
జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న అషు రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాతో తెచ్చుకున్న పాపులారిటీతో బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టి స్టార్గా ఎదిగింది. ఆ తర్వాత హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేకాకుండా ఆర్జీవీతో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వైరల్ అవడమే కాకుండా ఆమెకు 'బోల్డ్ బ్యూటీ' అనే పేరును తెచ్చిపెట్టింది. తాను చేసే పోస్ట్లకు యాప్ట్ అయ్యేలా ట్యాగ్లైన్ రాస్తూ కూడా రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవల కూడా 'మీ కళ్లల్లోనే వేడి ఉంది' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో పోస్ట్లే కాకుండా అప్పుడప్పుడు టూర్లకు కూడా వెళ్తూ ఉంటుంది అషు. ఇటీవల వెకేషన్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన అషు 'మేడమ్ టూసాడ్స్' మ్యూజియంను సందర్శించింది. ఈ మ్యూజియంలో సెలబ్రిటీల మైనపు బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పలు ఫొటోలు దిగిన ఈ భామ తాను అభిమానించే బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ మైనపు బొమ్మతో ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్స్టా గ్రామ్లో షేర్ చేస్తూ 'సారీ అలియా భట్' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment