
సోషల్ మీడియా సొంత కోడ్
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సంబంధించి తాము కూడా ‘స్వచ్ఛంద నైతిక నియమావళి’ని పాటిస్తామని సామాజిక మాధ్యమాలు ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చాయి. పోలింగ్కు 48 గంటల ముందు తమసైట్లలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తామని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్, షేర్చాట్, టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాలు స్పష్టం చేశాయి. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడు గంటల్లోగా చర్య తీసుకుంటామని కూడా అవి హామీ ఇచ్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తొలిసారి.. మరో మూడు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు కూడా ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ఇటీవల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో జరిగిన చర్చల పర్యవసానంగా నైతిక నియమావళిని స్వచ్ఛందంగా పాటించేందుకు సామాజిక మాధ్యమాలు అంగీకరించాయని ఎన్నికల సంఘం ఆ ప్రకటనలో తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 126వ అధికరణ ప్రకారం పోలింగుకు 48 గంటల ముందు పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. ఏ పార్టీ అయినా దీనిని ఉల్లంఘిస్తే మూడు గంటల్లోగా దానిపై చర్య తీసుకోవాలని సిన్హా కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ సిఫారసు మేరకు తాము మూడు గంటల్లోగా ఉల్లంఘనలపై చర్య తీసుకుంటా మని సామాజిక మాధ్యమాలు ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు ఎన్నికల నియమావళిని పాటించేం దుకు తమంతట తాముగా ముందుకు రావడం ఇదే మొదటిసారి. సామాజిక మాధ్యమాల నిర్ణయంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా హర్షం వ్యక్తం చేశారు. ఈ నియమావళిని సామాజిక మాధ్యమాలు తు.చ. తప్పకుండా పాటిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలు, ఎన్నికల సంఘానికి మధ్యవర్తిగా ఐఏఎంఏఐ వ్యవహరిస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. రాజకీయ ప్రకటనల చెల్లింపుల విషయంలో కూడా పారదర్శకంగా ఉంటామని సామాజిక మాధ్యమాలు స్పష్టం చేశాయి. గత ఎన్నికల సందర్భంగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్టు కావడం, దుష్ప్రచారం జరగడం, ద్వేషపూరిత ప్రసంగాలు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడటం కోసం ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలకు కూడా నియమావళిని ప్రతిపాదించింది. -
ఫేస్‘బుక్కవుతారు’..!
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంతో పాటు రాష్ట్రంలో సోషల్ మీడియా విస్తరించింది. ఓటర్ల కంటే రెట్టింపు స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు సాంకేతిక విప్లవం పెరిగిన నేపథ్యంలో ఈ సారి ఎన్నికల ప్రసారంలో సోషల్మీడియా కీలక భూమిక పోషించనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే కంటే కొంతమంది సిబ్బందితో సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా పోస్టింగులు చేసుకుంటే మేలన్న అభిప్రాయాలు లేకపోలేదు. అంతలా సోషల్ మీడియా ప్రభావం దేశంలోను, రాష్ట్రంలోను మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇష్టానుసారం పోస్టింగులు కుదరవిక ఎన్నికల కోడ్ వచ్చేసింది. సామాన్యులతో పాటు ఉద్యోగులు సైతం ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ గ్రూపులలో పోస్టులు పెడుతుంటారు. అయితే సోషల్ మీడియాపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా చర్యలు తప్పవు. జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివిధ పార్టీలకు పరోక్షంగా సహకరించాలని ప్రయత్నించినా..ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పెట్టినా ఇక అంతే సంగతులు. పోస్టింగులు ఊస్టింగ్ అయిపోతాయి. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్లోకి అధికారులు, ఉద్యోగులు ఎన్నికల కోడ్ రావడంతో ఎక్కడైనా..ఒకేమాట, ఒకే పాట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంత మెజారిటీతో గెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇవే అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. పలు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో గ్రూపుల మధ్య వేరు వేరు అభిప్రాయాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వం గురించి పొగడడం గానీ, రాజకీయ పార్టీల గురించి ప్రశంసించడం గానీ అధికారులు చేయకూడదు. ఎన్నికల నియమావళిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం ఎన్నికల కోడ్లోకి వచ్చేశారు. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారంలో గానీ.. సామాజిక మాద్యమాల్లో సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, వీడియోలు పెట్టడం, షేర్ చెయ్యడం, చర్చలు సాగించడం వంటివి ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితోపాటు తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్నికల అధికారులు, కలెక్టర్ జె.నివాస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. -
ప్రచారం చేస్తే..పరేషాన్ కావాల్సిందే..!
సాక్షి, వైఎస్సార్ కడప : ఎన్నికల కోడ్ కూయడంతో... ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చి చేరారు. దీంతో పాటు సోషల్ మీడియాకు ఎన్నికల నియమావళి వర్తింపచేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినా.. ఫార్వర్డ్ చేసినా ఇబ్బందులు తప్పవు.. సో.. ఉద్యోగులూ బహుపరాక్.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో లోక్సభ, శాసనసభకు కలిపి జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు. దీంతో ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కోడ్ పరిధిలోకి వచ్చినట్లయింది. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల యంత్రాంగానికి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తే వారిని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అధికారం ఉంటుంది. (గతంలో మన జిల్లాలో కొందరు ఉద్యోగులు సైతం సస్పెన్షన్కు గురైన ఘటనలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సమీప బంధువైన విద్యావిభాగానికి చెందిన ఓ అధికారిపై కూడా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.) కాగా ఫలానా అభ్యర్థికి ఓటు వేయండి అని ప్రచారం చేసినా.. వ్యతిరేకంగా ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెక్షన్ 23 (ఐ)ను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం నిర్వహించరాదని 1949 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం సెక్షన్ 23(ఐ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలను కూడా ఈ సమయంలో ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు లేకపోలేదు. సోషల్ మీడియాతో బీ కేర్ఫుల్ కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనిది. ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేసే స్థాయికి సోషల్ మీడియా ఎదగడంతో పోటీ చేసే అభ్యర్థులు, వారి అనుచరగణం సోషల్మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటారు. ఇందుకోసం ఏకంగా సోషల్ మీడియా విభాగాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మెసెంజర్ వంటి వాటితో ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో గ్రూపుల్లో రెచ్చగొట్టే ప్రచారాలు, మతపరమైన సున్నితాంశాలు వంటి విషయాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జరగరానిదేదైనా జరిగితే గ్రూప్ అడ్మిన్ బాధ్యుడవుతాడని కనుక సోషల్ మీడియా విషయంలో కూడా ఉద్యోగులు అనవసరమైన వివాదాలకు, ప్రచారాలకు పోకుండా ఉంటే మంచిదని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నికల నియమావళికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల గురించి వేగంగా విస్తరిస్తున్నాయి. -
ఎయిర్ బస్
‘వణక్కమ్ (నమస్కారం) మనకు ప్రభుత్వం మంచి బస్సు ఇచ్చింది. దీనిని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించండి. చెత్త పారేయవద్దు. నా దగ్గర చింతపండు క్యాండీ ఉంది, మీకు వికారంగా ఉంటే అడగండి, ఇస్తాను, మీకు వాంతి అయ్యేలా ఉంటే చెప్పండి, బ్యాగు ఇస్తాను. ఎవ్వరూ మొహమాటపడక్కర్లేదు’ అంటూ ప్రయాణికులను మృదువుగా ఆహ్వానిస్తారు శివషణ్ముగమ్. కోయంబత్తూరు సింగనల్లూరు బస్ స్టాండ్ బస్ హార్న్ శబ్దాలతో, టైర్ల బర్బర్ ధ్వనులతో, దుర్వాసనతో, బాగా రద్దీగా, గందరగోళంగా ఉన్న సమయంలో శివషణ్ముగమ్ పిలుపు అమృతంలా చెవిని తాకుతుంది. ఈయన మాట్లాడిన మాటల వీడియో కిందటి వారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనకు తక్షణమే ప్రజలలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. చాలా న్యూస్ చానెల్స్ ఆయనను పలకరించాయి. ఒక చిన్న స్వాగతవచనం ఎంతోమందిని ఎందుకు ఆకర్షించింది? సాధారణంగా మన బస్ కండక్టర్లు, పని ఒత్తిడి కారణంగా కాని, ఇతర కారణాల వల్ల కాని చాలా చిరాకుగా, నిర్లక్ష్యంగా గాని ప్రవర్తిస్తుంటారు. స్నేహపూర్వకంగా పలకరించరు. కాని శివషణ్ముగమ్ మాత్రం ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాయువు పీల్చుకునేలా ప్రయాణికులకు తోడ్పడతారు.తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి చెందిన కోయంబత్తూరు – మదురై బస్సులో కండక్టరుగా పనిచేస్తున్నారు శివషణ్ముగమ్. ఆ బస్టాండ్లో ‘మదురై బై పాస్... మదురై బై పాస్’... అంటూ బస్ ఫుట్బోర్డు మీద నిలబడి, ప్రయాణికులను ఆప్యాయంగా పిలుస్తుంటారు శివషణ్ముగమ్. ఆయనకు ఈ రూట్లో ఇటీవలే కొత్త బస్సును కేటాయించారు. నీలిరంగు యూనిఫారమ్లో, చేతిలో సంచితో బస్ డోర్ దగ్గర నిలబడి, 52 సంవత్సరాల శివషణ్ముగమ్ ‘‘మీరంతా ఈ బస్సులో ప్రయాణించడానికి ఏదో ఒక కారణం ఉంది. మీ అందరికీ శుభం జరగాలి. మీ యాత్ర దిగ్విజయంగా జరగాలని మా డ్రైవర్ సదాశివం, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు సహాయపడడానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని చెబుతారు. విమానంలోకి ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ మాట్లాడే స్వాగత వచనాలను పోలి ఉంటాయి శివషణ్ముగమ్ మాటలు. కాని ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన విమానం ఎక్కలేదు. ఇది తనకు తానుగా అలవాటు చేసుకున్న సంప్రదాయం.23 సంవత్సరాలుగా టీఎన్ఆర్టీసీలో పని చేస్తున్న శివషణ్ముగమ్ ఇటువంటి పలకరింపును ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులంతా ఈ బస్సును పరిశుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నా ను’ అంటూ అందరినీ ఉత్తేజపరుస్తూ, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రశాంత చిత్తంతో ప్రారంభించేలా చేస్తున్నారు శివషణ్ముగమ్. – జయంతి -
వరుసకు చెల్లెలు అయిన మహిళ ఫొటోను..
గుంటూరు, పిడుగురాళ్లటౌన్: పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్కుమార్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తన తండ్రితో పాటు వ్యాపారం చేస్తున్నాడు. 2017 డిసెంబర్ నెలలో ఓ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ను ఏర్పాటు చేసుకుని అప్పటినుంచి పట్టణంలోని వరుసకు చెల్లెలు అయిన ఓ మహిళ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్చేసి ఆమెకు అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ, ఆమె భర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్డీపీఓ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ టీపీ నారాయణస్వామి, సిబ్బంది శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసును దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో గురువారం పిడుగురాళ్ల బస్టాండ్లో సందీప్ను అరెస్ట్చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
భావోద్వేగమైన లేఖను పోస్ట్ చేసిన మంచు మనోజ్
హీరోగానే కాకుండా, సహాయ పాత్రల్లో కూడా నటిస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. గత కొంతకాలంపాటు సరైన విజయం లేక ఈ యువ హీరో వెనుకబడ్డాడు. అయితే సినిమాలే ప్రపంచం కాదంటూ.. తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని చెబుతూ.. ఓ సుదీర్ఘమైన లేఖను ట్వీట్ చేశాడు. మంచు మనోజ్ షేర్ చేసిన లేఖ.. -
సోషల్ మీడియా కామెంట్.. జాబ్ ఫట్
దుబాయ్: శబరిమల వివాదం నేపథ్యంలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు భారతీయుడొకరు సౌదీ అరేబియాలో ఉద్యోగం పోగొట్టుకున్నారు. కేరళకు చెందిన దీపక్ పవిత్రం.. రియాద్లోని లులు హైపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వివక్షాపూరితమైన, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘మతపరమైన విషయాల్లో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని అస్సలు సహించం. సోషల్ మీడియాను మా సిబ్బంది దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామ’ని లులు గ్రూపు కమ్యూనికేషన్స్ అధికారి చీఫ్ వి నందకుమార్ తెలిపారు. అన్ని దేశాల సంస్కృతులను, మత విశ్వాసాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్యోగిపై కఠిన చర్య తీసుకున్నందుకు లులు గ్రూపు అధిపతి యూసుఫ్ అలీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే కారణంతో అంతకుముందు ఒమన్లో కేరళకు చెందిన మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కేరళ వరద బాధితులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది. అతడు క్షమాపణ చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. -
ట్విటరే లేకపోతే..!: ట్రంప్
వాషింగ్టన్: నకిలీ వార్తలను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విటర్ తనకెంతో ఉపయోపడ్తోందని అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్విటరే లేకపోతే నకిలీ వార్తలపై వివరణ ఇచ్చేందుకు గంటకో ప్రెస్ కాన్ఫెరెన్స్ పెట్టాల్సి వచ్చేదన్నారు. ‘ట్వీట్ చేయడం నాకిష్టం. వాస్తవాలను సోషల్ మీడియా ద్వారానే నేను చెప్పాలనుకుంటాను. అయితే, నాకు విలేకరుల సమావేశాలు అన్నా కూడా ఇష్టమే. కానీ అర్థం, పర్థం లేని ప్రశ్నలడిగితేనే కొట్టాలనిపిస్తుంది’ అన్నారు. ‘నిన్న ఏపీ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పింది ఒకటి. వారు రాసింది మరొకటి. హెడింగ్ అయితే మరీ దారుణం’ అని ట్రంప్ విమర్శించారు. రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లే గెలుస్తారన్నారు. -
బ్రేకింగ్.. ఆగిపోయిన యూట్యూబ్
సాక్షి, హైదరాబాద్ : వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్ యూట్యూబ్ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయడం ఆగిపోయింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్డేట్ చేస్తామని యూట్యూబ్ సంస్థ ట్విటర్లో పేర్కొంది. యూట్యూబ్ కంటెంట్ చూడాలని వెబ్సైట్లోకి వెళ్తే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 503 నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తున్నారు. అలాగే యూజర్స్కు వెబ్సైట్ లాగిన్ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్ అయిన విషయం తెలిసిందే. Thanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We're working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated. — Team YouTube (@TeamYouTube) October 17, 2018 Wow, I'm loving Youtube's new update! Minimalistic and Chic #YouTube pic.twitter.com/a0lHbpbQCN — ros (@Amuchanist) October 17, 2018 Mayday mayday SOS SOS#youtube what happened? pic.twitter.com/vIYTmyndP1 — HatiHunter (@ailinafuad) October 17, 2018 -
చెప్పకనే చెప్పారు
ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇవే నిజమయ్యాయి. గత నెల 1న(సెప్టెంబర్) షిబానీ సోషల్ మీడియాలో పై ఫొటో షేర్ చేశారు. ఇప్పుడు అదే ఫొటోను మంగళవారం ఫర్హాన్ అక్తర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఓ లవ్ సింబల్ ఉంచారు. అంతే.. వీరిద్దరూ తమ ప్రేమను ఫొటో ద్వారా చెప్పకనే చెప్పేశారని బీ టౌన్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఏడాది షిబానీ పుట్టినరోజుకి(ఆగస్టు 27) తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఆమె ఫొటోతో పాటు మూడు కిస్సింగ్ ఎమోజీలను ఫర్హాన్ అక్తర్ ఉంచిన విషయం గుర్తుండే ఉంటుంది. -
‘మీటూ’.. మరింత ముందుకు
‘మీటూ’ ఉద్యమ విస్తృతి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైగింక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, వికాస్ బాల్, సుభాష్ కపూర్, నటుడు నానా పటేకర్తో పాటు మరికొందరు వృత్తి పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ వైస్ ప్రెసిండెంట్, క్రియేటివ్ హెడ్ ఆశిష్ పాటిల్ చేరారు. ‘ఆశిష్ పాటిల్ తనను లైగింకంగా వేధించాడు’ అని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బాధితురాలు తమకు సరైన పద్ధతిలో ఫిర్యాదు చేస్తే ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులు అన్నారు. ఆశిష్కు అడ్మినిస్ట్రేటివ్ సెలవును ప్రకటించారు. ఆ తర్వాత అతన్ని వి«ధుల నుంచి పూర్తి్తగా తొలగిస్తున్నట్లు మంగ ళవారం ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. క్వాన్ ఎంటర్టైన్మెంట్ ప్రముఖుడు అనిర్భాన్ దాస్ బ్లాహ్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని విధుల నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు ఓ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దాస్ బ్లాహ్ను వైదొలగాలని కోరాం. మా ఉద్యోగులకు సేఫ్ అండ్ సెక్యూర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మా కర్తవ్యం. ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాం’’ అని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సౌత్లోనూ ‘మీటూ’ ఉద్యమ గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నటి సంగీతా బాద్, ఆర్.జే. నేత్ర మాట్లాడుతూ ‘తామూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం’’ అన్నారు. కథానాయికలు కృతీకర్బందా, శృతీ హరిహరన్, సంయుక్తా హెగ్డేలతో పాటు మరికొందరు కథానాయికలు ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఆ హక్కు ఎవరికి ఉంది?! మరోవైపు నటి భావనపై లైంగిక దాడి విషయంలో నటుడు దిలీప్ సభ్యత్వంపై వేటు వేయకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)లో కొనసాగిస్తుండటంపై ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(డబ్ల్యూ.సీ.సీ) సభ్యులు తప్పుబట్టారు. బాలీవుడ్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించబోమని చెప్పిన అక్షయ్కుమార్, ఆమిర్ఖాన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంపై ‘అమ్మ’ కార్యదర్శి సిద్ధిఖీ స్పందిస్తూ...‘‘డబ్ల్యూ.సి.సి సభ్యులు అక్షయ్కుమార్, ఆమిర్ఖాన్లను ఉదాహరణలుగా చెప్పారు. కేవలం ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తిని ఒక వృత్తి నుంచి నిషేధించమనే హక్కు ఎవరికి ఉంది? ఇది ఎంత వరకు సమంజసమైంది. నిందితులుగా తమ పేర్లు జాబితాలో ఉంటే అప్పుడు కూడా అక్షయ్, ఆమిర్ తాము నటిస్తున్న సినిమాల గురించి ఇలానే చేస్తారా?’’ అని షూటుగా విమర్శించారు. ఇదొక ఆరంభం ‘మీటూ’ ఉద్యమంపై తాజాగా నటి సుస్మితా సేన్ స్పందించారు. ‘‘ కొన్నిసార్లు ఇలాంటి విషయాలు షాకింగ్లా ఉంటాయి. కానీ, మనం అమాయకులం ఏమీ కాదు. ఇదొక ఆరంభం. ‘మీటూ’ ఉద్యమంలో మాట్లాడిన బాధిత మహిళల మాటలను వినాలి. నమ్మాలి. వ్యాప్తి చేయాలి’’ అన్నారు. దుర్వినియోగం కాకూడదు రకుల్ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేదే ప్యార్ దే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు లవ్ రంజన్పై లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రకుల్ను అడగ్గా...‘బాధిత మహిళల మాటలను ప్రజలు వింటున్నారు. కొంతమంది శిక్షించ బడుతున్నారు కూడా. రాబోయే కాలంలో వర్క్ ప్లేస్ మరింత సౌకర్యంగా ఉండాలంటే ‘మీటూ’ ఉద్యమం మిస్ యూజ్ కాకూడదు’’ అని పేర్కొన్నారు రకుల్. కాగా ‘‘లైంగిక వేధింపుల గురించి ఎప్పటికీ చెప్పకపోవడం కన్నా కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు చెప్పడం ఉత్తమమే’’ అని సల్మాన్ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ పేర్కొన్నారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తాజాగా మరికొందరిపైనా ఆరోపణలు వస్తున్నాయి. -
‘సామాజిక’ ప్రభావంపై ఈసీ విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో సామాజిక మాధ్యమాలకు ఎన్నికల ఫివర్ పట్టుకుంది. ఫేస్బుక్, ట్వీట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణల కోసం అధికార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఐటీ విభాగాలు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మాధ్యమాల వాడకం భారీగా పెరిగి ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని విశ్లేషించేందుకు వాటి ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ విభాగం ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఈ విభాగం ఈ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించి రోజువారీ నివేదికలు అందజేస్తుంది. సమాచార విశ్లేషణ (డేటా అనలిటిక్స్) టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన ఓ ప్రైవేట్ ఐటీ కన్సల్టెన్సీకి ఈసీ ఈ బాధ్యతను అప్పగించింది. 15 రోజుల నివేదిక సమర్పణ... ఎన్నికల ప్రచార విశ్లేషణలో భాగంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు, 31 జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైతం ఈ విభాగం దృష్టి పెట్టింది. ఈ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న లైక్లు, షేర్ల సంఖ్య, కామెంట్ల ఆధారంగా ప్రచార సరళిని కన్సల్టెన్సీ రోజువారీగా విశ్లేషిస్తోంది. పార్టీల సామాన్య కార్యకర్తలు పెడుతున్న రాజకీయ పోస్టుల్లో కొన్నింటిని ప్రింట్ తీసి రోజువారీ నివేదికలతో జత చేసి సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తోంది. గత నెల 27న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి 15 రోజుల వరకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మాధ్యమాల వేదికగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సరళిపై ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ నివేదికను సమర్పించింది. ప్రజలకు అవుతున్న చేరువ ఆధారంగా ఎన్నికలపై ట్విట్టర్ 60 శాతం, ఫేస్బుక్ 30 శాతం, యూట్యూబ్ 1 శాతం ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ట్వీట్టర్, గూగుల్ ట్రెండ్స్లో రోజువారీగా ఏఏ అంశాలకు అధిక ప్రాచుర్యం లభిస్తోంది అన్న సమాచారాన్ని సేకరించి సీఈఓ కార్యాలయానికి సమర్పించే నివేదికల్లో పొందుపరుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిని విశ్లేషించడానికే ఈ విభాగం పని చేస్తోందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అభ్యంతరకర, అసభ్యకర ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి. ఇలాంటి పోస్టులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకోగలమని, ఫిర్యాదులపై సైబర్ పోలీస్ విభాగం దర్యాప్తు చేయనుందని ఓ అధికారి తెలిపారు. -
చంద్రబాబు డూప్ దొరికాడోచ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాత్రధారి కోసం సరిగ్గా ఆయన్ను పోలిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ ప్రారంభించిన వేట ఫలించింది. ఎక్కడో గుర్తు తెలియని ఓ ప్రాంతంలోని హోటల్లో సరిగ్గా చంద్రబాబును పోలిన ఓ వెయిటర్ హాఫ్ బనియన్, నిక్కర్ ధరించి వినియోగదారులకు ఆహారం వడ్డిస్తున్న వీడియో గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వ్యక్తి ముఖం, గడ్డం కూడా దాదాపు చంద్రబాబును పోలి ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో వేల మంది సరదాగా షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ఆకర్షితుడైన రాంగోపాల్ వర్మ సదరు వ్యక్తి ఆచూకీని కనుక్కోవడంలో సహకరించినవారికి రూ.లక్ష అందజేస్తానని శనివారం ఫేస్బుక్లో ప్రకటన చేశారు. అతడే కాకపోయినా, అతడి(చంద్రబాబు)ని పోలిన మరో వ్యక్తి ఆచూకీ తెలిపినా ఈ బహుబమతి అందజేస్తానని వెల్లడించారు. ఆర్జీవీ ఇచ్చిన ఆఫర్ సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఓ న్యూస్ చానల్లో పనిచేసే ముత్యాల రోహిత్ చంద్రబాబును పోలిన వెయిటర్ ఆచూకీని ఆర్జీవీకి పంపారు. ఈ విషయాన్ని శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఆర్జీవీ ఫేస్బుక్ ద్వారా ధ్రువీకరించారు. ‘‘హే రోహిత్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా యూనిట్కు సీబీఎన్(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం..’’అని ఆర్జీవీ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా, చంద్ర బాబును పోలిన హోటల్ వెయిటర్ వివరాలను ఆర్జీవీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, ఈ వ్యక్తి పేరు ప్రభు అని, గతంలో అతడు త్రయంబకేశ్వర్లోని హోటల్లో పనిచేసేవాడని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడని ఓ వ్యక్తి ఫేస్బుక్లో పేర్కొన్నాడు. ఈ వ్యక్తికి సంబంధించి ఇటీవల వైరల్ అయిన వీడియో ఏడాది క్రితం తీసిందని అతడు వెల్లడించారు. ఈ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంది. వచ్చే జనవరి చివరి వారంలో విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు చంద్రబాబును పోలిన వ్యక్తి అంగీకరిస్తాడా? లేదా ? అన్నది వేచిచూడాలి. చదవండి : ఈ వ్యక్తిని పట్టిస్తే వర్మ నజరానా -
ఒత్తిడితో బతుకులు చిత్తు
కామారెడ్డి క్రైం: విద్యార్థి దశలోనే ఎదురవుతున్న ఒత్తిళ్ళకు యువత చిత్తవుతున్నారు. ఇక్కడితో అంతా అయిపోయింది, ఇంక చేసేదేమి లేదనే నైరాశ్యంలోనికి వెళ్లిపోతున్నారు. చదువుల పేరిట అటు విద్యాలయాల్లో, ఇంట్లో పెద్దలు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకుంటామో లేదోనన్న బెంగ ఎంతో మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలాంటి బలహీనమైన క్షణాలు వారిని మృత్యువైపు అడుగులు వేయిస్తున్నాయి. ఎంత చదివినా మార్కులు తక్కువగా వస్తున్నాయనే బాధలో కొందరు, పరీక్ష బాగా రాయలేకపోయామని మరికొందరు, ఫలితాలు నిరాశపరిచాయని ఇంకొందరు ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురై మనోవేదనకు గురైనా భవిష్యత్తుపై భరోసాతో ముందుకుసాగాల్సిన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అదే సమయంలో పిల్లల శక్తి సామర్థ్య్లాలను సైతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన విషయాల్లో తోడ్పాటును అందించాలి. సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పిల్లలపై ఏ మాత్రం ఉందో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసమయాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వారి భుజం తట్టాల్సిన అవసరాన్ని తల్లిదండ్రుల గుర్తించాలి. వీటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూనే పిల్లల నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించడం అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే.... పరీక్షలు బాగా రాయ లేదని, అందరితో సమనంగా చదవలేకపోతున్నాననీ, మార్కులు తక్కువగా వస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయాందోళనలు విద్యార్థుల్లో పెరిగాయి. ఇవే కొన్ని సందర్భాల్లో అత్మహత్యలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు, గురువులు వారి మానసిక పరిస్థితిని సకాలంలో గుర్తించక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం రెండు రోజుల వ్యవధిలో బానుసవాడలో ఓ 8వ తరగతి చిన్నారి, కామారెడ్డిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12న మోర్తాడ్ మండలంలో సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం. గత మార్చిలో తాడ్వాయికి చెందిన హారిక అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షలో ఫెయిలయ్యానని ఉరేసుకుంది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ(19) అనే విద్యార్థిని టెట్ పరీక్షలు బాగా రాయలేదనే బాధలో ఉరేసుకుంది. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రజిత(25) అనే యువతి వీఆర్ఓ పరీక్ష బాగా రాయలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్లూర్కు చెందిన సుస్మిత(18) టెట్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్థాపం చెంది రైలు కిందపడి ప్రాణం తీసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రవళిక(19) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జిల్లాలో ఈ యేడాది ఇప్పటిదాక జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 20 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. మాధ్యమాల ప్రభావం... ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల ప్రభావం యువతపై ఎంతగా పడుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అశ్లీలతను చూపించే వెబ్సైట్లు విద్యార్థి దశనుంచే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హైస్కూల్ స్థాయి నుంచి యువత మొబైల్ ఫోన్లను చేత పట్టుకుని నిమగ్నమవుతున్నారు. కళాశాలల్లో ఫోన్లను నిరాకరించే విషయంలో యాజమాన్యాలు దృష్టి సారించడం లేదు. ఎక్కడున్నా స్మార్ట్ఫోన్లలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువతరం అదే టెక్నాలజీతో పెడదారి పట్టడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. తద్వారా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లను తమ పిల్లలను దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక సినిమాల ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇటీవలి జగిత్యాలలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం బిచ్కుందకు చెందిన పురుషోత్తం(19) అనే యువకుడు ఓ వివాహితను ఫోన్లో వేధించగా పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి దశలో యువతపై సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పడుతోందని ఇలాంటి సంఘటనలతో స్పష్టమవుతోంది. బాధ్యతగా వ్యవహరించాలి.. తమ పిల్లల చదువులు, వారి ప్రవర్తనల విషయంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పలువురు సూచిస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాలు పెరిగాయి. నిత్యం విధులు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో కలిసి సమయాన్ని గడపడం లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎందరో యువత మానసికంగా కృంగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తూ వారి కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ ఆలోచనలను పంచుకుంటే జరిగే తప్పిదాలను అరికట్టవచ్చు. వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించాలి. తప్పుదారిలో వెళ్తే దిశానిర్దేశం చేయాలే గానీ ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ఒత్తిడికి గురిచేయొద్దు.. పోటీ ప్రపంచంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు చదువు ఒక్కటే చూస్తున్నారు. పిల్లల సామర్థ్యానికి మించి ఒత్తిడికి గురి చేయొద్దు. వారి సామర్థ్యాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వారిలో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ, కామారెడ్డి -
అలా చేస్తే ఇంకా ఆనందిస్తాను : మెగాహీరో
హీరోల పుట్టినరోజులు వస్తే అభిమానులకు పండుగే. ఇక వారి ఆనందాలకు హద్దులే ఉండవు. కేక్ కట్టింగ్లు, బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి ఆర్భాటాలు వద్దంటూ తమ అభిమానులకు సూచిస్తుంటారు. వాటికి ఖర్చయ్యే డబ్బులతో ఎవరికైనా ఆర్థిక సహాయాన్ని చేయమని కోరుతుంటారు. తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ తమ అభిమానులను కూడా ఇదే విధంగా కోరారు. అక్టోబర్ 15న పుట్టిన రోజును జరుపుకోబోతున్న సాయిధరమ్ తేజ్ మెగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘అత్యంత ప్రియమైన మెగాభిమానులకు అంతులేని ప్రేమతో.. గెలిచినప్పుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చేతుల చప్పట్లు చప్పుడుకూడా తగ్గకుండా జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ.. వెన్నంటి ఉన్న అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయాన్నన్నది వాస్తవం. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకొని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా ధృడంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. మీకు నా నుంచి చిన్న విన్నపం. నా పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల అభిమానులు కేక్ కట్టింగ్, బ్యానర్స్ కట్టడంలాంటివి..చేస్తున్నారని చెప్పారు. వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో ఎవరైనా చిన్నారి చదువులకు ఉపయోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను. ఎల్లప్పటికీ మీ అభిమానం కోరుకునే.. మీ సాయిధరమ్ తేజ్’ అంటూ సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రియమైన మెగాభిమానులకు 🙏🏼 pic.twitter.com/p9H6PzQyJs — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 13, 2018 -
సీఎం రమేశ్ రాజభవనం చూశారా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల నేపథ్యంలో తన వ్యక్తిగత ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్, జూబ్లిహిల్స్లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజభవనాన్ని తలిపిస్తున్న ఆయన నివాసాన్ని చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేశ్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి. చదవండి: వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్.... రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు -
సోషల్ వార్
ఆనందాన్ని పంచడానికి, స్నేహితులను కలపడానికి, భావాలను వ్యక్తీకరించే సాధనంగా మొదలైన సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ ప్రచారానికి అస్త్రంగా మారుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికార పీఠాన్ని అందుకోవడానికి నిచ్చెన మెట్లుగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, యూట్యూట్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా యువతకు చేరువయ్యేందుకు ఆయా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్ లేని యువత లేదంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్ ఛార్జీలు, ఫోన్ ధరలు కూడా అందుబాటులో ఉండటంతో.. వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాలు చాలా సర్వసాధారణమై పోయాయి. – సాక్షి, సిద్దిపేట ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా ఇప్పుడు సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల కామెంట్లు, వీడియో క్లిప్పింగ్స్, లఘు చిత్రాలు, సన్నివేశాల రూపంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకో విశ్లేషణ, సర్వేల పేరుతో అభ్యర్థుల భవితవ్యాలను సోషల్ మీడియాలోనే నిర్ణయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఫొటోలతో ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తూ బలాబలాలను లెక్కగడుతున్నారు. తమ అభిమాన నాయకుడిని ప్రమోట్ చేసేందుకు అభిమానులు ఫేస్బుక్, వాట్సాప్లలో గ్రూప్లు క్రియేట్ చేస్తున్నాయిరు. తమ నాయకుడి ప్రతి కదలిక, చేసే పని, మాట్లాడే విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు వీలుగా ఫేస్బుక్లో ప్రత్యేక పేజీలను క్రియేట్ చేసి అభిమానులను సాధించి పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శించేందుకు కూడా ట్రాల్ పేజీలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యర్థిని విమర్శించడమే ధ్యేయంగా ఈ ట్రాల్ పేజీలు నడుపుతున్నారు. సామాన్యులు బలి చాలా మంది సరదా కోసమో, కాలక్షేపం కోసమో సోషల్ మీడియాను వాడుతుంటే ఈ రాజకీయ నాయకులు వారినీ వదలడం లేదు. న్యూట్రల్గా ఉండే వారిని ఆకర్షించడమే లక్ష్యంగా వారి అనుమతి లేకుండా గ్రూపుల్లో యాడ్ చేయడం, ఫేస్బుక్లో పెట్టే ప్రతి పోస్టుకీ ట్యాగ్ చేయడం చేస్తున్నారు. దీంతో రోజూ వందల సంఖ్యలో వచ్చి పడే మెసేజ్లు, ఫొటోలతో వారు బేజారెత్తిపోతున్నారు. ఫేస్బుక్లో ట్యాగ్ చేస్తున్న కారణంగా ఏ ఒక్కరు కామెంట్, లైక్లు పెట్టినా తమకు నోటిఫికేషన్ వస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. కొందరు మొహమాటానికి సహిస్తుంటే.. ఇష్టం లేనివారు మాత్రం నిస్సంకోచంగా గ్రూపుల నుంచి బయటకొస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే కామెంట్లు, లైక్ల ఆధారంగా నాయకులు వారి యాక్టివిటీస్ని మార్చుకుంటున్నారు. కొందరైతే వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు తమ అభిమానులకే పరిమితం అవుతున్నాయని గ్రహించి.. న్యూట్రల్ వ్యక్తులను ఆకర్షించడమే లక్ష్యంగా ట్విట్టర్ ఖాతాలు తెరిచి ప్రయోగాలు చేస్తున్నారు. అభివృద్ధే ప్రధాన ఆయుధంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి గత నాలుగు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కన్నులకు కట్టినట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గం స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీకి ఒక సోషల్ మీడియా ఇన్చార్జిని నియమించారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ప్రచారం క్షణాల్లో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్లలో పెడుతున్నారు. అదేవిధంగా పార్టీజిల్లా, రాష్ట్ర కార్యాలయాల్లో ప్రత్యేకంగా నియమించిన సోషల్ మీడియా టీమ్ల ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో ముఖాముఖి, లఘు చిత్రాలు, ప్రయోజనం పొందిన వారి మనస్సులో మాటలు చెప్పించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో ఆ నాయకుడి గొప్పతనం వివరించడం, నియోజకవర్గంలో చేసిన పనిని, చేపట్టిన అభివృద్ధిని చెప్పేవిధంగా పేరుగాంచిన కవులు, గాయకులు, సంగీత దర్శకులతో ప్రత్యేక పాటల ఆల్బం చేయించి వాటిని ప్రచార కార్యక్రమాలతోపాటు, సోషల్ మీడియాలో కూడా పెట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. విపక్ష పార్టీల ఎదురు దాడి.. టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా విపక్ష పార్టీలు కూడా సోషల్ దాడికి దిగారు. అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని, నియోకవర్గాల్లో పనితీరును ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర నాయకులు చేసిన వాగ్ధానాలు, వాటిని విస్మరించిన తీరును వీడియో క్లిప్పింగ్లు సేకరించి ఒకదానితో ఒకటి జోడించి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీసీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్లను వేసి ప్రచారం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా సోషల్ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ ప్రసంగాలు, ప్రవేశపెట్టిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రానికి చేకూరుతున్న లబ్ధి, రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం వాటా, నిధుల పంపిణీ వంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలుస్తుంది కోహెడరూరల్(హుస్నాబాద్): ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంతో కీలకంగా ఉంది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను ప్రజలు తెలుసుకుటుంన్నారు. ఫేస్బుక్, వాట్సాప్లలో వచ్చే పోస్టులపై అవగాహన కలుగుతోంది. ఏదేమైనా ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాల్లో జోరుగా సాగుతుంది. దీంతో ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలో వద్దో నిర్ణయాలు తీసుకుంటున్నారు. – కొమిరె అనిల్, బీటెక్ విద్యార్థి, కోహెడ హద్దులు మీరితే ఎవరినైనా శిక్షిస్తాం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఫలితమే సోషల్ మీడియా. ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విరివిరిగా వాడుకుంటున్నాయి. సాధారణ ఎన్నికల ప్రచారంలో మాదిరిగానే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఓట్లు అడగవచ్చు, అభివృద్ధి చెప్పుకోవచ్చు, ఎదుటి పార్టీకి ఎందుకు ఓటు వెయ్యకూడదో అభిప్రాయం పంచుకోవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలకు పోవడం, రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం నేరం. హద్దులు మీరి ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదు. – జోయల్ డేవిస్, పోలీస్ కమిషనర్, సిద్దిపేట -
మీటూ : ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట
-
మగవాళ్లకు నిజంగా ‘స్కేరీ టైమ్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎప్పుడూ వారిదే పైచేయి, ఎప్పుడూ వారికే అవకాశం’ అనే పల్లవితో సాగి ఓ ఆంగ్ల పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘మహిళలు తమ రోజువారి జీవితాల్లో భద్రత కోసం అర్థరహితంగా ఎంతో దూరం వెళ్లాల్సి వస్తోంది. మహిళల్ని భయపెడుతున్న మగవాళ్లు, ఇక వారి వ్యవహారాల్లో భయపడాల్సిన సమయం వచ్చింది’ అన్న భావ స్ఫూర్తి కలిగిన ఈ పాటను టెక్సాస్లో నివసించే సింగర్, పాట రచయిత, కొరియోగ్రాఫర్ లింజీ లాబ్ పాడారు. ఆమె ఈ పాటకు ‘ఏ స్కేరీ టైమ్’ అని టైటిల్ పెట్టారు. అమెరికాలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ పాట రాసి పాడినప్పటికీ భారత్లో ‘మీ టూ’ ఉద్యమం సృష్టిస్తున్న ప్రకంపనలకు తగినట్లుగా ఈ పాట ఉండడంతో సోషల్ మీడియాలో దీనికి ఎంతో ఆదరణ లభిస్తోంది. ‘మీ టూ’ ఉద్యమంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ మగవాళ్లకు ఇది ‘స్కేరి టైమ్’ అని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
‘నోటా’పై స్పందించిన విజయ్..యాటిట్యూడ్ మారదంటూ పోస్ట్!
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలతో అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని ఫామ్ను సంపాదించుకున్నాడు. ‘గీతాగోవిందం’తో వంద కోట్ల క్లబ్లోకి చేరుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తుంది.. తనను ఎవరూ ఆపలేరు అనుకునే సమయంలో ‘నోటా’ విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. కేవలం విజయ్ ఉన్నాడన్న ఒక్క కారణంతోనే ఈ సినిమాపై తెలుగునాట హైప్ క్రియేట్ అయింది. అయితే సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కలేదు. ‘నోటా’ను విమర్శకులు కూడా ఏకిపారేశారు. ఈ సినిమా ఒకవేళ విజయం సాధిస్తే అది కేవలం విజయ్ గొప్పతనమే అవుతుందని రివ్యూలు చెప్పేశాయి. అయినా అంతా తానై భుజాన మోసినా ‘నోటా’ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక దీనిపై విజయ్ ట్విటర్లో స్పందిస్తూ ఓ పోస్ట చేశాడు.‘ నా మీద ప్రేమతో సినిమా చూసేవారికి, పక్కవారు ఫెయిల్ అయితే ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి’.. అంటూ మొదలుపెట్టి.. ‘ ‘నోటా’ ను చేసినందుకు గర్వపడుతా. దీని ఫెయిల్యూర్కు పూర్తిగా నాదే బాధ్యత. ఈ చిత్రాన్ని ప్రేమించిన ప్రేక్షకుల అందరి ప్రేమను నేను తీసుకున్నాను. అలాగే ఈ సినిమాపై వచ్చిన అసంతృప్తి, విమర్శలను సీరియస్గా తీసుకున్నాను. వాటిని పరిశీలించాను. నా వైపు ఉన్న తప్పులను సరిచేసుకున్నాను. కానీ, నా యాటిట్యూడ్ మాత్రం మారదు. ఓ విజయమో, అపజయమో ఓ రౌడీని తయారు చేయలేదు పడగొట్టలేదు. ఎప్పుడైతే నీకు ఎదురైన సమస్యను వదిలేస్తావో, చూసి ఆగిపోతావో అప్పుడు నువ్వు మారినట్టు. రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు.. విజయం కోసం పోరాడటం.. రౌడీలు అయినందుకు గర్వపడదాం. ఫైట్ చేస్తూ ఉందాం. గెలుస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం. నా ఫెయిల్యూర్ను ఎంజాయ్ చేస్తున్న వారికిదే సమయం.. ఇప్పుడే పండగ చేస్కోండి. వెంటనే తిరిగి వస్తా!.’ అంటూ తనలోని యాటిట్యూడ్ను చూపించాడు విజయ్. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. Idi paristhiti. pic.twitter.com/1500Qsh4TG — Vijay Deverakonda (@TheDeverakonda) October 9, 2018 -
‘చంద్రబాబు గారి మరో ఆణిముత్యం’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో(2014 నాటి) కాంగ్రెస్పై చంద్రబాబు చేసిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తూ మహాకూటమి పొత్తుపై నిలదీశారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలుకునున్నారని, ఈ విషయం తన ప్రజాగర్జన ద్వారా తెలిసిందని, ఇటాలియన్ మాఫియా రాజ్ కథ ముగిసిందని చంద్రబాబు అప్పట్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ కేటీఆర్.. ‘ఆ ఇటాలియన్ మాఫియా రాజ్ అతను ఇప్పుడు జిగ్రీ దోస్తులయ్యారు. అతనెవరో చెప్పుకోండి? ఇప్పుడు తెలిసిందా నేను ‘మహాఘంటియాబంధన్’ అని ఎందుకు పిలుస్తానో’ అని పేర్కొన్నారు. So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ? Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7 — KTR (@KTRTRS) October 9, 2018 ‘రాహుల్, సోనియాలకు కొత్తగా తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో కూడా తెలంగాణలో వారు పర్యటించారు. అప్పుడు తెలంగాణ అభివృద్దికి ఏం చేశారు.’ అని ప్రశ్నిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్ అప్పట్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను షేర్ చేస్తూ కేటీఆర్ ‘బాబుగారి మరో జ్ఞాన ఆణిముత్యం.. స్కామ్కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్లు 2014 వరకు తెలంగాణ అభివృద్దికి చొరవ చూపలేదనకుంటే.. అప్పటి నుంచి ఇప్పటికి ఏం మారింది?’ అని మరీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావ్ అని చంద్రబాబును పరోక్షంగా ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్తో జతకడుతున్న విషయం తెలిసిందే. Another pearl of wisdom from CBN Garu👇 If Scamgress leaders Rahul & Sonia didn’t do squat for Telangana development till 2014, what changed since then? #MahaGhatiyaBandhan pic.twitter.com/jfX0anT1mi — KTR (@KTRTRS) October 9, 2018 -
ఉత్తమ్.. కునుకు..
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా గర్జనకు హాజరైన డీకే అరుణ చేతికి రంగురాళ్ల ఉంగరాలతో ప్రత్యేకంగా కనిపించారు. ఎడమ చేతికి నాలుగు రంగురాళ్ల ఉంగరాలు, కుడి చేతికి మరో ఉంగరంతో ఆకర్శణగా నిలిచారు. వేదికపైన ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు. అనంతరం మహిళా కార్యకర్తలతో సెల్ఫీ దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉత్తమ్.. కునుకు సభకు కాస్త ఆలస్యంగా హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ వేదికపై కొద్ది క్షణాలపాటు కునుకు తీశారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తున్నారని గమనించిన అనంతరం నవ్వులు చిందించారు. -
5 లక్షల గూగుల్ ప్లస్ ఖాతాల డేటా లీక్?
కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్ ప్లస్లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్ ప్లస్ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్ ప్లస్ కార్పొరేట్ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్ ప్లస్లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
వికీపీడియాలో బాలకృష్ణ అభిమానులకు షాక్!
ఒకప్పుడు మనకు ఏదైనా తెలియకపోతే ఎవరినైనా పెద్దవాళ్లను అడిగి తెలుసుకునేవాళ్లం. కానీ మారిన పరిస్థితిలు, వచ్చిన మార్పులు, పెరిగిన సాంకేతికత వల్ల ఎవరికి ఏ సమాచారం కావాలన్న అరచేతిలో ఉండే స్మార్ట్ఫోన్ సహాయంతో ఇట్టే తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా గూగుల్, వికీపీడియా అవసరం మరింత పెరిగిపోయింది. అయితే ఈ మధ్య వీటిలో తప్పులు దొర్లడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రీసెంట్గా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిలో బాలయ్య 1913 నవంబర్ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. వికీపీడియాలో ఎవరైనా సరే తమకు తెలిసిన విషయాన్ని పంచుకోవచ్చు. ఎవరో ఆకతాయి ఈ పని చేసుంటారని అభిమానులు ఊగిపోతున్నారు. మరి ఈ విషయం బాలయ్య దృష్టికి వెళ్లకముందే.. సరిచేసుకుంటే మంచిది...లేకుంటే వికీపీడియాకు దబిడిదిబిడే.. అంటూ కామెంట్లు చేశారు అభిమానులు. దీంతో వికీపీడియా వెంటనే బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేసేసింది. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గురించి సమాచారాన్ని అడిగితే.. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీని చూపెట్టడం, జవహర్లాల్ నెహ్రూ అని సమాచారం ఇస్తూ.. నరేంద్రమోదీ ఫోటోను గూగుల్ చూపించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాన్ని తప్పుగా చూపెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమారుడిని ప్యూన్ అని తప్పుగా సమాచారాన్ని అందించింది. ఇలా గూగుల్, వికీపీడియాలు తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
షోయబ్.. సచిన్ను మరిచిపోయావా ?
ఇస్లామాబాద్: పాక్తిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్కు గురయ్యాడు. ట్విటర్ వేదికగా షోయబ్ క్రికెట్కు తనే డాన్ అని ప్రకటించుకున్నాడు. ఈ వ్యాఖ్యలు యావత్ క్రికెట్ అభిమానులుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా షోయబ్ అక్తర్ను ఏకీపారేశారు. షోయబ్ ట్వీట్ ఏంటంటే.. తన బౌలింగ్లో ఇబ్బంది పడ్డ వివిధ దేశాల ఆటగాళ్లందరి ఫొటోకు క్యాప్షన్గా.. ‘వారంతా నన్ను క్రికెట్ డాన్ అని పిలిచేవారు. నా బౌలింగ్ శైలిని అలా ఉండేది. వాళ్లను గాయపరిచి ఎంజాయ్ చేసేవాడిని కాదు. కానీ నా దేశ కోసం.. నా అభిమానుల కోసం నేను అలా ఆడేవాడినని చెప్పగలను.’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్పై అభిమానులు సెటైర్ల్ వేస్తున్నారు. ‘ఏ షోయబ్ సచిన్ టెండూల్కర్ను మరిచిపోయావా?’ అని ప్రశ్నిస్తూ.. షోయబ్ బౌలింగ్ను సచిన్ చీల్చిచెండాడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. Don of cricket as they called me but never enjoyed hurting people but I must say when I was out there I just ran in for the love of my country & for the people around the world .. pic.twitter.com/be84Y2yYl5 — Shoaib Akhtar (@shoaib100mph) October 7, 2018 How can you forget this gem from @sachin_rt !! Smashing you my friend. You were also winning asia cup this time..😂 pic.twitter.com/jyFgga9EXc — Gautam (@TheMystic19) October 7, 2018 -
ఆంధ్ర యువకుడి పనికి కేటీఆర్ ఫిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రోహిత్ కుమార్ రెడ్డి అనే ఆంధ్ర యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ట్వీటర్ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఏపీకి చెందిన రోహిత్.. కేసీఆర్, టీఆర్ఎస్కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. Many thanks Rohit Kumar Reddy for your love & solidarity 🙏 Rohit, who’s a native of AP is walking all the way from Vijayawada to Hyderabad garnering support for KCR Garu & TRS #TelanganaWithKCR https://t.co/HuyPxI4IgC — KTR (@KTRTRS) October 8, 2018 అయితే రోహిత్ రెడ్డి కేసీఆర్, టీఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడిన వీడియోను శ్రీనివాస్ నారయణ్ అనే నెటిజన్ ట్వీట్ చేయగా దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. -
వైరల్: మంత్రిగారి బహిరంగ మూత్రవిసర్జన!
జైపూర్: ఓవైపు స్వచ్ఛ్ భారత్ కోసం దేశ ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తుంటే.. మరోవైపు ఆయన పార్టీకే చెందిన రాజస్తాన్ మంత్రి శంభు సింగ్ ఖేటసర్ మాత్రం బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ సదరు మంత్రిగారు తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ పక్కనే మూత్ర విసర్జన చేయడం విశేషం. తను చేసిన ఈ పనిని ఇది పెద్దవారి సాంప్రదాయమని సమర్ధించుకోవడం మరో విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేశారు. దీనిపై మీడియా వివరణ కోరగా.. తను తమ సీఎం పోస్టర్ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్ భారత్ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. తను ఈ పని చేసిన చోటు చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనవాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా టాయిలెట్స్ లేవన్నారు. #India A state Minister in Rajasthan a northern Indian state has landed in a controversy after a photo of him urinating near a wall went viral on social media. Minister Shambhu Singh Khatesar said urinating in the open was "an age-old tradition". pic.twitter.com/L3bzR405rT — Eugene Makai (@EugeneMakai) October 7, 2018 -
జహీర్ కొంచెం బరువు తగ్గబ్బా!
కోల్కతా : ఆదివారంతో 40వ ఏట అడుగుపెట్టిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్కు అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ను తెలియజేశారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీటే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ‘హ్యాపీ బర్త్డే జహీర్.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం’ అని చమత్కరిస్తూ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక జహీర్ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం 124 మ్యాచ్లాడిన జహీర్ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ స్వింగ్ బౌలరైన జహీర్.. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. Happy birthday @ImZaheer zed K.. have a great year ...please loose some weight...u were India’s strength 🤝 — Sourav Ganguly (@SGanguly99) October 7, 2018 స్వింగ్తో తన బౌలింగ్ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్కు చేరినప్పటికి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, అజిత్ అగార్కర్లున్నారు. ఇక జహీర్కు తన టీమ్మెట్స్ సెహ్వాగ్, లక్ష్మణ్, భజ్జీ, ఆర్పీసింగ్, కైఫ్లు సైతం విషెస్ తెలిపారు. -
నీలాంటి మగాళ్ల వల్లే!
ట్వీటర్లో సోనమ్ కపూర్ ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్గా ట్వీటర్ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్. ‘‘నా ట్వీటర్ అకౌంట్ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉన్నారు సోనమ్. ఓ నెటిజన్ చేసిన విమర్శలే సోనమ్ ట్వీటర్కి ఫుల్స్టాప్ పెట్టడానికి కారణమని బాలీవుడ్ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ– ‘‘సోనమ్... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతారు. ఫస్ట్ మీ పాపులేషన్ని కంట్రోల్ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్ అయ్యారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. -
సోషల్ మీడియా ఆర్గనైజర్పై పోలీసుల వేధింపులు
పామర్రు: సోషల్ మీడియా ఆర్గనైజర్ నాగబాబుపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వారికి కోపం తెప్పించాయి. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులపై ఒత్తిడి తేవడంతో నాగబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నాగబాబును అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియా ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కె. పార్ధసారథి, పామర్రు ఇన్చార్జి కైలా అనీల్ కుమార్లు మండిపడ్డారు. పామర్రు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ తెలిపారు. అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పప్పులో కాలేసిన లోకేశ్
-
సోషల్ ఖాతాలూ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను నామినేషన్ల దాఖలు సమయంలో సమర్పించే ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపకపోయినా, నకిలీ ఖాతాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియాకు వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలు యథాతథంగా సామాజిక మాధ్యమానికీ వర్తిస్తాయన్నారు. ఎన్నికల నియమావళిపట్ల విలేకరులు, జిల్లా ప్రజా సంబంధాల అధికారులకు అవగాహన కల్పించేందుకు బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఎన్నికల్లో మీడియా పాత్రపై టీవీకే రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు రజత్కుమార్, టీవీకే రెడ్డి బదులిచ్చారు. అలా చేస్తే కఠినచర్యలే... : సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును ఎన్నికల ఖర్చు కింద లెక్కిస్తామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రచార సరుకు (కంటెంట్), షార్ట్ ఫిల్మ్స్ అభివృద్ధికి చేసే ఖర్చు ఎన్నికల ఖర్చు పరిధిలోకి వస్తుందన్నారు. అయితే రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులపై పరిమితులు లేనందున, పార్టీలకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ ఖర్చులను లెక్కలోకి తీసుకోబోమన్నారు. కానీ అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ప్రచారాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తే జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. తప్పుడు, అశ్లీల, అభ్యంతరకరమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తే సైబర్ క్రైం చట్టాల కింద పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ పార్టీల తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వార్తలను కచ్చితమైన సమాచారంతో ప్రచురించేలా చూడటంలో జిల్లా పౌర సంబంధాల అధికారులు చొరవ చూపాలని సూచించారు. చెల్లింపు వార్తలపట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎన్నికల ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు మజీద్, సీఈఓ కార్యాలయ జేడీ సత్యవాణి పాల్గొన్నారు. -
సంపద నుంచి చెత్త సృష్టిస్తా.. పప్పులో కాలేసిన లోకేశ్
సాక్షి, విజయవాడ : మంత్రి నారా లోకేశ్ మళ్లీ పప్పులో కాలేశారు. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ నెటిజన్లకు హాట్ టాపిక్గా మారింది. గాంధీజయంతి సందర్భంగా మంగళవారం ఏపీ ప్రభుత్వం స్వచ్ఛతే సేవ కార్యక్రమం ప్రారంభించింది. చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, దీని కోసం గ్రీన్ అంబాసిడర్లను నియమించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను నారా లోకేశ్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తామని కాకుండా, సంపద నుంచే చెత్తను సృష్టిస్తామని అందులో పేర్కొనడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్పై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే. -
మోదీపై ట్వీట్.. పదవికి రాజీనామా..!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్య (దివ్య స్పందన) తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తొంది. అయితే ఆమె పదవికి మాత్రమే రాజీనామా చేశారని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహిరించే రమ్యకు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారడంతోనే పదవి నుంచి తప్పుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మోదీ ఫోటోను ట్విటర్లో షేర్ చేసి ఆయనను ‘దొంగ’గా అభివర్ణిస్తూ ఆమె చేసిన వివాదం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ.. దేశ ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేశారని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దేశ ఖ్యాతిని, సార్వభౌమాధికారాన్ని దిగజార్చేవిధంగా ఆమె ట్వీట్ ఉందని ఢిల్లీకి చెందిన న్యాయవాది సయ్యద్ రిజ్వార్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో రమ్య దూకుడుగా వ్యవహరించారు. ఆమె రాజీనామా వార్తలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ధ్రువీకరించాల్సిఉంది. చదవండి : మాజీ ఎంపీ రమ్యపై రాజద్రోహం కేసు -
ఒపీనియన్ పోల్స్పై నిషేధం లేదు..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ముగిసే వరకూ మీడియాపై కొంత మేర నియంత్రణ అవసరమని పీఐబీ అడిషనల్ డైరెక్టర్ టీవీకే రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రక్రియలో మీడియా చాలా అవసరమని, రహస్య ఓటింగ్ ప్రాంతానికి మినహా అన్ని ప్రాంతాల్లో మీడియా వెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. ఇక 126 (ఏ) ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేయరాదని, మొదటి దశ ఎన్నికలు ప్రారంభం అయిన తరువాత ఎగ్జిట్ పోల్స్పై నిషేధం.ఉంటుందని చెప్పారు. మిగిలిన ఎన్నికలపై అవి ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఓపీనియన్ పోల్స్పై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాకు సైతం ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియా మాదిరిగానే నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. అభ్యర్ధులు చివరి 48 గంటల్లో ఛానెల్స్ ద్వారా కూడా ప్రచారం చేయవద్దని కోరారు. పోలింగ్కు 48 గంటల ముందు వరకూ ఎలక్ర్టానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ప్రి సర్టిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. ఇక ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాకు వర్తించే నిబంధనలు సోషల్ మీడియాకు వర్తిస్తాయన్నారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థి తన ఫేస్బుక్ ఖాతాకు సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలని టీవీకే రెడ్డి పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్.. క్విడ్ ప్రోకోలా వార్తలు ఉంటే పెయిడ్ న్యూస్గా పరిగణిస్తారని అన్నారు. పెయిడ్ న్యూస్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని చెప్పారు. పెయిడ్ న్యూస్ విషయంలో మీడియాకు ఎన్నికల కమిషన్ ఎలాంటి నోటీస్ ఇచ్చే అధికారం లేదని, ఎన్బీఏ, పీసీఐకి మాత్రమే అధికారాలుంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థికి మాత్రమే ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చే అధికారం ఉందని చెప్పుకొచ్చారు. ఒకే వార్త వివిధ పత్రికల్లో ఒకే విధంగా ప్రచురిస్తే అది పెయిడ్ న్యూస్గా పరిగణిస్తారన్నారు. గత ఎన్నికల్లో 972 పెయిడ్ న్యూస్ కేసులు నమోదయ్యాయని, 2018 కర్ణాటక ఎన్నికల్లో 15 కేసులు నమోదయ్యాయన్నారు. -
అభిమానులకు విజయ్ దేవరకొండ సందేశం
నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. తన ఫ్యాన్స్ను రౌడీస్ అంటూ పిలుచుకునే ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్పై స్పందించాడు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశాడు. ‘ప్రియమైన రౌడీస్ సినిమా, జీవితం, రౌడీ కల్చర్, యాటిట్యూడ్లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మార్పు తీసుకువస్తున్నాం. అదే సమయంలో మనం సోషల్ మీడియా పరంగా కూడా కొత్త ట్రెండ్ తీసుకురావాలి. మీలో చాలా మంది ప్రేమతో నా ఫొటోను డీపీగా పెట్టుకుంటున్నారు. అయితే దీని కారణంగా మీ కొంత మందిలో వాదనలకు దిగుతున్నారు. నేను అలాంటివి చేయను అందుకే మీరు కూడా చేయోద్దు. నేను సాధించిన విజయాలు నా స్వశక్తి తోనే సాధించా.. అందుకే ఇతర గురించి నేను పట్టించుకోను. అందుకే మిమ్మల్ని ద్వేశించే వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోండి. నేను మీకు ఎప్పటికీ మంచి సినిమాలు, మంచి దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆన్లైన్ వివాదాలు చూడటం నాకు ఇష్టంలేదు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. As we grow in numbers, it's time we set our own rules. We are young and can make this change - You and Me. pic.twitter.com/vxlOEaoS4l — Vijay Deverakonda (@TheDeverakonda) 3 October 2018 -
బిగ్బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్ సీజన్-2 తెలుగు టైటిల్ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్ బిగ్బాస్ను సోషల్ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్ ఆడించాయి. (చదవండి: బిగ్బాస్ విజేత కౌశల్) తెలుగులో కౌశల్ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్ అబ్దుసమద్ టైటిల్ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్లు క్యాంపెన్ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్తో కలిసి కౌశల్ ఇలా..) గత తమిళ బిగ్బాస్ సీజన్లో ఓవియా కంటెస్టెంట్కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్ను గెలిపించాయి. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) #BiggBossTamil2 - #Riythvika #RiythvikaArmy #Biggbossmalayalam - #Sabu #SabuArmy #BiggBossTelugu -#Kaushal #KaushalArmy pic.twitter.com/ptTe5pjPcC — Shanu (@shanum8) September 26, 2018 #KaushalArmy #SabumonArmy Sabumon army is voting for Kaushal ✌️✌️💪💪💪💪💪💪💪#BiggBoss2Telugu pic.twitter.com/cAXFfn6gKT — VD7 (@Vishnu7dev) September 27, 2018 -
సిమెంట్ బస్తాలతో పెళ్లిగౌను.. వైరల్!
జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్ డ్రెస్పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. మరి పేదోడు ఫ్యాషన్ డిజైనర్ను భరించగలడా? కాస్త మెదడుకు పని పెడితే మనలోనూ ఫ్యాషన్ డిజైనర్ పుడతాడు. చైనాలోని ఓ మహిళా రైతే దీనికి నిదర్శనం. పేరు లిలీతాన్. గంగ్సూ ప్రావిన్స్లో ఓ కుగ్రామంలో నివాసం. రోజూ పొలం పనుల్లో బిజీగా ఉంటుంది. ఓ రోజు వర్షం పడుతుండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తోచలేదామెకు. ఒకప్పుడు ఓ మేగజీన్లో చూసిన అందమైన వెడ్డింగ్ గౌన్ గుర్తొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న 40 సిమెంట్ బస్తాలను తీసుకుని.. 3 గంటల్లో అచ్చం అలాంటి వెడ్డింగ్ డ్రెస్నే కుట్టేసింది. సిమెంట్ బస్తాల గౌన్తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫొటో తెగ హల్చల్ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది. -
ప్రతి ఓటరునూ కలవాలి
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలను అమలు చేస్తోంది. ముందస్తు ఎన్ని కలకు అభ్యర్థులను ముందే ప్రకటించిన టీఆర్ఎస్... ప్రచారం విషయంలోనూ ప్రత్యర్థి పార్టీల కంటే ముందుంటోంది. నియోజకవర్గాల్లో సాధారణ ప్రచారానికి తోడుగా సోషల్ మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులపై స్పష్టతకు రాకముందే... ఒకదశ ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అమలు చేసిన ‘వంద ఓటర్లకు కమిటీ’విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. టీఆర్ఎస్కు సవాలుగా నిలిచిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు స్థాయిలో 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పోలింగ్ నిర్వహణలో టీఆర్ఎస్ అనుసరించిన విధానంతోనే పార్టీకి భారీ మెజారిటీ సాధ్యమైంది. ఇదే వ్యూహాన్ని ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ అమలు చేసి విజయం సాధించింది. ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని టీఆర్ఎస్ వదులుకోవడంలేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలకు ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. నాలుగేళ్ల పరిపాలనలో సహజంగా ఉండే వ్యతిరేకతను అధిగమించేందుకు వీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘వంద ఓటర్లకు కమిటీ’విధానాన్ని ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రారంభించారు. బూత్ కమిటీల కంటే మెరుగ్గా... టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను, అభ్యర్థి విజయాలను... ఆయా నియోజకవర్గా ల్లోని ప్రతి ఓటరుకు చేరవేయడమే లక్ష్యంగా ‘వంద ఓటర్లకు కమిటీ’విధానం ఉంటోంది. అభ్యర్థులకు, ఓటర్లకు అనుసంధానంగా ఈ కమిటీ పని చేస్తుంది. గతంలో అన్ని పార్టీల్లో ఉన్న బూత్ కమిటీల కంటే మెరుగైన ఫలితాలు వంద ఓటర్లకు కమిటీలతో సాధ్యమవుతాయి. వంద మంది ఓటర్లే ఉండటంతో ప్రతి వారంలో ఒకసారి ప్రతీ ఓటరును ఈ కమిటీ కలిసే అవకాశం ఉంటుంది. ఆయా ఓటర్లకు సంబంధించిన అంశాలను తెలుసుకుని అవసరాలను తీర్చడం, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కమిటీలు మరింత క్రీయాశీలకంగా పనిచేస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు ప్రతిరోజు కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే పోలింగ్ నిర్వహణలో ‘వంద ఓటర్లకు కమిటీ’ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో ఈ విధానాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులకు సూచించింది. ప్రచారంపై అధినేత సమీక్ష... టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార సరళిపై ఈ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. పలువురు అభ్యర్థులకు ఫోన్లో సూచనలు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించే నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో కేసీఆర్ మాట్లాడారు. బహిరంగ సభల జనసమీకరణ లక్ష్యాలను మరోసారి నిర్దేశించారు. అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ ఉండాలని స్పష్టం చేశారు. బహిరంగ సభలకు ఏర్పాట్లను చేస్తూనే ఆయా నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గ స్థాయిలో సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలను పర్యవేక్షకులుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. -
లోకేష్ ట్వీట్.. నెటిజన్ల సెటైర్స్!
సాక్షి, హైదరాబాద్: మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లోకేష్.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫొటోకు క్యాప్షన్గా.. ‘నవ్యాంధ్రలో మళ్లీ చంద్రోదయమే అంటున్న అన్నగారు.. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అయితే దృశ్యం కమనీయమే కానీ మీ పోలికే బాలేదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్నగారు చెప్పారని’ ఒకరు.. ‘90 శాతం చంద్రన్న పనైపోయింది. ఇంకా 10 శాతం మాత్రమే మిగిలి ఉంది. తెలుగు ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి’ అని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘చూడండి బ్రదర్.. చంద్రాస్తమయం అని చూపిస్తున్నట్లుగా ఉంద’ని ఇంకొకరు కామెంట్ చేశారు. నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం. pic.twitter.com/ictkqvNojw — Lokesh Nara (@naralokesh) September 28, 2018 ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్న గారు చెప్పారు... — Just Do It....9394022222 (@Vivek_Janasena) September 28, 2018 Chandrodayam entoo.... pic.twitter.com/33hBtbCTvc — 〽️@#€$# (@mahi_614) September 28, 2018 90% of Chandranna time over..only 10% maatrame undi.. Golden days ahead for telugu ppl ani anna gaaru chebutunnaaru 😄 — BayAreaMegaFan (@Twittarodu) September 28, 2018 Chandrodayam kadu Chandra asthamayam...... .. wait for one year it will completely disappear. 🤗 — sivaramakrishna (@sivaram555) September 28, 2018 -
నెటిజన్స్పై ఫైర్ అయిన సమంత!
సోషల్మీడియాలో అడ్డూ అదుపూ లేకుండా కామెంట్లు పెడుతున్న నెటిజన్లకు సమంత ఘాటుగా రిప్లై ఇచ్చారు. తను వేసుకున్న డ్రెస్పై సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తను ఎలా ఉండాలో ఉచిత సలహాలిస్తున్న వారికి కాస్త గట్టిగానే బదులిచ్చారు సమంత. అక్కినేని ఫ్యామిలీలోకి వచ్చాక ఇలాంటి డ్రెస్లు వేసుకోవడం ఏంటి?.. డ్రెస్ బాగోలేదు.. వెంటనే ఫోటోను తీసేయ్.. అంటూ ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై స్పందించిన సమంత.. ‘నేను పెళ్లి అయిన తరువాత ఎలా ఉండాలో చెబుతున్న వారందరికే ఇదే నా సమాధానం’ అంటూ.. మధ్య వేలు చూపిస్తూ ఉన్న ఫోటోను పోస్ట్చేశారు. దీనిపైనా కొంతమంది నెటిజన్లు మండిపడగా, మరికొంత మంది సపోర్ట్ చేశారు. ఇక ఇంతటితోనైనా ఈ అంశానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి. చదవండి : సమంత డ్రెస్సింగ్పై మళ్లీ రచ్చ! -
సమంత డ్రెస్సింగ్పై మళ్లీ రచ్చ!
సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు తన అభిమానులకు సరదాగా రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు సరద సరదాగా ట్వీట్లు చేసినంత వరకు బాగానే ఉంటుంది కానీ.. అభిమానులకు నచ్చని పనులు చేస్తేనే వస్తుంది తంటా. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటో అభిమానులకు కాస్త ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. గతంలోకూడా సమంత డ్రెస్సింగ్పై ట్రోలింగ్ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెడ్ కలర్లో ఉన్న పొట్టి దుస్తులను వేసుకొని దిగిన ఫోటోను షేర్చేయడంతో సమంతపై ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయంలో సమంత అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరు సమంతకు సపోర్ట్గా కామెంట్లు పెట్టగా, మరికొందరు నెగెటివ్గా కామెంట్ చేస్తున్నారు. కొందరు లేడీ ఫ్యాన్స్ సైతం సమంత వేసుకున్న డ్రెస్ బాగోలేదంటూ, తన నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు సమంతకు సపోర్ట్గా.. ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పే అధికారం ఎవరకి లేదంటూ.. ఇలా నెగెటివ్గా ఆలోచించే వారు ప్రతిచోటా ఉంటారు. ఇలాంటివారిని పట్టించుకోవద్దు.. ప్రపంచం ముందుకు పోతూ ఉంటే.. ఇంకా కొందరు ఎక్కడో ఉన్నారంటూ నెగెటివ్ కామెంట్స్ చేసేవారిపై ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొంతమంది.. నీవు ప్రస్తుతం సమంత మాత్రమే కాదనీ, ఎంతో మంచి చరిత్ర ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లావని, వెంటనే ఆ ఫోటోను తీసేయ్, ఇలాంటి పనులు చేయడం నచ్చలేదంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత చేసిన ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram Inner peace 😎 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Sep 25, 2018 at 7:12am PDT -
రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే నటి రాఖీ సావంత్.. షాకింగ్ కామెంట్స్తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. ‘కళ్లను దానం చేస్తానని బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ప్రమాణం చేశారు. ఇలా చాలా మంది తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తూ మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఎదో ఒకటి డొనేట్ చేయలనుకుంటున్నాను. నా వక్షోజాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాను.’ అని చివర్లో తన వక్షోజాలను ఎవరు దక్కించుకుంటారో చూద్దాం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ రాఖీపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #aishwaryaraibachchan #aishwaryarai A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on Sep 21, 2018 at 12:42pm PDT ఈ విషయంపై మీడియా ఆరాతీయగా.. ‘మీకు తెలియదు చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ సమయంలో వారి వక్షోజాలు తీసేస్తారు. అందుకే నేను నా వక్షోజాలు దానం చేయాలనుకున్నాను. ఈ విషయం ఇంత గందగోళం సృష్టిస్తుందని నేను ఊహించలేదు’ అని రాఖీ తన చర్యలను సమర్ధించుకున్నారు. -
మోదీని మించిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రీట్వీట్ల విషయంలో మొదటి సారి ఆయన్ని అధిగమించారు. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ ఇరువురికి వచ్చిన రీట్వీట్లపై మిచిగాన్ యూనివర్శిటీ అధ్యయనం జరపగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 4.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ కేవలం 76 లక్షల ఫాలోవర్లు కలిగిన రాహుల్ గాంధీకి రీట్వీట్లు ఎక్కువ రావడం విశేషమని మిచిగాన్ యూనివర్శిటీ తరఫున ఈ అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ జోయోజీత్ పాల్, డాక్టోరల్ అభ్యర్థి లియా బొజార్ట్ వ్యాఖ్యానించారు. కేవలం హిందీలో చేసిన ట్వీట్లపైనే వారు ఈ అధ్యయనం జరిపారు. రాహుల్ గాంధీ ట్వీట్లలో ప్రాస, వ్యంగ్యం, ఎత్తిపొడుపు మాటలు ఉండడం అందుకు కారణమని అధ్యయనకారులు తేల్చారు. ఉదాహరణకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సేల్స్ టాక్స్గా భావిస్తే మోదీ ప్రభుత్వం దాన్ని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా మార్చిందంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం. ఇక మోదీ ట్వీట్లు చప్పగా, పేలవంగా, సూటిగా ఉండడం వల్ల రీట్వీట్లలో ఆయన వెనకబడ్డారని వారు తెలిపారు. మోదీ ఎక్కువగా ఇంగ్లీషులో, ఆయనకన్నా ఎక్కువగా హిందీలో రాహుల్ గాంధీ ట్వీట్లు చేయడం కూడా రాహుల్ గాంధీకి కలసి రావచ్చని వారంటున్నారు. దేశవ్యాప్తంగా 274 మంది రాజకీయ నాయకల ట్విట్టర్ ఖాతాలపై వీరు అధ్యయనం జరిపారు. వారిలో ఎవరు ఏ భాషలో ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారో కూడా గుర్తించారు. ఎక్కువ మంది ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ భాషలను ఉపయోగిస్తుండగా, కొందరు కేవలం ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ తన మొత్తం ట్వీట్లలో 73.7 శాతం ఇంగ్లీషులో ట్వీట్ చేయగా, రాహుల్ గాంధీ (2015 నుంచి ఇప్పటి వరకు) 68 శాతం మాత్రమే హిందీలో ట్వీట్లు చేశారు. పి. చిదంబరం, కిరణ్ బేడీ, మనోహర్ పారికర్, సుబ్రమణియన్ స్వామీ, శశి థరూర్, స్మృతి ఇరానీ, అఖిలేష్ యాదవ్లు మోదీ కన్నా ఎక్కువ శాతంలో (సంఖ్యలో కాదు) ఇంగ్లీషులో ట్వీట్లు చేస్తున్నారు. సుశీల్ మోదీ, రఘుబార్ దాస్, యోగి ఆదిత్యనాథ్లు ప్రాంతీయ భాషనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్లలో 8 శాతం ట్వీట్లు మాత్రమే ఇంగ్లీషులో ఉంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకున్న నరేంద్ర మోదీ ఇప్పటికీ ఎక్కువనే వాడుతున్నారు. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాత మోదీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అందుకనే మోదీ తన పార్టీ పార్లమెంట్ సభ్యులందరిని సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆదేశించడంతోపాటు ప్రతి ఒక్కరిని ఫేస్బుక్లో కనీసం మూడు వేల లైక్స్ కూడా రావాలని షరతు విధించారు. -
ఫఖర్ జమాన్పై జోక్సే జోక్స్!
దుబాయ్ : పాకిస్తాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఫఖర్ వినూత్నంగా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ వేసిన 14వ ఓవర్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై సందిగ్ధం వ్యక్తం చేస్తూ నాన్ స్ట్రైకర్ను అడగ్గా అతను ఏం చెప్పకపోవడంతో ఫఖర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్కు తాకిందని తేలింది. అప్పీల్కు వెళితే ఫఖర్ బతికిపోయేవాడు. దీంతో అభిమానులు కిందపడిపోయిన ఫఖర్ సీన్పై ఫన్నీ మేమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ‘ఫఖర్.. ధావన్ కోసం పిచ్ శుభ్రం చేస్తున్నావా?’ అని ఒకరు.. ఫఖర్ను వెంటనే జింబాంబ్వే పంపించాలని మరొకరు కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్ చేయమంటే ఫఖర్ మాధురీ దీక్షిత్లా డ్యాన్స్ చేస్తున్నాడని, స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ఫఖార్ తనవంతు కృషిచేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో నెగ్గితే పాక్ ఫైనల్లో మరోసారి భారత్తో తలపడనుంది. Rt for Fakhar Zaman Like for Madhuri Dixit.#INDvPAK #PAKvIND #AsiaCup2018 pic.twitter.com/2D1CPzWHSH — Keshav (@Keshav65391027) September 23, 2018 Fakhar clearing pitch for Dhawan 😂 pic.twitter.com/ylilkrKBWj — Nepali Lad (@iamimmorrtall) September 24, 2018 Fakhar Zaman lbw pic.twitter.com/HtK1305M7d — Khurram Siddiquee (@iamkhurrum12) September 23, 2018 -
ఉపాసన అంటే చరణ్కు ఎంత ప్రేమో!
టాలీవుడ్ యంగ్ కపుల్స్లో రామ్చరణ్-ఉపాసన జంట సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. చెర్రీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. రామ్చరణ్కు ట్విటర్ ఖాతా లేదనే విషయం తెలిసిందే. అందుకే చెర్రీ అభిమానులు అందరూ ఉపాసనను ట్విటర్లో ఫాలో అవుతుంటారు. తాజాగా చెర్రీ గురించి ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చెర్రీ దగ్గరుండి మరీ తినిపిస్తున్నాడు.. కానీ, మళ్లీ జిమ్లో వర్కౌట్స్ చేయమని చంపేస్తాడంటూ బోరున ఏడుస్తున్న ఎమోజీలను ట్వీట్ చేసింది. ఈ సండే మిష్టర్ సీతో ఆనందంగా గడిచిందంటూ ట్వీట్ చేశారు. రామ్చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ నిమిత్తం అజర్బైజాన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తోంది చిత్రబృందం. He feeds u dessert 😘 - then kills u in the gym 😭. Amazing #Sunday circuit with Mr C #ramcharan pic.twitter.com/v5qn3aWivb — Upasana Kamineni (@upasanakonidela) 23 September 2018 -
టీఆర్ఎస్ ‘సోషల్’ ప్రచార వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార వ్యూహా లపై దృష్టి సారించాయి. పెరుగుతోన్న సాంకేతికత తో ప్రచార వేదికలు మారిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా లేకుండా ఎన్నికల ప్రచారాన్ని ఊహించలేని పరిస్థితి నెలకొంది. దీనికి తగినట్లుగా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మధ్యమాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు, వ్యాఖ్యలపై వెంటనే స్పందించేలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా సైట్లలో పోస్టులు పెట్టేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్రచార వ్యూహాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం కోసం 200 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మంగళవారం హరితప్లాజా హోటల్లో ఈ బృందంతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియాలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలను ఆయన వివరించారు. మేనిఫెస్టో నుంచి వ్యాఖ్యల వరకు.. వచ్చే ఎన్నికల పార్టీ మేనిఫెస్టో విడుదల కాగానే అందరికీ అది చేరేందుకు సోషల్ మీడియా సైట్లను చక్కగా వినియోగించుకోవాలని సోషల్ మీడియా బృందానికి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్రావు, కవిత ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలపై చేసే వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరవేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి కార్యకర్తకు చేరాలి టీఆర్ఎస్కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కార్యకర్తకు చేరేలా చూడాలని సోషల్ మీడియా ప్రచార బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు. అనంతరం కార్యకర్తలు వారి ప్రాంతాల్లోని ప్రజలకు పంపుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రెండున్నర కోట్ల సెల్ఫోన్లున్నాయి. వీరిలో స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారే అధికం. దాదాపు కోటి మంది ఏదో ఒక సోషల్ మీడియాతో అనుసంధానమై ఉన్నారని, వీరికి టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. టీఆర్ఎస్ ముఖ్య నేతల ప్రచార కార్యక్రమాల ఆడియోలు, వీడియోలు అందరికీ చేరాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గణాంకాలతో తెలిపేలా సోషల్ మీడియాలో సమాచారం చేరవేయాలని కేటీఆర్ సూచించారు. -
సోషల్ మీడియా వైరల్..
రెండు సంవత్సరాల క్రితం ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వెబ్సైట్లలో పొందుపరచడంతో అందులోని అంశాలు వాస్తవమేనని భ్రమపడిన పలువురు ఎయిర్ఫోర్స్ ఆశావాహ అభ్యర్థులు తీరా కడపకు వచ్చిన తర్వాత అది పాత సమాచారం అని తెలుసుకుని భంగపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు విచారించుకున్న తర్వాతనే అభ్యర్థులు ఎంపికలకు హాజరుకావాలని సదరు అధికారులు పేర్కొంటున్నారు. కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదా నంలో సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్ఫోర్స్ ఎంపికలు నిర్వహిస్తున్నారన్న తప్పుడు సమాచారం వైరల్ కావడంతో ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కడప నగరానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016 సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో ఎయిర్ఫోర్స్లో మెడికల్ అసిస్టెం ట్, సెక్యూరిటీ వైట్రేడ్ ఉద్యోగాలకు ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో కడప, అనంతపురం, కర్నూలు, చి త్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఇదే వార్త గత కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.. ఇందుకు ఆధారంగా 2016 సెప్టెంబర్లో అప్పటి కలెక్టర్ కె.వి. సత్యనారాయణ ఇచ్చిన ప్రెస్మీట్కు సంబంధించిన వార్తా క్లిప్పింగ్ను సైతం జతపరిచారు. క్లిప్పింగ్ను జతజేసిన వారు అది ఏ సంవత్సరానికి చెందినదో తెలుపకుండా సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్ఫోర్స్ ఎంపికలు అని సోషల్ మీడియాలో పెట్టడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆత్రుతతో కడపకు చేరుకున్నారు. కంగుతిన్న అభ్యర్థులు.. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఎంపికలు జరుగుతాయన్న ఉద్దేశ్యంతో ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఎంపికల కోసం శనివారం రాత్రికి కడపకు చేరుకున్నారు. రాత్రి నగరంలోని డీఎస్ఏ స్టేడియం వద్దకు చేరుకుని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో కంగుతిన్నారు. అదే సమయంలో అటుగా బీట్కు వచ్చిన పోలీసులు అభ్యర్థులను ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు ప్రశ్నించడంతో రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వచ్చామని పేర్కొనగా.. ఇక్కడ ఎటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం లేదని.. ఉంటే కనీసం మాకైనా సమాచారం ఉండేదని పోలీసులు వారికి తెలియజేశారు. దీంతో డీఎస్ఏ కిందిస్థాయి సిబ్బందిని అడుగగా ఇక్కడ ఎటువంటి ఎంపికలు నిర్వహించడం లేదని పేర్కొనడంతో పాటు రెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారని.. ఇప్పుడేమీ జరగలేదని వారు పేర్కొనడంతో అభ్యర్థులకు ఏమి చేయాలో పాలుపోలేదు. దీంతో అభ్యర్థులు తిరుగుముఖం పట్టారు. మళ్లీ ఆదివారం ఉదయానికి మరికొంత మంది అభ్యర్థులు రావడంతో సిబ్బంది ఇక్కడ ఎంపికలు నిర్వహించడం లేదని చెప్పి పంపించారు. ఈ విషయమై స్టెప్/డీఎస్ఏ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా ఎంపికలకు హాజరుకావడం సరికాదన్నారు. ఏవైనా ఎంపికలు ఉంటే ఆయా జిల్లాల స్టెప్ కార్యాలయాల్లో ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని.. అభ్యర్థులు తెలుసుకుని వస్తే ఇటువంటి తిప్పలు తప్పుతాయని వారు పేర్కొన్నారు. -
సోషల్ పోరులో హోరాహోరీ
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. అయితే ఈసారి క్షేత్ర స్థాయిలో నేతల ప్రచారంతో సమానంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాన పార్టీల మధ్య యుద్ధం తారస్థాయిలో సాగనుంది. అందుకోసం ఆయా పార్టీలు తమ సోషల్ మీడియా ప్రచార వీరుల్ని యుద్ధం కోసం సన్నద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది వలంటీర్లకు సమాచార విశ్లేషణ, సంప్రదింపుల అంశంలో శిక్షణను పార్టీలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్ద పార్టీలే కాకుండా.. ఆమ్ ఆద్మీ, సీపీఎం వంటి పార్టీలు కూడా సైబర్ సైన్యాన్ని ఎన్నికల ప్రచార రంగంలోకి దింపుతున్నాయి. 2014 ఎన్నికల ప్రచారం నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచార స్థాయిని గణనీయంగా పెంచుకుని బీజేపీతో సమానంగా పోటీకి సిద్ధమైంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా భారత్లో 46.21 కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. ఇక 2019 నాటికి దేశంలో సోషల్ మీడియాను వాడేవారి సంఖ్య 25 కోట్లకు చేరనుంది. 2016లో ఆ సంఖ్య 16.8 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారం 2019 లోక్సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం. బీజేపీకి దీటుగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో డిజిటల్ ప్రచార విభాగాల్ని చాలాకాలం నుంచే బలోపేతం చేశామని, సోషల్ మీడియా ప్రచార వ్యూహాల్ని ఖరారుచేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక విభాగాల్ని నెలకొల్పామని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ దివ్య స్పందన తెలిపారు. ‘ప్రతీ రాష్ట్రంలోను సోషల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటిని జిల్లా స్థాయికి విస్తరిస్తున్నాం. పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ డిజిటల్ విభాగంతో అనుసంధానమయ్యారు. దాంతో సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందుతోంది’ అని స్పందన చెప్పారు. పార్టీ వాట్సాప్ నంబర్కు అందరూ అనుసంధానం కావాలని కార్యకర్తలకు కాంగ్రెస్ సూచించింది. కార్యకర్తలందరినీ డిజిటల్ ప్రచారానికి అనుసంధానం చేసేలా ‘ప్రాజెక్టు శక్తి’ని చేపట్టామని కాంగ్రెస్ సమాచార విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. 12 లక్షల మంది వలంటీర్లు: బీజేపీ 2014 ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించిన బీజేపీ.. ఈసారి మరింత దీటుగా ప్రతిపక్షం ఆరోపణల్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. సోషల్ మీడియా ప్రచారం కోసం 12 లక్షల మంది వలంటీర్లు అందుబాటులో ఉన్నారని.. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాల్వియ తెలిపారు. -
నల్లధనం అడ్డుకట్టకు ఈ చట్టాలు చాలవు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు. -
దాని వల్లే పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోంది..
బెంగళూరు : సోషల్ మీడియాతో పైలెట్ల సామర్థ్యం దెబ్బతింటోందని భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలెట్లు గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడపడటంతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోస్పేస్ మెడిసిన్ (ఐఏమ్) లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్ఎన్లైజర్స్లా.. సరిగ్గా నిద్రపోని వారిని గుర్తించే వ్యవస్థను సిద్దం చేయాలన్నారు. సోషల్ మీడియా పైలెట్ల నిద్రను మింగేస్తుందని, చాలా మంది పైలెట్లు సోషల్ మీడియాలో గడుపుతూ అర్దరాత్రి వరకు నిద్రపోకుండా ఉంటున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చాలా ఫ్లైట్స్ తెల్లవారుజామునే టెకాఫ్ చేయాల్సి ఉంటుందని, దీంతో పైలెట్లకు నిద్రసరిపోవడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని ఐఏమ్ వైద్య నిపుణులను కోరారు. నిద్రలేమి సమస్యతోనే 2013లో ఓ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తుచేశారు. -
రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్ల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి 20 ఏళ్ల సమగ్ర ప్రణాళికను రూపొందించి దానినే బీజేపీ మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా మేనిఫెస్టోను రూపొందించడంతో పాటుగా నియోజకవర్గ స్థాయి సమస్యలపైనా ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో విద్యా, వైద్యం, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ప్రజల అవసరాలు–బీజేపీ ఆవశ్యకత, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలన, మజ్లిస్తో ఆ పార్టీల దోస్తీ తదితర అంశాలను కూడా ప్రస్తావించనుంది. దీనిని రూపొందించే పనిలో భాగంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. రైతులకు ఉచిత బోరు, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు, రైతు రుణాల వడ్డీని ప్రభుత్వమే భరించేలా చర్యలు, పంటలపై ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇవ్వడం, నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాల పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ఇందులో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా దీనిని రూపొందించి ప్రజల్లోకి తేవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్రావు, తాజామాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వైకుంఠం, ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత్షా సభ తరువాత ప్రకంపనలే: లక్ష్మణ్ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా మేనిఫె స్టోను రూపొందిస్తున్నామని ఇది విజనరీ డాక్యుమెంట్లా ఉంటుందని లక్ష్మణ్ వెల్లడించారు. ఈ నెల 15న మహబూబ్నగర్లో అమిత్షా సమావేశం అనంతరం ఇతర పార్టీల్లో ప్రకంపనలు పుట్టించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులు తమపార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. -
రాజకీయాలు @ సోషల్ మీడియా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: దీనిని బట్టి చెప్పొచ్చు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకునేందుకు ఎంతగా ఆరాటపడుతున్నాయో. దీని ద్వారా వీలైనంత మంది కార్యకర్తలను సమీకరించుకుని తద్వారా పార్టీ విధానాలు, ఎదుటి పార్టీ లోపాలను ప్రజలకు వివరించే పనిలో పడ్డాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రమేకాదు ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సీపీఐ వంటి పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకునేందుకు ఉద్యమంలా ముందుకు వెలుతున్నాయి. ఫేస్బుక్ లైవ్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఒకేసారి వేల మంది బూత్ ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కేటీఆర్ ఆద్యుడు... ఆ తరువాత హరీశ్రావు.. ఐటీ మంత్రిగా కేటీ రామారావు రాష్ట్ర ప్రభుత్వం, తన శాఖలో చీమ చిటుక్కుమన్నా ట్వీట్ చేసేవారు. నాలుగేళ్ల క్రితం ఆయన అనుసరించిన ఈ మార్గం అప్పుడప్పుడు ప్రత్యర్థి పార్టీల వారికి నచ్చేది కాదు. అయితే, అప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న మార్గమే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలకు సరైన పంథాగా కనిపిస్తోంది. కేటీఆర్ తరువాత ఎక్కువగా ట్విట్టర్ను వాడే మంత్రుల్లో హరీశ్రావు ఉంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్ ద్వారా ఒకేసారి లక్షల మందికి చేరేలా చూస్తుంటారు. హరీశ్ పేరుతో ఫేస్బుక్ ఖాతాలో కూడా ఎప్పటికప్పుడు విషయాలను అప్ డేట్ చేస్తారు. ఇప్పుడు ఇది అన్ని పార్టీలకు పాకింది. కేటీఆర్ ట్వీట్లకు ఉత్తమ్ రీట్వీట్ ద్వారానే సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమం ద్వారా మరింత క్రియాశీలకంగా వ్యవహరించే మార్గాల గురించి రాజకీయ పార్టీలు ఐటీ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ మాధ్యమాన్ని వినియోగించుకునేందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. అంతేకాదు ఫేస్బుక్ లేదా ట్విట్టర్లో 5 వేలు.. అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిని గుర్తించి డబ్చిచ్చి మరీ వచ్చే ఎన్నికల కోసం వారిని వాడుకోవాలని పార్టీలు భావిస్తుండటం గమనార్హం. గాంధీ భవన్లో ప్రత్యేక విభాగం... టీపీసీసీ సామాజిక మాధ్యమాన్ని విరివిగా వాడుకునేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. దీని కోసం కొందరు ఐటీ నిపుణులను కూడా నియమించుకుంది. టీపీసీసీ అభిప్రాయాలు, పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాలు వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. జిల్లాల వారీగా పార్టీ సానుభూతిపరులను ఎంపిక చేసుకుని వారి ద్వారా అధికార పక్షం లోపాలు, హామీల అమలులో వైఫల్యాలు వంటి వాటిని ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ‘సామాజిక మాధ్యమం విషయమై పార్టీని మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి వీలుగా మా పార్టీ ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ప్రణాళిక ప్రజలకు వివరించడానికి దీనిని వినియోగిస్తాం. మా అభిప్రాయం చెప్పడానికి టెలివిజన్ ఒక్కటే ముఖ్యమైన మాధ్యమం కాదని గుర్తించాం’అని ఉత్తమ్కుమార్ రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. సామాజిక మీడియాను పట్టించుకోకపోతే తప్పు మొదట్లో సామాజిక మాధ్యమంపై తెలంగాణ జన సమితి పెద్ద ఆసక్తి చూపలేదు. కానీ, రోజురోజుకు దీనికి పెరుగుతున్న డిమాండ్ను చూసి టీజేఎస్ ఇప్పుడు పూర్తిగా దానిపైనే ఆధారపడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో కాని వాటి కోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తోంది. దీని కోసం ఆ పార్టీ కూడా నిపుణులను ఏర్పాటు చేసుకుంది. ‘సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం తప్పని కొద్ది రోజుల్లోనే మాకు అర్థమైంది. దీనిద్వారా అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్లగలం అన్న విష యాన్ని ఇప్పుడు గమనించాం. ఇప్పుడు మాకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ముఖ్యమో సామాజిక మాధ్యమం అంతే’అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాన్ని వదలడం లేదు.. వామపక్షాలు సైతం సామాజిక మాధ్యమానికి ఆకర్షితులు కావడం విశేషం. సీపీఎం ఎప్పటి నుంచో ఈ ప్రచారానికి దిగినా సీపీఐ ఇటీవలే రంగప్రవేశం చేసింది. ఇప్పటిదాకా దీనిని వాడుకోకపోవడం వల్ల తాము చాలా కోల్పోయామని ఆ పార్టీ అంటోంది. ‘సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం చాలా తప్పు. కేటీఆర్ ట్వీట్ల మీద ఆధారపడినప్పుడు మాలో కొందరం దానిని పిచ్చిపనిగా అనుకున్నం. కానీ, ఇప్పుడు సామాజిక మాధ్యమం జీవితంలో భాగమైపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు మనం చెప్పదలచుకున్నది క్షణాల్లో వేల మందికి చేరవేయవచ్చు. సామాజిక మాధ్యమం మీద కన్నెర్ర చేయడం కంటే.. దానిని అక్కున చేర్చుకోవడమే మేలు’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా వాటిని నేరవేర్చింది. ఇది నేను చెప్పడం కాదు, ఫేస్బుక్ వేదికగా చాలామంది మళ్లీ మేమే రావాలని కోరుకుంటున్నారు. – ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మా అభిప్రాయం చెప్పడానికి టెలివిజన్ ఒక్కటే ముఖ్యమైన మాధ్యమం కాదని గుర్తించాం. సామాజిక మాధ్యమాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నాం. – టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సామాజిక మీడియాను పట్టించుకోకపోవడం తప్పని మాకు అర్థమైంది. దీని ద్వారా అత్యంత వేగంగా ప్రజల్లోకి వెళ్లగలమన్న విషయాన్ని తెలుసుకున్నాం. – టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఇప్పుడు సామాజిక మాధ్యమం జీవితంలో భాగమైపోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు మనం చెప్పదలచుకున్నది క్షణాల్లో వేల మందికి చేరవేయవచ్చు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి -
రష్మికతో ఎంగేజ్మెంట్ బ్రేక్ : రక్షిత్ స్టేట్మెంట్
తొలి సినిమా ‘ఛలో’, రెండో సినిమా‘గీత గోవిందం’తో తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న.. టాలీవుడ్లోకి రాకముందు ఆమెకు కన్నడలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. టాలీవుడ్లోకి ప్రవేశించి, ఈ ఫాలోయింగ్ను, తన పాపులారిటీని మరింత పెంచేసుకుంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాఫిక్గా మారింది. కన్నడలో తనకు విశేషమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ‘కిరిక్ పార్టీ’ చిత్రీకరణ సమయంలోనే నిర్మాత, సహ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. పెద్దల అంగీకారంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రద్దయింది. కారణాలు ఏమన్నది తెలియదు కానీ, ఈ ఇరువురు విడిపోయారు. వీరి ఎంగేజ్మెంట్ రద్దు కావడానికి కంటే ముందే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. ఆ వార్తలను రక్షిత్ శెట్టి ఖండించాడు. అయితే నిన్న కన్నడ పాపులర్ న్యూస్ పేపర్ అధికారికంగా రష్మిక, రక్షిత్ల ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిందని ప్రకటించడంతో, సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. రష్మిక, రక్షిత్ల ఎంగేజ్మెంట్ రద్దు కావడంపై ఆమె తల్లి కూడా తామిప్పుడు బాధలో ఉన్నట్టు చెప్పారు. రష్మికపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని తట్టుకోలేని రక్షిత్ శెట్టి, ఆమెను తప్పుపట్టందంటూ కోరుతూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్టు పెట్టారు. ‘రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో అదే అందరం నమ్ముతుంటాం. కానీ అవి నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు ఉన్న కోణాన్ని చూడకుండానే, నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. మీ కంటే ఎక్కువ రష్మికా గురించి నాకే తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి. దయచేసి ఆమెను శాంతిగా ఉండనీయండి. త్వరలోనే ప్రతీది ఓ ముగింపుకు వస్తుందని నేను ఆశిస్తున్నా. నిజమేమిటో అప్పుడు మీకు తెలుస్తుంది. మీడియా న్యూస్గా వెళ్లకండి. ఎవరూ కూడా నానుంచి, రష్మికా నుంచి సమాచారం పొందిలేరు. వారి అవసరానికి తగ్గట్టు వారు సొంత వార్తలు రాసుకున్నారు. అంచనాలు, ఊహాగానాలు నిజం కావు. కొన్ని రోజులు మాత్రమే ఈ పేజీ లైవ్లో ఉంటుంది. నేను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నా. ఒకవేళ నిజంగా అవసరం అనిపించినప్పుడు మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తా. నేను కేవలం ఇప్పుడు పనిపైనే దృష్టిసారించనున్నా’ అని పేర్కొంటూ ఓ పెద్ద లెటరు రాసుకొచ్చారు. దీంతో నిన్నమొన్నటివరకూ వీరిద్దరి బ్రేకప్పై ఉన్న కన్ఫ్యూజన్ పోయి ఇద్దరూ విడిపోయారనే విషయంలో క్లారిటీ మాత్రం వచ్చింది. రష్మికను తప్పు పట్టదంటూ రక్షిత్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
మీడియా సమక్షంలోనే అధికారికి కిమ్ మరణశిక్ష?
సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వీడియో ఇంట్రస్టింగ్గా కనిపిస్తే చాలు నెటిజన్లు షేర్లు, కామెంట్లు లైకులతో హోరెత్తిస్తుంటారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాల గురించి ఆలోచించకుండానే తమకు తోచిన కామెంట్లు పెట్టి మరీ షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా మార్ఫింగ్కు గురై వైరల్ అవుతుంటాయి. ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన హయాంలో అవినీతి అధికారికి మీడియా సమక్షంలోనే మరణశిక్ష ఎలా విధించారో చూడండి.. అంటూ ఓ వీడియో ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేవలం 12 సెకన్ల వీడియోలో కిమ్ మరో వ్యక్తికి కరచాలనం చేసి నవ్వుతూ పలకరిస్తారు. అనంతరం నడుస్తు ఓ ప్రదేశానికి వెళ్లగానే అక్కడ ఇదివరకే ఏర్పాటు చేసిన ఓ పెద్ద గుంతలో సదరు వ్యక్తి పడిపోయి, వెంటనే డోర్లు మూసుకుంటాయి. తర్వాత సింపుల్గా కిమ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంతేనా ఇదంతా మీడియా సమక్షంలోనే జరగడంతో రిపోర్టర్లు కూడా వామ్మో అంటూ ఓ లుక్కిస్తారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి. వామ్మో అవినీతికి మరీ ఇంత పెద్ద శిక్ష వేశాడా కిమ్ అంటూ ఆయన గురించి తెలిసివాళ్లు ముక్కున వేలేసుకుంటుంటే, మరికొందరేమో అవినీతికి సరైన శిక్ష అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఫన్ మూమెంట్స్ అనే ఓ సెటైరికల్ యూట్యూబ్ చానెల్ వాళ్లు ఈ వీడియోను తయారు చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో వీడియోలో కనిపించిన వ్యక్తి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్జే ఇన్. అతనేమీ ఉత్తర కొరియాకు చెందిన అవినీతి అధికారి కాదు. గత ఏప్రిల్లో ఇంటర్ కొరియన్ సమ్మిట్లో భాగంగా ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య చోటుచేసుకున్న ఓ అరుదైన చారిత్రక ఘట్టాన్నే ఫన్ మూమెంట్స్ యూట్యూబ్ చానెల్ తన క్రియేటివిటీని జోడించి పై వీడియోను తయారు చేసింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సైనిక సరిహద్దుల్లో అధినేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. ఇది ఉభయ కొరియా దేశాల మధ్య సానుకూల వాతావరణానికి సంకేతంగా నిలిచింది. తమ తమ ప్రతినిధి బృందంతో కలిసి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్జే ఇన్ గంటన్నరపాటు సమావేశమయ్యారు. అణునిరాయుధీకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని, కొరియా భూభాగంలో చిరకాల శాంతిని నెలకొల్పేందుకు తాము కలిసి పనిచేస్తామని వారిరువురు ప్రకటించారు. 1953లో జరిగిన కొరియా యుద్ధానంతరం 65 ఏళ్లలో కొరియా దేశాల మధ్య చర్చలు జరుగడం ఇది మూడోసారి కాగా, ఉత్తర కొరియా అధినేత దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం అదే ప్రథమం. ఇరుదేశాలను వేరుచేసే సైనిక విభజనరేఖ వద్ద ఉన్న పన్ముంజోమ్ వారి కలయికకు వేదికైంది. ఇరుదేశాల మధ్య ఉన్న చిన్న దారికి అటువైపు నిలబడిన కిమ్ను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు మూన్ ముందుకువెళ్లారు. అయితే ముందుగా మా దేశంలోకి వెళ్దామంటూ కిమ్ ఆయనను తోడ్కోని తమ భూభాగంలోకి తీసుకెళ్లారు. ఇరువురు నేతలు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని కొంతదూరం నడిచారు. తర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. చిరునవ్వు చిందిస్తూ మూన్తో కరచాలనం చేసిన కిమ్.. ఇది భావోద్వేగ కలయిక అని పేర్కొంటే, మూన్ కూడా చిద్విలాసంగా కరచాలనం చేస్తూ.. ఇలా కలువడం సంతోషంగా ఉందని అన్నారు. అప్పటి వీడియోను మీరు ఓ లుక్కేయండి.. -
ఎందుకంటే లైఫ్లో బిగ్ ఛేంజ్ కోసం.. : నటి
సాక్షి, తమిళసినిమా: గత 12 ఏళ్లుగా త్రిష నట జీవితాన్ని చూస్తూనే ఉన్నాం. ఆది నుంచి ఇప్పటి వరకూ సంచలనాల పంథాను ఆమె కొనసాగిస్తున్నారు. ఈ అమ్మడు ప్రేమలో పడిందని చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. 2014లో నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్తో ప్రేమపెళ్లికి సిద్ధమైందంటూ కథనాలు వచ్చాయి. పెళ్లికి ముందే ప్రేమికుల చిహ్నమైన తాజ్మహల్ను ప్రియుడితో కలిసి ఆమె చుట్టివచ్చారు. దీంతో పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరు బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు త్రిష పెళ్లి గురించి కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. హీరోయిన్ ఒరియేంటెడ్ సినిమాలు చేసే స్థాయికి త్రిష ఎదిగారు. అయితే, సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ధనుష్తో జతకట్టిన ‘కొడి’ చిత్రం తరువాత ఈ అమ్మడు హిట్ చూసిన పాపాన పోలేదు. అయినా ఈ బ్యూటీని లక్కు వెతుక్కుంటూ వచ్చింది. ఎంతోకాలంగా రజనీకాంత్తో కలిసి ఒక్క సన్నివేశంలోనైనా నటించాలని భావిస్తున్న త్రిషకు.. ఇప్పుడు ఆయన సరసన కథానాయకిగా నటించే అవకాశం దక్కింది. ‘ పేట’ చిత్రంలో సూపర్స్టార్తో త్రిష రొమాన్స్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో త్రిష ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫొటో పెద్ద చర్చకు దారితీసింది. అందులో తన జుత్తును షార్ట్గా కట్ చేసుకుని త్రిష చాలా స్టైలిష్గా కనిపించింది. రజనీ చిత్రం కోసమే ఈ గెటఫ్ అని అంతా అనుకున్నారు. కానీ, త్రిష మాత్రం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఒక అమ్మాయి తన జుత్తును కత్తిరించుకుందంటే ఆమె జీవితంలో పెద్ద మార్పును రాబోతున్నదని అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకు ఆ పెద్ద మార్పు ఏమిటబ్బా అంటూ అభిమానులు ఆలోచనలో పడ్డారు. త్రిష చిరకాల కోరిక అయిన రజనీకాంత్తో జత కట్టడం సారమైంది. ఇక, మిగిలింది పెళ్లే.. ఈ అమ్మడు పెళ్లికి రెడీ అవుతోందా? అన్న సందేహం మొదలైంది. ఈ క్రమంలో త్రిషకు పెళ్లి అంటూ మళ్లీ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. త్రిష రియాక్ట్ అవ్వలేదు కానీ, ఆమె తల్లి ఉమా కృష్టన్ వెంటనే స్పందించారు. పెళ్లి ప్రచారం ఉట్టి వదంతులేనని, వాటిని నమ్మవద్దనీ, జస్ట్ ఫ్యాషన్ కోసమే ఆమె వెంట్రుకలు కట్ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. త్రిష న్యూ స్టైల్ వెనుక ప్రత్యేకత ఏమీ లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం త్రిష విజయసేతుపతితో రొమాన్స్ చేసిని ‘96’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలిసిన కిమ్ జోంగ్ ఉన్
-
మీడియా సమక్షంలోనే అధికారికి కిమ్ మరణశిక్ష?
-
వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్లు!
దేశంలో ఇటీవలికాలంలో చిత్రవిచిత్ర కారణాలతో వివాహాలు రద్దవుతున్నాయి. అబ్బాయి భయస్తుడనీ, అమ్మాయి సరిగ్గా మాట్లాడటం లేదని సాకులు చెబుతూ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఆగిపోతున్నారు. తాజాగా వాట్సాప్లో నిండా మునిగిపోయిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్లో కాబోయే భర్త షాకిచ్చాడు. వాట్సాప్లో గంటల తరబడి గడుపుతూ కాబోయే అత్తమామలకు భారీగా సందేశాలు పెట్టడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఆమ్రోహీ జిల్లాలో చోటుచేసుకుంది. ఆమ్రోహీ జిల్లాలోని నౌగావ్సాదత్ గ్రామానికి చెందిన ఉరోజ్ మెహందీ కుమార్తెకు ఫకీర్పురాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే అప్పటి నుంచి అమ్మాయి వాట్సాప్లో కాబోయే అత్తమామలకు ఇష్టానుసారం సందేశాలు పెట్టడంతో ఈ నెల 5న వివాహ మండపానికి వరుడి కుటుంబ సభ్యలెవరూ రాలేదు. దీంతో అమ్మాయి తండ్రి ఫోన్ చేయగా తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వరుడి తండ్రి తెలిపాడు. అమ్మాయి ఎప్పుడూ వాట్సాప్లో ఉంటూ సందేశాలు పంపడంతో తమ కుమారుడు ఆమెతో పెళ్లికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశాడు. దీంతో వధువు తండ్రి ఉరోజ్ పోలీసులను ఆశ్రయించారు. వరుడి కుటుంబం అడిగిన రూ.65 లక్షల కట్నాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిత్రవిచిత్ర కారణాలతో చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. ♦ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన ఓ వరుడు తాము కోరిన మాంసాహారాన్ని వధువు కుటుంబ సభ్యులు వడ్డించలేదన్న కోపంతో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ♦ విందులో పెళ్లి కొడుకు సోదరుడికి ఇంకో రసగుల్లా ఇవ్వడానికి వధువు తరఫు బంధువులు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్లోనే మరో పెళ్లి ఆగిపోయింది. ♦ ఇక యూపీలోని షాజహాన్పూర్ కు చెందిన ఓ యువతి ఊరేగింపు సందర్భంగా పెళ్లికొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్తో చిరాకుపడి వివాహాన్నే రద్దు చేసుకుంది. ♦ బిహార్లోని సరన్లో మరింత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపుగా వస్తున్న పెళ్లికొడుకు ఉరుము శబ్దానికి అదిరిపడటంతో అంత పిరికివాడిని తాను పెళ్లి చేసుకోలేనని మరో యువతి తేల్చిచెప్పింది. దీంతో పీటల దగ్గరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. -
‘ఫేస్బుక్’లో అంగన్వాడీ సమాచారం
విజయనగరం ఫోర్ట్: ఇప్పటివరకు నాలుగు గోడలకే పరిమితమైన అంగన్వాడీల సేవలు ఇకపై బహిర్గతం కానున్నాయి. ఇప్పటి వరకు శాఖాపరమైన అధికారులు మాత్రమే వారి పనితీరును తెలు సుకునేవారు. ఇకపై ఫేస్బుక్ ఖాతాలు ఉన్న వారంతా తెలుసుకునేలా చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఫేస్బుక్ ఖాతాలు తెరవాలని ఐసీడీఎస్ అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలన్నీ అందులోనే నమోదు చేయాలని సూచించారు. అయితే, ఫోన్ వినియోగం తెలియని అంగన్వాడీ కార్యకర్తలు అధికారుల ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు. గిరిజన పల్లెల్లో సిగ్నల్స్ ఉండవని, పింఛన్ల పంపిణీకే ఆపసోపాలు పడుతున్న సమయంలో ఫేస్ బుక్లో ప్రతీరోజూ అంగన్వాడీ కార్యకలాపాలు అప్లోడ్ చేయడం కష్టమన్న భావన వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,987 పెద్ద, 742 చిన్న అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2,987 మంది కార్యకర్తలు, 2,987 మంది ఆయాలు, 742 మినీ అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఫేస్బుక్ ఖాతాలు తెరవాలని అధికారులు ఆదేశించడంతో అధికశాతం మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. చాలా మం దికి ఫేస్బుక్ ఖాతా తెరవడం, కార్యకలాపాల ఆప్లోడింగ్ తెలియదు. ప్రధానంగా గిరిజన ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల్లో చాలామందికి దీనిపై కనీస అవగాహన లేదు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో నెట్ సమస్య కూడా వారిని ఆవేదనకు గురిచేస్తోంది. మారుతున్న పద్ధతులు... అంగన్వాడీ కార్యకర్తలు గతంలో అనేక రికార్డులు నిర్వహిస్తూ వచ్చారు. సాధారణ పద్ధతిలో వాటిని నిర్వహించడం కష్టతరం కావడంతోఇదే విషయాన్ని ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అధికారులు కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (కాస్)ను ప్రవేశ పెట్టారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు పిల్లలు 1,13,878 మంది, 15,575 మంది గర్భిణులు, 15,395 మంది బాలింతలకు సేవలు అందుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు అన్న అమృతహస్తం, బాలామృతం కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ఫొటోలతో సహా ఫేస్బుక్లో నమోదు చేయాలి. జిల్లాకో డాష్ బోర్డు ఏర్పాటు... ప్రతీ జిల్లాకు ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు కొన్ని శాఖలకే పరిమితమైన డాష్ బోర్డు ఐసీడీఎస్ శాఖలో కూడా ఏర్పాటు చేయనున్నారు. కాస్ విధానం కాదని ఫేస్బుక్ ఖాతాలు తెరవాలని ఆదేశించడాన్ని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు.